శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గర్వం తలకెక్కితే !ఒక్కసారి స్మశానం వైపు చూడు....

>> Monday, March 18, 2024

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
             వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ 
             బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై 
             యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!
        

భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

Read more...

ఆదివారం చేయకూడని పనులే మనకు అలవాటయ్యాయి

>> Saturday, March 16, 2024

🕊️శ్రీమతే రామానుజాయ నమః 🦚
🦚 శ్రీలక్ష్మీనరసింహస్వామి నే నమః 🦜
🦜 శ్రీరామ జయ రామ జయజయ రామ 🕊️

   💎నేటి మంచిమాట 💎

మాంసం తినడం..! మద్యం తాగడం..!
 క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!

ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవారు జన్మ జన్మలకు ఇబ్బంది పడతారని అని నొక్కి చెప్పారు మన పెద్దలు.

ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు
ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!

ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!

అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..

అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!

 బ్రిటీషు వాడు
(Thomas Babington Macaulay,)
ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..
మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!

కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!

ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!

ఆదివారం అరోగ్యవారం గా మార్చుకుందాం....

యోగ చేద్దాం.! ప్రాణాయామం చేద్దాం.!
సూర్యనమస్కారాలు చేద్దాం.!
సూర్యోపాసన చేద్దాం.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.!!

ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు
కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ
దీన్ని పాటించడానికి ప్రయత్నిద్దాం..!!

ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ
క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే
కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.

🙏 ఆచార్య శ్రీపాదములే మనకు రక్షకము 🤷‍♂️

🙇‍♂️ నవ్వండి నవ్విస్తు వుండండి 💧

🌹 ఊర్ధ్వపుండరములు ధరించిన అతివిలక్షణమైన శ్రీవైష్ణవుల దర్శనము శుభప్రదము మరియు మజ్గళకరము 🌹

💎జయ తిరుప్పావై జీయర్ తిరువడిగళే శరణమ్ 👏

Subhash

Read more...

వస్తున్నది మహాశివరాత్రి....మీ గోత్రనామాలు పంపండి

>> Tuesday, March 5, 2024

C

మహా శివరాత్రి 

మదినిండా  స్వామిని నింపుకుని  ఆయన అనుగ్రహంకోరి  సృష్టిలోని జీవరాశి పరవశించే పర్వదినం . 
ఈరోజు  మనం చేసే  ఉపాసనలన్నీ  శీఘ్రంగా ఫలించి  ఆయన అపార కరుణ  మనపై  ప్రసరిస్తుంది . 
ప్రతిసంవత్సరం వలెనే   పీఠంలో  రుద్రాభిషేకములు స్వామికి విశేష అర్చనలు జరుపబడుతున్నాయి. 
మీ గోత్రనామాలు  పంపిన చో  మీతరఫున  స్వామికి సేవాకైంకర్యాలు  జరుపబడతాయి.. ఇందుకోసం  మీరు మీశక్త్యానుసారం లోకక్షేమాన్ని ,సనాతన ధర్మ   కోరుతూ శివపంచాక్షరి  జపించటం మాత్రమే మాకు పంపవలసిన దక్షిణ . అంతకన్నా ఏమీలేదు. 

గోత్రనామాలు పంపవలసిన  చిరునామా 
durgeswara@gmail.com


Read more...

శ్రీపంచమి శుభాకాంక్షలు

>> Wednesday, February 14, 2024


చదువుల తల్లి చల్లనిచూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాము

Read more...

జ్ఞానవాపి

>> Sunday, February 4, 2024

జ్ఞానవాపి సముదాయము-కంచే తొలిగిన విధానం!
వారణాశి లో జ్ఞానవాపి సముదాయం లో ఉన్న నేల మాళిగ లో ఉన్న శ్రింగార గౌరీ ఆరాధన స్థలంలో పూజలు నిర్వహించు కోవచ్చని వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన పరిణామాలను చూస్తే అధికారులు తలుచుకుంటే ఎంత వేగంగా పనులు అవుతాయో అర్థం అవుతుంది!
******************
31-01-2024 మధ్యాహ్నం 3 గంటలకి వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు జ్ఞానవాపి సముదాయంలో ఉన్న మసీదు నేల మాళిగ లోఉన్న దేవతా మూర్తుల పూజ చేసుకోవచ్చని.
సాయంత్రం 6 గంటలకి వారణాశి జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం కోసం అధికారులని తన కార్యాలయానికి రమ్మని ఆదేశాలు ఇచ్చారు.
వారణాశి జిల్లా కోర్టు తీర్పు ను అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్.
రాత్రి 8గంటలకు వారణాశి జిల్లా SP తన కింది అధికారులతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వచ్చే ముందు అదనపు పోలీసు బలగాలని తన కార్యాలయానికి రమ్మని ఆదేశాలు ఇచ్చారు SP.
రాత్రి 9గంటలకి జిల్లా కలెక్టర్ కోర్టు తీర్పు ను అమలు చేయడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో జిల్లా ఎస్పీ తో చర్చించి భద్రతా దళాలును సిద్ధంగా ఉండమనీ ఆదేశాలు ఇచ్చారు.
రాత్రి 10 గంటలకి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా SP లు కలిసి జ్ఞానవాపి సముదాయ ప్రదేశానికి వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించారు.
రాత్రి 11 గంటలకి వారణాశి జిల్లా కలెక్టర్ పూజలు ప్రారంభించడానికి పూజారిని సిద్దంగా ఉండమని కబురు పంపారు.
రాత్రి 11.30 లకి ఇనుప కంచెను (ఐరన్ బారికెడ్స్) ను మునిసిపల్ కార్మికులు తొలగించారు!
ఈ ఐరన్ బారికేడ్స్ ను 1993 లో అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముల్లా సింగ్ యాదవ్ ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా నిర్మించాడు ముస్లిం ఓటర్ల సంతృప్తి కోసం.
అర్ధ రాత్రి 12 గంటలకి ‘ వ్యాస్ కీ తేహాఖాన ‘ ను తెరిచి పూజ కోసం అక్కడ ఉన్న 10 దేవతా మూర్తుల సంప్రోక్షణ మొదలు పెట్టారు.
తెల్లవారుఝామున బ్రహ్మ ముహూర్తంలో పూజలు మొదలయ్యాయి.
మరోవైపు సనాతనులు జ్ఞానవాపీ సముదాయానికి దారిని సూచించే బోర్డుల మీద జ్ఞానవాపి మసీదు మీద మందిర్ అని స్టిక్కర్లు అంటించేశారు.
*******************************
జ్ఞానవాపి లో పూజలు మొదలయ్యాయి అని తెలుసుకున్న ముస్లింలు అర్ధ రాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ను అర్ధరాత్రి నిద్ర లేపి జ్ఞానవపి లో పూజలు మొదలు పెట్టారు అని అర్జెంట్ హియరింగ్ కింద తమ పిటిషన్ ను లిస్ట్ లో పెట్టమని అడిగారు అంటే ఫిబ్రవరి 1న సుప్రీం కోర్టు మొదలవగానే తమ పిటిషన్ ను విచారణకు తీసుకోవాలని కోరారు.
కానీ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ మీరు ఉత్తర ప్రదేశ్ హై కోర్టు లో తేల్చుకోండి అని సలహా ఇచ్చారు.
దాంతో చేసేది లేక ఫిబ్రవరి 1న హై కోర్టు లో పిటిషన్ వేశారు కానీ హై కోర్టు Not maintainable అని కేసు కొట్టేసింది.
ఇదంతా జనవరి 31 మధ్యాహ్నం నుంచి ఫిబ్రవరి 1 మధ్యాహ్నం వరకు అంటే 24 గంటలలో జరిగింది.
***************************
ఒకసారి 2022 లోకి వెళ్లి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం!
2022 లో వారణాశి జిల్లా న్యాయమూర్తి జ్ఞానవాపి సముదాయంలో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఆ న్యాయమూర్తి కి బెదిరింపులు వచ్చాయి ‘ సర్ తన్ సే జుడ ‘ అంటూ.
యోగీజీ సదరు న్యాయమూర్తికి పోలీసు రక్షణ ఇచ్చారు.
అదే న్యాయమూర్తి జనవరి 31 న పూజలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చి అదే రోజున పదవీ విరమణ చేశారు.
***********************
ఇంతకీ జ్ఞానవాపి సముదాయం మీద నడుస్తున్న కేసు విషయంలో అయోధ్య రామాలయం లో లాగా టైటిల్ సూట్ ఏమీ లేదు అంటే ఆ స్థలం మాదే అని అనట్లేదు ముస్లిమ్ లు.
విచారణ జరుగున్నది కేవలం మందిరం మీద మసీదు ఎందుకు కట్టారు అక్రమంగా దురాక్రమణదారులు అనే విషయం మీద!
ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా కనపడుతున్నా మనం న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం చూడండి అదీ మన దౌర్భాగ్యం!
కాంగ్రెస్ నానాటికీ ఎందుకు బలహీనపడుతున్నదో విమర్శ చేసుకుంటే మంచిది.
కాంగ్రెస్ పాలనలో అయోధ్య, కాశీ,మధుర వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు.
**************************
మధుర శ్రీ కృష్ణ మందిరం ఎలా ధ్వంసం చేశారో తెలుసుకుంటే కడుపు మండుతుంది.
జై శ్రీకృష్ణ!
జైహింద్!

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP