శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641
Showing posts with label నా అభిప్రాయములు. Show all posts
Showing posts with label నా అభిప్రాయములు. Show all posts

విగ్రహారాధననువ్యతిరేకిస్తున్నామంటూ ధర్మాన్ని అపహాస్యం చేయాలనుకునేవారు ఆకాశం మీద ఉమ్మెయ్యాలనిప్రయత్నిస్తున్నామని తెలుసుకోవటం మంచిది.

>> Saturday, August 15, 2015

ఈదేశం లో ధర్మం మీద దాడిచేయాలని ప్రయత్నించే  శక్తులు అనుసరించే వ్యూహాలు పలురకాలుగా ఉంటాయి. అందులో  వందల సంవత్సరాలు భయంకరమైన  అత్యాచారాలతో అణచివేతలతో ఎడారులనుంచి వచ్చిన ఓ మతంఅనయూయులు సాగించిన దుష్కృతాలరక్తచరిత్ర ఓ వైపు తేనెపూసిన కత్తులలా తమ వ్యూహాలను అమలుచేసి రెండొందల సంవత్సరాలకుపైగా ఈ దేశాన్ని దోచిన ఆంగ్లేయులు తమ పాలనలో దేశాన్నే కాదు మెల్లమెల్లగా ఇక్కడ మనుషుల మనసులను నిర్వీర్యం చేసే పథకాలు అమలుచేశారు. అందులో ప్రధానమైనది ఇక్కడవారిలో తమ సంస్కృతి,సంప్రదాయాలు, ధర్మం పట్ల అయోమయం,చులకనభావం ,కలిగించడం కోసం అపప్రచారాలు చేయటం ,అటువంటీ విద్యావిధానాలు అమలుపరచటం  ఇలా అమలయ్యాయి వారి వ్యూహాలు.  వాల్ల పరిపాలనలు అంతమయినా  వారు నాడువేసిన విషప్రచారపు వ్యూహాలు మాత్రం అమలుచేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతకాలంలో ప్రచారమాధ్యమాలలో  వారి ప్రచారాలు ఎలా అమలవుతున్నాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం అంతర్జాలం  లో కూడా  ఈ ప్రచారాలు  తీవ్రంగా సాగుతున్నాయి.
 హిందువులు సహనవంతులు కనుక సాధారణం గా  తమ ధర్మం పై జరిగే అపప్రచారాలను చూసి వారి అవివేకానికి నవ్వుకుని వదలివేస్తుంటారు. ఎక్కువమంది వ్యతిరేకంగా మాట్లాడటం గాని లేక న్యాయపరంగా చర్యలకు గానీ ఉపక్రమించరు . ఇది అలుసుగా తీసుకుని కోట్లాదిమంది అనుసరించే ధర్మంపట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయటం,వ్రాతలు వ్రాయటం చేస్తున్నారు.
  ఈమధ్య విగ్రహారాధన తప్పని ,పాపమని, ఇంకా కాస్తబరితెగించి విగ్రహారాధకులు మూర్ఖులని కూడా  బ్లాగులద్వారా ప్రచారం చేస్తున్నారు.

ముందుగా విగ్రహారాధన గూర్చి వీళ్ల విషప్రచారం గూర్చి చూద్దాం.
భగవంతుడు ఎక్కడో మబ్బులచాటునో ,పరలోకం లోనో ఉంటాడని ఎడారి మతాల భావన.
 కానీ ధర్మం ఏమి చెబుతోంది.?
భగవంతుడు సర్వశక్తివంతుడు . సర్వవ్యాపి . కనుక ఆయన అమ్దుగలడిందులేడని సందేహమువలదు ...సర్వోపగతుండు చక్రి........ అని నమ్ముతాము . కనుకనే ఆయనవిభూతులైన పంచభూతాలలోనూ,  ఆయనకు ప్రతిరూపమైన సర్వజీవులలోనూ పరమాత్మను దర్శిం చవచ్చని  నమ్ముతాము. గౌరవిస్తాము.

 ఆ పరమాత్మపై అపారమైన ప్రేమతో నిరాకారానికి రూపమైన లింగం గాగని. కరచరణాదులతో గూడిన అర్చామూర్తులను గానీ పూజిస్తాము. పూజాసమయంలో భావనంతా పరమాత్మమయంగా ఉంటుంది కనుక ఆయన ప్రీతిచెంది భక్తులభావాలకనుగుణంగా కరుణకురిపిస్తుండాడు. అమ్మగా అపారప్రేమను కురిపిస్తాడు.

[ఐతే ఏదో గర్వభావనతో,అహంకారంతో చేసే అర్చనాదికములకు ఫలితాలుండవని అది ఓ ప్రహసనంగా మిగులుతుందని శాస్త్రవచనం.]

ఇక మనసు ఏకాగ్రతను పొందటం కోసం విగ్రహాన్ని ఒక ప్రతీకగా అనుకున్నా . సనాతన ధర్మం లోనేకాదు, ఇతరమతాలలోనూ ప్రతీకలను కొలవటం లేక పవిత్రంగా భావించటం ఉన్నదే
 హిందువులు విగ్రహాలను కొలిస్తే  క్రిస్టియనులు శిలువను , ముస్లిం లు నెలవంకను, ఇంకా కాబాస్టోను ను కూడా పవిత్రంగా భావించటం తెలిసినదే. అలాగే  భగవద్గీత , ఖురాను, బైబిల్ గ్రంథాలను ఎవరూ కాగితం ముక్కల కట్ట గా చూడరుకదా? వాటిపట్ల అపచారం జరిగితే తీవ్రంగా స్పందిస్తారెందుకని? అవి కాగితాలతో తయారయినా తమ భావం మాత్రం అవి భగవంతుని వాక్కులని కదా? మరి విగ్రహారాధన లేదని ఎవరన్నారు?
  రాల్లు రప్పలతో కట్టిన తమతమ ప్రార్థనా మందిరాలను రాల్లు మట్టే కదా అని చులకనగా చూడరు కదా? ఎందుకని ? ఆప్రతీకలు పరమపవిత్రమనే భావనవలనే కదా ? ఇక తమ ఫోటొపై త,మఎదురుగా ఎవడన్నా చండాలం వేస్తుంటే అది కాగితం ముక్కేకదా అని మిన్నకుంటాడా ? ఎవడైనా ?
ఎందుకని ?
కనుక ప్రతీకలలో తమభావాలను ఆరోపించి తాథాత్య్మం పొందటం మనిషి లక్షణం.

ఇక పరమాత్మం ను నవవిధభక్తిమార్గాలద్వారా ఆరాధించటం ఈ ధర్మం నేర్పింది. ఒకటి ఎక్కువకాదు మరోటీ తక్కువాకాదు. ఆసాధకుని మనోస్థితిని బట్టి ఆయా సాధనలలో ఫలితం వస్తుంది.
 అసలు ఈసాధనా క్రమంలో చివరకు ఒంటరిగా ప్రయాణం సాగవలసినదే అనే సత్యం తెలుసుకనుక హిందువులు అన్నింటిలోనూ సాక్షీభూతంగా  సాగుతూ చివరకు తనమార్గాన తాను సాగుతారు స్వేఛ్ఛగా.
 ఇక   గుంపులుగా కూడటం ద్వారామాత్రమే భగవంతుని చేరుతామనుకునే అపోహఉ న్న మతాలు తాముగుంపులుగా  సాగుతూ మిగతావారిని  చేర్చుకుని తమగుంపు మరింత విస్తరించాలనుకునే కోరికతో , ఎవరూ తమ గుంపు వీడకూడదని పలుని బంధనలు, బలప్రయోగాలు. కాదన్నవారి పట్ల ద్వేషం అసూయలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రేమాకరుణలతో కూడిన దైవమార్గాన్నుండి దూరమవుతారు.

సమర్ధసద్గురువులైన సాయినాథులు కూడా తమదగ్గరకొచ్చే భక్తులలో ఎంతో మందికి క్షేత్రదర్శనాలు పూజలు చేసుకోమని చెప్పారే ! వారికంటే  గొప్ప  ధర్మవర్తకులావీరు?   గుంటూ రు మస్తానయ్య దర్గానుండి ,ఆజ్మీరు దర్గావరకు  గుణదల మేరీ మాతనుండి సాగారమాతవరకు హిందువులు బేధభావం లేకుండా గౌరవాభిమానాలు చూపుతారు /.ఎందుకు ? ఆయామహాత్ముల నడవడిక భగవద్భక్తిపూరితమైనదని నమ్మటం వలన. సత్యం ఎక్కడున్నా నమ్మవలసినదే అనే శాస్త్రవచనం వలన. చిత్రంగా విగ్రాహారాధన  వీళ్ళు   ఈ క్షే త్రాల ను  తప్పుపట్టరు
కలిప్రభావం వలన ఇప్పుడు సనాతనధర్మానుయూయులలో కూడా కొన్ని విపరీతాలు పొడసూపవచ్చు. అది యుగధర్మం.  ఇవి కాలానుగుణంగా యుగపురుషులవలన సంస్కరింపబడుతూనే ఉన్నాయి. కానీ ధర్మం పేరుతో పవిత్రయుద్దాలు జరిపి సాటిజీవులమానప్రాణాలు తీయటానికి అంగీకరించదు ఈధర్మం.
 నేడు ప్రపంచం లో నెలకొన్న భీకర అశాంతిికి కారణమెవ్వరు ? ఎడారిభూములలో ఆనాటి కాలమాన పరిస్థితులకణుగుణంగా అక్కడ ద్రష్టలవలన పుట్టి అక్కడి స్థితులను సంస్కరించి నేడు రాజ్యవిస్తరణకాంక్షతో రగులుతున్న వారి చేతులలో ఆయుధాలైనవి ఆమతాలేకదా?
ఇక్కడ భగవంతుడు కౄష్ణుడుఅవతరించి బోధించినది మరచిపోతున్నారని బుడుబుడిఏడ్పులతో వాదాలు వినిపించేవారు  కృష్ణుడే పరదైవమని వాల్లవాల్లందరికీ చెప్పవచ్చు కదా ?
మాకు ఏమతం పట్ల దోషభావం లేదు  ...ఆల్లూ వీళ్ళూ   మాగూర్చి తప్పుడు అభిప్రాయం కలిగిస్తున్నారని  మొగుడ్నికొట్టి మొగసాలకెక్కి సామెతగా  వీళ్లమాటలు ఉన్నాయి  వీరి రాతలు తిరగేసి చూడండి
 ఎవరన్నా వారి మతం గూర్చి విమర్శలుచేస్తే మాత్రం అవి తప్పుకాదని మిగతావన్నీ ఖచ్చితం గా తప్పేననే గడసరి వాదనలు కనపడతాయి వారి వ్రాతలలో/

సర్వేజనా సుఖినోభవంతు     ... అని కోరేది ధర్మం
మాభావనలనుమాత్రమే ఆచరించాలి అనుకునేది మతం.
 ఇక్కడ ధర్మమేదో చూడండి
మీ మతాన్ని ,మీమార్గాన్ని అనుసరించండి... అలానే మిగతా వారి ఆచారాలను గౌరవించండి
 భగవంతుడు అందరికీ సద్భుధ్ధినొసగాలని ప్రార్ధిస్తున్నాము.
జైశ్రీరాం


Read more...

ఎంతో గొప్ప కార్యక్రమం చేపట్టే పెద్దలకు కూడా ...ఇంత చిన్నతనం పనులు అవసరమా?

>> Friday, March 6, 2015

కొందరు ఎంతో గొప్ప సంకల్పంతో మహత్తర కార్యక్రమములు చేపడతారు. నిర్వహణ
దగ్గరకొచ్చేసరికి తెలిసి  చేస్తారోలేక తెలియకచేస్తారో గాని వారి సంకల్పాన్ని వారే చిన్నబుచ్చుకునే చే్ష్టలు  చేస్తుంటారు. అత్యంత అభిమానంతో అక్కడకు వెళ్ళిన మాలాంటివారికి బాధకలుగుతుంది.  కొన్నిసార్లు నేను చేసేవిమర్శలు  బాధకలిగిస్తాయని తెలిసినా ధర్మం పట్ల జరిగే అపచారం  కడుపులోదాచుకోలేక వెళ్లగక్కుతుంటాను.   జనం చేత లోలోపలైనా తిట్టించుకుంటూ ఉంటాను.

ఈమధ్య ఒకపట్టణం  లో జరిగిన ఓ మహత్తర ఆథ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లాను. నాతోపాటు మా బృందం అంతా వచ్చారు.  ఎంతో గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటిదాకా ఎవరూ నిర్వహించనంత గొప్పగా జరిగిందనిపించినది. నిర్వాహకులకు అవసరమైన నిధులుకూడా స్వామి అనుగ్రహం వలన  సమకూరాయన్నారు.  హనుమత్ప్రభో!అని పిలిస్తే చాలు  ఆయన కార్యక్రమానికి కావలసినవన్నీ అసాధ్యమనుకున్నవన్నీ  సాధ్యమయి అక్కడ చేరి తీరుతాయి. ఇక భక్తకోటిలో  అంతర్లీనంగా జీర్ణించుకుని ఉన్న హనుమద్భక్తి  కార్యక్రమం గూర్చి తెలిస్తే చాలు  లక్షలాదిగా తరలివెళ్ళేలా  చేస్తుంది. ఇదంతా సత్సంకల్పబలం. భగవత్ కృప.

ఇక అద్భుతంగా జరుగుతున్నది కార్యక్రమం. మధ్యలో ఈకార్యక్రమానికిస్వల్పవిరామమిచ్చి ,ఈకార్యక్రమాన్ని ఎవరో !  గుర్తించి ఇచ్చే సర్టిఫికెట్లు అందుకోవటం..ఆపై ప్రశంసలు...పొగడ్తలు   ... ఇవి కాస్త బాధనిపించాయి నాకు. ఎందుకంటే  పారాయణాదులు,పూజసాగేప్పుడు మనసు చిన్నగా లయమవుతూ పయనిస్తుంటుంది భక్తులకు.ఈసమయంలో దాన్ని డిస్టర్బ్  చేస్తే మరలా దారికెక్కదు. అందుకనే పూజమధ్యలో మాట్లాడకూడదు అని నియమం. పోనీ సామూహిక కార్యక్రమాలలో మాట్లాడటం తప్పనిసరైనా అది  మనసుకు మరింతగా ఏకాగ్రతనుపెంచే భగవ్ద్విషయమై ఉండాలి. అలాకాక భౌతికవిషయాలవైపు మల్లటం అంటే ఆకార్యక్రమం పట్ల అవమానకరంగా ప్రవర్తించటమే. అదీ మాహత్ముల ప్రత్యక్షపర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో జరగటం నాకు బాధకలిగించినది.

ఇక కార్యక్రమం జరుగుతుండగానే    కొందరు కార్యకర్తలు హుండీలు చేతబట్టి  ఆవరణ అంతా కలియదిరుగుతున్నారు. అంతటితో ఆగారా !? ప్రతివ్యక్తిదగ్గరకొచ్చి అడుక్కున్నేవాళ్లలాగా డబ్బాలు ఊపటం. అసహ్యమేసింది. ఇంతకార్యక్రమంలో తమ వంతుసమర్పణ చేయాలనుకునే వాళ్లకు కనపడేలా హుండీలు పెట్టవచ్చు. తప్పులేదు. సమర్పణచేయాలనుకునేవారు చేస్తారు. లేదంటే లేదు. ఈ కార్యక్రమాల కోసం ఈ  సమీకరణ ముందే జరుగుతుంది కదా!

ఇక అన్నీపూర్తయ్యాక  ఇంతటి మహత్తరకార్యక్రమాన్ని చేపట్టాడని ఎంతగానో మేము అభిమానించిన ఆపెద్దాయన స్వయంగా మైకు చేతబట్టి  స్వామి వారికి సమర్పించబడిన పేద్ద..లడ్డు.. అదీ సద్గురువుల చేత  స్వామికి సమర్పించబడినది... ఇది  వేలంపాట లో దక్కించుకోండి........ ఎవరు దీన్ని దక్కించుకుంటారో ... వాళ్ల ఇంట లక్ష్మీదేవి  స్థిరమై పోతుంది... ఇలా.... పరమదౌర్భాగ్యంగా    పాట మొదలెట్టాడు.
 ఇక డబ్బుజబ్బు ఉన్న వారంతా పోటిపడటం మామూలే.. మధ్యలో ఈయన   ... అదిగో ఈ లడ్డు పలానా ఊరు  ...వెంకయ్య గారు పాడారు...మరో ఊరు సుబ్బయ్యగారు పాడారు.... మనవూరుదాటెళ్లిపోతుంది.. పాడండి.... పాడండి... అంటూ  రేటూ పెంచుతూ పరమచండాలంగా   వేలంపాట.సాగిస్తున్నాడు.
ఈమధ్య ఎక్కడ చూసినా వినాయక చవితి పందిళ్లలో  ఈ దిక్కుమాలిన అచారం  మొదలైంది . దానికి తోడు న్యూస్పేపర్లలో  ఆవూర్లో.. లడ్డు అంతపలికింది.... ఈ వూర్లో ఇంతపలికింది  అనే వార్తలు..
ఎప్పుడో తయారుచేసిన పాచి లడ్డులను నివేదించటమే తప్పు. దానికి తోడు  వేలంపాట. పరమ అనాచారపు పనులు ఆచారాలై కూర్చుంటున్నాయి  కలిప్రభావం వలన.
ఇక మళ్ళీమొదటికొద్దాం
ఇప్పటిదాకా    ఎంతో ఉన్నతంగా కనపడిన ఆయన పట్ల మనసులో చులకనభావన ప్రవేశించింది నాకు.
మీకు నిజంగా సత్సంకల్పం ఉంటే  మీకు కావలసినవన్నీ  భగవత్ శక్తి అనుగ్రహం చేత సమకూరుతాయి.  ఎంత అట్టహాసంగా చేశామని కాదు. ఎంత భక్తిగా చేశామనేదే  ప్రధానం కావాలి భక్తులకు. అదిమాత్రమే పరమాత్మకు ప్రీతికలిగి సద్యోఫలితములనిస్తుంది ,



ఇది స్వయంగా చెప్పలేక చదువుతారు అని ఇక్కడ వ్రాస్తున్నాను . హనుమత్ప్రభువు నావాచాలత్వాన్ని మన్నించుగాక.
జైశ్రీరాం




Read more...

వయసులో ఉండగా మీరెప్పుడన్నా పిల్లలకు రామాయణం చెప్పారా??? ఇప్పుడేడ్చి ఏం లాభం ?!!!!

>> Wednesday, February 25, 2015

నిన్న మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి మరలా స్కూలుకు  వెళుతున్నాను. [నేను పనిచేసేది మాపక్కగ్రామమైన తిమ్మాపురం ప్రభుత్వపాఠశాలలో] . తిమ్మాపురం మలుపు దగ్గర కూర్చుని వున్న ఓ వయో వృధ్ధుడు పంతులుగారూ ! అని కేకవేశాడు . బండి ఆపిచూశాను బాగా పెద్దవయస్సు. కర్రసహాయంతో వచ్చి ,నన్ను కాస్త మావూరిదాకా తీసుకెళ్లయ్యా ! అనడిగాడు. అయ్యో దానిదేముందండి . ఎక్కండి  .మీరు జాగ్రత్తగా కూర్చో గలరా ? అనడిగాను . మోటారు సైకిల్ కదా! గతుకులు వచ్చినప్పుడు బాలెన్స్ గాఉండగలడా అని నా అనుమానం. పరవాలేదు కూర్చుంటానన్నాడు. ఎక్కించుకున్నాను .
బండి చిన్నగా పోనిస్తూ . ఇంత ఎండకు వస్తున్నారెందుకు ? అడిగాను.
ఒంట్లో బాగా ఉండటం లేదయ్యా ! నూజండ్ల వెళ్ళి మాత్రలు తెచ్చుకుంటున్నాను అనిచెప్పారాయన.
 మీరెళ్లకపోతే ఏమైంది ? మీ పిల్లలెవరినన్నా పంపవచ్చు కదా ? అన్నాను.
ఇప్పుడెవరయ్యా ! ఎవరి సంగతి వారుచూసుకోవడమే ?  మాగురించి పట్టించుకుంటారా? పొలమిచ్చాను. ఆస్తులిచ్చాను ? అవసరమైతే అప్పులిప్పించి అవీ తీర్చాను. ఇవాల్ల వాళ్లకు మమ్మల్ని చూద్దామని అనిపించటం లేదు.  .చూడాలన్నా కోడల్లు పడనియ్యరు ............................................. ఇలా   ఆయన బాధనంతా నాకుచెబుతూ  ఉన్నారు.
మీకు పిల్లలెంతమందండి ?
ఆరుగురు కూతుర్లు . ఇద్దరు కొడుకులు  .
అందరూ ఇక్కడె ఉన్నారా?
లేదయ్యా ! ఆడపిల్ల వాళ్లవాళ్ల ఊర్లలో ఉంటిరి. మగపిల్లలిద్దరూ ఊర్లోనే  .

ఇద్దరూ ఇక్కడ  ఉన్నారుకదా ! వాళ్లుగాని,వాళ్లపిల్లలు గానీ  మీకు ఈ పనులు చేసిపెట్టరా ?

హు....  ఈకాలంలో అంతా  ఆస్తులు పంచుకుంటారు గానీ ముసలాల్లకు అండగా నిలబడుతున్నదెవరు?  విచారం వ్యక్తం చేశారాయన.
 ఏమండి. మీరు తప్పంతా మీ   పిల్లలదంటున్నారు ! మీ రు వాల్లకు చిన్నప్పుడెప్పుడన్నా కూర్చోబెట్టి రాముని కథలను చెప్పారా ? తండ్రి  పట్ల రాముడెలా ఉన్నాడు! అన్నపట్ల లక్ష్మణభరతశతృఘ్నులెలా ఉండేవారు ? భర్తతో అమ్మ సీతమ్మ ఎలా మెలగింది .ఎప్పుడైనా చెప్పారా ?
వ్యక్తికి తల్లిదండ్రులపట్ల ఉండవలసిన బాధ్యత రాముణ్ణిచూసైనా నేర్చుకుంటారని ఊరూరా గుడి కట్టారు.
మనమేమో పండుగరోజు తలుపులు తీసి  పానకంవడపప్పు పంచుకుని ఆతరువాత గుడిముఖం కూడా చూడకపోతుంటిమి?
ఎప్పుడు చూసినా మాపిల్లలకు ఎన్నెకరాలు ఇవ్వాలి ఎన్నిలక్షలు పంచివ్వాలనే యావతప్ప ,వాడికి నాలుగు మంచి మాటలు నేర్పుదామని ఆలోచనకూడాలేకుండా ఎప్పుడూ ...పని..డబ్బు ..తప్ప ధర్మం గూర్చి ఆలొచించక  ....ఈరోజు  .. నాపిల్లలకు   ధర్మబుధ్ధి లేదు  అని బాధపడితే  లాభమేముంది ?>
మీతరం వాళ్లు నయం ఇప్పుడు మాతరం ఇంకా ఘోరం   .. మాతరం తరువాత పిల్లలకు రాముడెవరో తెలియకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పే చదువులలో  , ఇంట్లో ఉన్న వాతావరణం లోనూ ఇలాంటి ధార్మిక విషయాలు నేర్పే అవకాశాలు ఉండటం లేదు.   అని ఆయనను ఓదార్చాను.
అవునయ్యా ! మహానుభావులు ..ఆరోజులలో రాములవారు తల్లిదండ్రుల మాట జవదాటాడా!! అంటూ ఆయనా  మాటలు కలుపుతున్నాడు. మాపాఠశాల దగ్గర బండి ఆపాను.

ఆయన బండి దిగి  ....  కొడుకులు చూద్దామన్నా కోడల్లు చూడనియ్యరయ్యా ..ఏంచేస్తారు పాపం. అన్నాడు.
ఆడపిల్లలకూ ధర్మం గూర్చి. సీతమ్మ తల్లిలాంటి స్త్రీమూర్తులగూర్చి చెప్పాలి .అప్పుడే ఏ ఇంట్లో  వృధ్ధులకు నిరాదరణ ఉండదు అన్నాను.
అవునయ్యా  ! మా ఆడపిల్లలకు ఎలా చెప్పిపంపించామని ........ వివరించబోయాడు.
ఆయన గుడ్డిప్రేమకు   విసుగొచ్చింది.
చూడండి .. మనం ధర్మం గూర్చి నేర్పిఉంటే ఆడ,మగ పిల్లలిద్దరికీ నేర్పుతాము. ఇప్పుడు మీమగపిల్లలెలాఉన్నారనిబాధపడుతున్నారో!!
 ఇక అక్కడ మీ ఆడపిల్లలగూర్చి వాళ్ళ అత్తగారిళ్లదగ్గర ముసలాళ్ళ నడిగితే తెలుస్తుంది  . వెళ్ళిరండి  అని.. స్కూల్ లోకి ప్రవేశించాను.

Read more...

హనుమంతుడు కాదులేవయ్యా !! ఆయనైతే ఇన్నిమాటలు మార్చడు కదా !

>> Sunday, November 30, 2014

మొన్నఒకరోజు పూజ అయిపోయాక టిఫిన్ చేయబోయేసమయంలో ఒకతను పీఠానికొచ్చాడు. ఎవరుస్వామీ మీరు?అనడిగాను. మాది శాశంవారిపాలెం  ఒకసారి ఇక్కడకొచ్చాను అన్నాడాయన . సరే  ప్రసాదం తీసుకోండి అని ఇంట్లో నుండి ఆయనకు ప్రసాదం ,మంచినీళ్ళు ఇచ్చి  ,ఇప్పుడు చెప్పండి  ఎందుకొచ్చారు ? ఏంకావాలి అనడిగాను . మీ గుడి గవర్ణమెంట్ లో చేరిందా ? అన్నాడు [ఆయన మాట మోటుగాఉంది. ]
ఇది గుడికాదు  .పీఠం అన్నాను
ప్రతిష్ఠ జరగలేదా ?
జరిగింది. కానీ ఆలయ మర్యాదలు,ఆచారాలు వేరు ,పీఠం విషయం వేరు అని చెప్పాను.
సరే ! ఇవి పక్కనుంచండి .ఇంతకీ మీరెందుకొచ్చారు  అది చెప్పండి ముందు అనడిగాను.


నేను దేవారంగ్రామం దగ్గరున్న ఆలయంలో ఆంజనేయస్వామి దగ్గర పూజ చేసేవాడిని .ఇప్పుడు ఇంటిదగ్గరే పూజచేసి ప్రశ్న చెబుతుంటాను .రోజూ ఓ ఇరవైముప్పైమంది వస్తుంటారు .
మీరేం చేస్తారిక్కడ ?మీశిష్యుల చేత ఏంచేపిస్తారు?  అనడిగాడు.

స్వామి ! ఇక్కడ గురువులెవరూ లేరు ? ఇక శిష్యులెక్కడుంటారు? ఏదో కృష్ణా రామా అనుకొని భజన సాంప్రదాయంలో ,సంకీర్తనలు,పూజలు జరుపుకుంటుంటాము. అందరితో కలసి . అని వివరించాను.

నేనొక ఆలయం కట్టాలనుకుంటున్నాను .ముహూర్తం కోసం చూస్తున్నాను అన్నాడాయన.

అదేమిటీ ? మీరు దేవారం దగ్గర ఆలయంలో పూజలుచేస్తున్నారంటిరే ??

పూర్తి విషయం చెబుతాను  .  అని  మొదలుపెట్టాడాయన  నాకసలు మొదట్లో  దేవుడంటే పెద్దగా అసక్తి లేదు. మావూర్లో వాళ్ళు మార్కాపురం  దగ్గరున్న   ఊర్లో  ప్రశ్న లడగటానికి వెళుతుంటే వాళ్లవెంట వెళ్లాను . అక్కడ గణాచారి గారికి ఒంటిపై దేవత ఆవహించి  వచ్చినవారెందుకు వచ్చారో  వారి కోరికేమిటో తెలియజేస్తుంది.
నేను వెళ్లగానే మొదట ఉన్నవారిని కూడా ఆపి నన్ను పిలచాడు . ఏమయ్యా  మీ ఊరికి తూరుపుగా ఒక ఆంజనేయస్వామి ఆలయం వెలుగులేకుండా ఉంది . నీద్వారా  అక్కడ అభివృధ్ధి  జరుగుతుంది. ఇక్కడలాగే అక్కడకూడా నువ్వు ప్రశ్నచేప్తావు  అన్నాడు. మా మూడు ఊర్ల మధ్యలో దేవారం దగ్గరున్నదే పాత కాలంనాటి ఆంజనేయస్వామి గుడి.ఎవరూ పట్టించుకోవటం లేదు.  నేను రోజూ వెళ్ళటం  పూజచేసుకోవటం . పూజచేసుకుంటుంటే ప్రశ్నచెప్పమని అనిపించింది. అక్కడ నుండి జనం రావటం ప్రశ్నలు చెప్పటం ,నాకు ఒంటిపై ఆంజనేయస్వామి రావటం. ఇలా బాగా జరిగింది రెండేండ్లు. ఆతరువాత ఒకరోజు కలలో నాకు స్వామి కనపడి పలనా సర్వేనంబర్ లో నాకు  పొలం వుంది నువ్వు దాన్ని తీపించు అని చెప్పాడు. మరుసటిరోజు  నేను  వీఆర్వో దగ్గరకెళ్ళు అడిగిచూస్తే స్వామి చెప్పిన సర్వేనంబర్లో ఆపొలం ఉంది. కాకుంటే ఆపొలం  పెద్దవాళ్లచేతుల్లో ఉంది. దానికోసం వాల్లందరినీ అడిగి అది గుడికి ఇప్పించమన్నాను. నాపై వాల్లకు కోపం వచ్చింది. ఇక్కడ నుండి నాపై  పగబెట్టుకున్నారు. నేను భయపడకుండా అద్దంకి వెళ్ళి  దేవాదాయశాఖ ఈ వో ను కలసి దీనిపై పోరాడాను. చివరకు దేవాదాయ శాఖవాళ్లు ఆపొలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ నుండి ఇప్పటిదాకా  పొలం అనుభవించుకున్నవారు గుడినుండి నన్ను వెళ్లగొట్టే పని పెట్టుకున్నారు. ఏదో ఒక వంకతో తగాదాలు పెట్టుకునేవారు .చివరకు ఈ గొడవలు నాకెందుకని  నేను  మావూర్లోనే ఇంటివద్దే పూజచేసుకోవటం ప్రశ్న చెప్పటం చేస్తున్నాను.స్వామి నాకు కలలో కనపడి గుడితాళాలు నీదగ్గరకు రప్పిస్తాను అని చెప్పాడు .  మా అవిడకు కూడా నాగమయ్య స్వామి వంటి మీదకొస్తున్నాడు .జనం బాగా వస్తున్నారు.
ఈ మధ్య స్వామి కలలో కనపడి     ఒకస్థలం చూపి  కొలతలు చెప్పి ఇక్కడ గుడికట్టుకోమని చెప్పాడు .  అందుకని ముహూర్తం చూసుకుని మొదలు పెడదామని అనుకుంటూన్నాను. వేసవిలో  మావూరివాళ్ళు ఇక్కడ అన్నపూర్ణ శాలకు  స్లాబ్ కోసం చెక్క సెంట్రింగ్  బిగించేందుకు వచ్చారు  కదా , అప్పుడు వాళ్లు నీగురించి చెప్పారు. నేనొకసారి దార్లో వెళుతూ వచ్చి వెళ్లానుగాని మాట్లాడటం కుదరలేదు అందుకని ఈరోజు నరసరావు పేట వెళుతూ మాట్లాడిపోదామని వచ్చాను అన్నాడు.

ఆయన మాట మొరటుగాఉన్నాగానీ  భక్తిభావం,అమాయకత్వం కలగలసి ఉన్నాయి. ఈయనకోసం నాకుతెలిసిన విషయం చెప్పటంలో తప్పులేదనిపించింది.

చూడు స్వామీ ! ఇప్పుడు మీచేత ఎవరు ఇదంతా చేపిస్తున్నారనుకుంటున్నారు ? అడిగాను
ఇంకెవరు ?ఆంజనేయస్వామే కదా అన్నాడాయన.
నాకైతే ఇది స్వామి అనుగ్రహంలా కనిపించటంలా !
మీరేమనుకోకండి  నాఅభిప్రాయం చెపితే తప్పనుకోరుగా అనడిగాను.

అయ్యో ! నాకు ఇలా విషయాలు  తెలుసుకోవటం బాగా ఇష్టం చెప్పుస్వామీ అన్నాడాయన.


లోకంలో సిధ్ధపురుషులు,మహాయోగులుంటారు. వాళ్ల బోధన,నడిచేమార్గం భగవన్మయంగా సాగుతుంటాయి.భగవంతునిసేవ,సనాతనమైన ధర్మం,తప్ప మరో విషయానికి ప్రాధాన్యత ఇవ్వరు వాళ్లు.ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో వాళ్లవిషయం పక్కనపెడదాం.

 మీరు చెప్పినట్లుగా   భగవంతుడు వంటిమీదకు రావటం, ప్రశ్నలు చెప్పే చిల్లరపనులు  చేస్తాడం టే నేను  నమ్మలేను.


ఇప్పుడు కొన్నిచోట్ల ప్రశ్నలు చెపుతున్నారని,తాయెత్తులిస్తున్నారని ,వంటిమీదకు స్వామి వస్తున్నారని ఊగేవాళ్లందరి దగ్గరకు జనం వెర్రిగుంపులా పరిగెత్తటం, కొంతకాలానికి అక్కడ మహిమ తగ్గిందని ఇంకొకరిదగ్గరకు ఉరకటం చూస్తున్నారుకదా !
నాఅభిప్రాయమేమిటం టే ! ఇలా మహిమలు చూపుతున్నారనుకునేవాళ్ళు  మూడు రకాలు .
ఒకటి ఏదోపూర్వజన్మ పుణ్యం వలన కాస్త ఆథ్యాత్మిక సాధన అబ్బి ఏవో ఆథ్యాత్మిక శక్తులు మేల్కొనడం వలన వాళ్లకు ఎదుటివారి విషయాలు కొద్దిగా తెలుస్తుండటం జరుగుతుంది.  తనకు ఉన్న ప్రత్యేకతను ఆయన మార్కెట్లో పెట్టినట్లు పెట్టి జనాన్ని పోగేసుకుని గౌరవం పొందటం కోసం చూస్తాడు. అయితే ఈయన బాటరీ రీచార్జ్ అవగానే ఈయన ఇంకేమీ చెప్పలేడు. జనాన్ని వదలుకోలేక అబద్దాలన్నా చెప్పటానికి ప్రయత్నిస్తాడు. ఈయన దగ్గర ఉప్పులేదని తెలసి జనం ఇంకొక చోటుకు వెళుతుంటారు.

 ఇక రెండవ రకం  వీరు అమాయకులు. గతజన్మలో సాధనలో పొరపాట్ల వలన ఉన్నతగతిని పొందలేక ప్రేతాత్మలై తిరిగే కొందరికి వీళ్లు వశులవుతారు . ఇలాంటి అత్మలలో కొందరు భగవద్భక్తిని కలగినవారు ఉన్నాగానీ , ఈ పిశాచజన్మ లో తాము తమ జీవితకాలంలో చేద్దామనుకున్న పనులు   మీలాంటి అమాయకులద్వారా సాధించాలనుకుంటారు .నేను దేవుడ్ని ,అని   నమ్మబలికి ,మీదగ్గరకొచ్చేవారి విషయాలు మీకుచెబుతూ మీకు దేవుడే ఇదంతా చెబుతున్నాడు అనే నమ్మకాన్ని కలిగిస్తారు. ఉన్మాదంలో ఊగిపోయేట్లు.దొర్లేట్లు,కొన్నిసార్లు మీకు పరిచయం లేని భాషలో కూడా మాట్లాడుతూ,  తక్కువస్థాయి మహిమలు చూపుతూ మిమ్మల్నొక దేవతాంశలుగా నమ్మింప జేస్తారు .
అయితే   ఈ రకం సాధకుల ఆత్మలతో చిక్కెమిటంటే తాము ఏదో మంచిచేస్తున్నామని భావిస్తూ ,ఎవరిని ఆవహిస్తుంటారో వాళ్లచేత వెర్రిచేశ్టలు కూడా చేపిస్తుంటారు. ఎంతైనా పిశాచజన్మకదా! ఏదో ఒకరోజు .ఉన్నట్లుండి హఠాత్తుగా  మీలాంటి వాళ్లను వదలి వెళ్లిపోతుంటారు. దాంతో  జనం దృష్టిలో పిచ్చివాళ్లయి పోయినవాళ్లను, ఆత్మహత్యలుచేసుకున్నవాళ్లగూర్చికూడా నాకు తెలుసు. ఏదో విధంగా స్వామి అనుగ్రహం ఉంటేమాత్రం , ఈవిషయం మీకు తెలిసి వాటినుండి తప్పుకుని భగవంతుని చెంతకు  చేరే శుధ్ధ మార్గానికి మళ్లుతారు.

ఇక మూడోరకం పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్స్ కొందరుంటారు. వీళ్లకు మానవసైకాలజీ పై బాగాపట్టుఉంటుంది. పేరాశభక్తుల లో ఎలా దురాశపెంచి వసూళ్లుపిండుకోవాలో ,ఆ గారడీ విద్యలన్నీ వీళ్ళకు కొట్టిన పిండి.
ఇది కలియుగం కనుక యుగధర్మాన్ననుసరించి పేరాశతో చేరేవారంతా పోలో మని వెళ్లి  బలవుతుంటారు.

నేను చెప్పినదాంట్లో ఒక్కసారి ఆలోచించు.  నీకు స్వయంగా ఆంజనేయస్వామి అనుగ్రహం దర్శనం,ఆయన భాషణం వినగలిగే అదృష్టం ఉంటే . ముందు  దేవారం ఆలయం అభివృధ్ధి చేయాలని  చెప్పాడన్నావు ఆయనే,మరలా మాటమార్చి ఇంకొక చోట చోటు చూపించి అక్కడ ఆలయం కట్టమని చెబుతాడా ? ఇన్నిరకాలుగా మాట మార్చటం మనస్వామి అవతారంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించి చూడు. ఇదెవరో ? నిన్ను అడ్డం పెట్టుకుని పిచ్చివాణ్ణి చేస్తూ ఆడుతున్న పిశాచ చేష్ఠ లాంటిదే. పూర్వపుణ్యం వలన స్వామి మీద భక్తి కుదిరింది మీకు . పెద్దలనాశ్రయించి శుధ్ధమార్గం లో స్వామిని పరిపూర్ణంగా  భక్తితో సేవించుకోవటమే మనలాంటివాళ్ళకు మంచిది అని వివరించాను,నాకు తెలిసిన విధంగా .


నేను నరసరావుపేట అర్జంటూగా వెళ్ళిరావాలిస్వామీ. మీదగ్గరకు మళ్ళీ వస్తాను మాట్లాడుకుందాం అని వెళ్ళాడాయన ,పదిహేనురోజులయింది   ...... ఇంకా రాలేదు. రాడేమో....!!!!!!



Read more...

గురుపౌర్ణమి ని జరుపుతున్నాం సరే !పరమగురువు లు వ్యాసమహర్షులవారిని మనం మరచిపోనున్నామా ?

>> Saturday, July 12, 2014

చీకటి నుండి వెలుగులకు దారిజూపు మార్గమే గురువు. అట్టి గురుపరంపరలో వ్యాసభగవానుల వారి రూపంలో పరమాత్మ మనకు దర్శనమిచ్చారు.  కలగాపులగం గావున్న జ్ఞానరాశి యగు వేదాలను విభజించి ,అష్టాదశపురాణాలను  అందజేసి  లోకానికి మహోపకారం చేశారు.  వారి జన్మతిథిని గురుపౌర్ణమిగా నిర్ణయించాయి శాస్త్రాలు .  పరంపరానుగతంగా మనపుణ్యభూమిలో గురుపౌర్ణమి రోజు వ్యాసభగవానులను పూజించే ఆచారం కొనసాగుతూ ఉంది. వివిధకాలాలలో  వివిధప్రాంతాలలో గురుస్వరూపాలు వ్యక్తమై లోకాన్ని ఉధ్ధరించినా ,వారందరూ వ్యాసభగవానుల అరాధనను  నిర్విఘ్నంగా కొనసాగిస్తూ,ఆ ఆచారానికి భగం కలగకుండా శాస్త్రవిధిని   కొనసాగిస్తూ తమ శిష్యులందరికీ ఈ ఆచారాన్ని అందజేశారు.
ఇప్పుడు వ్యాసులవారే భవిష్య పురాణంలో సూచించినట్లుగా కలిప్రభావం తీవ్రతపెరుగుతున్నది. ఆచార్యులు,సద్గురువుల బోధనకంటే మన  తెలివితేటలతో నిర్ణయించే ఆచారేలే గొప్ప అన్నట్లుగా ప్రవర్తించేవారు,దీనిలో మంచీ చెడులను ఆలోచించేంత ఓపికలేని గుంపుమనస్తత్వంగల భక్తులు అసలు ఆచారాలను కాలదన్ని  తమ మనస్సుకు నచ్చిన విధానంలోనే .లేక తమకు ఇష్టమైన సద్గురు రూపాలలోనో గురుపౌర్ణమిని జరపటం ఎక్కువంది.
 అసలు వ్యాసభవానుని పూజించటం వదలివేసి తమకు ఇష్టమైన సద్గురు రూపాన్నిమాత్రమే పూజించటం అదే గురుపౌర్ణమి ఆచారంగా స్థిరపరచేలా చేస్తున్నారు.
సద్గురుపరంపరను పూజించటంలో ఎట్టిదోషమూ లేదు. కానీ లోకోపకారములైన ఇటువంటి సంస్కృతికు మూలమైన శాస్త్రనిర్ణయాలను నిర్లక్ష్యం చేయరాదు. అలాచేస్తే తరువాత తరాలవారికి  నిజమైన శాస్త్రవిద్యను దూరంచేసిన పాపం, వారు తరువాత ఇంకా దోషభూయిష్టమైన నిర్ణయాలేవన్నా తీసుకుంటే దానికి కారణమైన పాపమూ మనలను చుట్టుకుంటాయి.  ప్రభుత్వంలో ఒక కలెక్టర్ గారిపట్ల మనకు బాగా అభిమానం ఉన్నంతమాత్రాన ఆయన మాత్రమే ప్రభుత్వం అని తీర్మానించేసి ,నేను ఈయనను తప్ప ఏప్రభుత్వాన్ని ఆపద్దతినీ అంగీకరించనూ అంటే అది లోకోపద్రవమవుతుంది.
కనుక శాస్త్ర విధిని అనుసరించాలి. అందువలన లోకానికి మేలుకలుగుతుంది. నీ ఒక్కరి భావోద్వేగాలుకాదు, లోకశ్రేయశ్శును నిర్ణయిస్తుంది శాస్త్రం. మనం మనగురుపరంపరను వ్యాసభగవానులుగా పూజించవచ్చు. ముందు వ్యాసులవారి పూజ ఆపై మన గురుస్వరూపంపై ఆరాధన చేయటం వలన మనతరువాతి వారికీ ఈ సంస్కృతి మూలాలు అందించవచ్చు. అసలు ఏసద్గురువూ ఈ పరంపరను కాదు అని అచెప్పలేదు. చెప్పరుకూడా. ఎందుకంటే వారంతా ఒకే అంశకుచెంది ఈసంస్కృతి ని లోకోధ్ధరణకోసం  అందించిన వారు కనుక.
సద్గురువులుచెప్పినది మనం వింటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మన మనస్సుకు తోచినదేచేస్తాం. భూతదయను కలిగియుండి ,భగవద్భక్తి సహనము,ప్రేమ లతో నిరాదంబర జీవితాలను గడపమని  మనకుచెప్పిచెప్పి విసుగెత్తి  వేసారిన మన మహర్షుల,సద్గురువుల బాధ మనం పట్టించుకోము.  అదే మన్నవారిపై మాత్రం పట్టుదలగా వాదాలకు దిగుతాము.
ఎలా గురువుల అనుగ్రహాన్ని పొందగలుగుతాము మనము?
సద్గురువులు ఆచరించి,బోధించిన మార్గం అనుసరించటం ద్వారానా?  లేక
మనభావోద్వేగాలను గురువులపట్ల ఆపాదించి శాస్త్రవిధిని అతిక్రమించటమే మహాభక్తిగా భావించే ఆత్మవంచన ద్వారానా ? కాస్త వివేచించి చూడటం లో తప్పులేదుకదా !
అందుకే  వ్యాసపౌర్ణమిని  వ్యాసపౌర్ణమిగానే ఆచరిద్దాం .

ఇక్కడ  ఏదైనా ఒక్కమంచి మాట ఉన్నా అది సమర్ధ సద్గురు పరంపర అనుగ్రహం వల వారిదయగా ప్రాప్తించినదిగా చెప్పుకుంటున్నాను.
ఏదైనా దోషభూఇష్టమైన మాటలుంటే  అవి నా అజ్ఞానం వలన,అవివేకం వలన వచ్చినవిగా భావించి మన్నించమని సద్గురుపరంపరకు,సాధులోకమునకు శిరసాప్రణామములు సమర్పిస్తున్నాను
జయము జయము వ్యాసభగవానులవారికి.
జయముజయము సద్గురుమండలికి
జయముజయము లోకకళ్యాణకార దేవసంస్క్రుతికి


 

Read more...

ఏడుకొండలా సామీ..ఎక్కాడున్నావయ్యా ??!!!!!!!! ఇప్పుడేడ్చి ఏం లాభమయ్యా ??

>> Friday, May 16, 2014

ఎన్నికలపండగ రాగానే సీటుకోసం పోటిపడి కోట్లు గుమ్మరించైనా సీటు కొనుక్కున్నారు, ఇక పోటీలో డబ్బు ,మద్యం   నువ్వా? నేనా ? అన్నట్లు పోటాపోటిగా పంచారు.  తమ తెలివితేటలపై అపారనమ్మకంతో అనేక వ్యూహాలు,కుట్రలు రచించారు. తీరా పోలింగ్ అయిపోయాక ఇప్పటిదాకా నమ్ముకున్న తెలివితేటలపై నమ్మకాలు సన్నగిల్లాయి. ఇక తీర్థయాత్రలు,పూజలు, యాగాలు , మొక్కుల తో దేవుడి సాష్టాంగాలు పడుతూ గట్టెక్కించమని వేడుకోవటం మొదలెట్టారు. ఇందులో అగ్రభాగం తిరుపతి వెంకన్న స్వామి కరుణకోసం  తహతహ లాడారు.
ఆపదమొక్కులవాడా !! ఓ తిరుమలేశా !! అని ఆర్తనాదాలు చేశారు లోపల  లోపల. ఇందులో ఆపార్టీ..ఈపార్టీ అనేంలేదు.అన్నిపార్టీల అభ్యర్థులూ ఉన్నారు.

మొన్న రాత్రి ఓపార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి   పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని  ఎప్పుడు రమ్మంటారో ! మాస్టారిని అడగమని వారి తరపువారిద్వారా అడిగారు. ఎన్నికలయిపోయాయి . కౌంటింగ్ ముందు వచ్చి నాఫలితమేముంది ? ఆ దర్శనమేదో నిజంగా భక్తిఉంటే ముందుగానే  వచ్చేవారుకదా ? అన్నాను. వారినమ్మకం వారిది. వస్తాను అన్నప్పుడు దైవదర్శనానికి వద్దనటం భావ్యం కాదుకదా ? అని వారి తరపున అడిగిన మనపీఠానికి వచ్చే కార్యకర్త అభ్యర్థించారు.

అలావద్దు అని చెప్పే అర్హత మనకు లేదు ,కానీ వాల్లు పటాలంతో వస్తే ఇక్కడ అనాచారమవుతుంది . కనుక ఆభ్యర్థి వారి భర్త ఇద్దరు మాత్రమే రావాలి. ఇక్కడ వారెవరికీ ఆవిషయం తెలియపరచకుండా . అని షరతు పెట్టాను. వాల్లువచ్చారని తెలియగానే స్థానికంగా ఉన్న ఆపార్టీ కార్యకర్తలు రావటం.వాళ్లలో స్నానాలుకూడా చేయకుండా అనాచారంతో వచ్చినవాళ్లను మనం మందలించటం. వాళ్ళు అలగటం. ఇదొక తలనొప్పి . అని చెప్పాను,

విషయం తెలిసి ఆ అభ్యర్థి కూడా భర్తతో కేవలం డ్రైవర్ తో కలసి ఉదయాన్నే పూజకొచ్చారు.వా  రొచ్చేప్పటికి అభిషేకం జరుగుతున్నది, వారినీ కూర్చోబెట్టి అభిషేకం,పూజా జరిగాయి. వచ్చేప్పుడు వారు రెండు కొబ్బరికాయలు,డజను అరటిపండ్లు,రెండుమూరలు మల్లెపూలు తెచ్చారు. పూజానంతరం ఇక్కడ దక్షిణలు తీసుకునే సాంప్రదాయం లేదు కనుక హుండిలో ఆయన యాభైరూపాయలు  వేస్తున్నారు. నాకు చాలా జాలి  వేసింది.  ఇద్దరూ డాక్టర్లు. వాల్లకున్న యావదాస్థినీ ఖర్చు పెట్టారట్లుంది . జనం పూర్తిగా నాకేశారులా ఉంది. చేతిలో డబ్బుకూడా లేని స్థితికి వచ్చారు. ఏమి ఖర్మ పట్టింది వీరికి అనిపించింది.

 యథాప్రకారం ఆయన ప్రసాదం  తీసుకునేప్పుడు వారి పూర్వీకులు చేసిన పుణ్యకార్యక్రమాలగూర్చి చెప్పగా ,మేము కలలో కూడా ఊహిమ్చలేదండి ఇలా రాజకీయాలలోకొస్తామని అని ఆవిడ చెబుతుండగా అప్పటికే అక్కడకొచ్చిన స్థానిక లీడర్ స్వామీ!  వీరి విజయంకలగాలని ఆశీర్వదించండి అని అడిగారు.

స్వామీ ! ఆవిడ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవిడ ఏదడిగినా ఆవిడ ఏదిమేలో అదే ఇస్తుంది. యతోధర్మస్థతో జయః అన్నారు పెద్దలు . మధ్యలో ఇంకొకరు ఏదోచెస్తామనటం అబద్దమవుతుంది. అన్నాను.

 ఆవిడతో అమ్మా! మీపిల్లలకైనా ఒకరోజు చాక్లెట్ ఇచ్చిన మీరే ఇంకొకరోజు ఇంజక్షన్ కూడా చేయవలసి రావచ్చు. నొప్పికలిగిందని ఏడ్చి వాడు తనపై మీకు ప్రేమలేదనుకున్నా అది లేనట్లా? అలానే భగవంతుడు ఎప్పుడు ఏది ఇస్తే అది ఆయన అనుగ్రహంగానే భావించాలి. మీ పూర్వీకుల పుణ్యఫలం వలన ఈరోజు మీకు సమాజంలో ఈ ఉన్నతస్థితి కలిగింది. అలానే మనం చేసే అపచారాలు మన పుణ్యఫలాలను కొట్టి వేస్తుంటాయి. అది మనమైనా, మననాయకుడైనా ...............తప్పదు.  మనం ఈరోజు మొక్కుతున్న భగవంతుని పట్ల మన నాయకులు అపచారం  చేస్తుంటే కనీసం నోరు మెదపం. పవిత్ర స్థలాలో   చేసే అపచారాలప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది కట్టి కుడువక తప్పదుకదా ?  అని నర్మగర్భంగా చెప్పాను. వాళ్లకు అర్ధమైంది.  ప్రసాదం తీసుకుని వెళ్ళారు.


ఇక రాష్ట్రంలో మరో చోట మనకు   ఆప్తుడైన  ఓ అభ్యర్థి పోటీచేశారు. ఆయనకుసరైన ప్రత్యర్ధే లేరు   గెలుపు నల్లేరుపై నడక అన్నారు . కానీ నాకుమాత్రం ఎందుకో ఇతనికి కష్టాలున్నాయనిపించినది. సరే వారి ప్రయత్నాలన్నీ అయ్యాక పోలింగ్ అయ్యాక, స్థానిక ఫలితాలొచ్చాక. కళ్ళు తిరిగాయి. పరిస్థితి టైట్ . అతనికోసం స్వామి వారికి పూజజరిపించమని కోరగా ఆయన ,ఆయన కుటుంబం  శ్రీవేంకటేశ్వర స్వామివారికి అంకిత భక్తులని తెలుసు కనుక ,ఇనుముతో సహవాసం చేస్తే అగ్నికికూడా సమ్మెటదెబ్బలు తప్పవుగనుక వారితరపున ఈరోజు  ఉదయం అర్చనలు సాగించాము స్వామికి . నిన్నరాత్రే ఆయన పుణ్యఫలం ఆయనను తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలోనే గడిపేట్లుగాచేసింది . భారీ మెజార్టీ అనుకున్నది కాస్తా పరువుగా బయటపడేట్లు  చేసింది.

ఇందాక వారు మాట్ళాడినప్పుడు చెప్పాను. ఇప్పుడు స్వామి అనుగ్రహం మిమ్మల్ని ఈరోజు ఇలా కూర్చో బెట్టింది. మీ అధినేతో,మీ ప్రయత్నాలు మాత్రమో ! మీకీ విజయాన్నివ్వలేదు..    కనుక మనం ఎవరైనా స్వామి పట్ల అపచారంగా ప్రవర్తిస్తే ఎవరినైనాసరే తప్పు అనాల్సిందే. అప్పుడే స్వామిపట్ల మన భక్తిశ్రధ్ధలున్నాయని గుర్తు. అనిచెప్పాను. ఆయనా స్వామిభక్తుడు కనుక అర్ధం చెసుకున్నాడనుకుంటున్నాను.

అయితే గెలిచినవాళ్లంతా మహాపుణ్యాత్ములు, ఓడినవారంతా పరమ పాపులని నేననటం లేదు. తను తనపూర్వీకులు చేసిన పుణ్యకర్మలవల్ల లభించిన సంపదలు, చెడుకర్మలవల్ల ,దైవాపచారాలవలన తొలగిపోయి కష్టాలు సంప్రాప్తిస్తాయని చెప్పటం నాఉద్దేశ్యం,

తిరుమల భూమిపై ఉన్న మహాశక్తిక్షేత్రం. సాక్షాత్తూ జగన్నాయకుడైన శ్రీహరి లీలాస్థలం. ఇక్కడ  చెసుకున్నవారికి చెసుకున్నంత. భక్తితో ఉన్నవాడికి కలిగే మేలు ఎలానో అహంకరించేవాడికి అంతకీడు జరుగుతుంది
.
ఒకాయన శ్రీ కృష్ణదేవరాయలుటైపులో ఆలయంలోనే అభిమానుల చే పాద నమస్కారాలందుకుని అపారపుణ్యాన్ని పోగొట్టుకుని ఆరునెలలు గడవకముందే ఆప్తులచేతిలోనే అవమానాలపాలై  గంపెడు సంతానం  ఉన్నా చివరదశలో ఎవరూ లేనివాడిలా అశువులు బాశాడు.
 ఇంకొకాయన రోప్ వేలతో తిరుమలను విహారస్థలంగా చేయాలనే తిక్కలఆలోచనలతో క్షేత్రపాలకుల అగ్రహానికి గురై వాహనంతో సహా పైకి లేచి పరమాత్మ అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డా పదిసంవత్సరాలు తనస్థితిని చూసి తనే జాలిపడేలాగడిపాడు.

 ఇంకొకాయన వెంకన్నకు ఏడుకొండలెందుకు ? రెండు చాలు, మిగతావి తమ విశ్వాసానికి చెందినవారికివ్వాలనే దురూహతో ప్రయత్నాలుచేసి   ..... చుక్కల్లో కెక్కినాడె చక్కనోడు...అని అభిమానులచేత పాటలు పాడించుకున్నాడు.

తనకు ఎవరూ సాటిరారనే అహంకారంతో శ్రీవారి సన్నిధిలోనే జేజేలు కొట్టించుకుని,పాదరక్షలతోనే పరమపవిత్రధామంలో ప్రవేశించే ప్రయత్నంతో విర్రవీగి న ఇంకొక లీడర్ కు ఎన్నికలో సాటిలేదు,వార్ వన్ సైడ్ ,ఆయనే సి ఎమ్ అని అన్ని సర్వేలు,పత్రికలూ చెప్పినా   చివరకు ,,,,,అంతా భ్రాంతి యేనా........ జీవితానా వెలుగింతేనా ???? అంటూ పాడుకుంటున్నాడు.

శ్రీవారి పట్లచేసిన అపచారానికి ఫలితం ఎంత కర్కశంగా ఉంటుందో ఇంకా కొంతకాలం తరువాత మనకు మరిన్ని ఉదాహరణలు కనపడతాయి

గెలిచినవారికి, ఓడిన వారికి చిన్న మనవి. మీకున్నది చూసుకుని గర్వంతో పవిత్రక్షేత్రాలలో విఱవీగి ప్రవర్తించకండి.క్షేత్రానికి,అక్కడి పవిత్రతకూ,భక్తులకూ బాధకలుగనివ్వకండి . లేదంటే వందతప్పులూ కాయబడతాయి. వందపూర్తయ్యాక తప్పులూ ఉండవు. శిశుపాలుడూ ఉండడు.

ధర్మోరక్షతిః రక్షితః


జైశ్రీరాం










Read more...

మానవత్వం మిగులుతుందా మనుషుల్లో? ఇటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటే ?

>> Monday, March 24, 2014

గతసంవత్సరం నేను బదరీనాథ నుమ్చి తిరిగొచ్చేప్పుడు ,బాగారాత్రి వేళ దారిలో ఒక బైక్ పడిపోయి ఉంది ఓమనిషి నేలపై దొర్లుతున్నాడు. మేమెక్కిన జీప్ డ్రైవర్ పట్టించుకోకుండా  బండిఆపకుండా వెళుతుంటే ,అదేమిటయ్యా ! అతనికి ప్ర,మాదం జరిగిందేమో ? ఎవరూ లేని ఈప్రదేశంలో  అలా వదిలేసి వెళ్ళటమేమిటి ? కాస్తాపు . చూద్దాం అని అడిగాను. రేపొద్దున్నే  నెనే బండిని గుద్దానని అంటాడూ. వాడు తాగుంటే పొద్దున్నే మెలుకువచ్చాక నాడబ్బు తీసుకున్నారంటాడు. మీమానాన మీరుపోతారు .ఇరుక్కునేది నేను అని రాష్ గా సమాధానం చెప్పి మా మాట పట్టించుకోకుండా ఇంకా స్పీడుగా పోనిచ్చాడు . వీనికి మానవత్వం లేదు అనుకున్నాను అప్పుడు. కానీ అతనికి ఎదురైన అనుభవాలు అతనికి  అంత కాఠిన్యం తెచ్చాయేమో అనిపిస్తుంది ఇప్పుడు కొన్నిసంఘటనలు చూస్తుంటే.

వినుకొండలో  మా బంధువుల పిల్లవాడొకడు  బ్రతుకు తెరువుకోసం టెంట్ హౌస్ ఒకటి పెట్టుకున్నాడీమధ్య . అతనిదగ్గర   రోజువారీగా పనిచేస్తున్నారు కొందరు కుర్రవాళ్లు. అందులో  పక్క ఒక పల్లెటూరునుంచి వచ్చే వాల్లలో ఒక కుర్రవాడు బాగాపని చేస్తాడు. కాకుంటే అతనికి ఇంటిదగ్గర పనిలేనిరోజులలో వచ్చి పనిచెసి ఏరోజు డబ్బు ఆరోజు తీసుకెళతాడు. మొన్నొకరోజు అతను ఉదయాన్నే  పనిలోకి వచ్చాడు . .టెంట్ హౌస్ వద్దకు రాగానే హఠాత్తుగా కుప్పకూలి పోయాడు . కంగారు పడ్డ  వీల్లంతా  అతన్ని హాస్పటల్ కుతీసుకెళ్ళారు. హార్ట్ ఎటాక్ వచ్చిందని గుంటూర్ తీసుకెళ్ళమని చెప్పారు . వెంటనే వాల్ల బంధువులకు కబురుచేసి పిలిపించి గుటూరు తీసుకెళ్ళటమే గాక దగ్గరుండి హాస్పటల్ లో  తన జేబులో డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ఇప్పించినా దురదృష్టవశాత్తూ ఆకుర్రవాడు మరణించాడు. అప్పటికే ఓనరైన మావాడికి బాగానే ఖర్చయింది. శవాన్ని మృతుడి బంధువులు తీసుకుని వెళ్ళారు.
మరుసటి రోజు ఆవూరినుండి  చనిపోయిన కుర్రవానితో పాటు పనిలోకి వచ్చే ఇంకొక కుర్రవాడు మృతుని బంధువులతో వచ్చి ,చనిపోయిన వారి కోసం ఓనర్ గా మీరే బాధ్యత తీసుకోవాలని గొడవ  పెట్టుకొన్నారు. అదేమిటయ్యా? అతనేమన్నా నాదగ్గర నెలవారీ పనిచేస్తున్నాడా? రోజువారీగా ఇష్టం వచ్చినరోజు పని చేశాడు నాకు సంబంధం లేకపోయినా ఆపదకదా,అని నాస్వంతడబ్బుతో అంబులెన్స్ పెట్టి మరీ హాప్సటల్ కుతీసుకెళ్ళాను  ,వాల్లావిడ కూడా  ఉందికదా హాస్పటల్ కు తీసుకెళ్ళేప్పుడు,నే నింకెందుకివ్వాలి అని అతను వ్యతిరేకించాడు.   ఇవ్వకుంటే  మీరే అతన్ని కొట్టి చంపావని ,కేసుపెడతాం !  ఇంకా వినకపోతే  ఎస్ సి హెరాస్ మెంట్ కేసు కూడా పెడతామని  బెదిరింపులకు దిగారట. ఆసమయంలో దగ్గర ఎవరూ లేకపోవటం ,ఏం చేయాలో తోచక  ముందు  ఇవి తీసుకెళ్ళి అంత్యక్రియలు జరుపుకోండని పదివేలు చేతులో పెట్టి పంపాడు.
ఇక మంచికి పోతే నాకు ఇలా అయింది . నాకెందుకని గవర్ణమెంట్ హాస్పటల్ కుతీసుకెళ్ళి వాల్లబంధువులకు అప్పచెబితే పోయేది ! అని వాపోతున్నాడు టెంట్ హౌస్ ఆధారంగా బ్రతుకుతున్న  మావాడు.
మృతుడి బంధువులకు తెలుసు . ఇతను  సహాయం చేశాడని . మృతుడి పెళ్ళాం పిల్లలకు దిక్కులేకుండా పోయింది. అదివాస్తవమే! కానీ అందుకు కారణం ఎవరూ కాదు. విధి మాత్రమే కారణం.
ఇప్పుడు తమకు  విధిద్వారా జరిగిన అన్యాయానికి ఇంకెవరినో అన్యాయం చేయాలనే భావన సరైనదేనా? ఇంకెవడినో అన్యాయంగా  దోచుకోవాలనుకోవటం,అందుకోసం చట్టం ఇచ్చిన అవకాశాన్ని బ్లాక్ మెయిల్ కోసం వాడుకోవటానికి సిద్దపడే మనస్థితి  సమాజంలో ఎటువంటి పరిణామాలకు కారణమవుతుంది?
ఇలాంటి సంఘటనలమూలంగా  సామాన్యులలో  మానవత్వ భావనలు మిగులుతాయా?

ఇలాంటి అనుభవం ఎదురయ్యాక

Read more...

అవినీతి పరులైన అధికారులు,ఉద్యోగులు మాత్రమే కాదు ..అహంకారం,అసహనపరులైన భక్తులూ ..తిరుమల పాలిట చీడపురుగులే.

>> Thursday, January 30, 2014

కలియుగంలో భక్తులనుద్ధరించటానికై  వెలసిన దివ్యస్థలం తిరుమలకొండ ఈ యుగాన మానవుని బలహీనతలవలన కష్టతరమైన సాధనా మార్గాలో ఆథ్యాత్మిక ప్రయాణం  అందరికీ అందదు. బిడ్డ తన దగ్గరకు నడవలేనప్పుడు తండ్రి తనస్థానం నుంచి కదలి వచ్చి బిడ్డనుదరిచేర్చుకున్న రీతిలో వైకుంఠవాసుడు తరలివచ్చి కొలువై ఉన్నదివ్యస్థలి ఇది.   అందుకే అన్నమాచార్యులు "కట్టెదుటా వైకుంఠము కాణాచైన కొండా"అని తిరుమలకొండగూర్చి చెప్పారు. ఇక కలి పురుషుడు తన ప్రతిన ప్రకారం ఆ పరంధాముణ్ణి పవిత్రమనస్సుతో చేరుకోకుండా అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తుంటాడు. ఆ మాయా ప్రభావం వలన పవిత్రపుణ్యక్షేత్రాలలో కూడా  నీచ జనగణం తిష్ఠవేసుకుని కూర్చుంటున్నది.

  ఇప్పుడు సేవాగుణం ద్వారాకాక నికృష్టరాజకీయ అధికారాలతో ఇక్కడ క్షేత్రపాలకులుగా  అధములు దిగబడుతున్నారు. వారిననుసరించి  ఆయన ప్రసాదించిన ఉద్యోగంతో బ్రతుకుతున్న ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడా శ్రీవారి పట్ల అపారమైన భక్తి కలిగిన అధికారులూ అప్పుడప్పుడు వస్తుంటారు. ఇంటివద్ద భోజనం చేసివచ్చి పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా శ్రీవారి సేవలో తరిస్తున్న ఉద్యోగులూ  ఉన్నారు, కానీ సంఖ్యస్వల్పం. .    అవినీతి వైరస్ పాకి పోయి ఉన్న  ఈబాపతు, రాజకీయనాయకులు,ఉద్యోగులు తిరుమలను వ్యాపారస్థలంగా మారుస్తున్నారు.

  ఇక ఇంకొక వైపు  అహంకారం ,అసహనం పెనవేసుకున్న  ఉన్మాదభక్తులు   పలు
దుశ్చర్యలకు తెగబడుతున్నారు.తిరుమల లో సమస్యలకు ఒక్క అధికారులను,రాజకీయ నాయకులనే బాధ్యులుగా చూడకూడదు. అంతకంటే ముందు భక్తులమని చెప్పుకుంటున్న  మనం తిరుమలపట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మావలోకనం చేసుకోవాలి.

మొన్న తిరుమలలో  వైకుంఠ ఏకాదశి నాడు  దర్శనం లేదని గొడవ  చేసిన భక్తులపై  టిటీడి అధికారులు కేసులు పెట్టడాన్ని అందరూ విమర్శించారు. అది తప్పే. అయితే ఇక్కడ మీడియాగోలలో ఒక విషయం మరుగునపడింది.
గొడవ చేసినది ఎవరు? .   సామాన్యభక్తుల్లా దర్శనాలకోసం వచ్చినవారు కాదు. సిఫారసులేఖలతో వచ్చినవారు .[ఇందులో దర్శనాలు ఇప్పిస్తామని డబ్బుదండుకునే దళారీలూ ఉన్నారట] తమకు సిఫారసు లేఖలున్నాయి గనుక తమకు దర్శనం కల్పించాల్సిందే అని ధర్నాకు దిగారు. ఇక్కడ విఐపీలుగా దర్శనానికి వస్తున్నవారికి ఎంత అహంకారం ఉందో ఇక్కడ సిఫారసు లేఖలతో వచ్చేవారికీ అంతే అహంకారం ఉంది.
 వీళ్ళ అధికారాలను చూసి వీల్లొచ్చేస్సరికే చ్చేసరికే స్వామివారు  వీరి కోసం ఎదురుచూడాలనేది  వీళ్ళఅభిమతమా?   జగత్ప్రభువు సన్నిధికి వెళ్లాలంటే ఎంతగౌరవం, వినయం,భక్తి,అణకువ ఉండాలో వీళ్లకు తెలియదు.

ఇక మొన్న శుక్రవారం రోజున పైఉన్మాదభక్తులను ఆదర్శంగా తీసుకుని  అంగప్రదక్షిణం  సేవలో పాల్గొన్న భక్తులు తమకూ దర్శనం ఇప్పిమ్చాల్సిందేనని ఆలయంలోలోనే గొడవకు దిగారు. అది  శుక్రవారం స్వామివారి అభిషేక సమయం.వీరివలన స్వామి వారి అభిషేకానికి అంతరాయం ఏర్పడింది. ఏమాత్రం  బుధ్ధీజ్ఞానం లేని చర్య ఇది. నిజమైన భక్తుడెవడూ ఇంత అపచారానికి సాహసించడు. శుక్రవారం తప్ప మిగతారోజులలో అంగప్రదక్షిణం చెసిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇస్తారు . శుక్రవారం దర్శనం ఉండదని ముందుగానే నిర్ణయించబడింది. ఐనా  ఇలా అరాచకానికి పాల్పడే మనస్తత్వం భక్తి కాదు ఉన్మాదానికి ప్రతీక.  వీరి మూర్ఖపు చర్య వల్ల శుక్రవారం అంగప్రదక్షిణం రద్దుచేయబడింది.    శుక్రవారం స్వామి ఆలయంలో అంగప్రదక్షిణం   చేసే అద్భుత అవకాశం  భక్తులకు ఇకపై లేకుండా పోయింది. ఈపాపానికి బాధ్యులు ఫలితం అనుభవించాల్సిందే .

ఇక ఈరోజు వార్త లలో ఆయనెవరో మద్దూరి గారట. ఆయన దర్శనాలు,టిక్కెట్లూ ఇప్పిస్తాననగానే క్యూకట్టి డబ్బు సమర్పించుకున్న వారిలో  స్వామీజీ లు కూడా ఉన్నారని తెలుస్తుండటం కలియుగమాయలకు పరాకాష్ఠ.
దేవదేవుడిని ఎలా దర్శించాలో బోధించవలసిన పనిలో ఉన్నవారే   ఇలా దిగజారితే  వీళ్లను  కపటకాషాయవేషధారులనే పిలవవలసి వస్తుంది. ఇటువంటి ఆథ్యాత్మిక గురువుల శిష్యరికంలో తగలడ్డ శిష్యపరమాణువులు ఇంకెంత  గొప్పవారవుతారో?
ఇక తిరుమల కొండపై యాత్రీకులకు సేవచేస్తామని స్థలం తీసుకుని నిర్మించిన మఠాలలో భారీ అద్దెలకు గదులు ఇస్తూ  కోట్లుసంపాదిస్తున్న నిర్వాహకుల ఆథ్యాత్మిక సేవ ఏమని చెప్పాలి?
ఇటువంటి  వ్యాపారులను కొండపైనుండి తరిమితేగాని   ఆథ్యాత్మికరంగానికి సగం దరిద్రం వదలదు.

తిరుమల పట్ల మనం చూపేశ్రద్ద,అక్కడ మన అణకువ, వినయం తోకూడిన ప్రవర్తన మాత్రమే శ్రీవారి అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి . అడ్డదారిలో వెళ్ళెదర్శనాలు మన పుణ్యాణ్ని క్షయింపజేస్తాయి. ఆయన కన్నీతెలుసు .శిశుపాలుడి వందతప్పులు పూర్తయ్యేదాకా లెక్కించినట్లు మన పుణ్యరాశి ఖర్చయినదాకా లెక్కలు వేసి ఆపై ఘోరమైన శిక్షలకుగురిచేస్తారు క్షేత్రపాలక దేవతలు. జాగ్రత్త .

Read more...

సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉండే అక్కినేని గారి చివరి యాత్రలో వారసులు కూడా సాంప్రదాయానుసారం ఉంటే బాగుండేదేమో !

>> Friday, January 24, 2014

తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉంటారు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎక్కడ కనపడ్డా పంచకట్టుతో తెలుగుదనం ఉట్టిపడుతుండగా నిండుగా ఉంటారు. సాంప్రదాయములపై ఆయనకు నిబద్దతమెండు. ఓసారి ఆయనంటారు ఒక ఇంటర్వ్యూలో " పెళ్ళి పీటలమీద పెళ్ళికొడుకు నిండుగా పంచెకట్టుకుని ఉంటే శోభగా ఉంటుంది గానీ ఫ్యాంటు షర్ట్ లతో పెళ్ళిపీటలమీద కూర్చుంటే ఆ అందం ఎక్కడనుండి వస్తుంది? "అని.
కాబట్టే ఎక్కడ ఏ కట్టూబొట్టూ, వస్త్రధారణ ఉండాలో అక్కడ ఉండాలి అంటారు పెద్దలు.
ఆయన ఒకమహానటుడు .. నిజజీవితాన్ని పరిపూర్ణంగా ఎలా అనుభవించాలో చక్కని ప్రణాళిక ఉన్న జీవితం గడిపి, బాధ్యతలన్నీ పూర్తిచేసుకుని ,మరణం దగ్గరకొస్తున్నదన్న విషయం  సాధారణమే కదా ? అన్న నిశ్చలత్వంతో గడిపి ప్రశాంతంగా నిద్రలో తమ దేహాన్ని వదిలేశారు. అందరికీ రాదు ఆ అదృష్టం.

ఇక వారి అంతిమసంస్కారాలను టివీలో చూస్తున్నప్పుడు  సాంప్రదాయ పద్దతులను పాటించటం లో వారసులు పెద్దగా శ్రద్దచూపకపోయారేమో ననిపించింది. అయితే పుట్టెడు దుఃఖంలో వున్న వాల్లు ఈవిషయం గమనించకపోయినా  పక్కన పెద్దవాల్లైనా వారికి సూచనలు ఇస్తేబాగుండేది.

సహజంగా పార్ధివ దేహాన్నికూడా పవిత్రంగా భావించి దహన కార్యక్రమంజరిపేప్పుడు పాదరక్షలు వేసుకోరు . కానీ నాగార్జునతోసహా అందరూ బూట్లుధరించటం బాలేదు.
ఇక ఈసంస్కారంలో పంచెకట్టుతో తడివస్త్రాలు ధరించి ఉంటారు చితికి నిప్పంటించే వారు.  కానీ అక్కడ అలా లేదు.
అన్నిటికంటే అర్ధం కాని విషయం  తండ్రికి  పెద్దకుమారుడు తలకొరివి పెట్టాలి   పెద్దవారు వెంకట్ గారుండగా  నాగార్జునగారిచే ఈకార్యక్రమం జరిపించటం ఏమిటో ? ఎందుకో? తెలియటం లేదు.
    ఈ సంస్కారాన్ని జరిపించే జంగమదేవర గంట,శంఖం తో ఒక్కసారి కనిపించారు ఆతరువాత ఈ కార్యక్రమమప్పుడు ఆయనను ఎక్కడోవెనక్కు నెట్టేసినట్లున్నారు.

ఇక  ఓ మంచి నటుని మరణం పై ఇలాంటి   విషయాల ప్రస్తావన అవసరమా ? అని కోపగించకండి.
,మనిషి పుట్టినప్పటినుండి మరలా మట్టిలో కలిసేవరకు ఒక యజ్ఞంలా  మనజీవితాలలో సంస్కారముల పరంపర కొనసాగుతుంది. దేవునిపై పెద్దగా నాకు నమ్మకం లేదని నాగేశ్వర రావుగారు చెప్పినా, సాంప్రదాయాలను పాటించటంలో మాత్రం ఆయన నిబద్దతగా ఉండేవారు. వారి పూర్ణజీవితంలో ఈ చివరిఘట్టం లో సాంప్రదాయంకూడా చక్కగా పాటిస్తే బాగుండేదనే నా భావన. పరమాత్మ వారికి దివ్యలోకాలనుప్రసాదించాలని వేడుకుంటూ... నమస్కారం

Read more...

తిరుమల కొండపైకి వాహనాలను అడ్డుకుంటారా ? పిచ్చి పై స్థాయికి చేరుతున్నట్లుంది మీకు .

>> Sunday, September 22, 2013

సమైక్యాంధ్ర ఉద్యమనాయకులు రేపు తిరుమల కొండపైకి వాహనాలు వెల్లకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఈవార్త  చూస్తే ఉద్యమకారుల మతి తప్పి పిచ్చి స్థాయికి చేరుకుంటున్నట్లు అనిపిస్తున్నది

. ఈ ఉద్యమాలకు  దివ్యక్షేత్రాలకు సంబంధం ఏమిటి?  కొండకు వచ్చే భక్తులకు ఇబ్బంది కల్పించటం ద్వారా ఏమిసాధించాలని అనుకుంటున్నారు వీళ్ళు ?     ఉద్యమాలకు దైవానికి సంబంధం ఏమిటి?   మొన్న తెలంగాణ ఉద్యమంలో ఆలయాలు మూసివేసి న వాల్లు ఏంసాధించారు ? రాజకీయ విషయాలకు   రాక్షస మనస్తత్వమెందుకు? ఇలా ఇతర మతాలపట్ల చేస్తున్నారా ?   తెలంగాణా ఉద్యమంలో గాని సీమాంధ్ర ఉద్యమంలో గానీ పాల్గొంటున్న ఇతర మతస్థులు ఎప్పుడైనా ఉద్యమం పేరుతో వారి శ్రధ్ధాస్థలాలను ఈ రొంపిలోకి లాగారా ? ఆలయాలను ముసివేస్తామని ప్రకటించి మూసివేసిన తెలంగాణా ఉద్యమ సమయంలో ఎక్కడా  శుక్రవారం నమాజ్ లుకాని ఆదివారం ప్రార్ధనలు కానీ ఆగలేదే ? కనీసం ఆదౌర్భాగ్యపు ఆలోచన కూడా  ఆయామతస్థుల మనసులోకి రాలేదు.రాకూడదు కూడా . కానీ మనకు వస్తున్నాయి ఈ ఆలోచనలు . దైవదర్శనం లేకుండా చేసి రాక్షస మనస్తత్వాలను బయట పెట్టుకున్నాం . మరలా. ఇప్పుడూ  అదే తంతు . కొండపైకి  వచ్చే భక్తులకు ఇబ్బందికలిగించేలా వాహనాలను ఆపటం మొదలుపెడుతున్నారు. రేపు గుడి తలుపులు కూడా తీయొద్దంటారేమో ?కొండపైకి వెళ్ళటానికికూడా వీల్లేదంటరేమో ? ఏమో చెప్పలేం ? పిచ్చి ముదిరితే ఏస్థాయికైనా వెళ్ళొచ్చు.
ఉద్యమకారులూ! కొద్దిగా కళ్ళుతెరచి  చూడండి . దైవభక్తులకు కలిగించే బాధ భగవంతుని పట్ల అపచారమవుతుంది.   కోనేటిరాయని క్షేత్రంలో ఇలాంటి చర్యలు చేపట్టి కోరి ఆపదలను తెచ్చుకున్నట్లవుతుంది మనం..

అసతోమా సద్గమయ !

Read more...

కాపాడినది తల్లి కనకదుర్గమ్మ ఈరోజు నన్ను కనికరించి

>> Friday, August 16, 2013

పిపీలకాది బ్రహ్మపర్యంతము జీవులగమనము ఎవరి ఆజ్ఞానుసారం నడుస్తున్నదో ఆ తల్లి జగన్మాత పాదపద్మములకు నమస్కారము.


అనుకోకుండా మొన్న శుక్రవారం [9 వతేదీ] న అర్చనానంతరము    అమ్మ సన్నిధినుండి బయటకు వస్తూ కొబ్బరినీళ్లపై కాలు జారి పడటం వలన ఎడమ కాలు ఎముక విరిగినది. వెంటనే పిల్లలు కారుతీసుకు వచ్చి నరసరావుపేట ఆర్దోపెడిక్ శ్రీనివాసరెడ్డిగారి హాస్పిటల్ కు చేర్చటమూ అక్కడ  సరజరీచేసి రాడ్ వేసి కుట్లువేయటమూ జరిగినది. వారంరోజులుగా అలవాటులేని హాస్పటల్ వాతావరణం చికాకు కలిగించగా  డాక్టర్లకు మల్లొస్తాను అని చెప్పి నిన్న గురువారం రాత్రికి ఇంటికి చేరాను. ఈరోజు చక్కగా మా అవిడచే వరలక్ష్మీవ్రతం జరిపించి ఆవిడ నివేదించిన ప్రసాదాలను స్వీకరించి సంతుష్టాంతరంగ అయినదాతల్లి .  నాకుమాత్రం ఈరోజు లోపలికెల్లి దర్శించుకునే భాగ్యం ప్రసాదించలేదు. వారం రోజులుగా అతల్లి సేవకు దూరం అయ్యేంత పాపకర్ముడనయ్యాను.
ఇక మాతాతగారి వద్దనుండి పీఠంలో చిన్నపొరపాట్లు జరిగినా వెంటనే దాని దృష్టాంతాలు కనపడుతుంటాయి .
 నాకు తెలిసి   ఈమధ్య కాలంలో  నేను చేసిన పాపపుపని ఒకటున్నది. మందిరంలో ఈమధ్య చీమలు ఎక్కువయ్యాయి. ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు చేసి మట్టిని తోడూతున్నాయని కోపంతో   చీమల మందు  చల్లాను. అప్పుడూ మనసులో బాధకలుగుతున్నా  , మరి  మందిరాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత నాదేకదా అని సర్ధిచెప్పుకున్నాను.

ఇక రెండవది నేను మొహమాటానికి వెళ్ళి  ఓ పెద్దావిడ   [భర్తనుకోల్పోయి ఇంకా పుట్టింటివారు తీసుకెళ్ళి వస్త్రాలు పెట్టకముందే ]    ఇక్కడకు రావాలని చాలారోజులుగా కోరుతున్నందున ఆవిడ తురీయాశ్రమం లో ఉన్నవారుకనుక రావటానికి అనుమతించాను. ఇది దోషమని మావాల్ల వాదన.
ఇక ఆలయంలో ఇతరులు తెచ్చిన నైవేద్యలను శుధ్ధిగా  చేశారా ?లేదా ? అనివిచారించి నివేదనకొరకు తీసుకుంటాము. అయైతే మా పిల్లవాడొకడు ఆరోజు తెచ్చిన  నైవేద్యం  పీఠ ఆవరణలోకి  రాగానే క్రిందపడిపోయింది. ఆపిల్లవాడు మళ్ళీ ఇంటికెళ్ళి నైవేద్యం తీసుకునిరావటం, కాదంటే బాధపడతాడని ఆనైవేద్యాన్ని లోపలికి తీసుకెళ్లటం .  ఇక్కడ దోషం ఆపిల్లవానిదికాదు. మానాయనమ్మ  చెబుతుండేది  అమ్మవారి పూజ కత్తిమీద సాములాంటిది .వళ్లు దగ్గరపెట్టుకును ఉండాలని.
వీటన్నిటికంటే ఇంకో  ప్రాబ్ల్మ్ ఉంది. మాగ్రామంలో రాములవారి మేడ గ్రామరక్షాదేవత యంత్రము  పునరుధ్ధరణలేక జనంలో అలజడి, ఒకరిపైఅ మరొకరికి అనవసర ద్వేషాలతో గ్రామం ఎదుగుబొదుగులేక కునారిల్లుతున్నది.
ఈ మధ్య లో మనమన్నాకాస్తపట్టీంహుకుందామని ,గ్రామంలో యువతను సమీకరించి ప్రయత్నాలు చేశాను. మరుసటిరోజే ఈ దుర్ఘటన జరగటం. ఆరోజు రాత్రి నన్ను ఆసుపత్రికి తీసుకెల్లిన తరువాత మా అమ్మగారి కి స్వప్నంలో పూర్వమెప్పుడో మా గ్రామంలో గతించిన వ్యక్తులు తగాదాకు వచ్చినట్లు కనపడి ఏడి వాడు? కొద్దిఓ మాచేతనుంచి తప్పించుకున్నాడు .లోపల వాల్ల నాయనమ్మ వాన్ని నెట్టి కాపాడింది. బయటకొస్తే వాడిసంగతి చూసేవారం అని తగాదాలాడుతున్నారట . మాఅమ్మ గారు ఏడూస్తూ రాత్రల్లా స్వప్నంలో వాల్లతో తగాదాడుతున్నదట.  పొద్దుటే ఏడుస్తూ హాస్పటల్ లో ఉన్న నాకు ఫోన్లో చెప్పటం జరిగింది
 ఏదో పెద్దప్రమాదం జరగవలసినది అమ్మ సన్నిధిలో ఉండటం వలన తప్పుకోగలిగాను అని నమ్ముతున్నాను. ఇందుకు కారణం నావలన ఏదైనా జీవికి జరిగిన అపకారం కావచ్చు. లేదా నా కర్తవ్యపాలనలో లోపం కావచ్చు ,లేదా నాదికాని పనిని  తలకెత్తుకున్నందుకుకావచ్చు , కానీ కాపాడబడినది మాత్రం ఆతల్లి అనుగ్రహం వలన మాత్రమే నిస్సందేహమిది.
జై జగన్మాతృకే

Read more...

బుద్ధునిపై అపారమైన ప్రేమను ఒలకబోసేవారంతా నోరు విప్పరేం ??????!!!!??????

>> Wednesday, July 10, 2013


ఆరుబయట ఉంచిన రాగిపాత్రకు చిలుము పట్టినట్లు గా ధర్మావలంబనలోకూడా కాలానుగుణంగా కొన్ని అనాచారాలు  పెరిగిపోతాయి . వాటిని సరిచేయటానికి మహాత్ములరూపంలో సద్గురుసత్తా అవతరించి ఆ తికమకలను సరిచేయటం . జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా  హైందవ ధర్మంలో కూడా పెరిగిపోయిన అనాచారాలను సరిచేయటానికి బుధ్ధునిగా అవతరించిన తథాగతుడు ఆయన అవతార కార్యక్రమాన్ని కొనసాగించాడు .  ఆతరువాత ఆవతార కార్యక్రమాన్ని తమ అవసరాలకోసం ఉపయోగించుకోవాలనుకునే వాల్లు ఓకొత్తవాదన లేవదీశారు. హిందూ మతం లోమనం ఉండాల్సిన పనిలేదు . బౌద్ధానికి మారదాం అని. ఈమధయకాలంలో ఈ వాదన బాగా వినిపిస్తోంది కొందరు వర్గ సిద్దాంత కర్తల నోటివెంట . వ్రాతలలోకూడానూ. పోనీ వీల్లు బౌద్దమతం పట్ల ప్రేమ తోనూ ఆసిధ్ధాంతాలు నచ్చి ఇలా ప్రచారాలుసాగిస్తున్నారా ? లేక ఏదో విదేశీ మతాల కిరాయి ప్రచారాలలో భాగంగా బౌధ్ధవాదాన్ని చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తున్నది.
ఎందుకంటే ? మొన్న పరమపవిత్రమైన బుధ్ధ గయలో ఉగ్రవాద దాడి జరిగింది .  ఇంతదుర్మార్గంపై స్పందనలు ఎలా ఉంటాయా? అని గమనిస్తున్నాను.మన రాజకీయ నాయకులు ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడారు. ఇది పిరికి చర్య. ఉగ్రవాదాన్ని సహించం.... ఇలా పడికట్టు పదాలతో సాగాయి వారి ఖండనలు.










ఐతే నా అనుమానం ఇప్పుడు బౌధ్ధాన్ని అభిమానిస్తున్న ,వారు, హిందుత్వమే మన ప్రథమ శతృవు అన్నట్లుగా  సిధ్ధాంతీకరిస్తున్న  మేధావులు నోరు విప్పటం లేదెందుకని ?  ఇప్పుడు అందరి కంటే ఎక్కువగా స్పందన కనిపించాలి కదా ? వారినుండి ? ఎందువలన నోరు పెగలటం లేదు. అసలు వీల్లు బౌద్దం గూర్చి సిధ్ధాంతీకరించటానికి అర్హత కలిగిఉన్నారా ?అని సామాన్యజనం ఆలోచించరా ?

ఇక ఉగ్రవాద దాడులపై స్పందనలు బహువిచిత్రంగా ఉంటాయెందుకనో?  ఇలాంటి దాడి చేసిన వారికి మాత్రమే ఈసంఘటనలతో సంబంధం ఉన్నట్లు  ,ఆయామతాలకు ఉగ్రవాదంతో సంబంధమే లేనట్లు ఉంటాయి ప్రచారాలు.
ఆమధ్య నార్వే లో అనుకుంటా ఒకడు తమ మతంపై దురభిమానంతో జనాన్ని పిట్టల్ను కాల్చినట్లు కాలిస్తే  వాడు ఉన్మాది అని, మతవిద్వేషం  కాకపోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కింది మీడియా.
ఇలాంతి దురదృష్టకరమైన సంఘటనలో  ఎక్కడన్నా హిందువు పేరు కనపడిందనుకోండి ? ఇక శివాలెత్తుతారు మన నాయకులు ,మీడియా కూడా . ఇది హిమ్దువులలోపెరుగుతున్న ఉగ్రవాద లక్షణంగానూ , వానిచర్య యావత్ హిందూ సమాజ భావన అన్నట్లుగా  తమ ప్రసంగాలతో వీరంగం వేస్తుంటారు. ఎందుకని ఇలాంటి  భావజాలం లో కూరుకుపోతున్నది భారతదేశం ? ఆలోచిద్దాం ఓపదినిమిషాలన్నా .

Read more...

పనికి మాలిన ప్రతి చెత్త విషయాన్ని పదేపదే చూపించే తెలుగు టీవీ చానల్లు అత్యద్భుతంగా జరిగిన అతిరాత్రయాగం గూర్చి పట్టించుకోలేదెందుకు ?

>> Friday, May 4, 2012

పనికి మాలిన ప్రతి చెత్త విషయాన్ని పదేపదే చూపించే తెలుగు టీవీ చానల్లు అత్యద్భుతంగా జరిగిన అతిరాత్ర మహాయాగం గూర్చి పెద్దగా పట్టించుకోలేదు . ఏదో నామ్కేవాస్తే గా చూపించారు. ఒక్క ఎస్వీబీసీ,భక్తి చానల్ మాత్రమే లైవ్ లో చూపాయి.
దీనికి కారణమేమిటంటారు ? బాగా ఆలోచించి చూస్తే చాలా అనుమానాలు కనపడుతున్నాయి కదా ! ప్రిన్ట్ మీడియా తోపాటు ఎలక్ట్రానికి మీడియా పూర్తిగా ఇక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తున్నది కదా !

హిందువుల పండుగలప్పుడు ఎక్కడెక్కడనుండో అతితెలివి మేధావులను కూర్చోబెట్టి వ్యతిరేక ప్రచారం చేపించటం ,ఇక్కడివారి మనోభావాలను గాయపరిచేలా చర్చలు . ఇవన్నీ చూస్తున్నాముకదా .ఇంకా మనకు స్పష్టంగా సంకేతాలవసరం లేదు . తెరవెనుక సూత్రధారులు ఏమాలోచిస్తున్నారో ..ఏంజరుగుతుందో ..మౌనం వీడండి .ఆలోచించి మీగళాలనుకూడా విప్పండి కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొనేందుకు .

Read more...

తెలుగు బ్లాగు లోకానికి నేచేసిన సహస్రనామార్చన

>> Wednesday, May 2, 2012

బ్లాగులోకంలోప్రవేశించి మూడుసంవత్సరాలు దాటుతున్నది. ఇక్కడ కొచ్చి ఏదైనా పదిమందికి ఉపయోగపడే పని ఏకొద్దిగానైనా చేశామా ? అని ఆలోచించు కుంటున్నాను. లోకహితం కోరి మహాపురుషులైన మన ఋషిపరంపర అందించిన మహావిజ్ఞానం గూర్చి నాకుతెలిసిన తక్కువ పరిజ్ఞానాన్ని వ్రాసుకుంటూ అందుకు వందలరెట్లు ఎక్కువగా బ్లాగులోకం నుంచి నేర్చుకున్నాను . ఎక్కడో ఏజన్మ లో అనుబంధమో తెలియదు గానీ ఎందరో ఆత్మీయమితృలను సంపాదించుకోగలిగాను. మాష్టారూ ! అంటూ ఆప్యాయంగా పలకరించే యువతరం అభిమానాన్ని పొందగలిగాను.
బ్లాగులోకంలో హేమాహేమీలైన తాడేపల్లి,చదువరి, సత్యన్నారయణ శర్మ, భాస్కర్ రామరాజు,రామిరెడ్డి,నల్లమోతు శ్రీధర్,వలబోజు జ్యోతి,కొత్తపల్లి,సుజాత,మధురవాణి పద్మ, మాగంటి ,మళ్ళిన నరసింహారావు , జయదేవ్ ,రాజశేఖర్, చిలుమకూరి,ాఅదిలక్ష్మి, ఆంధ్రామృతం,భరద్వాజ,యోగి, అయ్యంగారి, నాగేంద్ర ,కశ్యప్,వీవెన్, విజయశర్మ ఇలా అనేకమంది మితృలతో[పేర్లన్నీ వ్రాయలేకపోయినందుకు క్షమించాలి .. ఈమధ్య వంశీ గారన్నట్లు నేను కూడా పెద్దముండా వాడ్నవుతూ పేర్లు వెంటనే గుర్తుకు రావటం లేదు ] కలసి తెలుగు బ్లాగులోకంలో నేనూ రెండుమాటలు వ్రాయగలిగాను. ఇక నాగప్రసాద్,మనోహర్,శ్రీకర్,నాగమురారి,చక్రవర్తి , చింతలపాటి శ్రీకృష్ణ , కృష్ణాస్ ,రాజశేఖర్,త్రినాధ్ ఇలాంటీ యువతరం తో బ్లాగులోకంలోనేకాక బయట ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోగలుగుతున్నాను .
కలి పురుషుని ప్రభావంతో భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానంపై కలిసేన జరుపుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకొంటున్న ధర్మ వీరులతో నేనూ గొంతుకలపగలుగుతున్నాను . మహర్షులిచ్చిన ఆథ్యాత్మిక సంపదతో మానవుని జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకొనవచ్చు అనే నమ్మకం కలిగిన నేను దాన్నిఆస్తికుల జీవితంలో ప్రయోగాత్మకంగా నిరూపించుకునే ఆథ్యాత్మికప్రయోగాలను అందించి ఉడతాభక్తిగా సహాయ పడగలుగుతున్నాను ...పొరపాటు ..పొరపాటు. నేనూ భగవత్ లీలలపై ఈ రూపేణా శ్రధ్ధాశక్తులు పెంచుకోగలుగుతున్నాను.
కత్తిమహేష్ ,సాంబారు గారు, లాంటి విమర్షకులకు నేను భారతీయసైధ్ధాంతిక భావజాలంతో చర్చలు ,వాదనలు జరిపానేకాని వారందరూ నాకు సోదరసమానులేగాని అన్యంకాదు .కొందరికి నావాదనల వలన శతృవుగా కనిపించానేమోకాని ! నామనసులో మాత్రం ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం పొడచూపకుండా జాగ్రత్తపడుతూనే ఉన్నాను.
వెయ్యిన్నెనిమిది పోస్ట్లులు దాటి ,లక్షమందిపైగా వీక్షకుల అభిమానానికి నోచుకుని ,ఆథ్యాత్మికంగా పలువురితో కలసిపనిచేస్తూ ..హరినామ సంకీర్తనా పథంలో నడుస్తూ నేను ఇతరులకిచ్చినది ఇసుకరేణువంత మాత్రమే నైతే ఇక్కడనుండి పొందుతున్నది కొండంత.

ఇంత పెద్ద బంధువర్గాన్ని ప్రసాదించిన తెలుగు బ్లాగ్ లోకానికి నేను ఋణపడే ఉంటాను జన్మాంతం వరకు

జైశ్రీరాం
జైశ్రీరాం

Read more...

ఎంత నీచానికి దిగజారుతున్నారీ మత వ్యాపారులు చదువులనడ్డం పెట్టుకుని ?????!!!!!!

>> Friday, March 16, 2012

రెండు సంవత్సరాలక్రితం వరకు మేము పీఠానికి అనుబంధంగా హిందూ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలను నడిపేవారం. ఇప్పుడు పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపు నివ్వటానికి పెట్టిన నిబంధనలను, కొత్త బిల్డింగులను కట్టే ఆర్థిక స్థోమత లేక ఆపివేశాము. నామమాత్ర ఫీజులతో నడిపే పాఠశలకు పిల్లలు నిండుగా ఉన్నా నిధులు దండిగా లేక వెనుకకు తగ్గవలసి వచ్చినది. ఇక మూడు సంవత్సరాలక్రితం కేరళనుంచి ఓ బృందం దిగింది మామండలం లో పాఠశాల పెట్టాలని. అనుకున్నదే తడవు వాళ్లు స్థలం కొన్నారు. ఓచర్చి నిర్మించారు . ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెట్టారు . ఇక పోలో మని పిల్లలతల్లిదండ్రులు భారమైనా చేర్చటం మొదలెట్టారు. మన పాఠశాల మూసివేయటం తో వాళ్లకు ఇంకా మేలైంది.
సరే ! ఇక వాళ్లు డబ్బుతెచ్చుకుని పాఠ శాల పెడితే మీ ఏడుపేంటని ? మీరడగవచ్చు. ఇక్కడ మా బాధ అదికాదు.చదవండి ఇంకా .

మొన్నామధ్య గాంధీనగర్ కు చెందిన నాగిరెడ్డి అనే కుర్రవాడొచ్చాడు ఆలయానికి . సార్ ! మీరు మరలా పాఠశాల ఓపెన్ చేయాలండి అన్నాడు. ఏంటి సంగతని అడిగితే....... మా చిన్నపాపను సెయింట్ జూడ్స్ లో వేశాను కదండి. అది నిండా ఎనిమిదేళ్లు లేవు . మీ దేవుడికంటే మా ఏసుప్రభువే గొప్పవాడు నాన్నా అని చెబుతుంది . నేను బిత్తరపోయాను. ఇక్కడున్నప్పుడు మా పెద్దపాప గాని పిల్లలు గానీ ఎంతచక్కగా పద్దతిగా ఉండేవారు. పసిపిల్లలకు కూడా ఇలా చెబుతున్నారు. మొన్న ఫీజు కట్టతానికెళ్లినప్పుడు వాళ్ల ప్రిన్సిపాల్ నడిగాను . వాళ్లు అలాంటిదేం లేదని సమర్ధించుకుంటున్నారు . అన్నాడు.
వాళ్లు !పాఠశాలలు స్థాపించే ఉద్దేశ్యాలలో ఇదొకటి. నిధులు రాబట్టుకుని మతవ్యాపారాలు చేసుకుంటారు . తల్లిదండ్రులే అడగాలి ఇదేంటని .అని చెప్పాను. ఎవరండి అలా అడిగేది ? అందరూ ఇప్పుడు పట్టించుకోరు విషం తలకెక్కినట్లు ఈ మతపిచ్చి ఎక్కాక పిల్లలు మనచేతికి రారు అంటు బాధపడ్దాడు.

ఇక నిన్న బెంగళూర్ నుంచి మన మనోహర్ ఫోన్ చేశాడు . మాటల సందర్భంలో వళ్ల చుట్టాలపిల్లవాడు నిత్యం వాళ్లపాఠశాలలో ఇచ్చిన మతగ్రంథం చదవటమే కాదు అమ్దులో పరీక్షలున్నాయని చెబుతున్నాడట. ఏదన్నా మన దేవీ దేవతల ప్రసంగం వస్తే చెవులు మూసుకుంటాడట. అదే విట్రా అంటే ? మేము ఇలాంటివి వినకూడదట మా మిస్ లు చెప్పారంటున్నాడట. తల్లిదండ్రులు మాత్రం వెఱినవ్వు నవ్వుకుని వదిలెస్తునారట. మనమెదన్నా అంటే అక్కడసీటురావటమే కష్టం ఇప్పుడు బయటకు పంపిస్తారేమోనని అంటున్నారట. ఇలాఉంది మాస్టారూ ! మన స్థితి అని చెప్పుకొచ్చాడు.
చిత్రమేమిటంటే సమర్ధులైన ఉపాధ్యాయులతో నడపబడుతున్నఅనేక పాఠశాలలున్నాయి కానీ ఇంగ్లీశుమీది వెర్రిమోహంతో మనం ఈ మిషనరీ పాఠశాలలకు పిల్లలను పంపాల్సిన అవసరం ఉందా ? అని తల్లిదడ్రులు ఆలోచించటం లేదు. కనీసం వెళ్లి ఇలా మాపిల్లల మనసులకు విషం ఎక్కించొద్దు అనైనా అనటం లేదు. మన సాంప్రదాయం సంస్క్రుతులను ధ్వంసం చేసే విధంగా మన పిల్లలను మనమే గొర్రెలమందలను కసాయి కొట్లకు తోలినట్లు తోలుతున్నాం . చదువుతో పాటు అక్కడ ఏరకమైన విద్వేషపూరిత భావాలను పిల్లలకు నేర్పుతున్నారో గమనించుకోలేని గుడ్డితనం మనలనావహించింది . చదువుకున్నవాళ్లు కూడా ఇలాంటి విషప్రచారాలనడ్డుకోకుంటే ...ఇక పల్లెలనుంచి ఈపాఠశాలలకు పిల్లలను పంపుతున్నవారికేం తెలుస్తుంది ?

Read more...

ప్రమాదాలకాలం ఇది..హనుమంతుని స్మరణచేసి ఇంటినుండి కదలండి.

>> Saturday, July 23, 2011


ప్రసుతం భూమ్మీద గ్రహస్థితుల ప్రభావం వలన ప్రమాదకర సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెల్లవారి పేపర్ చూస్తే రోడ్లు రక్తమోడుతున్నవార్తలే ఎక్కువగా ఉంటున్నాయి . మనకు తెలిసినవి కాక ఇంకెన్ని దుర్ఘటనలో !?
ఈమధ్య మన మితృడు కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ మాట్లాడుతూ మాస్టర్ గారూ ! ప్రమాదలు జరగటం సహజం ఎక్కడొ ఎవరికో జరుగుతుంటాయనుకున్నాను ,కానీ ఇప్పుడు మాత్రం ఎందువల్లనో ఈ దుర్ఘటలు ఎక్కువయ్యాయని పిస్తున్నది. నాకు మొన్నజరిగిన యాక్సిడెంట్ గురించి తెలిసిన మితృలు ఫోన్ చేసి పలకరించేప్పుడు వారివారి కుటుంబాలలోను తెలిసినవాల్లకు ఈమధ్య జరిగిన యాక్సిడెంట్ లగూర్చి చెబుతుంటే విస్తుపోయాను. ఇంతమంది ఇన్నిప్రమాదాలు జరిగాయని చెబుతున్నారంటే ఇంకా మనకు తెలియని ఎన్నిసంఘటనలున్నాయో కదా !
ఇంతమంది అజాగ్రత్త గా ఉండరుకదా ! అయినా ఏదో బలమైన కారణం ఉందని మీలాంటివాల్లు చెబుతున్నది నిజమనిపిస్తున్నది ..అని తన పరిశీలనగూర్చి చెప్పారు.
ఈమధ్య మాజిల్లాలో పోలీసులరికార్డ్ ప్రకారం మాజిల్లా పరిధిలోనే నిరుడు ఆరువేలమందికి పైగా దుర్ఘటనలబారినపడ్డారు అనితెలుస్తున్నది.
మనమేకాదు వాహనాలెక్కే ఎవడూ ప్రమాదాలు జరగాలని కోరుకోడు. అందరూ ఏల్లతరబడి డ్రైవింగ్ చేస్తున్నవారే. కానీ కాల ప్రభావం ,గ్రహస్థితులప్రభావం మాత్రం మానవులమీద శుభాశుభాలను ప్రసరిస్తున్నది. దీనికి మన తెలివితేటలు,మేధస్సు, నైపుణ్యాలు లొంగనంత అతీతాలేమీ కాదు . కనుక పెద్దలు మనకిచ్చిన శాస్త్రజ్ఞానాన్ని ఉపయోగించుకుని తప్పుకోవటమే. పెనుతుఫానులొచ్చినప్పుడు మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో పెళ్లగించబడతాయి. తలవంచిన తుంగమొక్క కుమాత్రం ఏమీకాదు. ఇదీఅంతే . అహంకారం వీడి భగవంతునికి శరణాగతులంకావటమే తెలివైనపని.

ఇక ఈసమయంలో మనం భగవధ్యానం,పూజా లేదా స్మరణ చేసి మన నిత్యవిధులకు కదలటం క్షేమకరం
ముఖ్యంగా హనుమధ్యానం.చాలీసా పారాయణం చేసి ప్రయాణాలకుపక్రమించటం ,గడపదాటటం మంచిదని నా అభిప్రాయం .దీనికొరకేమీ మనం భారీ ఖర్చులుచేయాల్సినపనిలేదుకదా ! కాస్త శ్రధ్ధా,భక్తి.వినయము ఇవి చాలు. మితృలు దీనిని సహృదయతతో స్వీకరించి స్వామినాశ్రయించి ఆయన రక్షణలో శ్రేయస్సును పొందగలరని మనవి.

Read more...

కలిసేన నాపై " కత్తి"గట్టిందెందుకు ?

>> Wednesday, March 10, 2010





ఇక నా వంతు ప్రయత్నమేమి చేయాలి ? ఎవరుకొత్తగా చెప్పేదేమీ లేదు . ఆ అవసరం అసలే లేదు . కావలసినదంతా మహాత్ములు ఇచ్చే ఉన్నారు. దానినుపయోగించుకుని భౌతికంగా ఈలోకంలో భగవంతుని ఉనికిని మన జీవితయానం లో గమనించి ఆయనపట్ల శద్దను పెంచుకోవటమే . ఈ విపత్కర స్థితిలోను కలి ప్రభావం వలన సనాతనమైన ఈ ధార్మిక ప్రవాహాన్ని అనుసరిస్తూ, సాధారణమానవులను ఈ దివ్యప్రవాహం తో మమేకం చేస్తూ మహనీయులెందరో తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. కలి ప్రభావం వలన కాస్త కూస్త సాధనచేసి అల్పశక్తులను పొందిన కొంతమంది రకరకాల సిద్దాంతాలను జనం ముందుకు తెస్తూ గందరగోళ పరుస్తున్నారు.

ఒకాయన సాధనచేసి నువ్వు భగవంతుడవౌతావని అంటాడు. కృష్ణుడు ,రాముడు మానవమాత్రులేనంటాడు. వాల్లంతా సాధనతో దేవుల్లయ్యాడంటాడు. [కృష్ణుడు పసిపిల్లవానిగా పూతన ప్రాణాలు హరించినప్పుడు భగవంతుడే .కంసాది దానవులను నిర్మూలించినప్పుడు భగవతుడే .మహాభారత యుద్దభూమిలో విశ్వరూపాన్ని చూపినప్పుడూ భగవంతుడే. యన ఏ సాధనతోను భగవంతుడు గా గుర్తించబడలేదు.. అని సప్రమాణం గా భాగవతాదిగ్రంథాలు ,గీతాబోధ స్పష్టం గాచెప్పినా ఈయన తనకొలతలతో చిన్నగా చేయాలనే ప్రయత్నం,వ్యాఖ్యానాలు తమతమ ఆలోచనలతో వ్రాస్తుంటారు.] మరొకవైపు భగవద్భక్తులైన సద్గురువులు యథాతథంగా భగవంతుని మాటలను అంగీకరించాలని వివరిస్తున్నా ఇటు వంటి వారి కెక్కవు. మరికొందరు శిష్యులను హఠాత్తుగా శక్తి పాతాలతో నేరుగా భగవత్ సన్నిధికే పంపుతామంటారు. ఇంకొకరు కొత్తరకం యోగం ,ధ్యానం అంటారు . ఇలా ఆథ్యాత్మిక రంగం గందరగోళంగా కనిపిస్తున్నది బయటనుంచి చూసేవారికి .
ఈ లోపల కొత్తాదేవుడండీ ! అంటూ మరో బృందగానం మొదలవుతుంది . ఇక మహాభారత కాలంలో సాక్షాత్తు పరమాత్మకు సన్నిహితునిగా ఉన్న అర్జునుడు శివున్ని కొలచి నా వాల్లు ఏబేధం చూపక అనుగ్రహించిన వైనం చదివినా కొందరింకా ఆబేధాలను మరచిపోలేదు.. ఇక మానవాళిని అనుగ్రహించటమే ధ్యేయంగా భూమిపై పలుప్రాంతాలలో అక్కడ అవసరాన్ని బట్టి దత్తాంశతో జన్మించి మానవు లకు మోక్షమార్గాన్ని బోధించిన సద్గురువుల బోధలను, తమ తమ వ్యాఖ్యానాలతో మరుగు పరచి విస్తరణవాద సిద్దాంతాలుగా మలచి దానిని ప్రచారమ్ చేసి ఈధర్మం నుంచి జనాన్ని వేరు చేసే గుంపుదాడులు . మాసిద్దాంతాన్ని నమ్మకపోతే నరకటానికైనా సిద్దమనే పద్దతి ఒకటైతే.మిగతా మార్గాలలో భగవంతుని వైపు వెళ్ళేవాళ్లంతా పాపులు కనుక, మీ పాపము మాగుంపులో చేరితే పోతుంది. మావలెనే మానవులందరినీ మార్చాలనే సంకల్పంతో మీకోసం మేము శ్రమిస్తున్నాము కాబట్టి మీరు మీధర్మాన్ని విడచి మా గొర్రెపిల్లలవలే అగుడీ... అని రకరకాల వ్యూహాలతో ముంచుకొస్తున్న ముప్పొకటి. వీరందరినీ తట్టుకుని నిలబడి ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్న జనం,వారికి సనాతన ధర్మాన్ని వివరిస్తూ సాగుతున్న సత్ పురుషులు,సాధుపుంగవులు కలి సేన దాడులతో అల్లల్లాడుతున్నవైనం మనకు కనపడుతున్నది. ఈ తాకిడుతట్టుకుని మాహాత్ములు తమ దివ్యసంకల్పాలతో మానవజాతిని మోక్షమార్గం వైపు మళ్ళించే పని సాగిస్తూనే ఉన్నారు. వారిని ఎగతాళి చేసినా,అవమాన పరచినా అసలు పట్టించుకోకున్నాగాని వారి ప్రేమ భావతరంగాలు మనలను సన్మార్గం లో నడచేప్పుడు పడిపోకుండా చేయిపట్టుకుని నడుపుతూనే ఉన్నాయి. కాబట్టే భూమాత ఈ కలి ఆగడాలను ఇంతవేదనతోనైనా తట్టుకుని ఉన్నది. మన ప్రాచీన రుషులు నడచి బాగా నలగిన బాటే శ్రేయస్కరము తప్ప మరొకటి మానవాళికి మార్గము కాదు. వారు చెప్పని కొత్త సిద్దాంతాలు మనకవసరం లేదు .

ఉడుత భగవత్ కార్యానికి ఇసుకరాల్చి ధన్యమయిన చందంగా మనం మన ప్రయత్నం చేయాలి. మనుషులు పరుగుపందెం గా జీవితాన్ని మార్చుకుని ఉన్నారు .ఇన్ని ఆధునిక సౌకర్యాలొచ్చినా భగవంతుని సేవించే సమయం చాలక ఏదో మొక్కుబడిగా ,భయంతోనో ,భక్తితోనో ఆయనగూర్చి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతున్నది . మనసులో భగవంతుని పట్ల భక్తి ఉన్నా ఏదో ఒక సందర్భం ఉంటేగాని అభ్యాసపూర్వకంగా ప్రతిరోజూ దైవనామస్మరణ చేయరు. [అందరూ అనికాదు నా ఉద్దేశ్యం] ఎక్కువమంది స్థితి ఇలా ఔతున్నది. కాబట్టి ప్రతిరోజు ఏదో కొద్దిసేపైనా ఆభగవంతుని దివ్యనామాన్ని స్మరిస్తుంటే ఖర్మ ఫలాలు తొలగి జీవితం లో ఎదురయ్యే ఆటకాలను దాటగలుగుతారు. దానికోసమే సద్గురువులు అనేకమంది సత్సంగాలు భజనలు, పూజాదులు లోకంలో చేపిస్తున్నారు. ఆరీతిలోనే ఎలాగూ పీఠములో చేస్తున్న సేవను నా ఒక్కడికోసమే గాక పలువురికోసం పంచుకోవటం లో తప్పేముంది ?. కనుకనే అనుకోకుండా ఈ అంతర్జాలం లోకి ప్రవేసింపబడ్డ నేను ఇక్కడ నాతో పాటు కార్యక్రమాలలో పాల్పంచుకునేందుకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇక్కడ బాగా గమనించి చూడండి . నేనెప్పుడూ మీ కోసం నేనే సాధన చేస్తానని చెప్పలేదు. ఈకార్యక్రమంలో మీగోత్రనామాలతో ఇక్కడ పూజ జరపాలంటే ఆకార్యక్రమానికి అనుసంధానంగా పంపినవారు భగవన్నమమో ... మంత్రమో ,రోజూ..జపించాలని స్పష్టం చేస్తున్నాను. రోగి ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సెలైన్ ఎక్కిస్తాము .తరువాత ఆహారం తీసుకుని రోగిశక్తివంతుడు కావాలి . అదీ నా నమ్మకం .అలానే స్వయంగా భగవంతుని శరణువేడాలి ఎవరైనా .మిగతావారు చేసే సహాయం స్వల్పం మాత్రమే నని నా అభిప్రాయం. అయితే వీరబ్రహ్మేంద్ర ,రాఘవేంద్ర ,సాయి నాథులవంటి సద్గురువులు ఈ నియమానికి లోబడరు. వారు సమర్ధులు కనుక తమ అనుగ్రహం చేత ఏమైనా చేయగలరు. నేను చెప్పేది సాధారణ సాధకుల విషయం . నాకైతే అటువంటి శక్తి ఇసుమంతా కూడా లేదనేది సత్యం . కాబట్టి స్వయంగా మీరు ఈసాధన చేయండి ఈ పద్దతిలో అని చెబుతూ వివిధ సందర్భాలలో కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నాను .. ఇది నాతె లివితేటలతో చెబుతున్న విషయం కాదు . మహాత్ములు మహర్షులు మనకిచ్చిన మహా సంపద . ఫలానా నామాన్ని .లేదా ఫలానా మంత్రాన్ని ఇలా [సంఖ్యప్రధానం కాకపోయినా ఒక అభ్యాసం కోసం చెబుతుంటాము] జపించి చూడండి . మీసమస్య ఎలా మీరే పరిష్కరించుకోగలుగుతారో చూడండి అని చెబుతున్నాను. ఇదొక ఆథ్యాత్మిక ప్రయోగం ,ఫలితం పొందాకైనా వాళ్లు భగవంతుని పట్ల ద్విగుణీకృతప్రేమభావంతో భక్తిని పెంచుకుని ఆయనను సేవిస్తూ తమతమసాధనలను సాగిస్తారు. అందుకోసం నేను చేసే ఈపని వల్ల వాళ్ల పుణ్యం లో నాకూ కొద్దిగా భాగం వస్తుందికదా అన్న నాస్వార్ధం ఉండొచ్చు.
నేనెప్పుడూ ఈ కార్యక్రమాలకోసం మీరు డబ్బు ఇవ్వాలని అడగలేదు . ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ,పూజలు ఆ సందర్భంగా జరిగే అన్నదానములు చూసి తమంత తాముగా మాతరపున ఈకార్యక్రమం లో ఖర్చుచేయమని కోరినవారిని స్వయంగా మీరే వచ్చి ఆన్నదానమో మరొక కార్యక్రమానికో ఖర్చుపెట్టమని ఆహ్వానిస్తూ ఉంటాను. అలా రాలేని వాల్ల తరపున ఖర్చుపెట్టినా నయాపైసలతో సహా లెక్కరాసి ఉంచాను .అయినా ఈ రెండున్నర సంవత్సరాలలో ఓ ఇరవైమంది అలా ఖర్చుతాముభరించి కార్యక్రమాలకు తోడ్పడ్డారు అంతే . అందులో కొందరు ఇక్కడకొచ్చి స్వయంగా నిర్వహించారు. అయితే ఈకార్యక్రమాలు అత్యంతాశ్చర్యకరంగా అద్భుత ఫలితాలనిచ్చాయి .
ఖండాంతరాలలో నివాసముంటూ కష్ట సమయం లో తోడెవరూ లేరని బాధపడుతున్న ఒకరికి శివాభిషేకం చేసుకోండి అన్నాను . ఆయన సమస్య మబ్బులా విడిపోయిందన్నాడు. మరొకరు సంకటం లో హనుమంతుని స్తుతి మీరుచెప్పినవిధగా చేశాను నాసమస్యను స్వామి తొలగించాడని చెప్పారు. ఒకతల్లి ! తనబిడ్ద అమెరికాలో ఆరునెలలుగా ఉద్యోగయత్నాలు ఫలించక బాధపడుతున్నాడని ఆవేదనతో అడిగితే , అమ్మా! ఈబాధ మనం మనం పంచుకుంటే లాభమేముంది ? ఆ బాధేదో ఆయనముందు వ్యక్తం చేయి అని, ఇలాంటి కష్టసమయం లో ఏమిచేయమని పెద్దలు చెప్పారో దాన్నే ఇక్కడ ఆతల్లిని ,అక్కడ ఆ అబ్బాయిని చెయ్యమని చెప్పాను . చిత్రంగా హనుమత్ రక్షాయాగం జరుగుతున్నప్పుడు నలభై రోజులదీక్షతో అతనుసాధనచేస్తూ ముప్పై తొమ్మిదో రోజు కూడా ఇంకా ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేయగా నేను స్వామి ని నమ్మావు ఇంకా నలభైఎనిమిది గంటల సమయమున్నదికదా అని ఓదార్చాను. నిజ్జంగా నలభై రోజులు పూర్తయ్యేసరికి అప్పటిదాకా అతని నిరీక్షణ కు ఫలితానిచ్చాడు పవనసుతుడు. అతను అతని తమ్మున్ని పంపి మొన్న కార్తీకమాసం లో అన్నదానం పంచాక్షరీ జపహోమం జరిపించాడు . మద్రాసునుంచి వచ్చిన ఆ అబ్బాయి దీపమాలికతో నిర్మించిన శివలింగం ఫోటోలు తీస్తుండగా ఆదీపాలమీదనుంచి జ్యోతిప్రవాహం వస్తున్న ఫోటో కనపడి మమ్మల్ని ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేయటమే కాక మా భక్తిశ్రద్దలను మరింతగా పెంచింది .ఆఫోటో పైన స్లైడ్ షో లో ఉంది చూడండి . చదువులలో ధిట్ట అయిన ఓ విద్యార్ధి ఏడుసంవత్సరాలుగా తనను వేధిస్తున్న తలనొప్పి నుండి నలభైరోజుల హనుమత్ రక్షాయాగం లో చాలీసా పఠనం వలన విముక్తికలిగిందని సంతోషంగా ఉన్నాడు. తన ఉన్నతవిద్యాభ్యాసం కున్న ఆటంకాలు లలితా పారాయణం ద్వారా తొలగిపోయాయని ఓ సోదరి చెప్పింది . విష్ణు సహస్రనామ పారాయణం నారాయణయాగం తో మరికొందరు తమ ఇబ్బందులు తొలగించుకున్నామని చెప్పారు. ఇలా ఇంక కొంతమంది కూడా .ఇక్కడ పైన చెప్పిన క్రియలన్నీ నా స్వంత తెలివితేటలతోనో నేను కనిపెట్టినవేమీ కాదు. తరతరాలుగా మనకు వారసత్వ సంపదగా వస్తున్న మహానిధులే . సాధన వారిది . ఫలితమిచ్చిన వాడు దయామయుడైన భగవంతుడు. ఇక్కడ నేను నాకు తెలిసిన దానిని చెప్పటం వరకు మాత్రమే సహాయ పడ్డాను. బాగా చదివితే కలెక్టర్ వు అవుతావని ఎవరైనా చెప్పొచ్చు . కాని సాధించిన వానిది, కరుణించిన వానిదే ఫలితమంతా . అలాగే చుట్టుపక్కల పల్లెలలో పట్టణాలలో అక్కడ స్థానిక దేవాలయాలలో జరిపిన కార్యక్రమలు ఒక్కక్కచోట ఒక్కో సత్ఫలితాలనిచ్చాయి . ఫాక్షన్ గ్రామంగా పేరుబడ్ద వి .అప్పాపురం లో జరిపిన హనుమదభిషేకాలు విబేధాలుబాపి ఊరికి మేలు జరిగేలా ఫలించాయి. కొన్నిచోట్లదేవాలయాలు ఆగిపోయినవి పూర్తయ్యాయి . ఇక విద్యార్థులకోసం మేము జరుపుతున్న పూజలతో విద్యార్ధులలో నెలకొన్న అనవసర భయాలు తొలగిపోయి వారిలో ఆత్మ విశ్వాసాని స్వామి మా వెంటవున్నాడనే నమ్మకాన్ని పెంచి విజయాలు సాధించేందుకు తోడ్పడుతున్నాయి. ఇక్కడైనా మేము సోమరిపోతులకు స్వామి అనుగ్రహం లభించదు శ్రమించాలని అటువంటి వారికే ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నాము.వారికి వచ్చిన సత్ఫలితాలతో నమ్మకంకుదిరితే హనుమంతునిలా సద్గుణాలతో జీవించాలని మద్యపాన ధూమపానాదులు స్వామికి ఇష్టముండవని తప్పుడుపనులకు పాల్పడకుండా జీవించాలని బోధిస్తున్నాము.నమ్మి ఆశ్రయించిన పిల్లలు ఫలితాలు చెబుతుంటే స్వామి కరుణకు మేము పులకించిపోతున్నాము . అయితే ఎక్కడా పిల్లలను కాని ,పెద్దలను గాని మీరు ఇప్పటివరకు ఆచరిస్తున్న ధర్మాలు తప్పనిగాని, అవివదిలేయమనిగాని ఎక్కడా చెప్పలేదు..


ఇక ఒక్కోసారి ఒక్కో రూపంతోఈ పూజలేమిటి ?ఏం సీజనుకొక దైవమా అని ఎగతాళి చేసడొకాయన. ఇక్కడ చిన్నవిషయం గమనించాలి .కరెంట్ అనే ఒకేశక్తి అనేక పనులను జరుపుతుంది ,ఫాన్ తిప్పగలదు,ఫ్రిడ్జ్ లో శీతలీకరించగలదు,పొయ్యిలో మండించగలదు .ఇలా అనేక పనులుచేయగలదు. మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా నానమ్మకు కోడలుగా బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే. బహురూపాలుగా వ్యక్తమవుతున్నది ఒకే పరమాత్మ అన్న గమనిక ఈసనాతనధర్మంలో ప్రతి సాధారణ మనిషికి ఉంది . కనుకనే ఏ రూపంలో భగవంతుడున్నా అంగీకరించే జ్ఞానవంతమైన జాతిగా మిగిలింది. సహనంతో పరులను అక్కున చేర్చుకుంటున్నది ఆదరిస్తున్నది .ఈ గడ్డపై ప్రతిబిడ్డా ఈ భావాన్ని ఉగ్గుపాలతో నేర్చుకుంటుంది. కనుక వివిధరూపాలు వివిధ ఆరాధనారీతులన్నీ ఒకటేననే నమ్మిక మాకందరకూ ఉంది .అదే ఈ జాతి దైవీభావాలతో వర్ధిల్లటానికి కారణం .


ఇక్కడ నేను ఎవరికీ గురువును కాను ,ఆ పదానికి అర్హత నాకులేదు అనేది స్పష్టం . అందుకే నేను ఇక్కడ ప్రవేశించిన మొదట్లోనే అందరికీ మనవిచేసాను నన్ను గురువుగారు అనిపిలవద్దు అని. అది కొద్దిమంది మహాత్ములపట్లమాత్రమే వాడదగ్గపదం అని . దీనిపై వ్రాసిన పోస్ట్ ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_8411.html

భగవంతుని పేరుతో జరిగే మోసాలకు ,అనాచారాలకు నేను వ్యతిరేకం అనేది నా పాతపోస్ట్ లు చదివినవారికి తెలుసు. వీధివీధికొకరు తామే దేవుళ్లమని ప్రకటించుకునేవారు పుట్టుకొస్తారని కాలజ్ఞానం లో తాతగారు చెప్పినట్లుగానే ప్రస్తుత కాలంలో కొత్తాదేవుడండీ ! అని పాటలుపాడే గుంపులను నేనెప్పుడూ అంగీకరించను.
అటువంటి ప్రమాదం లో ఇరుక్కున్న మా బధువొకాయనను ఎలా బయటపడేశామో ఇక్కడ చూడండి.

http://durgeswara.blogspot.com/2008/10/blog-post_21.html

నిన్నొక పెద్దాయన అడిగాడు .నువ్వేమన్నా ఈధర్మానికి రక్షకుడవా ? నువ్వు ప్రయత్నించకపోతే ఈధర్మం ఏమైనా నశించి పోతుందా? అని తిడుతూ వ్రాసాడు. అందుకు నాసమాధానమిదిగో.
అయ్యా ! నేనంత మూర్ఖున్ని కాను, అంత ఒల్లుబలిసి మాటలు మాట్లాడటానికి . నేనెంత ? నాబ్రతుకెంత ? . భగవత్ స్రుష్టియగు ధర్మం ఆధారంగా జన్మించి జీవిస్తున్నాము . ధర్మం సనాతనం . మనిషి సూర్యున్ని సృష్టించాను ,రక్షించానంటే వాడు మూర్ఖుడో ,పిచ్చివాడో అయ్యుండాలి . ఇక ఒక సమాజంలో రక్షణకోసం ఒక వ్యవస్థ ఉంటుంది. అయినంతమాత్రాన రక్షణ అనేది దానిపని కదా అని ఊరుకోక ,ఏ అర్ధరాత్రో ఎవడో ఒక దొంగవెధవ మనకల్లబడితే దొంగ ..దొంగ అని అరుస్తాము కదా .అందులో తప్పులేదుకదా . అలాగే ఇసుకరేణువులు రాల్పినంత మాత్రాన ఉడత వారధికట్టగలుగుతుందా . ఏ పూర్వపుణ్యమో ఈధర్మంలో జన్మించినందుకు నావంతు ధర్మావలంబనలో ఉన్నాను. భజనచేసే భక్తబృందంలో నా గొంతుకూడా కలుపుతున్నాను . తప్పుకాదు కదా !


ఇక నువ్వు చెప్పేది నిజమా , మిగతా ధర్మాలు అవలంభించేవారు అవి వదలి రావాలా ? నీది మతోన్మాదం కాదా ? అన్నారాయన

స్వామీ ! నేను చెప్పేపద్దతిలో భగవంతుని కృపను పొందవచ్చు అనటం లో తప్పులేదు .నేను చెప్పినపద్దతి మాత్రమే సరైనది అనేది మూర్ఖత్వం . లోకంలో ఉన్న ఇతర మతాలను ప్రతిపాదించిన వారెవరూ పరాయివారు కారే ? వాల్లంతా దత్తావతారాలైన సద్గురువులని నేను పూర్తిగా నమ్మి ఉన్నాను. వారినవమానించే స్థితికి దిగజారలేదునేను. ఆవిషయమ్ భవిష్యపురాణం వివరిస్తున్నది. ఆయాప్రాంతాలలోని మానవాళిని ఉద్ధరించటానికి ఆ సద్గురువులెలా అవతరిస్తారో ! ఏమి చేస్తారో అని.. కానీ వారిపేరుతో ప్రపంచం లో భగవంతుడు మాకు తెలిసిన మార్గం లో తప్ప మిగతామార్గాలలో కనపడడు . అలా ప్రయత్నించేవారు పాపులు .వారిని మార్చాలి,లేక నశీంపజేయాలనే వాదాలను ,ప్రచారాలను ఖచ్చితంగా నిరసిస్తాను. కనుకనే నాకు అని మతాలలో స్నేహితులున్నారు. వారెవరినీ నేనుచేసే కార్యక్రమాలలో బలవంతంగా పాల్గొనమనిగాని, మీమతం మార్చుకొమ్మనిగాని ఏరోజు చెప్పలేదు. కాబట్టే వాల్లు నాకింకా స్నేహితులుగానే ఉన్నారు.అలా అనుమానంతో నన్ను ధూషించిన వారితో నాసమాధానం తరువాత వాల్లు తమ తప్పుతెలుసుకున్నవైనం ఈక్రింది పోస్టుల వ్యాఖ్యలలో చూడండి.

http://durgeswara.blogspot.com/2008/11/blog-post_6830.html

http://durgeswara.blogspot.com/2008/11/blog-post_12.html


నియమానుసారంగా రోజు నమాజ్ చేసే ఆస్థికులను, పగలల్లా పనిపాటలు చేసుకుని సాయంత్రం అర్ధరాత్రి వరకు ప్రార్ధనలు చేసుకునే భక్తులువారి ధర్మనిష్ఠకు నేనెప్పుడూ ముగ్దుడనవుతుంటాను.
గుంటూరు మస్తానయ్య దర్గా దగ్గర నేను ధ్యానం చేసుకుంటుంటే పక్కనే నమాజ్ చేసుకుంటున్న వారు నాసోదరులుగానే భావనవస్తుందిగాని వేరుగాదు. అల్లామాలిక్ అని స్మరించే సాయి మాకు సద్గురువే. వచ్చిన చిక్కల్లా ఆ మహాత్ములు చూపిన బాటనకాక ఈసనాతన ధర్మాన్ని పతనం చేయాలని యత్నిస్తున్న నికృష్ఠబుద్దులతోనే.
నీతండ్రిని నువ్వుప్రేమించు ,నాతండ్రిని నేనుప్రేమిస్తాను. మనిద్దరం వారిద్దరిని గౌరవిద్దాము .అనేది ఈ సనాతన ధర్మం ఈధర్మాన్ననుసరిస్తున్నవారందరికీ నేర్పిన నీతి. నేను నాతండ్రినిని ప్రేమిస్తాను,నువ్వు నాతండ్రిని గౌరవించు మనిద్దరంకలసి నీతండ్రిని లేకుండా చేద్దాం అన్నది ప్రస్తుతం కలిసేన సిద్ధాంతం. కనుక నేను నాధర్మాన్ని అచరిస్తాను . మిగతా మత ధర్మాలను గౌరవిస్తాను . ఏది లోకానికి శ్రేయోదాయకమో విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం.

ఇలా ఇంటర్ నెట్లో పూజలు ప్రచారాలేమిటి? ఇదొక మోసం జాగ్రత్త అని విమర్శలొస్తున్నాయి. ఇంటర్నెట్ ను ఈ సనాతనధర్మాన్ని విమర్శించేవాల్లకు మాత్రమే పరిమితం చేశారేమో నాకు తెలియదు .లేక గుత్తకుతీసుకున్నారో నాకు ఎవరూ చెప్పలేదు. సామూహికంగా నమాజులు, ప్రార్ధనలు పూజలుచేసుకుని భగవంతుని ప్రార్ధిస్తున్నారు లోకంలో . తమ భావాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, టీవీలు .అలాగే ఇతరప్రసారసాధనాలద్వారా ఇతరులకు తెలుపుకుంటున్నారు. సామూహికంగా జరిపే ప్రార్ధనలకు పెద్దఎత్తున జనాన్ని తరలిస్తున్నారు .ఈ అంతర్జాలంలో లెక్కలేనన్ని ఇతర మతాలకు చెందిన మతసంబంధమయిన సైట్లున్నాయి. ఆయా మతబోధకులు తాము చేసే ప్రార్ధనలకు ఆహ్వానిస్తూ తమ సైట్లలో వివరాలుంచారు. ఇప్పుడు సనాతనమైన ఈ ధర్మం అవలంబిస్తున్నానుగనుక నేను ఇక్కడ నాభావాలను వెల్లడించకూడదా ? పోనీ నానుంచి ఎవరు మోసపోయారు? నేను ఒక్కనెలకు సంపాదించే నాజీతమంతా ఇస్తాను ఎవరైనా రహస్యంగా వచ్చి నాగూర్చి విచారణ జరిపి నిర్ధారించి అప్పుడు నాపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించండి . నేను చేసే పని ని ప్రోత్సహించే వారంతా మూర్ఖులుగా జమకట్టి నోరు అదుపులేకుండ పేలుతున్నవారు ,తాము ఏపాటి జ్ఞానులో, వీల్లతో చదువులోనో మరేదన్నా నిర్ధారణ పరీక్షలోనో పోటీపడి నిరూపిచుకుంటామంటే నేను వీల్లందరినీ ఒప్పిస్తాను . ఇక ఈదేశం లో హేతువాదులుగా చలామని అయ్యే వాల్లంతా రహస్యంగా నిధులుపొందేది ,పనిచెసేది , అదీ! ఎవరిని కించపరచాలని పనిచేసేది అందరికీ తెలిసినదే. ఇప్పుడు నాపై కత్తిగట్టి నేను మోసాలు చేస్తున్నానని ,ఇతరులను వేధిస్తున్నానని అభాండాలతో దౌర్భాగ్యపు ప్రచారానికి దిగినవారు వాటిని సప్రమాణంగా నిరూపిస్తే నేనిక్కడ నుండి నిష్క్రమించటానికి సిద్దం. అసలు ఇప్పుడు నేనెందుకిక్కడ టార్గెట్ అయ్యాను వీళ్లకు? . నేను ఇంటర్నెట్లో ప్రవేసించిన మొదటిలోనే నాపై దాడులు చేసారు మానసికంగా నన్ను చికాకు పరచాలని . అంతకు మునుపు ఈ ధర్మానికి సంబంధించిన ఎవరు బ్లాగుల్లోకొచ్చినా వారిని హేలనచేసి వివిధ వ్యాఖ్యానాలతో చికాకుపరచి తమంత తాముగా బ్లాగులు మూసుకునేట్లు చేసినచరిత్రవుంది వీరికి ఎవరొ ఒకరిద్దరు అప్పటిదాకా మొండిగా పోరాడుతుండేవారు వీల్లకు సమాధానమిస్తూ . ఈసనాతన ధర్మాన్ని రెండునాలకలధోరణితో విమర్శిస్తూ సాధారణ ధర్మావలంబులకు ఈధర్మం పట్ల అపనమ్మకం ,చులకన భావన కలగజేయటం వీల్ల లక్ష్యం . నాపై దాడి ఫలించలేదు . ఎందరో మేధావులైన ఆస్తిక మితృలు , తల్లులు ,నన్ను తమకుటుంబసభ్యునిగా అభిమానించి అదరిస్తున్నారు. యువత నన్ను మాస్టారూ అని గౌరవించి తమ సమస్యలగూర్చి సలహాలడుగుతూ గౌరవిస్తున్నారు పెద్దలు ఆశీర్వదించి నన్ను ప్రోత్సహిస్తున్నారు. దానికి తోడు సనాతన ధర్మావలంబులైన బ్లాగర్ల సంఖ్యపెరిగి ధార్మిక విషయాలపట్ల చర్చలు పెరిగాయి . ఇది కలిసేనకు కంటగింపు . భగవన్నామముగాని ,తత్సంబంధిత క్రియలుగాని ఏమాత్రం సహించలేని కలి సేన అన్నిరంగాలలో ధర్మం మీద విరుకుపడుతున్నట్లే ఇక్కడా తమ దాడి జరుపుతున్నది . ఈ ఉడతూపులకు భయపడి పారిపోయే పిరికితనం లేదిక్కడెవరికీ . మేము సర్వసంగ పరిత్యాగులము గాము ,భగవంతుని ఆశ్రయించి సంసారరణరంగం లో శస్త్రధారులమై నిలబడ్దయోధులము .

పైకి ఇది నాపై జరుగుతున్న దాడి అనిపిస్తున్నప్పటికీ వాస్తవమేమిటో గుర్తించండి .
[నాగూర్చి నేను ఇంత వివరంగా వివరించ గలిగే అవకాశం కల్పించిన వారికి ధన్యవాదములు .]


భగవత్సేవలో నాప్రయాణం ఏనాడు పక్కదారి పట్టకుండా కాపాడమని ఆ పవనసుతుని కోరుతూ .........





Read more...

అసలేం జరుగుతోంది ? ఎందుకు జరుగుతుంది ? [మొదటిభాగం]

>> Monday, March 8, 2010

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.

నేను నిన్న ఇద్దామనుకున్న వివరణ ఈరోజు మొదలెడుతున్నాను . ఎక్కడనుండి మొదలెట్టాలనే సందేహం వస్తున్నది. ప్రస్తుతం ధర్మం మీద జరుగుతున్న దాడుల గూర్చి ముందుగా వివరిస్తే నేను చెప్పబోయేదానికోసం సమర్ధింపుకొరకు ముందస్తుగా చెబుతున్నానని అనుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా నావివరణ ఇచ్చినా అది మూలకారణాన్ని తెలుపలేక పోతే ప్రయత్నం వృధా కావచ్చు. . సరే ! ఎటో ఒకపక్కనుంచి మొదలెట్టాలిగనుక బుద్ధిబలాన్ని ప్రసాదించమని నానోట సత్యాన్నే పలికించమని పవనసుతుని వేడుకుంటూ మొదలెడుతున్నాను.

ప్రస్తుతం భూమ్మీద అతి ప్రాచీనము.మానవాళి కి సంపూర్ణ మానవతేమిటో అందించ గల హైందవము ను ధ్వంసమొనరించటానికి కలి పురుషుని ప్రయత్నములు తీవ్రంగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇది ధర్మం కనుక. ధర్మాన్ని ధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం కనుక. అదేమిటి ఇది మతం కదా అని ఎవరైనా అనవచ్చు. మతమంటే ఒక అభిప్రాయం .లేదా ఒకరు లేక కొద్దిమంది ద్రష్ట లు దర్శించిన సిద్దాంతముతో కూడుకున్న మార్గం . ఈ కోణం లో చూస్తే మిగతామతాలకు వలె దీనికి ఒక ప్రవక్త మాత్రమే గాని, ఒక సిద్ధాంతం మాత్రమేగాని ఒక గ్రంధము మాత్రమే గాని ప్రమాణం కాదు. పలువురు మహర్షులు తపస్సు చేత భిన్నమార్గాలలో దర్శించిన సత్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది సత్యం .అది సార్వజనీనం .సర్వకాల సర్వావస్థలలోనూ ఏ మార్పుకూ వీలుగాని సత్యం . కనుకనే దీనిని ధర్మ మన్నారు . ధర్మం కనుకనే ప్రపంచం లో మానవాళి ఔన్నత్యానికి పాటుపడే ప్రతి సిద్దాంతాన్ని గుర్తించి గౌరవించింది . ఆయాప్రవక్తలను వారి బోధలను సైతం మన్నించి తనలో మమేకం చేసుకోగల ఔన్నత్యాన్ని ఈజాతిలో పాదుకొల్పినది. భగవంతుని వివిధమార్గాలలో ఎలా దర్శించవచ్చో ,మానవునికి సంపూర్ణ స్వేచ్చనిస్తూ వివరించింది. మానవాళికి మార్గదర్శకమైనది. అందువలనే ఈ ధర్మం లో మార్గదర్శకులైన సద్గురువులుంటారే తప్ప , శాసకులు కనపడరు. ఇలానే దర్శించాలి ,ఇదే పాటించాలనే శాసనాలతో మనోవికాసాన్ని అరికట్టదు ఈధర్మ మార్గం . కనుక మనసుకున్నస్థాయీ బేధాలననుసరించి వివిధమార్గాలలో భగవంతుని చేరగలరు భక్తులు తమ తమ సాధనారీతుల ద్వారా.

మరి కలి ఎలాంటివాడు ? భగవంతుని ,గాని సదాచారాలనుగాని ,సచ్చరిత్రనుగాని అంగీకరించడు మనిషి పతనావస్థకు చేరి పశువుగా మారడమే అతని ధ్యేయం . కనుక ఈధర్మాన్ని ధ్వంసం చేయడానికి తనదైన "ఈ యుగం" లో తీవ్రం గా శ్రమిస్తున్నాడు. ఆయన ప్రయత్నాలు వ్యూహాలు బహుళములు. బయట దాడిని కాచుకునే లోపలే లోనుండి దాడిచేసి మానవున్ని పతితునున్నిచేయడానికి మానవునిలో అంతర్గతంగా ఉన్న కామ క్రోధాది అంతశ్శతృవులనొకవైపు రెచ్చగొడుతూ , ,తనకు లొంగి తన లక్ష్యానికి తోడ్పడే మానవులనొకవైపున మొహరించి విజయవంతంగా తన కార్యక్రమాన్ని జరుపుతున్నాడు.

భవిష్య పురాణం , భాగవతాది గ్రంథాలలో మన మహర్షులు కలి వ్యూహాలను అతను ఎక్కడ ఎప్పుడు ఎలా భగవద్వేషాన్ని పెంచుతాడో, శివకేశవులు లేరు ,యజ్ఞయగాదులు వృధా, ఇంద్రియ సుఖాలు పొందటం కంటే మానవునికి ఉన్న అత్యున్నత లక్ష్యమింకేముందని ? వితండవాదాలను ఎలా ప్రసారం చేయగలడో దానికి తోడ్పడగల వివిధ సిద్దాంతాలు ఎలా విస్తరిల్లుతాయో , వివరంగా వివరించి హెచ్చరించారు .
సరే ఇక్కడ ఆయన పోరాట వ్యూహాన్ని చూద్దాం .కొందరు తినటం సుఖించటం అనే ఎండమావులవెంత పరిగెత్తేలా చేసి ధర్మం వైపు తలెత్తి చూడనివ్వడు. ఇక్కడ ధర్మాన్ని అనుసరించే వారిలో కామ క్రోధాదులు రెచ్చగొట్టి ,మనసును విషయవాంఛలమీదకు తిరిగేలా చేస్తాడు. మొదట్లోనే ఈ తాకిడికి తట్టుకోలేని వారు మొగ్గదశలోనే తమ సాధనలు వదలి జారిపోతారు. ఇంకా కొద్దిమంది సాధకులు పైకెదగగానే వారి చుట్టూ స్వార్ధపరమైన ఆలోనాపరుల గుంపులను చేర్చి , వారి భావాలతో కలుషితమైన మనస్సుతో ఆసాధకుడు క్రమంగా కామినీ ,కనకాలపట్లనో కీర్తి కాంక్షలపట్లనో అనురక్తుడయి తల్లకిందులుగా పల్టీలు కొట్టుకుంటూ పాతాళానికి జారేలా చేస్తాడు . నేలపైనడుస్తూ పడ్డవాన్ని గూర్చి అందరికీ పెద్దగా తెలియదుగాని కొండమీదనుంచి దొర్లి నవాణ్ని గూర్చి మాత్రం పెద్దచర్చ జరుగుతుంది . వాడి ఖర్మగాలి వాడుపడ్డా డని అనరు.వాడికెంత బలుపు అంటారు. ఇక వాడు పదిమందిని నడిపే వాహనచోదకుడైతే నమ్ముకున్నవాళ్లంతా నట్టేటమునుగుతారు.
కాబట్టే యత్యాశ్రమము వంటి అత్యున్నత వ్యవస్థలో కఠినమైన నిబంధనలు విధించారు పెద్దలు. అతడు వస్తు సంచయనం చేయరాదు .అరచేయి పళ్ళెంగా ఎక్కడదొరికినది అక్కడ ఎప్పుడు లభించినది అప్పుడుమాత్రమే స్వీకరించాలని .స్త్రీలను తమ సాన్నిధ్యంలో ఉండనీయరాదు . ఎక్కడా మూడుపూటలకంటే [చాంద్రాయణ వ్రతం లో తప్ప] నిదురించరాదనే నియమాలు ఏర్పరచారు . ఎప్పుడైతే యత్యాశ్రమాన్ని ఆశ్రయించినవారు పెద్దలమాటలను పక్కనబెట్టడమో లేక తమ మానసిక శక్తిపైన అతినమ్మకంతోనో తాము చేయబోయే సత్కార్యములకొరకని డబ్బు సేకరించిపోగేయటం ,తమ నివాసలని శాస్వతంగా ఉండేలా చేయడం ,భగవత్ కార్యక్రమాల కు పాల్గొనవచ్చే స్త్రీల ను ఆశ్రమాలలో బసచేయనీయడం ,వారితో ఎక్కువగా సంభాషించడం వంటివి చేస్తారో అప్పుడు "కలి" తన ప్రభావాన్ని చూపుతాడు. బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లా సంచయనం చేసిన ధనం కోసం ,వదిలివేసిన బంధువర్గాలో .అభిమానులో చేరికూర్చుంటారు. ఇక వీరిద్వారా మిగతావారు చేరుతారు .వెరసి ఏసంసారాన్నైతే వదలుకుందామని సన్యాసాన్ని స్వీకరించారో ఇంకో రూపంలో అది చుట్టూ చేరుతుంది . ఇక భగవంతుని తాము దర్శించేందుకు వెచ్చించాల్సిన సమయము మిగతా వాటిపైకి కర్చుచేసి తమ సాధనాశక్తి వృధాఅయి స్వయంకృతాపరాధంగా పతనమవుతుంటారు.

ఇక ఇక్కడ ఎవరి నియంత్రణలు లేవుగనుక డైరెక్ట్ గా " కలి " సేన ఫ్యాన్సీ డ్రస్ లా కాషాయాన్ని ధరించి దుకాణాలు ప్రారంభిస్తుంది. వివిధ క్షుద్రసాధనలతో లభించే అల్పశక్తులతో వీళ్ళు భక్తులను ,స్వార్ధపరతతో భగవంతుని అశ్రయించి లబ్దిపొందుదామనే వారిని మాయజేయటం నిలువునా ముంచటం చేస్తుటారు.వీరిని గూర్చే వీరబ్రహ్మేంద్రుల వంటి మహాత్ములు " ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టేరయా " అని హెచ్చరించారు. సద్గురువుగూర్చి అన్వేషించేవారు జాగ్రత్త అని ఎరగక మోసగాన్ని ఆశ్రయిస్తే గుడ్డివాడు మరో గుడ్డివాడిచేయి పట్టుకుని నడచిన చందంగా అవుతుందని హెచ్చరించాయి శాస్త్రాలు . శుష్కవాదాలతో ఆద్యాత్మిక చర్చలు జరిపేవారు పెరుగుతారని భాగవతం చెబుతుంది . . సాధకులు తక్కువ బోధకులెక్కువ . పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార్రక్షేత్రాలుగామారి ఆయాక్షేత్రాల పవిత్రత దెబ్బతిని దైవశక్తి అనుగ్రహ ప్రభావం అక్కడ తగ్గి పోతున్నది .మరికొందరు మహారుషులు కనుక్కోలేని గొప్ప ఆథ్యాత్మిక రహస్యాలు తమకు తెలుసని కాబట్టి తమ సిద్దాంతాలే నిజమైన మార్గమని కొత్తరకం బోధలు మొదలవుతున్నాయి ,రామకృష్ణాది భగవదవతారాలను గూర్చి తమ స్వల్ప బుద్దితో వ్యాఖ్యానిస్తూ ఆయా అవతారాలపట్ల మానవులలో భక్తిని క్షీణింప జేసి క్రమేపీ పతనమయ్యేందుకు తోడ్పడుతున్నాయి.
ఏది నిజమో ఏది అబద్డమో అర్ధంగాక అసలు ఆథ్యాత్మిక పథమే అబద్దమని శారీరిక సుఖాలే ప్రధానమనము అదే నిజమనే భౌతికవాదమే ఖచ్చితమైనదనే భావన పెరిగిపోతుంది. తద్వారా కలి పురుషుని లక్ష్యం నెరవేరుతున్నది.

ఇక బాహ్యంగా దాడి ఇంకా విస్తృతంగా జరుగుతుంది. భూమి మీద వివిధప్రదేశాలలో పుట్టి మానవాళి కి జ్ఞానాన్ని ప్రసాదించాలని తమ సర్వశక్తులను ధారబోసిన మహాత్ముల పేరు తో వారి మార్గాలను మతాలుగా మలచుకుని తమ ఆక్రమణ సిద్దాంతాలను శరవేగంగా ప్రచారం చేయగలుగుతున్నది కలిసేన . దయ ప్రేమ ను సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రవచించినన మహానుభావుల బోధకు వక్రభాష్యాలు చెబుతూ తాము బోధించినది తప్ప మిగతాది సత్యం కాదని ,కాబట్టి మిగతా మార్గాలద్వారాకూడా భగవంతుని చేరవచ్చు అనే సిద్దాంతాన్ని గాని, ఆసిద్ధాంతాలననుసరిస్తున్న ఈ ధార్మిక జాతిని మానసికంగాను, అడ్దమొస్తే భౌతికంగా నిర్మూలించాలనే యత్నం దీర్ఘకాలిక ప్రణాలికలతో సాగుతున్నది. ముందుగా దేవభాషను ,ఆభాషద్వారా లభ్యమవుతున్నా జ్ఞాన సంపదను నిర్మూలించటానికి మ్లేఛ్ఛ భాషాభి వృద్ధితో ప్రారంభమై మానవుని స్వభాషలను అంతం చేయటం ద్వారా తమయొక్క భావ పరంపరను సంస్కృతిని మెదళ్ల్లోకి ఎక్కించేపని వరుసగా జరిగిపోతున్నది. తద్వారా ప్రేమ స్థానం లో ద్వేషం ,త్యాగం స్థానంలో స్వార్ధం .జ్ఞానం స్థానం లో కామాది వికారాలు తిష్టవేసి నేడు మనం చూస్తున్న అనర్ధాలన్నింటితో మానవ జాతి మొత్తం తల్లడిల్లి పోతున్నది. ఇందుకోసం ధనం వెదజల్లి దానికోసం తల్లికి కూడా కీడుచేయడానికి వెనుకాడని బలహీనులను లొంగదీసుకుని ,మరికొందరిని వివిధప్రలోభాలతో ప్రేరేపించి ఈ ధర్మం పట్ల విరక్తి కలిగే .గౌరవం తగ్గించే సాహిత్యాన్ని,ప్రచారాలను సాగిస్తూ దీని ధ్వంసం చేయటమే లక్ష్యంగా కలి ప్రభావం సాగుతోంది. మానవులలో సదాచారాలన్నీ వృధా అని ఇంద్రియాలను సుఖపెట్టడమే ప్రధానమని ,భ్రాంతిని పెంపొందిస్తూఉన్న యత్నాలు మనకల్లముందే కనపడుతున్నాయి . ఇక ఇది తప్పు అని తెలుసుకుని తెలివిలోకి రాకుండా సిద్దాంత రాధ్ధాంతాలతో మనుషులను గందరగోళపరచి అధర్మాన్ని ఎదుర్కోవాలనే సృహకూడా లేనట్టి మానసిక బలహీనులను పెంపొందించే వ్యూహం దిగ్విజయంగా నడుస్తోంది. దీనికి అలంబనగా ఉండేందుకు బతుకుపై విపరీత మమకారాలను పెంచుకునేలా చేసి భయంకరమైన పిరికితనం మనిషి మనసులో తిష్ఠవేయబడేలా చేయబడుతున్నది. దాని ఫలితమే కళ్లముందు అన్యాయం జరిగినా స్పందించలేని హృదయాలు, ధర్మాన్ని రక్షించుకోవాలనే పౌరుషాగ్నులు చల్లారిపోతూ కనపడుతున్నాయి ఈ పుణ్యభూమిలో . ఇదంతా ఒకరోజు కాదు ఏళ్లబడి సాగుతున్న కలి ప్రణాళిక. ఇక తాము తరించటమేకాదు మానవజాతిని కూడా దివ్యమార్గం లో నడపాలనే సత్సంకల్పంతో తమ ముక్తి కంటే ధర్మోద్ధరణముఖ్యమని శ్రమిస్తున్న సద్గురువులను వివిధ రీతులలో వేధిస్తూ వారిపై దురభిప్రాయాలను కలిగిస్తూ ,నిజమైన సత్ పురుషులను సాధువులను కూడా అనుమానించేలా , అవమానించేలా ఈధర్మపథాన పుట్టినవారుకూడా తయారవుతున్నారు కలి ప్రభావాన. పరిగెత్తి పాలుతాగాలనే తపనతో నిలబడి ఆలోచించనీయనంత యాత్రిక వేగం జీవితంలోపెంచి తామేది చెబితే అది నిజమనుకునేలా భావించే స్థితి కల్పించబడుతుంది కలిసేనద్వారా .

నేను సర్వసంగ పరిత్యాగిని కాను. ఒక గొప్ప సాధకుడినో ,యోగినో కాను . సామాన్య మానవులలో ఒకడిని . కానీ ఈ ధర్మం .దాని ఆధారంగా పుట్టిన సంస్కృతి నాకు గొప్పవారసత్వాన్నిచ్చాయి. భగవంతుడు స్వయంగా అవతరించిన ఈ పుణ్యభూమిలో నాకు జన్మ వచ్చింది. నాకంటూ కొన్ని ఆత్మీయతా బంధాలను , ప్రేమ,త్యాగాది దైవీభావాలను ఇచ్చింది . మానవునిగా పుట్టినందుకు మహోన్నతునిగా ఎదగాలని ప్రయత్నించటానికి కావలసినంత సాధనాసామాగ్రి నిచ్చింది . నేను సుఖంగా ఉండలి నాతోటి ప్రాణులన్నీ శుభకరంగా వర్ధిల్లాలని కోరుకోగల మనసును, సంస్కృతినీ నిచ్చింది సృష్టిలో ప్రతిప్రాణీ నాకు పరాయిది కాదు అనే భావన ప్రసాదింపబడింది ఈ ధర్మం ద్వారా . . ఇన్ని ఇచ్చిన భగవంతుని ఉనికిని , ఈ ఆథ్యాత్మిక వారసత్వాన్ని కూలగొట్టాలని కలి పురుషుడు యత్నిస్తున్నప్పుడు నేనేం చేయాలి ? నాకెందుకు నాసుఖం నాకు చాలదా చిన్నినా పొ్ట్టకు శ్రీరామ రక్ష అని అనుకోవాలా . అదంతా భగవంతుడు చూసుకోవలసిన పని అని మిన్నకుండాలా ? లేక భగవంతుడు స్వయంగా గీతగా బోధించిన నీతిని మానవ జన్మ అనే అవకాశంతో సక్రమంగా వినియోగించుకోవాలా ?! చెప్పండి . దానికొరకు నేను అనుసరిస్తున్న మార్గమేమిటో మీకు మరో పోస్ట్ లో విన్నవించుకుంటాను .

[ ఇది మొదలు మాత్రమే దయచేసి నా మనసులో మాట పూర్తిగా వినటానికి కొద్ది సమయం కేటాయించి మిగతా భాగం కూడా చదవండి ఒకే సారి పెద్దపోస్ట్ గావ్రాసి మీ విలువైన సమయాన్ని వృధాచేయనీయగూడదనే తలంపుతో చిన్నచిన్న భాగాలుగా వ్రాస్తున్నాను. మన్నించగలరు]

Read more...

బ్లాగ్ లోక హిరణ్యకశిపునింట ఓ భక్త ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు

>> Wednesday, February 10, 2010


విష్ణుని మహిమలను ,ఆయన లీలలను వర్ణించనెవరి తరముకాదు . ఏంటో ఒక్కోసారి లోక కళ్యాణకరమైన ఆయన లీల అసలర్ధంకాదు , కానీ తెలుసుకున్నతరువాత ఆశ్చర్యపోతాము . వేడిన వారికి దరశనమీయవు !వలదని నిన్ను వారించువారిని వదలక వెంట తిరిగెదవయ్యా ! అంటూ భక్తులు పాడుకుంటూనే ఉన్నారు యుగయుగాలుగామహాభక్తులు . ఎవరు ద్వేషిస్తారో వాళ్లచేతనే పలుమార్లు తన నామాన్నుచ్ఛరింపజేసే చిత్రమైన లీలలు చేస్తాడాయన.

అప్పుడెప్పుడొ హిరణ్యకశిపుని నృసింహమూర్తిగా సంహరించినప్పుడు ఆదుష్టుని రక్తం విశ్వాంతరాలకు ఎగజిమ్మగా ఆరక్తపు తుంపరలు మెల్లగా భూమిపైవాలుతూ రాక్షసాంశలుగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాయి ,ప్రతియుగాన,ప్రతి తరాన . మానవ జన్మ తీసుకున్నా తమలో ఇంకి కరుడుగట్టిన విష్ణుద్వేషం మరచిపోకుండా ఆజీవి ,లోకాన విష్ణుద్వేషిగా పాతవాసనలను ప్రదర్శిస్తూనే ఉంటుంది .

ఇలా ఒకానొక రక్తబిందువు ఈయుగంలో ,ఈతరం లోనూ తెలుగుగడ్డమీద ఓ బ్లాగ్లోక మేధావిగా జన్మించినది. విద్యాబుద్దులు నేర్చి అన్నివిషయాలను చదివే పరిజ్ఞానం సంతరించు కున్నాడు. . తన పరిజ్ఞానాన్నంతా జనంలో విష్ణువుపైన ద్వేషం కలిగేలా చేయగలగటానికి , ఆపేరు చెబితేనే మండిపడే తన పూర్వలక్షణాన్ని అనుసరించి ప్రదర్శిస్తున్నాడు. .రాక్షసులు కూడా అద్భుత పాండిత్యాన్ని సంపాదించటం లోను సాధన చేయటం లోనూ ఏమాత్రం తక్కువవారుకాదు. మొండిపట్టుదల తీవ్ర తామసిక లక్షణాలతో అనుకున్నది సాధించగలరు. కాకుంటే ఆ జ్ఞానాన్నంతా భగవంతుని పట్ల ద్వేషంతో ఆత్మ వినాశనానికి ఉపయోగించుకుంటారు . పరమదయాళువైన ఆస్వామి తన పూర్వ భక్తుడు ఈ జన్మలోనూ పతనం కావటం సహించక వారి క్షేమం కోసం మరలా మరలా వారిచేత తన నామాన్ని స్మరింపజేసే రీతిలో తనలీలలు సాగిస్తాడు.


ఇక్కడ ఆ హిరణ్యకశపాంశ తో జన్మించిన ఆజీవి తన రచనలలో. వాదనలలో ప్రస్ఫుటంగా విష్ణుద్వేషం కన్పిస్తూ ఉండటం నాకనుమానం కలిగించింది .ఎందుకు ఈ జీవి ఇంతగా భగవద్వేషాన్ని ప్రదర్శిస్తున్నడా? అని ఎంతాలోచించినా గాని ,ప్రశ్నించి చూసినా గానీ సమాధానం రాలేదు . ఎందుకో హఠాత్తుగా ఈ విషయం స్ఫురణకు వచ్చి ఆలోచించాను . ఓసారి ఈ హిరణ్యకశిపుని ఇంట ఉన్న భక్తప్రహ్లాదుని ఫోటొ చూడటం తటస్థించింది . వాని ముఖం లో తేజస్సు ,భగవద్భక్తుని లక్షణాలను చూడగానే పోల్చుకున్నాను . సందేహం లేదు .ఈయనచే భగవన్నామ స్మరణ పలుమార్లు చేపించడానికే ఈయనకు జన్మించిన ప్రహ్లాదాంశమని అనుకోవచ్చు. ఈయనకు సహచర్యం చేస్తున్న ఆసాధ్వి నాటి లీలావతి అంతటి వందనీయ మాతృమూర్తేనని నాభావం .

ఇక ఇక్కడనుంచి మనం శ్రీహరి లీలా విలాసాన్ని చూడవచ్చు . ఈ హిరణ్యకశిపుడు పైకి కన్పించినట్లుగా నాస్తికుడేమీకాదు . నాస్తికత్వం ఒక ముసుగుమాత్రమే . లోపల చూస్తే ఆయన కూడా ఏదో రూపం మీద నమ్మకమున్నవాడే . కానీ సర్వాంతర్యామియగు హరి నామాన్ని సహించలేని ఈర్ష్యాద్వేషాలు కరుడుగట్టి ఉన్నాయి మనసున . కానీ కరుణాంతరంగుడైన శ్రీహరి లీలలకు ఇదే వేదికవనుంది.

ఇప్పుడు పెరుగుతున్నా బాలప్రహ్లాదుడు " హరి నీవే ...సర్వాత్మకుడవు " అనిపాడకా మానడు .అదివిని ఈయన మనస్సు అగ్నిపర్వతంలా కుతకుతలాడక మానదు .అదొక హింస ......పాపం. విష్ణువొక చిల్లరదేవుడు ... ఎవరా గోవిందుడు అని గర్జించి ప్రశ్నించిన నోటితోనే ., ముకుందా....ముకుందా .కృష్ణా ,,ముకుందా ...ముకుందా అని మురిపెంగా బిడ్డను పిలచి లాలించక తప్పని స్థితి కల్పించాడు స్వామి . ఎంతకాదనుకున్నా అంతరంగం లో ప్రేమతరంగాలు మిళితమై భగవన్నామం ప్రేమ పూరితంగా జపించబడుతుంది . ఇది తెలిస్తే ఇంకా నరకం . ఛీ ..ఛీ దానవ వైరి ఆ హరి నామం నేనునా నోట పలకటమా థిక్.... అని ఇంతెత్తెగిరినా సరే ,తప్పదు. నాన్నా !అని ఆబుడతడు పిలవగనే నాయనా !అని హరినామంతో వాడిని పిలవక తప్పనిస్థితి కల్పించాడు లీలానాటకసూత్రధారి.

పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ భక్తి ప్రవర్ధమానమై మన బాల ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తమునిగా ఎదుగుతున్నప్పుడు అది సహించలేక ,నిరోధించలేక ప్రేమద్వేషాలనేవిరుధ్ధభావలమధ్య నలుగుతూ విష్ణుద్వేషం యొక్క ఫలితం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అభినవ హిరణ్యకశిపునకు . ఎలాగోలా వానిని విష్ణువుపట్ల విరక్తునిగా మార్చాలని మార్చలేకపోయినా నాస్తికునిగానైనా మార్చి భగవ్ద్భావానికి దూరం చేయటం కోసం ,,ఒరే ద్వుడులేడు ..గీవుడు లేడు ,అని మన రాక్షస చక్రవర్తి అనగానే ..అయ్యో భగవంతుడు లేకున్న ఇదంతా ఎలాసృష్టించబడినది తండ్రీ అని మన బాలభక్తుడంటాడు . అయితే ఏడిరా ! చూపించు ? అని ప్రశ్నించగానే ..... ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు .... అంటూ ప్రహ్లాదుడు వివరణ ఇస్తుంటే దేహం కంపిస్తూ హృదయం రగిలిపోతూ ... అబ్బా ! ఆదృశ్యాన్ని ఊహించికుంటుంటే చాలు మనసు పులకించి పోతోందికదా ! అది అంతే .నారాయణ నీలీలా నవరసభరితం అంటూ మనం పాడుకుంటూ వేచిచూద్దాము .
ఇంకా హిరణ్యాక్ష ,రక్తబీజ ,మహిష,మహాకాయ, తాటక ,సుబాహు మారీచాది రాక్షసయూధముఖ్యుల అంశలుకూడా ఇక్కడ మనకు తటస్థిస్తున్నాయి . మరక్కడేమి మాయచేశాడో మహామాయకు అధినాయకుడు, తెలియదుకదా మనకు.

యుగయుగాన జరిగే విష్ణుమాయను ఊహించతరమా ! మనబోంట్లకు


Read more...

ఈ దు:ఖాలన్నింటికీ కారణం దేవుడేనంటారా ?!

>> Tuesday, February 2, 2010

దు:ఖానికి కారణాలు మనకంటికి కనిపించేవేకాక కనిపించని లోతులేవో ఉంటాయంటారు పెద్దలు . మానవసహజమైన భావోద్వేగాలు ,ప్రేమద్వేషాలను పక్కనపెట్టి పరిశీలించగలిగితే గాని అవి అవగాహనకు రావు. సహజంగా మనం దు:ఖంరాగానే భగవంతున్నో ,కంటికి కనిపించే ప్రపంచ దృశ్యాన్నో నిందిస్తాము. చిత్రమేమిటంటే మనకు శుభాలు,సుఖాలు ప్రాప్తించినప్పుడు మాత్రం మనసమర్ధతను శ్రమను , కష్టాన్ని మాత్రమే గుర్తుతెచ్చుకుని మనలను మనమే గౌరవించుకుంటాము. లేదా పొగుడుకుంటాము. వాస్తవమేమిటంటే శుభాలకు అశుభాలకు కారణం మన కర్మలే అనే విషయం లోతుగా ఆలోచించితే తెలుస్తుందని చెబుతారు పెద్దలు.

నేనొక ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా హెడ్మాస్టర్ గారు ఒకాయనుండేవారు . భార్యాభర్తలిద్దరు ఉద్యోగస్తులే .ఒక అబ్బాయి ,ఒక అమ్మాయి . సంపద బాగావుంది .బంధువర్గం లో బాగావున్నవాడుగా పేరు. ఎవరికీ హానిచేసే తత్వంకూడా కాదు .పెద్దగా వివాదాలమనిషికాదు. ఈయనకున్న ఒకే ఒక్క అలవాటు పేకాట . మందు అలవాటుకూడా ఉన్నదట చాటుగా. ఆయనకున్న ఓ పెద్దసమస్య ఆయన కొడుకే .అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు .వాడికి చిన్నప్పటినుంచీ చదువబ్బలేదుగాని అన్ని కళలు వంట పట్టాయి . తల్లిదండ్రులను బెదిరించి డబ్బు తీసుకెళ్ళి ఖర్చుచేయటం ,అప్పులుచేసి ఇంటిమీదకు తేవటం ,ఇంట్లో గొడవ. మాకందరికీ ఆవిషయం తెలుసు . ఓరోజు ఆయన విచారంగా కూర్చుని దు:ఖపడుతున్నట్లనిపించింది. ఏం !సార్ ఏమైంది . ఎందుకలా ఉన్నారు ? ఏదో బాధలో ఉన్నారు అని ఆప్యాయంగా అడిగేసరికి ఆయన ఆవేదనను ఇక దాచుకోలేక బోరుమన్నాడు . నాసమస్య తీరేదికాదు మాస్టారు. ఏదో ఒక రైలుకింద తలబెడితేగాని నాకు శాంతి రాదు అని బాధపడ్దాడు.

ఇచ్చిన డబ్బు చాలక ,అప్పులు చేసి ఇంటిమీదకు తెస్తున్నాడు జనాన్ని . పెళ్ళిచేసాక ఇంకా ఎక్కువైంది మాబాధ . అమ్మా ! నువ్వు నాన్న నిదురబోయేప్పుడు గాస్ లీక్ చేసి నిప్పు పెడతానని బెదిరిస్తుంటాడు . నిద్రబోయేప్పుడు ఏ రోకలబండతో నో తలమీద బాదుతానని అంటున్నాడు . వాడు అన్నంతపని చేస్తాడు , అంత దుర్మార్గుడే వాడు .
అన్నం తినేప్పుడు కూడా ప్రశాంతతలేదు అప్పుడుగొడవే . కలబడుతున్నాడు . బజార్లో తిట్లకు లేస్తున్నాడు డబ్బివ్వకపోతే .పరువు పోతుంది . నిద్రలేదు వీడినుంచి . మధ్యలో నాకు గిట్టని బంధువులు వీడికి ఎక్కిస్తున్నారింకా .
నేనెప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు . ఏమిటి నాకీబాధ ? దేముడుంటే నాకీ బాధేమిటి ? నాకెందుకు కలిగిస్తాడు ఈబాధ .అని విచారపడ్డాడు.

ఆయన ఆవేదన అర్ధం అయ్యాక . నేనో మాటన్నాను . మాస్టర్ గారు నేనో మాట చెబుతాను ఏమనుకోనంటే ,అని అన్నాను. దానిదేముంది చెప్పండి అన్నాడాయన.
సార్ ! మీకు పేకాట లో బాగా అనుభవం ఉందని అంటారు జనం . పేకాటలో డబ్బు పోగొట్టుకోవటం అరుదని మీరు చేయితిరిగిన ఆటగాడని అంటారు అవునా ? ప్రశ్నించాను .
అవునండి . కాని నేను ఎప్పుడు మోసం తో ఆడలేదే / న్యాయంగా ఆడి గెలుస్తాను .ఎవరిదగ్గర మోసం చేయలేదు. ఇందులో తప్పేమిటి? ఎదురు ప్రశ్నించాడాయన .
మీరు ఇంతవరకే ఆలోచిస్తే అంతే ! కాని ఇంకొంచెం ఆలోచించి చూడండి . నాకు తెలిసినది చెబుతాను వినండి . ముప్పారాజు వారి పాలెం లో పేకాటలో డబ్బు పోగొట్టుకుని వచ్చిన భర్త తో గొడవజరిగి ఒక మహిళ పురుగు మందుతాగి చనిపోయింది . అలాగే అదే గ్రామం లోఇంకోసారి పేకాటలో పొలం పుట్రాఅమ్మిన డబ్బుకూడా పోగొట్టుకుని వచ్చి భార్యను కొట్టి న దౌర్భాగ్యుడి చర్యకు అవమానానికి తట్టుకోలేక ఓ ఇల్లాలు బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది . ఈ సంఘటనలకు కారణమైన పేకాటలో మీరు ఉన్నారు .

ఇక్కడ ఆఇల్లాల్లు కార్చిన ప్రతికన్నీటి బొట్టు ఆడబ్బువెంట అంటిఉంటుంది. దిక్కులేకుండాపోయిన ఆపిల్లల ఆవేదన బంధువుల శాపనార్ధాలు ఎవరు భరించాలనుకున్నారు? అది తప్పనిసరిగా ఆడబ్బు దక్కించుకున్నవారే వడ్డీతో సహా చెల్లించాలి . ఇది కర్మ సిద్ధాతం. ఆతల్లులు కార్చిన ప్రతి కన్నీటిబొట్టు వందలశాతం పాపరాశిలా వచ్చి ఆశ్రయించుకుంటుంది. ఇవి నాకు తెలిసిన సన్నివేశాలు మాత్రమే .ఇంకా ఇలాంటి సంఘటనలెన్ని ఉన్నాయో తెలియదుకదా ! అన్నాను . ఆయన మౌనం వహించాడు ఏమీ చెప్పలేక .

తరువాత ఆకుర్రవానికి మాతోపాటు హనుమత్ దీక్షనిచ్చి రెండుసంవత్సరాలు చేపించటం నాలుగైదు సంవత్సరాలు సంతోషంగా వున్నా ఆకుటుంబం లో ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది స్థితి . [రెండుమూడు సంవత్సరాలు ఆ ఆటలకు చేష్టలకు దూరంగా వున్న మాస్టర్ గారు ,అబ్బాయిగారు తమ పాతలవాట్లను వదలుకోలేరని తేలి పోయాక]
బుద్ధి కర్మాను సారణి ...... అని పెద్దలన్నది నిజమేనని నమ్మాల్సినసన్నివేశమిది.


ఇక రెండవది.
--------------

మాప్రాంతం లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు . ఇద్దరు బిడ్డలు . ఆమధ్య ఒక యాక్సిడెంట్ లో కొత్తగా పెళ్లయిన కుమారుడు చనిపోయాడు . ఆసమయం లో ఆయన ఏడుస్తున్న ఫోటోలు చూసి గుండె తరుక్కు పోయింది .రాజకీయాలలో తిరుగులేని నేతగా , ఎదిగి విధి చేతిలో ఘోరంగా ఓడి గుండెలవిసేలా ఏడుస్తున్న ఆయన ను చూస్తే మనిషన్నవాని కెవరికైనా దు:ఖం వస్తుంది. ఆయన ఒక పుణ్యక్షేత్రాన్నే అభివృద్ది పరచినవాడు .ఎందుకీశిక్ష ? అని వేదన పడ్దప్పుడు , ఈ యన ఎలక్షన్లలో బాంబుదాడులు కొట్లాటల్లో మరణించిన వారి ఇల్లాల్లు ,బంధువులు ఫోటోలు కూడా [పేపర్లలో చూసినవి]ఒకసారి మనోఫలకం మీద కదలాడాయి .

ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ’ పసిపిల్లలంటే నాకు చాలా ఇష్టం .భగవంతుడు నాఇంట్లో పసినవ్వులు లేకుండా చేశాడు అని ఆవేదనపడ్డప్పుడు . ఈ ఎన్నికలహింసాపర్వం లో చచ్చిన వాని తల్లుల కడుపుశోకం,నాఇంట్లో నేకాదు వాడింట్లో దీపమెప్పుడారిపోతుందో ? వాని వంశం ఎప్పుడు నాశనమవుతుందో ! అని శోకండాలు పెడుతూ దుమ్మెత్తిపోసిన తల్లుల శాపాలు కర్మఫలితాలై వెన్నంటుతాయని నమ్మాల్సి వస్తున్నది.


ఇతరులకు దు:ఖాన్ని కలిగించే మన ప్రత్యక్ష,పరోక్షచర్యలేవైనా అవి మనవంతు బాధను మనకు తప్పనిసరిగా అనుభవం లోకి తెస్తాయని పెద్దలంటారు.
మొన్న నారాయణ శరణాగతి యాగానికొక భక్తుడొచ్చాడు . ఏమిచేస్తున్నవంటే . చీమకుర్తి ప్రాంతం లో మద్యం వ్యాపారం లో భాగస్వామ్యమన్నాడు. వెంటనే మానెయ్యమని చెప్పాను . ఇంకొకపనిచేసుకుని బ్రతుకు కానీ ఇలాంటివద్దని చెప్పాను.

చిల్లరకొట్టు పెట్టి నువ్వొక వస్తువు ఎక్కువధరకమ్మితే అందులో నీకు లాభం వస్తుంది . అదే నువ్వు మద్యం వ్యాపారం చేస్తే నీకు లాభం రావటమేకాదు తాగినవాని కుటుంబానికి దు:ఖమొస్తుంది . అది నీకు అశుభాన్ని వెంట తెస్తుంది .అని వివరించాను/ ఇప్పుడు రాష్ట్రం లో కోట్లకు పడగలెత్తిన మధ్యం వ్యాపారుల కుటుంబాల లోతు రహస్యాలు తెలిస్తేగాని అదివారికి వరమో శాపమో మనకర్ధంకాదు అని వివరించాను. అప్పటిదాకా అంతా పైన పటారమే కనపడుతుంది అన్నాను.
కాబట్టి మనపెద్దలు ఊరికే చెప్పలేదు ,సప్తవ్యసనాలతో వ్యాపారం చేసి బాగుపడదామని ప్రయత్నించటం ఎంత ప్రమాదమో ! అర్ధం చేసుకుందాం .. ఆచరణలో జాగ్రత్తలు తీసుకుందాం. మనచర్య ధర్మబద్దంగా వుండేట్టు . ఎవరి కంట కన్నీరొలకకుండా చూసేట్టు.





Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP