శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా] 9948235641

పరమేశ్వరానుగ్రహంగా పంచాక్షరీ జపయాగం పూర్ణాహుతి

>> Sunday, November 15, 2009


మహాదేవునికి ప్రీతిపాత్రమైన పంచాక్షరి జపమును జపింపజేస్తూ కార్తీక మాసం ప్రారంభం లో మొదలుపెట్టిన పంచాక్షరీ జప యాగం ఈరోజు ముగిసినది . స్వామికి ఉదయాన్నుంచి రుద్రసూక్త ప్రకారంగా అభిషేకాదులు అర్చనలు జరిగాయి. భక్తులు ఓం నమః శివాయ అని జపిస్తుండగా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపునా ఆహుతులిస్తూ పూర్ణాహుతి ని నిర్వహించటం జరిగినది. మీసాల మురళి [అమెరికా] తన సోదరుని పంపి ఈసందర్భంగా అన్నదానం నిరవహించారు . అలాగే సునీల్ వైద్యభూషణ్ జ్యోతిర్లింగార్చన నిర్వహనకు అన్నదానమునకు సహకరించారు . స్వామి అనుగ్రహం నిన్న జరిగిన జ్యోతిర్లింగార్చనలోను ,ఈరోజు యాగానంతరం కురిసిన వర్షం తో ప్రత్యక్షంగా అనుభవమయినది భక్తులకు . పరమేశ్వరుని కృపా కటాక్షం తో మీ అందరకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని స్వామిని వేడుకుంటున్నాము .






Read more...

శనిప్రదోష పూజకు సంతసించిన స్వామి

>> Saturday, November 14, 2009




జ్యోతిర్లింగం లోని దీపాలనుండి మూలవిరాట్ వైపుకు సాగుతున్న కాంతి కిరణాలు .





పరమశివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసములో వచ్చిన రెండవ శని త్రయోదశి అగు ఈ రోజున పీఠములో రామలింగేశ్వర స్వామి వారికి శనిప్రదోష పూజ భక్తి శ్రద్దలతో జరపబడినది. సాయంత్రం రుద్రాభిషేకము ,అర్చన అనంతరం జ్యోతిర్లింగార్చన జరిగినది. చిన్న జగన్నాథ మిశ్రో -కృష్ణవేణి దమ్పతులతరపున వారి కుమారులు సునీల్ వైద్యభూషణ జరిపించిన ఈ కార్యక్రమములో స్వామి జ్యోతిస్వరూపుడై దర్శన మిచ్చారు . స్వామి వారి జ్యోతిర్లింగాన్ని ఫోటో తీయగా జ్యోతులనుండి కాంతులు మూలవిరాట్ వైపుకు పయనిస్తూ స్వామి తాను సంప్రీతుడనయ్యానని నిదర్శనం చూపించారు.
రేపు ఉదయం జరగబోయే పూర్ణాహుతి కార్యక్రమానికి భక్తులు శ్రధ్ధా శక్తులతో ్ సిద్ధముతున్నారు . ఈరోజు ఉదయాన్నే శనీశ్వరునకు తైలాభిషేకం అర్చన గోత్రనామాలు పంపిన వారి తరపున నిర్వహించటం జరిగినది .


Read more...

శనిత్రయోదశి సందర్భంగా శనిప్రదోషపూజ,జ్యోతిర్లింగార్చనలకు గోత్రనామాలు పంపండి

>> Friday, November 13, 2009



శనిత్రయోదశి విశేషమైన రోజు .అదీ కార్తీకం లాంటి విశేషమైన మాసం లో రావటం మరింత శుభకరం . ఈ కార్తీకం లో రెండు త్రయోదశులు శనివారమే రావటం ఇంకా విశిష్టమైన సంగతి . అలాగే పౌర్ణమి అమావాస్య తిథులు సోమవారం రావటం ఈసంవత్సరం ప్రత్యేకత . రేపు శనివారం త్రయోదశి కనుక పీఠం లో నవగ్రహ శాంతి పూజలు ,శనీశ్వరునకు తైలాభిషేకం అర్చనలు జరుగుతాయి . శనీశ్వరునకు ప్రీతి కలిగించి , దుష్ప్రభావాలను తొలగించి శుభాలను కలిగించే పూజ ఇది . జనకళ్యాణం కొరకై శ్రీ పీఠం ఇక్కడ గోత్రనామాలు పంపిన వారి కొరకు శనీశ్వరునకు అభిషేకాలు అర్చనలు జరుపుతుంది.

ఇక ఇప్పుడు " కోటి పంచాక్షరీ జపయాగము" జరుగుతున్నందున హోమాదులు కూడా జరుపబడుతున్నాయి.ఆదివారం పూర్ణాహుతి జరుగుతుంది . అలాగే శనివారం సాయంత్రం శనిప్రదోషపూజ జరుగుతుంది . రుద్రాభిషేకములు ,జ్యోతిర్లింగార్చన జరుపబడుతుంది . జ్యోతిర్లింగార్చనలో తమ తరపున జ్యోతులు వెలించాలని కోరుకునేవారు కోరి ఆ ఖర్చును తామే భరిస్తే వారి తరపున శివలింగాకారం లో జ్యోతులు వెలిగించి పూజ జరపటం చేస్తారు. పూర్ణాహుతి రోజున జరిగే అన్నదానం లోను తాము పాలుపంచుకోవచ్చు. అలాగే ఆదివారం పూర్ణాహుతి అనంతరం యజ్ఞ శేషం గా మిగిలిన భస్మ ప్రసాదం ,రక్షలు పోస్ట్ ద్వారా,లేక కొరియర్ ద్వారా పంపాలని కోరుకునేవారు .ఆఖర్చును తామే భరించాలి . ఏదైనా దైవ కార్యక్రమం లో తాముకూడా పాల్పంచుకున్న ఫలితం భక్తులకు కలగాలనే ఉద్దేశ్యం తో మాత్రమే ఈ సూచన చేయటం జరుగుతున్నది . మామూలుగా గోత్రనామాలను పంపిన వారందరి తరపున నిత్యం సంకల్పం చెప్పబడుతున్నది .

******************** సర్వే జనా సుఖినో భంతు *****************************


Read more...

దర్శించండి

ఇష్టకామ్యసిద్ధికై పూజలు జరుపించుకోండి.

భగవన్మూర్తులకు పీఠములో ప్రత్యేక సేవలు జరపబడుతున్నాయి. అభిషేకప్రియుడయిన శివునకు రుద్రాభిషేకములు,అలంకారప్రియుడయిన శ్రీవారికి తులసి,పుష్పార్చలలు,అర్చనాప్రియ అగు అమ్మ దుర్గకు నిత్యశ్రీచక్రార్చన కుంకుమార్చనలు జరపబడతాయి. మీగోత్రనామాలతో మీరు కోరిన సేవ జరపబడుతుంది.సమ్ప్రదించండి. durgeswara@gmail .com

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP