శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తల్లి పదములు చేరి పులకించిన పూబాలలు

>> Sunday, February 28, 2010

కమలాక్షునర్చించు కరములే కరములు .
శ్రీమాత చిరునగవు చాలదా మనకు ?

ఋతువులు మాసములెన్నో గడచెను వెతలు దీర్చవెటుబోదునయా !
చదువుల తల్లి వాణి .

బాలా ! మాంపాహి ! ఇది నీలీల
భాగ్యవశాన ఓ మూఢుడు చేస్తున్న పూజకూడా మోదముతో తిలకిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ . అదీ ! తల్లి ప్రేమ .

రాధా,దుర్గ,సావిత్రి,సరస్వతి,లక్ష్మీరూపాలుగా పంచప్రకృతులుగా కొలువుదీరిన తల్లికి కలువపుష్పాలతో సేవ

తల్లి పాదాలు చేరితిమిగదా ! యని తమ భాగ్యానికి మురిసి పులకిస్తున్న పూబాలలు .


[పౌర్ణమి రోజు కలువపూలతో అమ్మను అర్చించాలనే సంకల్పం కలిగింది్ మనసులో . ఆరోజు ఉదయాన్నే నూజండ్ల చెరువులో ఉన్న ఈ పుష్పాలకోసం మనుషులను పంపించాలని అనుకున్నాను . కానీ సమయానికి ఆమనిషిని రాకుండాచేసి ఎలా చేస్తావురా ? అని చిన్న పరీక్షపెట్టింది అమ్మ . నేను చాలా మూర్ఖుణ్ణి .వెంటనే ఓపిల్లవాణ్ని వెంటబెట్టుకెళ్ళి అక్కడ చెరువుకు కాపలాగా ఉన్న నాపూర్వవిద్యార్థి ఒకడు పడవ నడుపుతుండగా గంపెడు కోసుకుని వచ్చి మా అమ్మకు ఇలా పూజ చేసుకున్నాను. ఇలా నాచేతే స్వయంగా తెప్పించుకుని ,అర్చనచేపించుకున్న అమ్మ ప్రేమ నాకెందుకో సరిగా అర్ధమవలేదనుకుంటా ! ఇంకా . ఇంకా ఎన్నెన్ని జన్మలుగడవాలో తల్లిసన్నిధికి చేరాలంటే? ఈ పూబాలలే భాగ్యముచేసుకున్నవో పుట్టినవెంటనే తల్లి పాదాల చెంత చేరుకున్నవి.]




Read more...

నీటిపై తేలాడే నరసింహుని లీల

>> Friday, February 26, 2010

పరిశీలించి చూస్తే పరమాత్మ లీలా విచిత్రాలు సృష్టి లో అంతటా కనపడతాయి. చోటుకొక చిత్రాన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో మనం చూడవచ్చు అలాంటి లీలా చిత్రమే ఒకటి ఇక్కడ చూడవచ్చు. నీటిపై తేలాడే నరసింహుని లీల ను ఇక్కడ చూడండి

http://telugu.webdunia.com/religion/believeitornot/article/0809/22/1080922086_1.htm

Read more...

పరిశీలించి చూస్తే పరమాత్మ లీలా విచిత్రాలు సృష్టి లో అంతటా కనపదతాయ్

Read more...

అలంకరణ అంటే ఇదీ !ఇలామనపిల్లల్ని చూసుకుందాం

>> Thursday, February 25, 2010

ఇప్పుడు పిల్లలకు ఎవరైనా ఇలా దుస్తులు ధరింపచెస్తే పదిమంది ముందు పొగుడుదాము....

చూడండి .....

ఈ చిన్నారి ఎంత ముద్దొస్తొందో.........................................


cid:1.3175880088@web95314.mail.in2.yahoo.comcid:2.3175880088@web95314.mail.in2.yahoo.com



cid:3.3175880089@web95314.mail.in2.yahoo.comcid:4.3175880089@web95314.mail.in2.yahoo.com

బాలాయై నమో నమః ప్రకృత్యై।
------mukku raaghavakiran sarma gaaru


బాలిక రూపమున్ గలిగి, భక్తుల పాలిటి కల్ప వల్లివై
చాలగ మమ్ముఁ గావగను, చక్కగ వచ్చిన దైవ మూర్తివా?
ఏలగ చాలుదీవు. జగమేలెడి ముగ్గురు తల్లులొక్కటై
బాలకవైతివమ్మ! వర భావ సమృద్ధినిఁ గల్గి మెల్గుమా!

----- chintha ramakrishna ravu garu

--

Read more...

పరీక్షలలో విజయం కోసం హనుమత్పూజ

>> Wednesday, February 24, 2010

జైశ్రీరామ్

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.


వేడినవారికి కొండంత అండ హనుమత్ స్వామి . ఆయన చెంత చేరినవారికి అన్నింటా దిగ్విజయమే . సకల మనో వికారాలను అణగించి బుద్ధిబలాన్ని పెంచి నిర్భయత్వాన్ని ప్రసాదించి సర్వత్రా జయాన్ని చేకొనేలా అనుగ్రహిస్తాడు తనను వేడినవారికి. కనుకనే పరీక్షలు వచ్చినప్పుడు స్వామి అనుగ్రహాన్ని కోరి భజించి జీవితంలో ఎదురయ్యే ఆపరీక్షలను దిగ్విజయంగా దాటగల శక్తినిపొందుతున్నారు అప్పుడూ ,ఇప్పుడూ కూడా.

ప్రస్తుతం రాష్ట్రం లో పలువురు పిల్లలు చదువులో పెద్దపరీక్షలనెదుర్కోబోతున్నారు . రాత్రింబవళ్ళు చదువుతూ మంచి రాంకులు ,మార్కులకోసం పోరాడుతున్నారు. ఇలా బద్దకించకుండా తమశాయశక్తుల కృషిచేసే వారంటే స్వామి కెంతో ఇష్టం . ఎందుకంటే అనుకున్నది సాధించాలంటే నిర్విరామంగా ఎలా కృషిచేయాలో స్వామి ఆచరించి చూపించాడుకదా ! అందులోనూ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న విద్యార్థులంటే మరీ ఇష్టం స్వామికి. ఆయన శక్తి పూర్ణంగా ప్రసాదిస్తాడు పిల్లలకు .
ఐతే కొద్దిమందికి ఆరోగ్యకారణాలు కానివ్వండి ,పూర్వజన్మకృతం వలన కానియ్యండి ఇంకా ఇతరకారణాల వలన కానివ్వండి ఏకాగ్రత రాక ,మనసు నిలకడ కుదరక ,భయమావరించి చదువులో వెనుక బడుతుంటారు. రాత్రింబవళ్ళు చదివినా గుర్తుండటం లేదని మంచి స్థాయితెచ్చుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు.పాసవ్వలేమని నిరాశ చెందుతుంటారు.

అలా భయపడవలసిన పనిలేదని మన పెద్దలు మనకు ఆంజనేయుని అభయాన్ని పొంది సులభంగా విజయాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు పూర్వకాలం నుంచి పెద్దలు.. ఆర్తులకు కొండంత అండగా నిలచి నడిపించే ఆంజనేయుడు మన తోడున్నాడని గ్రహించండి ఎటువంటి భయము అక్కరలేదు.ఆయనను ఆశ్రయించినవారికి ఎక్కడా అపజయం లేదు. వీళ్ళుపాస్ కావటం అసాధ్యం ,అని మాస్టర్లచేత నిర్ణయిచబడి తోటివారితో గేలి చేయబడ్ద పిల్లలనుకూడా హనుమదుపాసన చేపించి నతరువాత అద్భుతమైన ఫలితాలు చూసిన అనుభవముంది నాకు. తమ శక్తివంచన లేకుండా కృషిచేసి స్వామి నాశ్రయిస్తే తప్పనిసరిగా ఆయన అనుగ్రహంతో పరీక్షలలో కృతార్ధులుకాగలరు. అలాగే మంచి రాంకుల ను కోరుకున్నవారు అనుకున్న స్థాయిలో మార్కులను సంపాదించుకోగలరు . ఇది సిధ్ధయోగం.


ఈక్రింది సూత్రాలను పాటించాలి
------------------------

౧ .. విద్యార్థి గోత్రనామాలను మాకు మెయిల్ చేస్తే ఆపిల్లల పేర ఇక్కడ అర్చన జరుగుతుంది.
౨... ఈ సాధనలో పాల్గొనే విద్యార్ధి ఉదయాన్నే హనుమంతుని స్మరిస్తూ వేకువఝామునే నిద్రలేచి . చదువుకున్న తరువాత స్నానానంతరం పదినిమిషాలు ఇక్కడిస్తున్న చాలీసాలోని సంపుటీకరణ మంత్రాన్ని పఠించాలి
ఈ మంత్రాన్ని నడుస్తున్నప్పుడు ,ఖాళీ సమయంలోనూ ,భయం కలిగినప్పుడు స్మరించాలి.
ఎవరితోనూ తగాదాలు పెట్టుకోవడం ధూషించటం చేయకూడదు. చెడు మాటలు మాట్లాడితే మీ శక్తి తగ్గిపోతుంది . మంచి మాటలు పలకడంద్వారా మీరు శక్తివంతులవుతారు గ్రహించండి.

౩. మీకు సమీప ఆలయంలోగాని ,లేదా మీదగ్గర రున్న హనుమంతుని చిత్రపటాన్ని తులసికోటలోనో లేక కుర్చీలోనో పెట్టుకుని కనీసం 27 ప్రదక్షిణములు చేయాలి. ప్రతిరోజు ఉదయం వేళలో.
4. మాంసాహారం తీసుకోకుంటే మంచి ఫలితముంతుంది . శక్తికోసం పళ్ళు,పాలు ఎక్కువగా తీసుకోవచ్చు.
5. ధ్యానించవలసిన శ్లోకం

" బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశవికార్ ."

పై శ్లోకాన్ని పదే పదే స్మరించటం ద్వారా మంచి జ్ఞాపకశక్తి కలిగి చదువు బాగాసాగుతుంది.

విద్యార్ధులెవరన్నా మనసులో పరీక్షలపట్ల భయంకలిగినా ,ఇంకా ఏదన్నా సందేహాలొచ్చినా నాకు మెయిల్ చేసినా లేక ఫోన్ చేసినా మీ సందేహాలు తీర్చటానికి ప్రయత్నిస్తాను . మీకోసం ఇక్కడ స్వామికి అర్చనలు జరిపిస్తాము .
ఇందుకోసం విద్యార్థులు మాకివ్వవలసిన దక్షిణ స్వామి పట్ల మీరుచూపే శ్రద్ధాభక్తులు మాత్రమే. ఆయనలాగా మీరుకూడా సకల సద్గుణవంతులుగా తయారవ్వడమే .

దిగ్విజయోస్తు .
_________________

సంప్రదించవలసిన చిరునామా

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం

durgeswara@gmail.com

9948235641

మీ తోటి విద్యార్థులకు కూడా ఈ విషయం అందజేయండి

Read more...

దివ్యదర్శనం


సకలలోక జనని జగన్మాత కొల్హాపురం లో వెలసి భక్తజనులను పోషిస్తున్నది .ఆ మహాలక్ష్మీ దేవి దివ్యదర్శనాన్ని మనకు సకల సంపదలూ ప్రసాదించమని వేడుకుంటూ మనసున స్మరిద్దాం


Read more...

హాస్యం కూడా ఒకానొక యోగమేననుకుంటా

>> Tuesday, February 23, 2010

చిత్రాలను పెద్దపరిమాణం లో చూడండి దయచేసి .






నవ్వులబ్రహ్మ మల్లికన్న పేల్చిన మరొక నవ్వులబాంబు ఇక్కడ

http://teluguone.com/sendimage/view.jsp?id=g1266938298031



నవ్వులుపూయించిన నా అభిమాన రచయిత మల్లిక్ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ....

Read more...

కొల్లూరు మూకాంబిక అలయదృశ్యాలు చూడండిక్కడ

>> Monday, February 22, 2010


కొల్లూరు మూకాంబిక అలయదృశ్యాలు చూడండిక్కడ

http://www.p4panorama.com/panos/Mookambika/index.html

Read more...

సైన్స్ చెప్పే వేదాంతం

>> Saturday, February 20, 2010


"బ్రహ్మ" అనే పదం "బృంహణము " అనే ధాతువునుంచి పుట్టినది. బృంహణము అంటే అతటా ,అన్నింటా నిండియన్నది అని అర్థం ,ఆ బ్రహ్మం సత్యం అన్నారు..సత్యం అంటే వాస్తవమైన ఉనికి కలిగియుండుట,అంటే ఎన్నటికీ నశించినది,శాశ్వతమైనది అని అర్థం .అదిలేని తావేలేదు కనుక అనంతమైనదన్నమాట. బ్రహ్మ అన్నింటికీ ఆధార భూతుడన్నమాట. కుండలన్నింటికీ మట్టి ఆధారభూతమైనట్లు.అదే పరమాత్మ అన్నారు. అదే సర్వ వ్యాపకమని చెబుతారు ఋషులు .దానినే దైవమంటారు. ఈ గుణాలు గలది సృష్టికాధారంగా ఉన్నదని నిరూపిస్తే భగవంతుడున్నాడని నిరూపమైనట్లే .

ఆధునిక విజ్ఞానమేమని చెబుతోంది ? సృష్టి లోని పదార్థమంతా పరమాణుమయము అంటున్నది. ఈ పదార్ధమంతా ఒకే ఒక శక్తి లేక Energy యొక్క రూపమేనని చెబుతుంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త హైసెన్బెర్గ్ werner heisenberg "phisics and philosophy " అనే గ్రంథం లో నేటి విజ్ఞాన సారాన్నిలా చెబుతారు..."ప్రాథమికమైన కణాలన్నిటినీ చాలినంత శక్తి ప్రభావానికి గురిచేసినట్లైతే ఇతర ప్రాథమిక కణాలుగా మార్చవచ్చు. లేక గతిక శక్తి [kinetic energy] నుండి అటువంటి కణాలను సృష్టించవచ్చు. లేక ఆప్రాథమిక కణాలను నశింపజేసి శక్తిగా మార్చవచ్చు. కనుక మనకిక్కడ నిశ్చయమైన ఋజువు దొరికింది. పదార్థమంతటికీ ఆధారంగా ఒక ఏకత్వమున్నదని. ప్రాథమిక కణాలన్నీ శక్తి అనబడు ఒక్క ఆధారాన్ని కలిగిఉన్నాయని. అన్ని ప్రాథమిక కణాలరూపంలోనూ మనకు గోచరించేది ,ఇప్పుడాలోచిస్తే బ్రహ్మమని మన ఋషులు చెప్పినది దీన్నిగురించేనని తేలుతుంది. బ్రహ్మ సత్యం అన్న ఋషివాక్యాన్ని ఆధునిక విజ్ఞానమూ నిరూపిస్తుంది ! .


Read more...

ఇండియా ఇలాఉండేది నాడు

>> Friday, February 19, 2010



Just see what British thought of India and how they managed to rule us.
plz don't forget to read the letter in the end

Just read what INDIA was as per LORD MACAULAY on his statement on 2nd February 1835, in the last snap. That would really shock us Old Photographs from Indian History. Please Read the last Article Carefully
The daughter of an Indian maharajah seated on a panther she shot, sometime during 1920s.


Women gather at a party in Mumbai ( Bombay ) in 1910.













A group of Dancing or notch girls began performing with their elaborate costumes and jewelry



The Grand Trunk Road , built by Sher Shah Suri, was the main trade route from Calcutta to Kabu

A group from Vaishnava, a sect founded by a Hindu mystic. His followers are called Gosvami-maharajahs



A British man gets a pedicure from an Indian servant.

An aerial view of Jama Masjid mosque in Delhi , built between 1650 and 1658.


The Imperial Airways 'Hanno' Hadley Page passenger airplane carries the England to India air mail, stopping in Sharjah to refuel.



See what the India was at 1835.......



Read more...

బ్లాగులోకపు హిరణ్యకశిపునింట ఓ ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు . ఇదీ విష్ణు మాయ.

>> Thursday, February 18, 2010


విష్ణుని మహిమలను ,ఆయన లీలలను వర్ణించనెవరి తరముకాదు . ఏంటో ఒక్కోసారి లోక కళ్యాణకరమైన ఆయన లీల అసలర్ధంకాదు , కానీ తెలుసుకున్నతరువాత ఆశ్చర్యపోతాము . వేడిన వారికి దరశనమీయవు !వలదని నిన్ను వారించువారిని వదలక వెంట తిరిగెదవయ్యా ! అంటూ భక్తులు పాడుకుంటూనే ఉన్నారు యుగయుగాలుగామహాభక్తులు . ఎవరు ద్వేషిస్తారో వాళ్లచేతనే పలుమార్లు తన నామాన్నుచ్ఛరింపజేసే చిత్రమైన లీలలు చేస్తాడాయన.

అప్పుడెప్పుడొ హిరణ్యకశిపుని నృసింహమూర్తిగా సంహరించినప్పుడు ఆదుష్టుని రక్తం విశ్వాంతరాలకు ఎగజిమ్మగా ఆరక్తపు తుంపరలు మెల్లగా భూమిపైవాలుతూ రాక్షసాంశలుగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాయి ,ప్రతియుగాన,ప్రతి తరాన . మానవ జన్మ తీసుకున్నా తమలో ఇంకి కరుడుగట్టిన విష్ణుద్వేషం మరచిపోకుండా ఆజీవి ,లోకాన విష్ణుద్వేషిగా పాతవాసనలను ప్రదర్శిస్తూనే ఉంటుంది .

ఇలా ఒకానొక రక్తబిందువు ఈయుగంలో ,ఈతరం లోనూ తెలుగుగడ్డమీద ఓ బ్లాగ్లోక మేధావిగా జన్మించినది. విద్యాబుద్దులు నేర్చి అన్నివిషయాలను చదివే పరిజ్ఞానం సంతరించు కున్నాడు. . తన పరిజ్ఞానాన్నంతా జనంలో విష్ణువుపైన ద్వేషం కలిగేలా చేయగలగటానికి , ఆపేరు చెబితేనే మండిపడే తన పూర్వలక్షణాన్ని అనుసరించి ప్రదర్శిస్తున్నాడు. .రాక్షసులు కూడా అద్భుత పాండిత్యాన్ని సంపాదించటం లోను సాధన చేయటం లోనూ ఏమాత్రం తక్కువవారుకాదు. మొండిపట్టుదల తీవ్ర తామసిక లక్షణాలతో అనుకున్నది సాధించగలరు. కాకుంటే ఆ జ్ఞానాన్నంతా భగవంతుని పట్ల ద్వేషంతో ఆత్మ వినాశనానికి ఉపయోగించుకుంటారు . పరమదయాళువైన ఆస్వామి తన పూర్వ భక్తుడు ఈ జన్మలోనూ పతనం కావటం సహించక వారి క్షేమం కోసం మరలా మరలా వారిచేత తన నామాన్ని స్మరింపజేసే రీతిలో తనలీలలు సాగిస్తాడు.


ఇక్కడ ఆ హిరణ్యకశపాంశ తో జన్మించిన ఆజీవి తన రచనలలో. వాదనలలో ప్రస్ఫుటంగా విష్ణుద్వేషం కన్పిస్తూ ఉండటం నాకనుమానం కలిగించింది .ఎందుకు ఈ జీవి ఇంతగా భగవద్వేషాన్ని ప్రదర్శిస్తున్నడా? అని ఎంతాలోచించినా గాని ,ప్రశ్నించి చూసినా గానీ సమాధానం రాలేదు . ఎందుకో హఠాత్తుగా ఈ విషయం స్ఫురణకు వచ్చి ఆలోచించాను . ఓసారి ఈ హిరణ్యకశిపుని ఇంట ఉన్న భక్తప్రహ్లాదుని ఫోటొ చూడటం తటస్థించింది . వాని ముఖం లో తేజస్సు ,భగవద్భక్తుని లక్షణాలను చూడగానే పోల్చుకున్నాను . సందేహం లేదు .ఈయనచే భగవన్నామ స్మరణ పలుమార్లు చేపించడానికే ఈయనకు జన్మించిన ప్రహ్లాదాంశమని అనుకోవచ్చు. ఈయనకు సహచర్యం చేస్తున్న ఆసాధ్వి నాటి లీలావతి అంతటి వందనీయ మాతృమూర్తేనని నాభావం .

ఇక ఇక్కడనుంచి మనం శ్రీహరి లీలా విలాసాన్ని చూడవచ్చు . ఈ హిరణ్యకశిపుడు పైకి కన్పించినట్లుగా నాస్తికుడేమీకాదు . నాస్తికత్వం ఒక ముసుగుమాత్రమే . లోపల చూస్తే ఆయన కూడా ఏదో రూపం మీద నమ్మకమున్నవాడే . కానీ సర్వాంతర్యామియగు హరి నామాన్ని సహించలేని ఈర్ష్యాద్వేషాలు కరుడుగట్టి ఉన్నాయి మనసున . కానీ కరుణాంతరంగుడైన శ్రీహరి లీలలకు ఇదే వేదికవనుంది.

ఇప్పుడు పెరుగుతున్నా బాలప్రహ్లాదుడు " హరి నీవే ...సర్వాత్మకుడవు " అనిపాడకా మానడు .అదివిని ఈయన మనస్సు అగ్నిపర్వతంలా కుతకుతలాడక మానదు .అదొక హింస ......పాపం. విష్ణువొక చిల్లరదేవుడు ... ఎవరా గోవిందుడు అని గర్జించి ప్రశ్నించిన నోటితోనే ., ముకుందా....ముకుందా .కృష్ణా ,,ముకుందా ...ముకుందా అని మురిపెంగా బిడ్డను పిలచి లాలించక తప్పని స్థితి కల్పించాడు స్వామి . ఎంతకాదనుకున్నా అంతరంగం లో ప్రేమతరంగాలు మిళితమై భగవన్నామం ప్రేమ పూరితంగా జపించబడుతుంది . ఇది తెలిస్తే ఇంకా నరకం . ఛీ ..ఛీ దానవ వైరి ఆ హరి నామం నేనునా నోట పలకటమా థిక్.... అని ఇంతెత్తెగిరినా సరే ,తప్పదు. నాన్నా !అని ఆబుడతడు పిలవగనే నాయనా !అని హరినామంతో వాడిని పిలవక తప్పనిస్థితి కల్పించాడు లీలానాటకసూత్రధారి.

పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ భక్తి ప్రవర్ధమానమై మన బాల ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తమునిగా ఎదుగుతున్నప్పుడు అది సహించలేక ,నిరోధించలేక ప్రేమద్వేషాలనేవిరుధ్ధభావలమధ్య నలుగుతూ విష్ణుద్వేషం యొక్క ఫలితం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అభినవ హిరణ్యకశిపునకు . ఎలాగోలా వానిని విష్ణువుపట్ల విరక్తునిగా మార్చాలని మార్చలేకపోయినా నాస్తికునిగానైనా మార్చి భగవ్ద్భావానికి దూరం చేయటం కోసం ,,ఒరే ద్వుడులేడు ..గీవుడు లేడు ,అని మన రాక్షస చక్రవర్తి అనగానే ..అయ్యో భగవంతుడు లేకున్న ఇదంతా ఎలాసృష్టించబడినది తండ్రీ అని మన బాలభక్తుడంటాడు . అయితే ఏడిరా ! చూపించు ? అని ప్రశ్నించగానే ..... ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు .... అంటూ ప్రహ్లాదుడు వివరణ ఇస్తుంటే దేహం కంపిస్తూ హృదయం రగిలిపోతూ ... అబ్బా ! ఆదృశ్యాన్ని ఊహించికుంటుంటే చాలు మనసు పులకించి పోతోందికదా ! అది అంతే .నారాయణ నీలీలా నవరసభరితం అంటూ మనం పాడుకుంటూ వేచిచూద్దాము .
ఇంకా హిరణ్యాక్ష ,రక్తబీజ ,మహిష,మహాకాయ, తాటక ,సుబాహు మారీచాది రాక్షసయూధముఖ్యుల అంశలుకూడా ఇక్కడ మనకు తటస్థిస్తున్నాయి . మరక్కడేమి మాయచేశాడో మహామాయకు అధినాయకుడు, తెలియదుకదా మనకు.

యుగయుగాన జరిగే విష్ణుమాయను ఊహించతరమా ! మనబోంట్లకు




Read more...

దైవానికి చేసే షోడశోపచారపూజలలోని అంతరార్థం ఏమిటి ?

>> Wednesday, February 17, 2010

నిత్యము భక్తి శ్రద్దలతో ఆలయ దర్శనం చేస్తూ ఇంటివద్ద నిత్యానుష్ఠానం ,పూజ పారాయణం చేస్తూఉంటే క్రమంగా మన లౌకిక మైన విధులన్నింటినీ నిమిత్తమాత్రంగాను,భగవంతుడు మనకప్పగించిన బాధ్యతలన్న దైవీభావనతోనూ చెయ్యగలుగుతాము. అనివార్యమని భగవద్గీతాదులు చెప్పిన కష్ట సుఖాదులను సమభావం తో ఓర్పుతో ఎదుర్కొనటం అలవడుతుంది. క్రమంగా మన దేహము మనస్సు వాక్కు భగవత్సేవకంకితమైన పనిముట్లుగా ,పాత్రలుగా భక్తుడు తలుస్తాడు. బాహ్యంగా మందిరాన్ని శరీరమెలా దర్శిస్తుందో అలానే అంత:కరణ మన దేహాన్ని దేవాలయంగా భావించి పవిత్రంగా ఉంచుకోవడం నేర్చుకుం టుంది. అలా నడుచుకోగలిగితేనే మనం దేవాలయన్ని దర్శించినట్లు. ఆలయం లోని ఇంటిలోని పూజాపాత్రలను స్వంతమైనవిగా భావించిలౌకికమైన అవసరాలకెలా వాడుకోలేమో ! అలానే మన త్రికరణాలను - అంటే దేహంమనస్సు వాక్కులను అయోగ్యమైన రీతిన అంటే దైవీభావం తో మేళం గాని విధంగా వాడుకోలేము. అది మన భక్తి వాస్తవమవడానికి గుర్తు. మనం సాధనవాస్తవంగాచేస్తున్నమనడానికి గుర్తు.ఇలా పరిశుధ్ధమొనర్చబడిన త్రికరణాల రూపమైన సుక్షేత్రం లోనే భగవన్నామ స్మరణ ,ధ్యానము,పూజ అనబడు ఉత్తమ బీజాలు మొలకెత్తి వృద్ధిపొందుతాయి.

ఈభావాన్ని మన మనస్సులమీద నిత్యము బలంగా ముద్రించుకోవడానికనువుగా మనపెద్దలు కొన్ని ఆచారాలనందించారు ,వాటి అంతరార్ధం దేహాన్ని దేవాలయంగా ,అవయవాలను,త్రికరణాలను పవిత్రమైన పూజాసామాగ్రిగా రూపొందించుకొనమని ,అయోగ్యమైన రీతిలో వాటినుపయోగించి అపవిత్రం చేసుకొనవద్దని సందేశం. దీనిని కొంచెం వివరిస్తాను.

ఇంట్లో పూజగదిలోకి గాని.దేవాలయం లోకిగాని ప్రీతితో ఈ దేహాన్ని దానితోపాటు భక్తియుక్తమైన మనస్సును ఎలాప్రవేశ పెడతామో ! అలానే పూజలో ఇష్టదైవాన్నీ ఆహ్వానం [ఆవాహన] చేస్తాము. దైవం సర్వగతుడుకదా ! ఆయన వెరే ఎక్కడో ఉంటేగదా మనం ఆవాహన చేయగలిగేది ! సర్వగతుడైన ఆయన ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉన్నామన్న గుర్తును బలంగా హృదయంలో ప్రతిష్టించుకోవడమే ఆవాహన. ఆసన సమర్పణ. అలాగే మనశరీరం గూడా మన ఇష్టదైవం ఎదుటకూర్చుంటుంది. పూజారంభం లో ఆచమనం చేసి, అలానే తరువాత దైవానికీ ఆచమనీయం సమర్పిస్తాము. దైవానికి సమర్పించిన పాద్యం [పాదాలు నీటితో కడగటం] వలెనే మనం కూడా మొదట ఇంట్లోకిరాగానే కాళ్ళు కడుక్కుంటాము .-అక్కడక్కడ లౌకిక కార్యాలకోసం సంచరించి రజోగుణాత్మకమైన భావాలతో [రజస్సు అంటే ధూళి అనికూడా అర్ధం దేహానికన్వయించుకుంటే] మలినమైన మనస్సును భక్తి భావనతో క్షాళనం చేసుకున్నట్లే ! ఇష్టదైవానికి ఆత్మసమర్పణ చేసినట్లే , మన జీవితము, సాధనలను మన హృదయస్థమైన ఆత్మకొరకే అర్పణ చేస్తాము. భక్తుడు స్నాన,తిలక,గంధ ధారణాదులన్నీ తనదేహాన్ని దైవభావంతో చూడటమేనని గుర్తించాలి .కేవలం అలంకార ప్రాయంకాదు.

అలానే పారాయణ స్తోత్రపాఠాలతో పవిత్రమైన వాక్కును వ్యర్ధము తుచ్ఛము అయిన సంభాషణలతో ఎలా అపవిత్రం చేయడం ? ధ్యాన భగవల్లీలా చింతనలతో పవిత్రం చెసుకున్న మనస్సు ను రాగద్వేష,అసూయాది భావనలతో ఎలా భ్రష్టం చేసుకోగలం ? ఇట్టి పవిత్రభావన నిర్మిస్తేనే పూజలో మనం చెసే ఆతమసమర్పణ వాస్తవము,సార్ధకము అవుతుంది. దానిని సుప్రతిష్ఠం చేసుకోవడానికే ఇలాంటి బాహ్యాచారలను పెద్దలు ఏర్పరచారు. ఇలానిలుపుకుంటేనే మనం చేసే ఆలయదర్శనం గానీ,ఇంటిలోని పూజామందిరాలలోని నిత్యపూజలుగానీ నిజంగా పవిత్రము శక్తివంతము కాజాలవు.

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ఉపన్యాసం ....సాయిబాబా మాసపత్రికనుండి]


Read more...

చెడు మననలనొదలదు , మనమే దాన్నొదలాలి.

>> Tuesday, February 16, 2010

ఓగ్రామం లోకి ఓసాధువు వచ్చారు . ఆయనదగ్గరకెళ్ళి జనం ఆథ్యాత్మిక సహాయాన్ని పొందుతున్నారు. ఆ గ్రామం లో ఉన్న ఓ ఆథ్యాత్మిక సాధకునికి తన సాధనలో వస్తున్న ఆటంకాలను అధిగమిచలంటే ఇలాంటి సాధుమూర్తుల అవసరం ఉందికనుక తన అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు అయన దగ్గరకెళ్ళాడు. వెళ్ళి నమస్కరించాడు.

చిరునవ్వుతో ఆమహాత్ముడు ఏం,కావాలి నాయనా అని అడిగాడు.
మహత్మా ! నాకు భగవంతుని చేరాలనే కోర్కె ఎంతగానో ఉంది . కానీ నాకున్న చెడు అలవాట్లు నన్ను వదలటం లేదు.
నాసాధనకు ఇవి బహుఆటంకాలుగా మారి అడ్డుకుంటూన్నాయి . ఇవి నన్ను పట్టుకుని వదిలేలా లేవు. ఇవి నన్ను వదిలేమార్గమేదైనా చూపండి ,అని వేదనతో వేడుకున్నాడు.

ఇది వింటూన్న ఆమహాత్ముడు హఠాత్తుగా లేచి పరిగెత్తుకెళ్ళి ఓ చెట్టును వాటేసుకుని "వదులు .నన్నొదులు ,అయ్యో నన్నొదిలి పెట్టు ,ఎవరైనా దీనినుంచి పట్టునుంచి నన్ను కాపాడండి ఈచెట్టు నన్ను వదలటం లేదు, అని బిగ్గరగా అరవటం మొదలెట్టాడు.
చూస్తున్న ఈ సాధకునకు చిరాకనిపించింది.

అయ్యా! ఏమిటిది బహుచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చెట్టుమిమ్ము పట్టుకోలేదు. మీరే చెట్టును పట్టుకున్నారు. అది వదలేదేమిటి ? మీరేదాన్ని వదలి ఇవతలకు రావచ్చుకదా ! అని ప్రశ్నించాడు.
అవునుకదా ! మనలను చెడు అలవాట్లు వదలటమేమిటి ? మనమే వాటిని ఒదిలితే సరి. అని ఆయన చెట్టువదలి ఇవతలకొచ్చాడు.
ఇదే నాయనా మనిషి అమాయకత్వం . చెడు మనలను పట్టుకోదు .దానిని మనమే పట్టుకుని వదిలించండీ అని వేదనతో విలపిస్తుంటాము. మనమే వాటిని వదలివేస్తే సరిపోతుందనే విషయం ఏల గమనించము ? అని ప్రశ్నించాడు తిరిగి.

ఆమహాత్ముని బోధన అర్ధమైన ఆసాధకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ,తనలో లోపాలను ఎలా వదలాలో తెలిసి.

Read more...

ఆదివారం ప్రత్యేక పూజలు

>> Monday, February 15, 2010



ఆదివారం రోజు పీఠము లో గుంటూరు జిల్లా డ్వామా పిడి యుగంధర కుమార్ దంపతుల చే నిర్వహించబడిన పూజాకార్యక్రమాలు

ఇక్కడ చూడండి
http://picasaweb.google.co.in/durgeswara/UgandharKumar




Read more...

మృత్యుంజయ స్తోత్రం

>> Thursday, February 11, 2010


మృత్యుంజయ స్తోత్రం
=======================


హరిః ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ మార్కండేయ ఋషిః
అనుష్టుప్ఛంధః
శ్రీ మృత్యుంజయో దేవతా
గౌరీ శక్తిః
మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్థే
జపే వినియోగః

ధ్యానమ్
చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం |
ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం |
కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం |
కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే ||

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ - హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ - యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.



Read more...

మహాశివరాత్రి ఇలా జరుపుకోవాలి





మహాశివరాత్రి ఇలా జరుపుకోవాలి
=======================================


మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.

ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.

జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.

ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.

జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.

ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.

----------------------------------------------------------------------------------
ముందుగా నందీశ్వరదర్శనం చేయాలట
==============================================



మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే భక్తులు ముందు నందీశ్వరుడిని దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. శివభగవానుడు జ్ఞానదేవుడు. జ్ఞానికి మాత్రమే పరుల దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. విషరూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించనీయకుండా కంఠంలోనే అదిమిపెట్టి బంధించగల పరమేశ్వరుడే.. ఆదిశంకరుడు.

అలాంటి మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆలయాల్లో దర్శించుకునేవారు ముందు నందీశ్వరునికి ప్రణమిల్లి నమస్కరించాలని పురోహితులు అంటున్నారు. శివమందిరములో ప్రవేశిస్తుండగా, శివుని వాహనమైన నంది భగవానుడితో తమ కోరికలను వృషభుడి చెవిలో చెప్పుకుంటే.. శుభప్రదంగా పూర్తవుతాయని విశ్వాసం.

సాధారణంగా ఎద్దుకు బుద్ధి చాలా తక్కువగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ భగవంతుని లేదా భగవత్‌జ్ఞానాన్ని మస్కిష్కంపై మోసుకుని మానవుడు విశ్వంలో పురోగమించగలిగితే సామాన్య బుద్ధిగల ఎద్దు కూడా మహా మహా విద్వాంసులను కూడా ఓడించగలుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్చంచబడుతుందని పండితుల వాక్కు.

అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళే భక్తులు ముందు నందీశ్వరుడిని పూజించి, ఆయనకు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇంకా మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శివదేవుని పైన సదా వ్రేలాడుతుండే అభిషేక పాత్ర నుండి జరిగే అభిషేకం లేదా ఆ పాత్ర నుంచి వెలువడే జలబిందువులు సాతత్యాన్ని సూచిస్తాయి. ఇలా భగవంతునిపై మన అభిషేకం నిరంతరం కొనసాగాలనే పరమార్థాన్ని ఈ అభిషేక పాత్ర సూచిస్తోంది. అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే అభిషేకం, పూజల్లో పాలుపంచుకుని ఆ హరహర మహాదేవుని అనుగ్రహాన్ని పొందుదుముగాక..!



-----------------------------------------------------------------------------
లింగోద్భవకాలంలో చేయవలసిన పూజ
==============================================
పండుగలన్నింటిలోనూ అనంత పుణ్యప్రదమైనది "మహాశివరాత్రి". ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇలా మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశికి "మహాశివరాత్రి" అని పేరు. అట్టి మహిమాన్వితమైన రోజునే జ్యోతిర్లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

శివపద మణిమాలలో 'శి' అనగా శివుడనియు, 'వ' అనగా శక్తి స్వరూపమని చెప్పబడి ఉంది. ఈ శివరాత్రినాడు విశేషమైన కాలం "లింగోద్భవకాలం" ఆ రాత్రి 11.30 నుండి 01.00 గంటల వరకు అని పురోహితులు అంటున్నారు. ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివపంచాక్షరీని జపిస్తూ, ఉపవాస దీక్షతో "పార్థివ లింగానికి" పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోనూ, రెండో జాము నందు తేనెతోను అర్చిస్తే ఉమామహేశ్వరుల అనుగ్రహం పొందుతారని విశ్వాసం.

అలాగే మహాశివరాత్రి నాడు లక్షబిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని, మొగలిపూవులతో శివారాధన చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతికొరకై స్వీకరించి వారికి వెయ్యి అశ్వమేధ యాగాలను చేసినంత ఫలం లభించి, శివసాయుజ్యము లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అందుచేత ఇంతటి విశిష్టమైన "మహాశివరాత్రి" పర్వదినాన సమీప శివక్షేత్రాల్లో విశేషార్చనలు జరిపించి మనమందరం పునీతులౌదాం..

---------------------------------------------------------------

జ్యోతిర్లింగ రూపమేలదాల్చె శివుడు
========================================


దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలేనని" శివపురాణంలో శంకర భగవానుడు విష్ణుదేవునితో అన్నారు. "నిర్గుణుడనైన నేను సృష్టి స్థితి లయక సత్వ, గుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలను ధరిస్తుంటాను. మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే మట్టి.

అలాగే నురగలు, కెరటాలు, బుడగలు మొదలైన బుడగలన్నీ సముద్ర లక్షణాలు.. కానీ ఆ సముద్రం మాత్రం ఏకైకమైనదే.. ఇదే తరహాలో "వాస్తవానికి దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే". నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న నా రుద్రమూర్తీ ఇవన్నీ ఏకస్వరూపాలే. వీటిలో ఏ బేధం లేదని" విష్ణువుతో పరమేశ్వరుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి.

పూర్వం బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు.. ముగ్గురిలో ఎవరు గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగారు. వారిని గమనిస్తున్న పరమశివుడు వారిలో పుట్టిన అహంభావాన్ని అణగదొక్కి వారి ఇద్దరికీ చక్కని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పై విధంగా హితబోధ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వీరి అహంను తొలగించే దిశగా మాఘమాసం చతుర్దశి నాడు వారి ఇరువురులకు మధ్యంగా జ్యోతిర్లంగంగా రూపుదాల్చారు. దీంతో జ్యోతిర్లింగ ఆది, అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లగా, బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు. చివరకు కనుక్కోలేక ఓడిపోయి, పరమేశ్వరుని శరణువేడుకుంటారు.

అప్పుడు ఆ పరమ శివుడు అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు పండితులు చెబుతున్నారు. దీంతో బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి, పరమాత్మను విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే "మహాశివరాత్రి" అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.

అందుచేత సత్య, జ్ఞాన, అనంత స్వరూప గుణాతీతుడైన పరబ్రహ్మ.. శంకరదేవుణ్ణి మహాశిరాత్రి నాడు పూజిస్తే మోక్షమార్గం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన మహేశ్వరుడిని ప్రార్థించి.. ఆయన అనుగ్రహం పొందండి.
[భక్తులకోసం వెబ్ దునియా నుంచి సేకరించబడినది]


Read more...

బ్లాగ్ లోక హిరణ్యకశిపునింట ఓ భక్త ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు

>> Wednesday, February 10, 2010


విష్ణుని మహిమలను ,ఆయన లీలలను వర్ణించనెవరి తరముకాదు . ఏంటో ఒక్కోసారి లోక కళ్యాణకరమైన ఆయన లీల అసలర్ధంకాదు , కానీ తెలుసుకున్నతరువాత ఆశ్చర్యపోతాము . వేడిన వారికి దరశనమీయవు !వలదని నిన్ను వారించువారిని వదలక వెంట తిరిగెదవయ్యా ! అంటూ భక్తులు పాడుకుంటూనే ఉన్నారు యుగయుగాలుగామహాభక్తులు . ఎవరు ద్వేషిస్తారో వాళ్లచేతనే పలుమార్లు తన నామాన్నుచ్ఛరింపజేసే చిత్రమైన లీలలు చేస్తాడాయన.

అప్పుడెప్పుడొ హిరణ్యకశిపుని నృసింహమూర్తిగా సంహరించినప్పుడు ఆదుష్టుని రక్తం విశ్వాంతరాలకు ఎగజిమ్మగా ఆరక్తపు తుంపరలు మెల్లగా భూమిపైవాలుతూ రాక్షసాంశలుగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాయి ,ప్రతియుగాన,ప్రతి తరాన . మానవ జన్మ తీసుకున్నా తమలో ఇంకి కరుడుగట్టిన విష్ణుద్వేషం మరచిపోకుండా ఆజీవి ,లోకాన విష్ణుద్వేషిగా పాతవాసనలను ప్రదర్శిస్తూనే ఉంటుంది .

ఇలా ఒకానొక రక్తబిందువు ఈయుగంలో ,ఈతరం లోనూ తెలుగుగడ్డమీద ఓ బ్లాగ్లోక మేధావిగా జన్మించినది. విద్యాబుద్దులు నేర్చి అన్నివిషయాలను చదివే పరిజ్ఞానం సంతరించు కున్నాడు. . తన పరిజ్ఞానాన్నంతా జనంలో విష్ణువుపైన ద్వేషం కలిగేలా చేయగలగటానికి , ఆపేరు చెబితేనే మండిపడే తన పూర్వలక్షణాన్ని అనుసరించి ప్రదర్శిస్తున్నాడు. .రాక్షసులు కూడా అద్భుత పాండిత్యాన్ని సంపాదించటం లోను సాధన చేయటం లోనూ ఏమాత్రం తక్కువవారుకాదు. మొండిపట్టుదల తీవ్ర తామసిక లక్షణాలతో అనుకున్నది సాధించగలరు. కాకుంటే ఆ జ్ఞానాన్నంతా భగవంతుని పట్ల ద్వేషంతో ఆత్మ వినాశనానికి ఉపయోగించుకుంటారు . పరమదయాళువైన ఆస్వామి తన పూర్వ భక్తుడు ఈ జన్మలోనూ పతనం కావటం సహించక వారి క్షేమం కోసం మరలా మరలా వారిచేత తన నామాన్ని స్మరింపజేసే రీతిలో తనలీలలు సాగిస్తాడు.


ఇక్కడ ఆ హిరణ్యకశపాంశ తో జన్మించిన ఆజీవి తన రచనలలో. వాదనలలో ప్రస్ఫుటంగా విష్ణుద్వేషం కన్పిస్తూ ఉండటం నాకనుమానం కలిగించింది .ఎందుకు ఈ జీవి ఇంతగా భగవద్వేషాన్ని ప్రదర్శిస్తున్నడా? అని ఎంతాలోచించినా గాని ,ప్రశ్నించి చూసినా గానీ సమాధానం రాలేదు . ఎందుకో హఠాత్తుగా ఈ విషయం స్ఫురణకు వచ్చి ఆలోచించాను . ఓసారి ఈ హిరణ్యకశిపుని ఇంట ఉన్న భక్తప్రహ్లాదుని ఫోటొ చూడటం తటస్థించింది . వాని ముఖం లో తేజస్సు ,భగవద్భక్తుని లక్షణాలను చూడగానే పోల్చుకున్నాను . సందేహం లేదు .ఈయనచే భగవన్నామ స్మరణ పలుమార్లు చేపించడానికే ఈయనకు జన్మించిన ప్రహ్లాదాంశమని అనుకోవచ్చు. ఈయనకు సహచర్యం చేస్తున్న ఆసాధ్వి నాటి లీలావతి అంతటి వందనీయ మాతృమూర్తేనని నాభావం .

ఇక ఇక్కడనుంచి మనం శ్రీహరి లీలా విలాసాన్ని చూడవచ్చు . ఈ హిరణ్యకశిపుడు పైకి కన్పించినట్లుగా నాస్తికుడేమీకాదు . నాస్తికత్వం ఒక ముసుగుమాత్రమే . లోపల చూస్తే ఆయన కూడా ఏదో రూపం మీద నమ్మకమున్నవాడే . కానీ సర్వాంతర్యామియగు హరి నామాన్ని సహించలేని ఈర్ష్యాద్వేషాలు కరుడుగట్టి ఉన్నాయి మనసున . కానీ కరుణాంతరంగుడైన శ్రీహరి లీలలకు ఇదే వేదికవనుంది.

ఇప్పుడు పెరుగుతున్నా బాలప్రహ్లాదుడు " హరి నీవే ...సర్వాత్మకుడవు " అనిపాడకా మానడు .అదివిని ఈయన మనస్సు అగ్నిపర్వతంలా కుతకుతలాడక మానదు .అదొక హింస ......పాపం. విష్ణువొక చిల్లరదేవుడు ... ఎవరా గోవిందుడు అని గర్జించి ప్రశ్నించిన నోటితోనే ., ముకుందా....ముకుందా .కృష్ణా ,,ముకుందా ...ముకుందా అని మురిపెంగా బిడ్డను పిలచి లాలించక తప్పని స్థితి కల్పించాడు స్వామి . ఎంతకాదనుకున్నా అంతరంగం లో ప్రేమతరంగాలు మిళితమై భగవన్నామం ప్రేమ పూరితంగా జపించబడుతుంది . ఇది తెలిస్తే ఇంకా నరకం . ఛీ ..ఛీ దానవ వైరి ఆ హరి నామం నేనునా నోట పలకటమా థిక్.... అని ఇంతెత్తెగిరినా సరే ,తప్పదు. నాన్నా !అని ఆబుడతడు పిలవగనే నాయనా !అని హరినామంతో వాడిని పిలవక తప్పనిస్థితి కల్పించాడు లీలానాటకసూత్రధారి.

పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ భక్తి ప్రవర్ధమానమై మన బాల ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తమునిగా ఎదుగుతున్నప్పుడు అది సహించలేక ,నిరోధించలేక ప్రేమద్వేషాలనేవిరుధ్ధభావలమధ్య నలుగుతూ విష్ణుద్వేషం యొక్క ఫలితం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అభినవ హిరణ్యకశిపునకు . ఎలాగోలా వానిని విష్ణువుపట్ల విరక్తునిగా మార్చాలని మార్చలేకపోయినా నాస్తికునిగానైనా మార్చి భగవ్ద్భావానికి దూరం చేయటం కోసం ,,ఒరే ద్వుడులేడు ..గీవుడు లేడు ,అని మన రాక్షస చక్రవర్తి అనగానే ..అయ్యో భగవంతుడు లేకున్న ఇదంతా ఎలాసృష్టించబడినది తండ్రీ అని మన బాలభక్తుడంటాడు . అయితే ఏడిరా ! చూపించు ? అని ప్రశ్నించగానే ..... ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు .... అంటూ ప్రహ్లాదుడు వివరణ ఇస్తుంటే దేహం కంపిస్తూ హృదయం రగిలిపోతూ ... అబ్బా ! ఆదృశ్యాన్ని ఊహించికుంటుంటే చాలు మనసు పులకించి పోతోందికదా ! అది అంతే .నారాయణ నీలీలా నవరసభరితం అంటూ మనం పాడుకుంటూ వేచిచూద్దాము .
ఇంకా హిరణ్యాక్ష ,రక్తబీజ ,మహిష,మహాకాయ, తాటక ,సుబాహు మారీచాది రాక్షసయూధముఖ్యుల అంశలుకూడా ఇక్కడ మనకు తటస్థిస్తున్నాయి . మరక్కడేమి మాయచేశాడో మహామాయకు అధినాయకుడు, తెలియదుకదా మనకు.

యుగయుగాన జరిగే విష్ణుమాయను ఊహించతరమా ! మనబోంట్లకు


Read more...

ఎంత దౌర్భాగ్యులు మన నాయకులు




ఎంత దౌర్భాగ్యులు మన నాయకులు

అంతర్జాలంలో నాకందిన మెయిల్ ఇది




Please see the below two Incidents:

Forward this mail to every Indian, let every body know that these are our leaders..... .
Shameless people...... ... Fit for Nothing.....
Have a look at two of the leaders we have chosen to rule us.... sitting and having a leisure time when our
National Anthem is being played......





2.
Disrespect - WHO THE HELL IS SHE ??









Hello Everyone,
These pictures I am sending you all shows the gross disrespect and insult to the Indian National flag by this so called 'spiritual leader' and self proclaimed 'GOD' Mataji Nirmala Devi. This disrespect to our country's flag shows that she has definitely no respect or love for the country that gave her so much and her husband who was an IAS officer and chief of the SCI (he is seated next to her in the pics). Such a shame..
I do urge and plead with all Indians who deeply love their country to
forward the photos to as many people as possible so that it does catch the eye of someone higher up in the Indian Govt who can really take someaction against this cult.


Pls dont keep this mail in your mail box as I feel keeping this in mail box itself is an insult to our country.

All Indians (Please send this to everyone in your chain)


Read more...

సైన్యం లో నా ప్రవేశానికి సైంధవుడు ,ఆ మిలటరీ డాక్టర్ ..

>> Tuesday, February 9, 2010

చిన్నప్పటినుంచి నాకు మిలటరీ వాళ్ళంటే విపరీతమైన అభిమానం . చదువు చెప్పిన ఉపాధ్యాయులు ,కావచ్చు,చదివిన కథలు కావచ్చు.చూసిన సినిమాలలో సైనికుని పాత్రలు కావచ్చు. మిలటరీ వాళ్లను చూస్తే నా అభిమాన హీరోని చూసినంత ఆనందం. ఎప్పటికైనా నేను కూడా ఆలివ్గ్రీన్ రంగు డ్రస్ లో మెషిన్ గన్ లు చేతబట్టి మంచు పర్వతాల్లో మాతృభూమి రక్షణకై పోరాడాలనే లక్ష్యం పెరిగిపెరిగి అలా పెద్దదైపోయింది . వైద్యం మీద ఉన్న ఇష్టం కూడా మిలటరీలో చేరితే మిలట్రీ డాక్టర్నవ్వచ్చన్న కోరిక కలిసి ఇంటర్ లో బైపీసీ తీసుకోవటానికి కారణమయ్యింది.

కోరిక గుర్రాలెక్కితే రాత గాడిదలు కాస్తుందని ,సరైన గైడెన్స్ లేక ,సమాచారం ఈరోజులలోలాగా అందుబాటులో లేక మొత్తానికి మరలా బిఏ లో చేరాల్సి వచ్చింది. మిలటరీ చేరాలనే కోరికమాత్రం వదలలేదు. డిగ్రీ చదువు తుండగానే వినుకొండలో నిర్వహించిన మిలటరీ సెలక్షన్ కాంప్ లో పాల్గొని చెక్కవాగు కాడనుంచి శివయ్యస్థూపందాకా రెండుమైళ్ళు పైగా డ్రాయర్లమీద పరిగెత్తించారేగాని పంచదార నోటపోసుకునే అవకాశం కలిగించలేదు.

పట్టువదలని విక్రమార్కునిలా గుంటూరు రిక్ర్యూట్ మెంట్ ఆఫీస్ కెళ్ళి అక్కడ బోర్డుమీదవున్న నమూనాలో మద్రాస్ ఆఫీస్ కు దరఖాస్తు పంపి ,వచ్చిన కాల్ లెటర్తో డిగ్రీ పూర్తవగానే మరోసారి గుంటూరులో సెలక్షన్ కెళ్లాను. పొద్దుటే లోనికి పిలచి వచ్చినవాళ్లందరినీ నాలుగు పెద్దలైన్లలో కూచోబెట్టారు అర్ధనగ్నంగా . పొద్దుటనుంచి మాకెదురుగా ఉన్న టేబుళ్లదగ్గర ఎవరెవరో ఆఫీసర్లు వస్తున్నారు పోతున్నారు . లోటాలు లోటాలు టీతాగుతున్నారేగాని మధ్యాహ్నం దాకా మంచినీళ్ళు తాగుతారేమోనని కూడా దయతలచి వదలలేదు. ఈ మాత్రం ఓపిక లేకుంటే రేపు బంకర్లలో రోజులతరబడి ఎలా పొంచి ఉండగలమనుకుని సర్ది చెప్పుకున్నాము .
తీరిగ్గా సర్టిఫికెట్ వెరిఫికేషన్లు అయ్యాక ఫిజికల్ చేస్తున్నారు . నాపక్కలైన్లో చూద్దునుకదా మవూరి .........రెడ్డి ఉన్నాడు . వాళ్ళు నరసరావుపేటలో ఉండేవారు అప్పట్లో . నన్నుచూసి ఏం బావా ! ఎప్పుడొచ్చావని పలకరించాడు. తాను ఇంతకు ముందు ఒకసారి సెలక్షన్ కు వచ్చానని ,కాని ఇక్కడా నిజాయితీగా జరగటం లేదని అందుకనే రాత్రి బ్రోకర్ ద్వారా ఎనిమిది వేలు చెల్లించామని చెప్పాడు . సరే కానివ్వు ఏంజరుగుతుందో అది జరుగుద్ది అని సర్ది చెప్పుకున్నాను .రాత్రి ఆరుగంటలకు ఓ పెద్దహాలులోఫిజికల్ టెస్ట్ లో సెలక్టయిన మా అందరినీ దిగంబరంగా నిలబెట్టి మిలటరీ డాక్టర్ గారు నఖశిఖ పర్యంతం పరీక్షిస్తున్నారు .ఆ ఆంకం కూడా ముగిశాక ఒక్కొక్కరిని డాక్టర్ గారి గదిలోకి పంపి కళ్లు ,ముక్కు చెవులు పరీక్షిస్తున్నారు. దాదాపు అన్ని టెస్టులయిపోయాయి గనుక మరుసటిరోజు ట్రైనెక్కించేసి ఇటునుండి ఇటే ట్రైనింగ్ కాంప్ కుపంపుతారని ఆనందం తో గాల్లో తేలిపోతున్నాను . అన్నీ పరిక్షించిన ఆడాక్టర్ చెవిలో మైక్రోస్కోప్ లాంటి పరికరం పెట్టి చూసి " చెవిలో గుబిలి ఉంది శుభ్రపరచుకుని మరొకసారి సెలక్షన్ కు రాపో " అని చెప్పాడు.
నా ఆశలసౌధం కూలిపోయింది .సార్ ..ఇప్పుడే శుభ్రం చేసుకుంటాను సార్ అని బతిమిలాడినా నిర్ధాక్ష్యణ్యంగా బయటకు పంపాడా దుర్మార్గుడు . ఎన్నిజన్మల నుంచి శతృత్వమోగాని ఇప్పుడు తీర్చుకున్నాడు ,అని తిట్టుకుంటూ ఈదేశం లో అవినీతి ,లంచగొండితనం నశించాలని మనస్సులో శపించుకుంటూ కళ్లవెంట నీళ్ళు కుక్కుకుంటూ వెనుక్కొచ్చాను.

ఆశచావక తరువాత మరోసారి రిక్రూట్మెంట్ ఆఫీస్ తలుపుతట్టాను. ఈసారి వాళ్లకు మరీదయగలిగింది కాబోలు యథాప్రకారం డ్రాయర్లమీద నాలుగింటిదాకా కూచోబెట్టి చావుకబురు చల్లగా చెప్పారు ,సెలక్షన్ వాయిదావెస్తున్నామని . మాలో ఉద్యమాలు నడిపిన విద్యార్ధి నాయకులున్నారు కాబోలు ఆవిషయం ఇందాకే చెప్పాలి.నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు వీళ్ళు అని మాటలతో మాలో అవేశాన్ని రగిలిస్తూ వాచ్ మెన్ లు బయటకు నెడుతుండగా గేట్ దాటి వచ్చాము . గేట్ లోపల వాళ్ళు బయటమేము . ఉద్యమస్పూర్తి బాగా తలకెక్కి సెలక్షణ్ లేదంటె పొద్దుటే చెప్పవచ్చుకదా ఇదేంటి ?మీఇష్టమేనా ? అని వాదనలు పెద్దగా అరుస్తున్నాము . ఈసందట్లో నేను గేట్ ముందుకు నెట్టబడ్డానని గాని లోపల అధికారులకు ఈగొడవకు నాయకత్వం వహిస్తున్నది నేనే ననే నమ్మకం ముదురుతున్నదని గ్రహించలేకపోయాను . ఇంతలో లోపలనుంచి ఈ పై అఫీసర్ నాకేసి చూపుతూ వాణ్ణి లోపలకు లాక్కురమ్మని వాళ్ల వాచ్ మెన్ కు హిందీలో ఆర్డర్ వెయ్యటం చూసి ఏంచేద్దామబ్బా అని వెనుదిరిగి చూద్దునుగదా !మన ఉద్యమనాయకులంతా పలాయనం చిత్తగిస్తున్నారు . వాడు రాగానే నాచొక్కాపట్తుకున్నాడు . లోపలకెళ్లామంటె ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అది మిలటరీ కాంప్ కార్యాలయం కనుక పోలీసుల కేసుకూడా ఉండదు. బుద్ది శరవేగంతో పనిచేసింది .అతన్ని విదిలించికొట్టి వేగంగా వెనుక్కుతిరగగానే ఖచ్చితంగా అదేశమయంలో సిటీబస్ ఆ ఆఫీస్ ను ఆనుకునే మలుపులో కి రావటం ,నేను పరిగెత్తెళ్ళి వెళుతున్న బస్ లోకి జంప్ చేయటం ఆ సాహసం వీరత్వం,.తలచుకుంటే ఇప్పటికీ నవ్వాగదు.
అలా నా మిలటరీ ప్రవేశానికి సైంధవునిలా ఆరోజు ఆ డాక్టర్ అడ్డుపడ్డాడు.

{ ఏమో ! ఆజగన్మాత ఈ లీల జరిపిందేమో అనిపిస్తుందిప్పుడు}





Read more...

మంచు మృత్యువును కౌగిలించుకున్న వెర్రిబాగులఅన్నయ్యలారా .జైహింద్


మేమేమో దుప్పట్లో వెచ్చగాముడుక్కుని మరగుజ్జులమై స్వార్ధం తో ఇక్కడ
మీరేమో మంచుమృత్యువుని రొమ్మువిరుచుకుని ఎదిరించి త్యాగంతో అమరులై అక్కడ.
మాకోసం మీరు అన్నీ మరచిపోయారు
మీకుటుంబ ఏమవుతుందని
సుఖపడటానికి సంపదలెలా పోగేసుకోవాలని
సరదాగా సినిమాలు షికార్లు కొట్టాలని
వాదనా బలాలతో ప్రతిభా ప్రదర్శనాలెలా చేయాలని
వృధాగా వాచా నీతులుబోధిస్తూ
వివిధ సిధ్ధాంత రాద్ధాంతాల కండూతులను ప్రదర్శించాలనే విషయాలన్నీ
మరచిపోయారు.

సోదరులారా !
మేమూ మరచిపోతాము
మిమ్మల్ని
పేపర్ చదువుతూ తాగే ఈకాఫీ కప్పు ఖాళీ అయ్యాక
సాయంత్రం పసందయిన టీవీ కార్యక్రమాలు మొదలయి
మీ త్యాగానికి టివీ వాళ్ళిచ్చిన చిన్న వార్త
మామెదల్లో ఎక్కడో మరుగనపడిపోయి
మా భోగాలు మమ్మావహించి మెదళ్లు మొద్దుబరచినతరువాత .


అసలింతకీ ! ఎందుకిలా వెళ్ళిపోతారు మీరు . వెర్రిబాగులోల్లారా
ఆమాత్రం జీతం ఇక్కడ ఏపని చేసుకుంటేరాదు.
తిక్కలోల్లాలా ! ఇక్కడ చూడండి
పబ్బులు ,గబ్బులు.క్రికెట్లు , కంప్యూటర్లు
రాజకీయాలు ,రాష్ట్రవిభజనలు
బంద్ లు ,బస్సులు తగలెట్తుకోటాలు
ఎంత సరదాగా
ఎంత ఆనందంగా బ్రతుకు తున్నమో !
ఇక్కడుండక అక్కడకెందుకెళ్ళారు ?

.............................................

ఏంటో ? అన్నయ్యా చిన్నప్పుడు మీగూర్చి చదివి
మాతృభూమికోసం ప్రాణాలొదలే మీ అదృష్టానికి పొంగిపోయి
కనీసం మీకోసం టీ అందించే అదృష్టమన్నా పట్టాలని
ప్రయత్నించి .. ప్రాప్తం లేక
ఇలా మిగిలినా
మీ రు నాసోదరులని మరువలేక
మనసు కరగి కన్నీరై కారిపోతోంది
............. నవ్వకు సోదరా ! ఆదివ్య ధామంనుంచి నన్ను చూసి
వీడు వృధాప్రగల్భాలు పలుకుతున్న ఉత్తరకుమారుడా ! అని


Read more...

భాయి బుడ్డా

>> Monday, February 8, 2010


గురునానక్ గారి కాలము నాటి విషయము . ఆయన అనుచరులు ప్రతిదినము ఆయనముందు కూర్చుని భక్తిగీతములు పాడెడివారు. వారితోపాటు ఒకబాలుడుకూడా వచ్చి వారందరి వెనుక వినమ్రుడైకూర్చుని వింటుండేవాడు . ఈ విషయమును నానక్ గారు కనిపెట్టారు. ఆయన ఆబాలునివైపు చిరునవ్వుతో చూస్తూ "నాయనా ! ఇప్పుడు నీవు నిద్రించవలసిన సమయము . వీరందరితో ఇంత ఉదయముననే ఏల వచ్చుచున్నావు? ఆటలయందు ఆసక్తి చూపవలసిన వయస్సునీది. ఈ భక్తి పాటలతో నీకేమి పని ? అని అడిగెను.
గురుదేవునివైపు గౌరవంగా చూస్తూ ఆబాలుడు " అయ్యా ! ఒకనాడు మాతల్లిగారు కొన్ని కట్టెలు తెచ్చి పొయ్యిలో వేయుము అని ఆజ్ఞాపించారు. నేను ఆలాగుననఏ చేసి చూచుచుంటిని .వాటిలో సన్నగా ,చిన్నగా ఉన్న కట్టెముక్కలు త్వరత్వరగా మండి భస్మమైపోయినవి. లావుగా పొడవుగావున్నవి ఆలస్యం గా భస్మమయినవి. వాటిని చూస్తూ నాకొక ఆలోచనతో చావు భయము వచ్చినది. నేను చిన్నవాడనే ,నాకంటే పెద్దవారెందరో వున్నారు. వారికంటే ముందుగా నాకే చావు వచ్చునేమో ! నని తోచినది .కావుననే ఈ సమయము వృధాకాకుండా ఎల్లవేలలా మీ చెంతనే ఉండాలనిపించినది. అందుకే అందరితో పాటు కలసి ప్రార్ధనకొచ్చుచున్నాను అని పలికాడు.

బాలుడు చెప్పినది విని నానక్ గురుదేవులు చాలా సంతోషించారు . ఆత్మోన్నతికి అతనికి గల పట్టుదలను మెచ్చుకునెను. బిడ్డా! వయస్సులో చిన్నవాడవైనా వివేకంలో ,జ్ఞానం లో వృద్ధుడవు .అనిదీవించాడు. నాటినుండి ఆపిల్లవాడు భాయీ బుడ్డా అని పేరొందాడు.

ఆతర్వాత కాలపు శిఖ్ఖు గురువులు సైతం అతనికి గౌరవమర్యాదలను ఇచ్చేవారు . గురు అంగదులు,అమరదాసు,రామదాసు ,గురు అర్జునదేవులు ,గురుగోబిందసింగు లకు గురు పీఠాధిపత్యము భాయీ బుడ్డా స్వయంగా తనచేతులతో జరిపాడు.

Read more...

ఓడమీద కాకి లాంటివాడు పరమాత్మ ప్రేమికుడు


ఓ సాధువు గొప్ప దైవభక్తుడు । ఆయనొకనాడు తనమనస్సులో ఇలా అనుకున్నాడు ।"నేనే భగవంతునకు ప్రీతిపాత్రుడను।భగవంతుడు నాయెడల ఎంతో సంతోషం గా ఉన్నాడు । నిత్యం పూజ జపధ్యానాదులతో ఆయనను సేవించే నాకన్న గొ్ప్ప భక్తుడు వేరొకరుండుట అసాధ్యము . " అతడీవిధం గా తలపోసి భగవంతుని ఇలా ప్రార్ధించాడు / హే ! పరమాత్మా ! నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు లేక ఎక్కువగా ధ్యానిమ్చేవారు వేరొకరులేరుకదా ?ఉంటే వారిని నాకు చూపించు " దానికి భవంతుడిలా పలికాడు .ఓయీ ! నీకన్న నన్ను ఎక్కువగా ప్రేమించువారీ సృష్టిలో చాలామంది వున్నారు. " అప్పుడతను అయితే ఒక్కరిని చూపండి చాలు అని రోషంగా అడిగాడు. మనుష్యులెందుకు నీకొక పక్షిని చూపిస్తాను అదిగో ఆచెట్టుమీద కూచున్నదే అదే . దాని వద్దకు వెళ్ళు అని భగవంతుని వాణి వినిపించింది. అపుడాసాధువు నాకు పక్షిభాషరాదుకదా అని వేడుకొనగా అతనికి ఆపక్షిభాష అర్ధమయ్యే వరమీయబడినది.

భగవంతుడు చెప్పినప్రకారం సాధువు చెట్టు వద్దకు చేరుకుని ఆచెట్టుపై నున్న ఆపక్షిని సంబోధిస్తూ పరమాత్మ గూర్చి ఏదైనా చెప్పమని అడిగాడు . దానికాపక్షి "ఓయీ నాకు మాటాడటానికి సమయము , రవ్వంత తీరిక లేదు. ఐనా నా ప్రియతమ ప్రభువు పంపాడుగనుక నీతో ఈమాత్రం మాటాడగలుగుతున్నాను అన్నది. అదివిని అతడాశ్చర్యం తో నీకు తీరిక లేదంటున్నావు .ఇంతకూ నీవుచేసే పని ఏమిటి ? అని అడిగాడు. దానికాపక్షి ఇలా జవాబు చెప్పింది. నేనహోరాత్రములు ఆపరమపురుషుడైన శ్రీహరి ని ధ్యానిస్తున్నాను. ఐనా నన్నొక విషయము బాధిస్తున్నది " ఏమిటాబాధ సాధువడిగాడు . దానికా పక్షి " ఇక్కడకు కొంచెం దూరం లో ఒక సెలయేరున్నది .అక్కడకు వెళ్ళి నీరుత్రాగవలసి వస్తున్నది ............ "ఆ సెలయేరెంత దూరం లో ఉంది ? అడిగాడు సాధువు .
"అదిగో ఆఎదురుగా కనిపిస్తున్నదే గోధుమచేను .ఆపొలమునకావలి వైపున ఉన్నది".
అదివిని సాధువు ఆశ్చర్యపోయి అది ఏమంత దూరం కాదే ! దగ్గరేకదా అన్నాడు.

" ఓయీ నీకేమి చెప్పను ? నాకీ కాస్తదూరం వెళ్లివచ్చుట బాధాకరముగా నున్నది. ఎందుకందువా ! నేను నీటికోసం ఆకాస్తంత దూరం ఎగురునప్పుడు పరమాత్మ ధ్యానాన్ని మానుకోవలసి వస్తున్నది . నా ప్రియతముడైన హరి నామాన్ని క్షణం సేపు వదలాలన్నా నాకు భరింపరానిదవుతున్నది.

దానికాసాధువు విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడాపక్షితో " నేను నీకేమన్నా సాయం చేయగలనా అని అడిగాడు. అప్పుడాపక్షి మరేం లేదు ఆసెలయేటిని నావద్దకు తెచ్చి పెట్టగలవా ? అని అడిగినది.
సెలయేరును అలా తీసుకురావటం సాధ్యపడని విషయం అన్నాడా సాధువు.
అయితే మీనుంచి మరే సాయ మక్కరలేదు అని పక్షి భగవధ్యానం లో మునిగిపోయింది.
సాధువు తలవంచుకుని వెళ్ళిపోయాడు .

ఈ కథలోసారాంశమేమనగా . పరమాత్మను కాంక్షించేవారు ఆయనను ఎంతగాప్రేమిస్తారంటే ఒక్కక్షణం కూడా ఆయన నామాన్ని వదలి పెట్టి ఉండలేరు. ఆయన ధ్యానానికి దూరమైతే బ్రతకలేమన్న స్థితిలో ఉంటారు.
సముద్రం లో ప్రయాణిస్తున్న ఓడపైనగల కాకి ఆఓడను వదలక ఎల్లప్పుడూ దానిపనే కూర్చుని ఉంటుంది. అది కాసేపు గాలిలోకెగిరినా మరలా వచ్చి ఓడపైనే వాలుతుంది. పైన ఆకాశం క్రింద సముద్రం ఉండగా దానికి ఓడతప్ప మరో ఆశ్రయం కనిపించదు. పరమాత్మ ప్రేమికులు కూడా ఆకాకి ఏవిధంగానైతే ఓడను వదలదో అదేవిధంగా పరమాత్మను ధ్యానించటం ఎట్తి పరిస్థితులలోనూ మానుకోరు.





Read more...

మహాదేవుని అర్చనకు మీ గోత్రనామాలు పంపండి

>> Saturday, February 6, 2010

మహాదేవుని కరుణ పొంగిపొరలే మహిమాన్విత పర్వం మహాశివరాత్రి. శంభో ........మహాదేవ అని చెంబుడు నీళ్లుపోస్తే చాలు పులకరించి ఉబ్బిపోయి వరాలు కురిపించే భోళాశంకరుడాయన. ఆపర్వదినాన పీఠములో పార్వతీ పతికి ప్రీతిపాత్రంగా రుద్రాభిషేకములు ,ఏకాహంగా శివనామ గానం , రాత్రికి జ్యోతిర్లింగార్చన జరుప బడుతున్నాయి . భక్తులు గోత్రనామాలను పంపిస్తే వారి తరపున కూడా సంకల్పం చెప్పి అభిషేకాదులను చేయటం జరుగుతుంది . అమ్మవారి సన్నిధిలో ఆనందరూపుడై ఉండేస్వామి తానిక్కడ వున్నానని నిదర్శనం చూపుతూ గతం లో జ్యోతిర్లింగార్చనలో ప్రమిదల నుండి స్వామి మూలవిరాట్ వైపుకు కాంతి ధారలు సాగుతున్న ఈ దృశ్యాన్ని చూడండి .
నమ్మి స్వామినర్చించండి సకల శుభాలు పొందండి. మీగోత్రనామాలను వివరంగా మెయిల్ చేయండి .




Read more...

ఫకీరు హృదయము

మహమ్మదీయ పవిత్ర గ్రంథము తజ్ కరాత్_ఉల్-ఔలియాలో ఒక కథ ఉంది.
ఒకప్పుడొక ఫకీరు సుదూర యాత్ర చేస్తున్నాడు. దారిలో తినుటకు కావలసిన రొట్టెలను మూటగట్టుకుని ప్రయాణిస్తున్నాడు.
మొదటి రోజు సాయంత్రమునకొక మసీదు చెరుకుని విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటిరోజు పెందరాలే మేల్కొని ఎండ ఎక్కువకాకముందే చాలాదూరము పోవలెనని వడివడిగా నదచి దాదాపు పది మైళ్ల దూరం వెళ్ళాడు. ఎండపెరగటం అలుపురావటం వలన కొద్దిగా రొట్టెలను తిని ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు.మూటవిప్పి చూస్తే ఏముంది ? రొట్టెల నిండా చీమలు పట్టుకుని ఉన్నాయి.
అయితే ఆయన సామాన్యునిలా నారొట్టెలన్నీ పాడుచేసాయి చీమలు అని ఆలో చించక "అయ్యో ! ఇవి మసీదులోని చీమలు. రాత్రి రొట్టెకోసం వచ్చి మూటలో ఉన్నాయి . వీటిని ఇంతదూరం తెస్తిని. పాపం ఇవి తమ ఇంటికి దూరమైనవి. ఇక్కడ వదలివేస్తే అవి తమ పిల్లలను బంధువులను తలిదండ్రులను గానక దు:ఖపడును." అని విచార పడ్డాడు.
వెంటనే ఆయన తిరుగు ప్రయాణమై అంతదూరం మరలా నడచి వచ్చి మసిదులో వాటిని విడిచి సంతృప్తి చెందాడు.
పరమార్ధము మనకు దయను కరుణను మాత్రమే నేర్పుతుంది. హింసను కాదు.



Read more...

మనసెందుకు కోరుకోదు? ! మహాదేవుని లోకము

>> Friday, February 5, 2010



ఉద్ధవుడు శ్రీకృష్ణభక్తుడు. శిష్యుడుకూడా . ఒకనాడయన శ్రీకృష్ణపరమాత్మనిలా అడిగాడు. దేవా ! మీరు సర్వశక్తి సంపన్నులు .తృటిలో ఏకార్యమునైనా చేయగలుగుదురు. నాచుట్టూ గల ఈ ప్రపంచం లో జనులందరును,ప్రాణులందరును అనేకమైన దు:ఖములకు,బాధలకు గురిఅగుచున్నారు. ఈ సమస్త ప్రాణులను మీ నిజధామమునకు ఎందుకు తీసుకుని పోరు ? మీరు కనికరించిన వీరందరు అచట శాస్వతానందమును పొందుదురుగదా ! దయాళువైన మీరు ఏల ఉపేక్షచేయుచున్నారు ? అని ప్రశ్నించెను. అదివిని శ్రీకృష్ణులు మందహాసము చేస్తూ "ఉద్ధవా! నేనలాగే కోరుకుందును కానీ వారు వచ్చుటకు ఒప్పుకోరు.

అదేమిటి ! దేవా ! మీరన్నది నమ్మలేనిది. అందరూ ఒప్పుకుంటారని నానమ్మకము. అని ఉద్ధవుడనెను. సరే ! అయితే అన్నింటికంటే నికృష్టమైనది పంది జన్మ . నాతో వచ్చుటకది ఒప్పుకునునేమో అడిగిచూడు అన్నాడు ఆలీలానాటక సూత్రధారి. ఉద్దవునికి నిజమే అడిగిచూడాలనిపించినది.

" ఈభూమికంటే ఏంతో ప్రశాంతము ఆనందముగానుండెడి పరంధామమునకు నిన్నుగొని పోయెదను వచ్చెదవా? అని అడిగాడు ఉద్దవుడు పందిని.

అది ఉధ్ధవుని శంకిస్తూచూసింది. "నేనిచ్చట తినునట్టి మలము మొదలగు ఆహారములచ్చట దొరుకునా ? అడిగింది.

ఛీ ! లేదు. నీకు తినుటకు అచట దివ్యమైన అమృతము దొరుకుతుంది . అత్యంత రుచికరంగా ఉంటుంది అని ఉద్దవుడన్నాడు.

" నాకిది అనుమానం గా ఉన్నది . ఇచట లభించెడి మలము కన్న రుచిగల పదార్ధమింకేదైనా ఉండునా? ఎన్నటికీ ఉండదు. ఫో ! ఫో ! నాకు నీ పరమాత్మ వద్దు ఆధామము వద్దు. నీ అమృతము నాకక్కరలేదు. నాకు ఇక్కడ ఉండటం రుచికరమైన ఈ ఆహారమే ఇష్టము . " అని పంది తన నిర్ణయమును తెలిపెను. ఉద్ధవుడు మారు మాటాడక వెడలి పోయెను.

అనగా ప్రాపంచిక కోర్కెలను వదలి భక్తిమార్గములో ప్రవేశించాలంటే భౌతికసుఖాలకు అలవాటుపడ్డ మనసుకు చాలాకష్టము గా ఉంటుంది .అందువల్ల వాటిని వదలాలంటె ఒప్పుకోదు.


Read more...

అన్నీ ఇచ్చే దేవుడేడి?

>> Thursday, February 4, 2010


అన్నీ ఇచ్చే దేవుడేడి?

రోజుకొక దేవుడిని పూజించలేక నానా అవస్థలు పడుతున్నాం. మనకి అన్నీ ఇచ్చే ఒక దేవుడిని గురించి చెప్పండి?
- ఏలూరి నారాయణ, రావినూతల

మీ ఉద్దేశం చాలా మంచిది. వివిధ దేవుళ్ళకూ, దేవతలకూ, పరమాత్మకూ తేడా మనకు తెలిస్తే, ఇంత మంది దేవుళ్ళను పూజించే అవసరం ఉండదు. సురులు అంటే... దేవతలు, దేవుళ్ళు, నరులు(మానవులు). తిర్యక్కులు(అడ్డంగా తిరిగే జంతువులు) స్థావరాలు(కదలకుండా ఉండే చెట్లు మున్నగునవి)- ఈ అన్నింటి కన్న విశిష్టమైన తత్త్వం ఒకటున్నదని, అదే పరబ్రహ్మ, పరతత్త్వం, పరమాత్మ, భగవంతుడు అని పిలువబడుతుందని వ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాలలో వివరించి నిరూపించారు. విశ్వ వ్యాప్తంగా అన్నింటికీ ఆధారమై ఉన్న ఆ పరమాత్మ తత్త్వం ఒక్కటే. ఆయన్ను ఆరాధిస్తే అన్నింటిని ఆరాధించినట్లే. 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు' అని అన్నమయ్య చెప్పినట్లుగా తిరుమల శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన మరొక పరతత్త్వము లేడు. మీ అన్ని కోర్కెల్ని ఆ శ్రీనివాసునికే నివేదించి, ఆరాధించి తరించండి.

-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

[from andhra jyothi daily]

Read more...

ఈ దు:ఖాలన్నింటికీ కారణం దేవుడేనంటారా ?!

>> Tuesday, February 2, 2010

దు:ఖానికి కారణాలు మనకంటికి కనిపించేవేకాక కనిపించని లోతులేవో ఉంటాయంటారు పెద్దలు . మానవసహజమైన భావోద్వేగాలు ,ప్రేమద్వేషాలను పక్కనపెట్టి పరిశీలించగలిగితే గాని అవి అవగాహనకు రావు. సహజంగా మనం దు:ఖంరాగానే భగవంతున్నో ,కంటికి కనిపించే ప్రపంచ దృశ్యాన్నో నిందిస్తాము. చిత్రమేమిటంటే మనకు శుభాలు,సుఖాలు ప్రాప్తించినప్పుడు మాత్రం మనసమర్ధతను శ్రమను , కష్టాన్ని మాత్రమే గుర్తుతెచ్చుకుని మనలను మనమే గౌరవించుకుంటాము. లేదా పొగుడుకుంటాము. వాస్తవమేమిటంటే శుభాలకు అశుభాలకు కారణం మన కర్మలే అనే విషయం లోతుగా ఆలోచించితే తెలుస్తుందని చెబుతారు పెద్దలు.

నేనొక ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా హెడ్మాస్టర్ గారు ఒకాయనుండేవారు . భార్యాభర్తలిద్దరు ఉద్యోగస్తులే .ఒక అబ్బాయి ,ఒక అమ్మాయి . సంపద బాగావుంది .బంధువర్గం లో బాగావున్నవాడుగా పేరు. ఎవరికీ హానిచేసే తత్వంకూడా కాదు .పెద్దగా వివాదాలమనిషికాదు. ఈయనకున్న ఒకే ఒక్క అలవాటు పేకాట . మందు అలవాటుకూడా ఉన్నదట చాటుగా. ఆయనకున్న ఓ పెద్దసమస్య ఆయన కొడుకే .అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు .వాడికి చిన్నప్పటినుంచీ చదువబ్బలేదుగాని అన్ని కళలు వంట పట్టాయి . తల్లిదండ్రులను బెదిరించి డబ్బు తీసుకెళ్ళి ఖర్చుచేయటం ,అప్పులుచేసి ఇంటిమీదకు తేవటం ,ఇంట్లో గొడవ. మాకందరికీ ఆవిషయం తెలుసు . ఓరోజు ఆయన విచారంగా కూర్చుని దు:ఖపడుతున్నట్లనిపించింది. ఏం !సార్ ఏమైంది . ఎందుకలా ఉన్నారు ? ఏదో బాధలో ఉన్నారు అని ఆప్యాయంగా అడిగేసరికి ఆయన ఆవేదనను ఇక దాచుకోలేక బోరుమన్నాడు . నాసమస్య తీరేదికాదు మాస్టారు. ఏదో ఒక రైలుకింద తలబెడితేగాని నాకు శాంతి రాదు అని బాధపడ్దాడు.

ఇచ్చిన డబ్బు చాలక ,అప్పులు చేసి ఇంటిమీదకు తెస్తున్నాడు జనాన్ని . పెళ్ళిచేసాక ఇంకా ఎక్కువైంది మాబాధ . అమ్మా ! నువ్వు నాన్న నిదురబోయేప్పుడు గాస్ లీక్ చేసి నిప్పు పెడతానని బెదిరిస్తుంటాడు . నిద్రబోయేప్పుడు ఏ రోకలబండతో నో తలమీద బాదుతానని అంటున్నాడు . వాడు అన్నంతపని చేస్తాడు , అంత దుర్మార్గుడే వాడు .
అన్నం తినేప్పుడు కూడా ప్రశాంతతలేదు అప్పుడుగొడవే . కలబడుతున్నాడు . బజార్లో తిట్లకు లేస్తున్నాడు డబ్బివ్వకపోతే .పరువు పోతుంది . నిద్రలేదు వీడినుంచి . మధ్యలో నాకు గిట్టని బంధువులు వీడికి ఎక్కిస్తున్నారింకా .
నేనెప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు . ఏమిటి నాకీబాధ ? దేముడుంటే నాకీ బాధేమిటి ? నాకెందుకు కలిగిస్తాడు ఈబాధ .అని విచారపడ్డాడు.

ఆయన ఆవేదన అర్ధం అయ్యాక . నేనో మాటన్నాను . మాస్టర్ గారు నేనో మాట చెబుతాను ఏమనుకోనంటే ,అని అన్నాను. దానిదేముంది చెప్పండి అన్నాడాయన.
సార్ ! మీకు పేకాట లో బాగా అనుభవం ఉందని అంటారు జనం . పేకాటలో డబ్బు పోగొట్టుకోవటం అరుదని మీరు చేయితిరిగిన ఆటగాడని అంటారు అవునా ? ప్రశ్నించాను .
అవునండి . కాని నేను ఎప్పుడు మోసం తో ఆడలేదే / న్యాయంగా ఆడి గెలుస్తాను .ఎవరిదగ్గర మోసం చేయలేదు. ఇందులో తప్పేమిటి? ఎదురు ప్రశ్నించాడాయన .
మీరు ఇంతవరకే ఆలోచిస్తే అంతే ! కాని ఇంకొంచెం ఆలోచించి చూడండి . నాకు తెలిసినది చెబుతాను వినండి . ముప్పారాజు వారి పాలెం లో పేకాటలో డబ్బు పోగొట్టుకుని వచ్చిన భర్త తో గొడవజరిగి ఒక మహిళ పురుగు మందుతాగి చనిపోయింది . అలాగే అదే గ్రామం లోఇంకోసారి పేకాటలో పొలం పుట్రాఅమ్మిన డబ్బుకూడా పోగొట్టుకుని వచ్చి భార్యను కొట్టి న దౌర్భాగ్యుడి చర్యకు అవమానానికి తట్టుకోలేక ఓ ఇల్లాలు బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది . ఈ సంఘటనలకు కారణమైన పేకాటలో మీరు ఉన్నారు .

ఇక్కడ ఆఇల్లాల్లు కార్చిన ప్రతికన్నీటి బొట్టు ఆడబ్బువెంట అంటిఉంటుంది. దిక్కులేకుండాపోయిన ఆపిల్లల ఆవేదన బంధువుల శాపనార్ధాలు ఎవరు భరించాలనుకున్నారు? అది తప్పనిసరిగా ఆడబ్బు దక్కించుకున్నవారే వడ్డీతో సహా చెల్లించాలి . ఇది కర్మ సిద్ధాతం. ఆతల్లులు కార్చిన ప్రతి కన్నీటిబొట్టు వందలశాతం పాపరాశిలా వచ్చి ఆశ్రయించుకుంటుంది. ఇవి నాకు తెలిసిన సన్నివేశాలు మాత్రమే .ఇంకా ఇలాంటి సంఘటనలెన్ని ఉన్నాయో తెలియదుకదా ! అన్నాను . ఆయన మౌనం వహించాడు ఏమీ చెప్పలేక .

తరువాత ఆకుర్రవానికి మాతోపాటు హనుమత్ దీక్షనిచ్చి రెండుసంవత్సరాలు చేపించటం నాలుగైదు సంవత్సరాలు సంతోషంగా వున్నా ఆకుటుంబం లో ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది స్థితి . [రెండుమూడు సంవత్సరాలు ఆ ఆటలకు చేష్టలకు దూరంగా వున్న మాస్టర్ గారు ,అబ్బాయిగారు తమ పాతలవాట్లను వదలుకోలేరని తేలి పోయాక]
బుద్ధి కర్మాను సారణి ...... అని పెద్దలన్నది నిజమేనని నమ్మాల్సినసన్నివేశమిది.


ఇక రెండవది.
--------------

మాప్రాంతం లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు . ఇద్దరు బిడ్డలు . ఆమధ్య ఒక యాక్సిడెంట్ లో కొత్తగా పెళ్లయిన కుమారుడు చనిపోయాడు . ఆసమయం లో ఆయన ఏడుస్తున్న ఫోటోలు చూసి గుండె తరుక్కు పోయింది .రాజకీయాలలో తిరుగులేని నేతగా , ఎదిగి విధి చేతిలో ఘోరంగా ఓడి గుండెలవిసేలా ఏడుస్తున్న ఆయన ను చూస్తే మనిషన్నవాని కెవరికైనా దు:ఖం వస్తుంది. ఆయన ఒక పుణ్యక్షేత్రాన్నే అభివృద్ది పరచినవాడు .ఎందుకీశిక్ష ? అని వేదన పడ్దప్పుడు , ఈ యన ఎలక్షన్లలో బాంబుదాడులు కొట్లాటల్లో మరణించిన వారి ఇల్లాల్లు ,బంధువులు ఫోటోలు కూడా [పేపర్లలో చూసినవి]ఒకసారి మనోఫలకం మీద కదలాడాయి .

ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ’ పసిపిల్లలంటే నాకు చాలా ఇష్టం .భగవంతుడు నాఇంట్లో పసినవ్వులు లేకుండా చేశాడు అని ఆవేదనపడ్డప్పుడు . ఈ ఎన్నికలహింసాపర్వం లో చచ్చిన వాని తల్లుల కడుపుశోకం,నాఇంట్లో నేకాదు వాడింట్లో దీపమెప్పుడారిపోతుందో ? వాని వంశం ఎప్పుడు నాశనమవుతుందో ! అని శోకండాలు పెడుతూ దుమ్మెత్తిపోసిన తల్లుల శాపాలు కర్మఫలితాలై వెన్నంటుతాయని నమ్మాల్సి వస్తున్నది.


ఇతరులకు దు:ఖాన్ని కలిగించే మన ప్రత్యక్ష,పరోక్షచర్యలేవైనా అవి మనవంతు బాధను మనకు తప్పనిసరిగా అనుభవం లోకి తెస్తాయని పెద్దలంటారు.
మొన్న నారాయణ శరణాగతి యాగానికొక భక్తుడొచ్చాడు . ఏమిచేస్తున్నవంటే . చీమకుర్తి ప్రాంతం లో మద్యం వ్యాపారం లో భాగస్వామ్యమన్నాడు. వెంటనే మానెయ్యమని చెప్పాను . ఇంకొకపనిచేసుకుని బ్రతుకు కానీ ఇలాంటివద్దని చెప్పాను.

చిల్లరకొట్టు పెట్టి నువ్వొక వస్తువు ఎక్కువధరకమ్మితే అందులో నీకు లాభం వస్తుంది . అదే నువ్వు మద్యం వ్యాపారం చేస్తే నీకు లాభం రావటమేకాదు తాగినవాని కుటుంబానికి దు:ఖమొస్తుంది . అది నీకు అశుభాన్ని వెంట తెస్తుంది .అని వివరించాను/ ఇప్పుడు రాష్ట్రం లో కోట్లకు పడగలెత్తిన మధ్యం వ్యాపారుల కుటుంబాల లోతు రహస్యాలు తెలిస్తేగాని అదివారికి వరమో శాపమో మనకర్ధంకాదు అని వివరించాను. అప్పటిదాకా అంతా పైన పటారమే కనపడుతుంది అన్నాను.
కాబట్టి మనపెద్దలు ఊరికే చెప్పలేదు ,సప్తవ్యసనాలతో వ్యాపారం చేసి బాగుపడదామని ప్రయత్నించటం ఎంత ప్రమాదమో ! అర్ధం చేసుకుందాం .. ఆచరణలో జాగ్రత్తలు తీసుకుందాం. మనచర్య ధర్మబద్దంగా వుండేట్టు . ఎవరి కంట కన్నీరొలకకుండా చూసేట్టు.





Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP