శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పెద్దవరం హనుమత్ క్షేత్రం విశిష్ఠత

>> Wednesday, November 30, 2011


పెద్దవరం హనుమత్ క్షేత్రం విశిష్ఠతగూర్చి కొద్దిగా చెప్పాలి .
నాగార్జునసాగర్ కాలువలు తవ్వేప్పుడు దరిశి బ్రాంచకెనాల్ డిజైన్ ఈ హనుమత్ క్షేత్రం నుండే వెల్లుతుంది. అందువలన అక్కడ విగ్రహాలు ఆలయం తొలగించి మరొక్కచోటకు తరలించాలని నిర్ణయం జరిగింది. కాలువల తవ్వకం మొదలెట్టి ఈక్షేత్రం ను తొలగించేందుకు బుల్డోజర్లు తదితర యంత్రాలు దింపారు . ముందుగా క్షేత్రం లో నిలువెత్తు ఉన్న స్వామి మూర్తిని తవ్వి తొలగించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ఇక యంత్రాలసహాయంతో తొలగించాలని ప్రయత్నం మొదలెట్టారు . చిత్రంగా యంత్రాలు స్వామి సమీపానికి రావటం... ఆగిపోవటం ...రావటం... ఆగిపోవటం. మరలా స్టార్ట్ చేసినా ఇదే స్థితి .మరొక డ్రైవర్లచేత ప్రయత్నించినా ఇదే పరిస్థితి. ఇక యంత్రాలడ్రైవర్లకు అకారణంగా విపరీతమైన భయం ఆవహించి చెమటలు పట్టి కూలబడటం తో భీతిల్లిన పర్యవేక్షకులు వెంటనే కాంట్రాక్టర్ కు కబురు చేయటం జరిగింది . ఆయనవచ్చి పరిస్థితి చూసి అధికారులతో సంప్రదించి తన పలుకుబడి ఉపయోగించి డిజైన్ లో మార్పులు చేపించి క్షేత్రం ముందుగా తవ్వకాలు జరిపేట్లు చేశారు. ఇప్పటీకీ నాటి పరిస్థితిని కళ్ళారా చూసిన వృధ్ధులు కల్లకు కట్టినట్లు స్వామి మహాత్మ్యాన్ని వివరిస్తుంటారు .

Read more...

>> Tuesday, November 29, 2011




పీఠం లో ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన పూజలందుకున్నస్వామి వారు . పార్వతి పుత్రులతో హరిహర సుతులతో కలసి నెలవైన స్కందుడు
శరణభవ

Read more...

పెరిగినాడు చూడరో ! పెద్దవరం హనుమంతుడూ ! [స్వామి లీల ఇది]

>> Monday, November 28, 2011


లోకంలో హనుమత్ క్షేత్రాలలో కొన్ని విశేషశక్తిస్థానములుంటాయి .అ టువంటి క్షేత్రాలలో ప్రకాశం జిల్లాలో పెద్దవరం గ్రామం సమీపంలో లోని వీరాంజనేయస్వామి శక్తిక్షేత్రం ఒకటి. ఇక్కడ స్వామి చూడగనే వల్లు జలదరించే రూపంతో కనిపించటమేకాదు అక్కడ ప్రవేశించగనే మనమనస్సు లోకల్లోలాలు సమసిపోయి ్ ఆథ్యాత్మికశక్తి తరంగాలు మనలను నిలువెల్లా ముంచుతున్న భావన అనుభవంలోకొస్తుంది . ఏకాంత ప్రదేశం పక్కనే నిండుగా పారుతున్న సాగర్ కెనాల్ పచ్చని ప్రకృతి దగ్గరలో కొండపై కనిపించే నృసింహస్వామివెలసి ఉన్నకొండ, వెంటనే మనమనస్సు స్వామి పాదాలపై లగ్నమవుతుంది .అనుకోకుండానే ఏకాగ్రత లభిస్తుంది. గ్రహబాధలతో మానసిక సమస్యలతో అనారోగ్యాలతో పీడింపబడేవారికి సత్వరం విముక్తి ప్రసాదిస్తాడీయన. ఎప్పుడో పురాతనకాలంలో ఋషి ప్రతిష్టితము . ఏకాంతం లో ఎలాఉన్నాడో అలాగే ఇక్కడ జనులుకూడా ఏకొద్దిమంది మాత్రమో ఈక్షేత్రంలోని హనుమత్ శక్తినిసరిగాగ్రహించి సాధన చేస్తున్నారని నాకనిపిస్తున్నది .
సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నామనసులో ఓ సంకలపం కలిగింది. ఇక్కడ స్వామికి చుట్టుపక్క;ల గ్రామాలప్రజలందరిచేత అభిషేకం చేపించి పొగిడితే పెరిగే స్వామి ని పొగడి మేలుపొందే సులభమైన సాధనా మార్గాన్ని గుర్తుచేయాలనేది ఆసంకల్పం . కానీ ఎందుకో స్వామి ఆజ్ణ్జ రాలేదు. కాలం అలాగడచి పోయింది . స్వామి ఆజ్ఞ రాలేదుకనుక మిన్నకున్నాను.





ఈమధ్య కురిచేడులో జరిగిన కార్యక్రమానికి ఈ ఊరిలో ఉన్న హనుమద్దీక్షాధారులందరినీ పిలిచారు కానీ ఒక్కస్వామే వచ్చాడు. కార్యక్రమానంతరం అతను స్వామీ ఖర్చు ఎంతైనా నేను భరిస్తాను మాఊరిదగ్గరున్న వీరాంజనేయక్షేత్రంలో ఈ హనుమత్ శక్తి జాగరణ పూజలు జరపాలని కోరాడు. ఇది ఒక్కరితోటి ఒక్కరికోసం చేసే కార్యక్రమం కాదు .ఇది అందరికోసం అందరిచేత చేపించే పూజ .అదీగాక వ్యవసాయ పనులసీజన్ గ్రామాల్లో .ఒక్కని వల్ల కాదు వేసవికాలంలో చూద్దాములే !అని పంపివేశాను . ఆసాయంత్రం నేను కురిచేడులో పూజముగింపయ్యాక వినుకొండ వెళదామనుకుని కూడా షార్ట్ కట్ మావూరికెల్లటానికని ఇలా కాలువకట్టమీదుగా బండిని తిప్పాను . ఈక్షేత్రం దాటాక మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చి స్వామికి నమస్కరించి వెళదామని గుడిదగ్గరకు వెనుక్కు వెళ్లాను. నమస్కరించుకుని బండిస్టార్ట్ చేయబోయేంతలో వెనుకవైపునుంచి ఒకవ్యక్తి పంతులూ ! అంటూ వచ్చాడు. ఏవిటబ్బా ? ఏకవచన సంబోధన అనిచూద్దునుగదా ఇంతకుముందు ఒకసారి మాట్లాడిన పెద్దవరం వ్యక్తే ఆకారంపిచ్చివానిలా ఉన్నాడు . ఏంపంతులూ ? ఇక్కడ పూజ కుదరదన్నావట ? మాట కోపంగా, హుంకారంగా ఉంది . ఇతను గతంలో నేను ఎదురుపడినప్పుడు అయ్యగారూ ! అని ఎంతో మర్యాదగా పిలిచినవాడే ఇదేమిటి ? అనుకున్నాను .వెంటనే బల్బు వెలిగింది . ఓహో! ఇది స్వామివారి నుంచి వస్తున్న గద్దింపన్నమాట అనుకుని నేను చాలవినయంగా [లేకుంటే వల్లుపగిలిపోతుంది మరి !] స్వామీ !మీఊరినుంచి ఒక్కల్లువచ్చారు ముందుకు .ఎలాసాధ్యమవుతుంది . మీఊరిలో ఉన్న దీక్షాధారులవరకైనా కలసి మాట్లాడుకుని నాదగ్గరకు రమ్మను అప్పుడు మాట్ళాడదాము అని ఒక్కముక్కలో సమాధానం చెప్పి వెల్లిపోయాను .

మరుసటిరోజు పొద్దుటే ఫోన్ చేసారు ఆవూరినుండి స్వామీ సాయంత్రం మీరు బడినుండి వచ్చేసరికి మీ పీఠానికి వస్తాము అని అన్నారు. సరే రమ్మన్నాను. అయితే వద్దు అనుకుంటే పట్టుదలగా చేయాలంటున్నారు కదా ! చూద్దాం ఇది స్వామి పై వీల్లకున్న భక్తా లేక వీల్లలో అంతర్గతంగా ఉండి నడిపిస్తున్న హనుమత్ శక్తా అన్నవిషయం అని మనసులో సంకల్పించాను. ఏం ? ఎప్పుడూ భక్తులకు స్వామే పరీక్షలు పెట్టాలా ? మనం మాత్రం ఆయనకెందుకు పరీక్ష పెట్టకూడదు అని మనసులో ఓచిన్న పట్టుదలపెరిగింది.
గురువారం ఐదుగురు దీక్షాధారులొచ్చారు . స్వామీ ! ఊరంతా చందాలు అడగటం కలపటం ఇప్పుడు సమయం చాలదు ఖర్చు మేమే భరిస్తాము ఏమేమి కావాలో చెప్పండి అనడిగారు.
కుదరదు స్వాములూ ! ఈకార్యక్రమంలో ఎవరినీ డబ్బు అడగకూడదు .కావలసిన వస్తువుల లిస్ట్ తీసుకుని ఇంటింటికీ వెళ్ళి అందులో మీరేమి తెస్తారు అని అడగాలి . ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు . బలవంతం చేయకూడదు. అలాగే నిరుపేదలైనా సరే చిన్న తమలపాకులకట్టనైనా తమవంతుగా తీసుకుని వచ్చేలా చేయాలి. ఇందులో డబ్బులిస్తాము మీరు అవసరమైనవి తెండి అని ఎవరడిగినా ఒప్పుకోరాదు .శ్రద్దాశక్తులు ఉంటే వాళ్ళే కొనుక్కుని వచ్చి గుడివద్దమనకు అందజేయాలి అన్నాను .
అలాగేచేయాలా ?సందేహం వ్యక్తంచేశారు వాళ్లు
అవునుఅలాగే చేయాలి ఖచ్చితంగా చెప్పాను.
తలకాయలూపారు
నూటఎనిమిది చాలీసా పారాయణములు జరపాలి మీకు చదువురాదుకదా ?ఇంతకుమునుపు పారాయణం చేసిన అలవాటు మీకులేదుకదా ఎలా ?సందేహం లేపాను .
దరిశినుంచి స్వాములను పిలుస్తాము అన్నారు వాల్లు

నాకర్ధమవుతుంది లోపల స్వామి ఎన్ని ఆటంకాలు కల్పించాలని చూసినా వీల్లచేత జరిపిస్తాడి కార్యక్రమాన్ని అని
మరి నూటా ఎనిమిది పొంగల్లు చేసి నివేదన జరపాలి
అలాగే చెబుతాం ఊర్లో అన్నారు వాల్లు.
వచ్చే మంగళవారం చేద్దామన్నారు వాల్లు
కుదరదు ఈ ఆదివారమే చేద్దాం అన్నానుపంచాంగం కూడా చూడకుండా మొండిగా .[ఎలాజరుపుతావోచూడాలి అని స్వామితో మనసులో పందెం వేసుకుంటూ.]
వాల్లు వివరాలన్నీ తీసుకుని వెల్లారు
కేవలం రెండున్నరరోజులలో ఇన్ని ఏర్పాట్లు ఎలాచేస్తారు ? చేయగలగాలంటే కేవలం స్వామి వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం . దుర్గమకాజ జగతకే జేతే !సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే .అన్నారు కదా సంత్ తులసీదాస్.
వెల్లి ఆరోజు సాయంత్రమే వాల్లు ప్రయత్నాలు మొదలు పెట్టటం ఒక్కవీధి తిరిగేసరికే కావలసిన వన్నీ వచ్చేసాయి . పొద్దుటనే చాలీసాలు ప్రింట్ చేపించే వ్యక్తి గుంటూరు వెళ్ళి వాటిని అచ్చేపించారు . ఇవతల గ్రామంలో ఎవరూ ఆదివారం పనులకు వెల్లరాదని మనఊరినుంచే ఇంటికొక పొంగలి వండి స్వామికి సమర్పించాలనే నిర్ణయం తీసుకున్నారు .
ఇక శనివారం పత్రికలలో వార్తచూసి ఆశ్చర్యపోయాను . ఆదివారం రోజు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇరవైవేల పెళ్లిల్లు ఉన్నాయని ,చాలా మంచి ముహూర్తమని ,సారాంశం.
చూశారా ! స్వామి సంకల్పం . నామూర్ఖత్వాన్ని ఎలా వెక్కిరిస్తుందో ?


ఇక ఆదివారం నిలువెత్తు స్వామిని భక్తులు ఆవుపాలు,నారికేళ జలం,శుద్దగంగోదకం లతో నిలువెల్లా అభిషేకిస్తూ తమ స్వంత బిడ్డకు స్నానం చేపిస్తున్నట్లు రుద్దిరుద్ధి మరీ సేవించారు ఆయనను.
మహిళలు క్షేత్రం వద్దనే పొయ్యిలు ఏర్పాటుచేసుకుని పొంగళ్ళు వండితున్న దృశ్యం చూడాలి .ఎంతశ్రద్దాభక్తులో చెప్పతరంకాదు.
ఒకవంక దరిశి నుంచి వచ్చిన దీక్షాధారులు నూటాఎనిమిది చాలీసాలపారాయణం చేస్తుండగా సంతోషంతో భజనలతో చిందులుతొక్కుతున్న దీక్షాధారులు . అనంతరం తమాలార్చనలు .చెప్పనలవికాని సంతోషం .ప్రతి ఒక్కరికీ హనుమత్ రక్షలు చాలీసా కార్డులు ప్రసాదంగా ఇవ్వబడ్డాయి.
ఇక హనుమత్ హోమానికి ఏర్పాట్లు జరిగాయి .

యజ్ఞానికి కూర్చోగనే పొద్దున్నుంచి కొద్దిగా చల్లగా ఉన్నవాతావరణం మబ్బులుకమ్మి చిరుజల్లులు చల్లబోయింది. స్వామీ !స్వామీ ! ఒక్కగంటసమయమివ్వు అని వేడుకున్నాము . యాగం మొదలవ్వగానే మబ్బులు విడిపోయాయి . ఏ ఆటంకంలేకుండా ఎంతో చక్కగా జరిపించుకున్నాడు యాగాన్ని తన అనుగ్రహం ఉంటే ఎలాఉంటుందో చూపారు.
వీటన్నింటీకంటే నాకింకో్ పెద్దభయం ఉంది . ఒకపక్క నిండుగా పారుతున్న సాగర్ కెనాల్ . ఈ తిరుణాళ్లవాతావరణంలో పిల్లలు ఎక్కడ ఈకాలువలో ఈతలకు దిగి ఏప్రమాదం తీసుకొస్తారో అని . ముందుగానే ఈజాగ్రత్తలు గ్రామస్తులకుచెప్పాను . . శనివారం రాత్రి నిదురలో కాలువలో దూకిన పిల్లవాణ్ని లోపల ఒక పెద్దచేపలవల బయటకు విసిరివేసినట్లు కలవచ్చింది. అటువంటిది నాభయం .
కానీ స్వామి దయవలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా సాగిందంటే స్వామి అనుగ్రహమేకదా మరి !

















Read more...

కురిచేడు కోటలో ఆంజనేయుని అభిషేకమహోత్సవాలు

>> Tuesday, November 22, 2011







కురిచేడు ప్రకాశం జిల్లాలో ఉన్న ఓవ్యాపారకేంద్రం . కార్తీకబహుళద్వాదశి మంగళవారం అగు ఈరోజు భక్తుల అభిషేకములతో స్వామి పులకించిపోయాడు . అసలే పొగిడితే పెరిగిపోయేస్వామాయె వేలాదిమంది భక్తులు పరవశించి చాలీసాగానం చేస్తూ ప్రయాగనుంచి తెచ్చిన గంగాజలం తో కలసిన కలశజలాల తో నిలువెల్లా అభిషేకిస్తుండగా ఇక ఆయన అనుగ్రహాన్ని వర్ణించతరమా ? పసిపిల్లలనుండి పండు వృధ్ధులవరకు తరలివచ్చి కురిచేడు కోట పైన వున్న స్వామికి అభిషేకములు జరిపారు. హనుమత్ శక్తిజాగరణ పూజలో భాగంగా శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం జరుపుతున్న ఈ సామూహిక హనుమదభిషేకములు ఈరోజు కురిచేడులో నిర్వహించబడింది . కులమతప్రమేయంలేకుండా తరలివచ్చిన భక్తులు స్వయంగా తనివితీరా స్వామిని అర్చించుకుని ఆనందడోలికల్లో తేలియాడారు.
అయితే ఈమహత్తరయాగం నిర్వహించటానికి మాత్రం ఎన్ని ఆటంకాలని? ఎన్ని అడ్డంకులొస్తాయని? కానీ ఆయనపై సంపూర్ణవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తే చాలు ప్రభంజనానికి చెదిరిపోయిన మేఘలలా అన్నీ తూలిపోతాయి.అందుకే స్వామి అండ ఉంటే అన్నింటా జయమే నని మహాత్ములు చెప్పినది.
జైశ్రీరాం" అనే నినాదాలుచేస్తూ పాఠశాలలనుండి వచ్చిన విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగానిలచారు.








Read more...

అష్టోత్తరశత నామ అభిమానులకు వందనం

>> Thursday, November 17, 2011

హరిసేవ బ్లాగును నిత్యం చూసేవారు ,అభిమానంతో పలకరించి ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన ఈ బంధువర్గానికంతటికీ కృతజ్ఞతలు.
బ్లాగును చాలామంది నిత్యం చూస్తున్నప్పటికీ ఫాలోయర్స్ గా కనపడుతున్నవారు క్రమేపీ పెరుగుతుండటం నాకూ కొద్దిగా ఉత్సుకతను కలిగించింది . నూటఎనిమిదవవారు గా ఎవరు వస్తారా అని చూస్తుండగా నిన్ననే నూట ఎనిమిదవ అభిమానికూడా చేరారు .అందరికీ కలిపి ఒకేసారు కృతజ్ఞతలు చెబుదామని ఇప్పటిదాకా వేచిచూశాను . అందుకే బ్లాగులో కనపడుతున్న నూటఎనిమిది మంది అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Read more...

ఇక శ్రీ రావణరాజ్యం రాబోతుంది కాచుకోండి

నేను చిన్నతనంలో అంటే పదవతరగతి నుండి చూస్తున్న,విన్నదుశ్ప్రచారాలు ఏమిటంటే హిందూ మతవిజ్ఞానాన్నిపంచే వేదాలు,పురాణాలు అబధ్ధాలు.అవి అసలు జరగనేలేదు. కల్పిత గాథలు .పుక్కిట పురాణాలు అనే ప్రచారాలు.. సహజంగా మేము చిన్నతనంలో కాలేజీలలో విద్యార్థిరాజకీయాలు నడిపే గుంపులలో కలసి తెలిసీ తెలియని జ్ఞానంతో జిందాబాద్ లు కొడుతూ ఉన్న వయస్సులో విన్నవిషయాల్లో ఈసారాంశం సహజంగా అంతర్లీనంగా ప్రచారంగా ఉండేది. ఇక ఈధర్మాన్ని ధ్వంసం చేయాలని కదం తొక్కుతున్న కలిమతాల ప్రధాన ప్రచారం మనపురాణాలన్నీ అబద్దాలనే.

ఇప్పుడు ఆర్య ,అనార్య,వలస చరిత్రలన్నీ అబద్ధపు రాతలని చరిత్ర పరిశోధనలవలన తేలిపోయింది . భారతీయ జీవనధారనుండి ఈ ఇతిహాసాలను తొలగించటం సాధ్యంకాదని స్పష్టమవటంతో కొత్త వ్యూహాలు మొదలయ్యాయి . అదేమిటంటే ఎలాగూ భారతీయ ఇతిహాసాలను ధ్వసంచేయలేరు కనుక ఆ ఇతిహాసములపైన ,పురాణములపైన అపప్రచారాలు సాగించి గందరగోళము సృష్టించి భారతీయ సమాజాన్ని మరింత బలహీనపరచటం వ్యూహంలో భాగంగా ఎంచుకున్నారు. ప్రతి సమాజంలో ఉన్నవిధంగానే మానవుల అవివేకము వలన ఏర్పడ్డ సామాజిక అసమానతలను అవకాశంగా మలచుకుని ,అన్నదమ్ములను చీల్చి మతాలుమార్చి ఓటుబ్యాంకుసైన్యాలుగాతయారుచేసుకుని అప్రతిహతంగా సాగుతున్న కలిసేన తమ మేధోపుత్రులద్వారా అబద్దపు ప్రచారాలు ముమ్మరం చేసింది . కావలసినంత నిధులు అందుతున్నాయి కనుక ప్రచారాలకు ఆడు అదుపూలేదు. కలిలో అబధ్ధానికి బలమెక్కువ . అబద్దాన్నైనా పదేపదే చెబితే నిజమని భ్రమింపజేయవచ్చనే సూత్రాన్ని తయారు చేసుకుని ప్రయోగిస్తున్నారు . ఇక అంతర్గతంగా ప్రచార మాధ్యమాలలో తమ పెట్టుబడులతో వేదికలు సిద్దం చేసుకుని హైందవుల పండుగలు పబ్బాలప్పుడు చర్చలంటూ మొదలెట్టి అందులోని దుష్టపాత్రలను గొప్పగ చూపించే విధంగా ప్రచారం చేయటం జరుగుతున్నది .అందులో ఎప్పుడొ తప్ప ఎక్కువగా అనామకులైన హిందూ ప్రతినిధులను ఎన్నుకుని/లేక ఏర్పాటుచేసి రెచ్చిపోయి విమర్శలు చేస్తుంటారు. తద్వారా హిందువులలో గందరగోళం నెలకొల్పటమే ప్రధానం.
ఇక జాతీయ స్వాభిమానం కూడా లేకుండా చేయాలి.ధేశభక్తి నశింపజేయాలనేది ఈ విదేశీ గూఢచారుల వ్యూహం కనుక ఇందులో మనగౌరవ జాతీయ నాయకులపై కొత్తగా సృశ్టించిన చరిత్ర ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీరనారి లక్ష్మీభాయి దగ్గరనుండి మహాత్మాగాంధీ పైనకూడా గౌరవభావం తగ్గేలా కొత్త రచనలు,నాటకాలు కళారూపాలసృష్టి ప్రచారం సాగుతుంది . ఇక చిన్నినాకడుపుకు శ్రీరామరక్ష అనే ధోరణిలో బ్రతుకులీడుస్తూ తమ సంస్కృతీ సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులగూర్చి సాగుతున్నదౌర్జన్యాలనుగూర్చీ పట్టించుకునే ఓపిక శక్తీ లేక సామాన్య హిందువులు దైవభక్తి,దేశభక్తి రహిత జీవచ్చవాలుగా మారబోతున్నామని గ్రహించలేని స్థితిలో జీవిస్తున్నారు. ఎదిరించగలిగిన వారిని అదుపుచేసే వ్యూహాలతో కలిసేన కదం తొక్కుతుంది.

అయితే ఇప్పుడు జరగుతున్న జరగబోతున్న వన్నింటీనీ ఐదువేలసంవత్సరాక్రితమే వ్యాసభగవానులవారు భవిష్యపురాణం ,భాగవతాదులలో చెప్పియున్నారు. ఎవరు ఎలా ధర్మాన్ని ధ్వంసం చేస్తారో ? చివరకు జరగబోయేదేమిటో కళ్లకు కట్టినట్లు వివరించారు.దీనినే వీరబ్రహ్మేంద్రుల వారు కాలజ్ఞానంలో మరింత వివరించారు. ఉద్యోగములుజూపి ఉచ్చులెన్నోవేసి మనమతానికె ఎసరు పెడతారు అని హెచ్చరించారు . దురదృష్ట వశాత్తూ భవిష్యపురాణం అసలు ప్రతి లండన్ మ్యూజియంలో ఉండగా మన విజ్ఞానం మనం తెలుసుకోవటానికి ఆధారమైన సంస్కృతం మరణశయ్యపై ఉన్నది.
ఇక పైన చూడండి రామరాజ్యం బదులు రావణ రాజ్యం, వీరనరకాశుర , సాధ్వీసూర్పణఖ లాంటి సినిమాలు
గాంధీ హింస , పిరికి నేతాజీ, పారిపోయిన అల్లూరి వంటి నికృష్ట చారిత్రక సత్యాలు సృష్టించ బడతాయి .................ప్రచారంచేయబడతాయి .

Read more...

ప్రపంచము బ్రహ్మము

>> Monday, November 14, 2011

ప్రపంచము బ్రహ్మము

ప్రాణము, ప్రాణధారియైన జీవుడు అనాది. జీవుడికి ఆధారం ఆత్మ కనుక, జీవాత్మగా గుర్తించబడుతున్నాడు. జీవుడిది ప్రసవం. కర్మ, ప్రాప్తి, ప్రారబ్ధం వున్నవి కనుక జీవుడిది బంధనతో, నిబంధనతో కూడిన రాక. ఇవేవీ లేని ముక్తుడూ ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. వాడిది ప్రవేశం, అనుప్రవేశం, ప్రభవం! కనుక మనవంటి జన్మఎత్తినట్లు అనిపించినా, మనకున్నటువంటి అంగాంగీ భావంతో ఉన్న శరీరధారిగా కనిపించినా, ప్రపంచంలో వుంటున్నా, 'బ్రహ్మము వలె సంచారం' చేస్తాడు. కర్మలు చేస్తున్నట్లున్నా కర్మానుభవం వుండదు. అందువలన కర్మబంధన లేదు. ఇవన్నీ వున్న జీవుడి వలె తరచుగా ఈ ప్రపంచంలోకి రాదు. రావటానికి బలమైన కారణం ఉంటే గాని, బ్రహ్మము ఈ సంసారంలో ప్రవేశించదు.

తారకమంత్రం
మానవదేహం ధరించి, జీవాత్మగా వుండి, ప్రాపంచిక కార్యకలాపాలను సాగించి, ప్రజ్ఞతో, ప్రతిభతో కొనసాగించి, కాలము, ప్రారబ్ధమూ కలిసివస్తే మంచి పనులు చేసి, అనాహతం వరకు చేరుకుని, అహంకారం చేత, ప్రమత్తత చేత, మదము చేత, అవిద్య చేత, అస్పష్టత చేత, అక్కడ నుంచి మూలాధారంలో పడిపోవటం, యెగభ్రష్టత! చేరవలసిన బ్రహ్మస్థానం చేరుకుని, నిరతిశయానందమగ్నుడై, ముక్తుడై, పరముక్తి స్వరూపంగా వుండి కూడా, ఈ సంసారానికి అంటే ప్రపంచానికి ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా, బ్రహ్మము తనను తాను ఈ సంసారంలోకి ప్రవేశపెట్టుకుని, ప్రభవించటం భ్రష్టయోగిత్వం! యోగభ్రష్టుడు బద్ధుడు. భ్రష్టయోగి నిబద్ధుడు. శుద్ధబుద్ధాత్మకమైన సాకార చైతన్యం.

ఈ రెండు స్థితులూ జీవులుగా వచ్చి, వుండి వెళ్లేవే! కాకపోతే జీవుడు ప్రభావానికి లోబడి వస్తాడు. బ్రహ్మము, స్వభావంలోకి అంటే ఆత్మభావంలోకి జీవుడిని నడిపించటానికి వస్తాడు. నడవవలసింది జీవుడే! అనాదిగా వున్న సంసారం, పరిణామం చెందుతూ, ప్రభావానికి లోనౌతూ, జీవుడిని ప్రవృత్తి మార్గంలో నడిపిస్తుంది. నివృత్తి మార్గంలోకి వెళ్లటమే జీవుడి ప్రధాన కర్తవ్యం. అంటే తన మూలాల్లోకి తాను వెళ ్లటమే. దానికి సంసారమే కార్య భూమిక. సంసారమొక దివ్యక్షేత్రం. అదే కురుక్షేత్రం.

జీవుడు తనలో ఉన్న సహస్ర దుర్గుణ క్షోణిని జయించుకుంటూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనబడే సులక్షణ ఆయుధాలను వాడుకుంటూ, తనపై తాను యుద్ధం సాగించాలి. విజయం సాధించాలి. తన శరీరాంతర్గతమైన వర్గాలను నిర్మూలనం చేసి, అయోధ్యగా మార్చుకోవాలి. ఆత్మారాముడిని, యోగీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. భ్రమరకీటక న్యాయంలో జీవుడు రాముడు కావాలి. జీవుడు సర్వానందరూపమైన కృష్ణుడు కావాలి. తనను తాను ఎరగాలి. ఎరుకలో సర్వమూ బ్రహ్మమనే నిశ్చితానుభవంలో నిలకడ చెందాలి. అదే తారకం. ఇదేమీ జరగకపోవటమే మారకం.

జీవుడూ బ్రహ్మమే
సంసారం ఒక సాధారణ భూమిక. ఇది బ్రహ్మమయం. పాలలో వెన్నను పట్టుకున్నట్లు సంసారానికి మూలమైన బ్రహ్మమును సాధించుకోవాలి. బ్రహ్మముగా జీవించాలి. బ్రహ్మముగా పరముక్తిని ఈ ప్రపంచంలో అనుభవించాలి. తన మూలము బ్రహ్మమన్న స్పృహ కలిగినపుడు, తన బంధము బ్రహ్మముతోనే వుండాలి గాని, భ్రమాత్మకమైన ప్రపంచంతో కాదు. ప్రపంచం బ్రహ్మమేనని భావించిన వాడికి, ఈ స్పర్థలేదు. అట్టివాడు ఆనందస్వరూపుడు. తాటికాయ కోయాలంటే తాటిచెట్టు ఎక్కాలి. కోసుకున్న తరువాత కిందకు దిగాలి. తాటిచెట్టు నీడ నేలమీద పరుచుకుని వున్నా, కాయలన్నీ అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నా, కాయ లభిస్తుందా? ఆ విధంగానే బ్రహ్మమే ప్రపంచంగా ఉన్నా, ప్రపంచాతీత సాధనాఫలంగా బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ కనిపిస్తున్న ప్రపంచానికి బ్రహ్మమే మూలం. ఇపుడు కనిపిస్తున్నదంటే, ఇది ఇంతకు ముందే వున్నది.

ఇపుడు అభివ్యక్తమైంది. కనుక ప్రపంచం అనాది. ఇపుడున్నది కనుక మధ్యలోనూ వున్నది. ఇది ఇట్లాగే ఉండదు కనుక అంతమెరుగనిది. అది, మధ్యాంత రహితం కనుక యిది సత్. సృష్టికి మూలము బ్రహ్మము. బ్రహ్మము కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. కనుక బ్రహ్మమే ప్రపంచంగా ప్రకాశిస్తున్నది. మూలపీఠం బ్రహ్మం. ఆధారపీఠం ప్రపంచం. ప్రపంచంలో భాగమైన జీవుడు బ్రహ్మమే. అనాదియైన ప్రపంచం రాబోయే కాలంలోనూ అభివ్యక్తమౌతుంది కనుక రూప, నామ భేదం వున్నా ప్రపంచం బ్రహ్మ స్వరూపంగా కనపడుతున్నది.

దేశం, ప్రదేశం, నైసర్గికంగా అనేక పేర్లతో, అనేక జాతులతో, అనేక భాషలతో, అనేక భావాలతో వున్నా, సమస్త సృష్టీ బ్రహ్మరూపమే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా వెలుగుతున్న కాలస్వరూపం బ్రహ్మమే. శ్రీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాది స్వరూపాలు బ్రహ్మమే. అనంతకోటి గురు స్వరూపాలు, అవతార మూర్తులు బ్రహ్మమే. అంతెందుకు? మిన్ను, మన్ను బ్రహ్మమే.

Read more...

అత్యాశ ఆపదలకు మూలమని వీళ్ళు చదవలేదా ?

ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈవ్యాసం చదివాక అత్యాశ ఎంతవినాశకరమో మనకు చెప్పిన చదువులెందుకు వంతబట్తటం లేదో ఆశ్చర్యమే ! ఎక్కడున్నది లోపం .కోల్పోయిన మనదైన చదువులవిలువ ఈతరం తెలుసుకుంటుందా ? లేక కలిమాయలోపడి పదిమంది నోటికాడిది ఒక్కరేపోగేసుకోవాలనే రాక్షసప్రయత్నాలతో వినాశనంవైపుసాగుతూనే ఉంటుందా ?
-------------------------------------------------------


ఆంధ్రజ్యోతి నుండి ఈక్రింది వ్యాసం చదవండి]

అత్యాశతో అష్టకష్టాలు
తరాలు తిన్నా తరగని సంపద
ఇంకా కావాలన్న దురాశ

గాలి, కోనేరు, కల్మాడీ, రాజా, కనిమొళి
రాజగోపాల్, శ్రీలక్ష్మి.. అందరిదీ అదే అంతు

హైదరాబాద్, నవంబర్ 13 : "దురాశ దుఃఖమునకు చేటు'' ..అనే పాఠాన్ని వారెవ్వరూ చిన్నప్పుడు చదువుకొని ఉండరు! అందుకే ఉన్నదాంతో తృప్తిపడక ఆశగా అంతులేని సంపద పోగేసుకుంటారు! నాలుగు రాళ్లు వెనకేసుకొని సుఖంగా ఉందామన్న సామాన్యుల తరహా ఆశ కాదది.. మంది సొమ్ము తామొక్కరమేబొక్కేయాలన్న దురాశ!

నాలుగు ముద్దలు తింటే తీరే ఆకలి కాదది.. ఎంత వెనకేసినా తీరని తనివి! తరాలు తిన్నా తరగనంత సంపద ఉన్నా.. ఇంకా ఏదో కావాలనే ఆబ! గనుల దొంగ గాలి జనార్దనరెడ్డి నుంచి.. విల్లా మాయల కోనేరు ప్రసాద్ దాకా.. అందినకాడికి రెండుచేతులా దోచుకుని ఇప్పుడు శ్రీకృష్ణజన్మస్థానంలో ఊచలు లెక్కబెడుతున్న ఆశపోతు మాయల మరాఠీలందరిదీ అదే తంతు!!

"నా జీవితం నాశనమై పోయింది. కుంగిపోయాను. 40 ఏళ్లుగా దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నా ఒక్క మచ్చా లేదు. ఇప్పుడు కస్టడీలో పరిస్థితి దారుణంగా ఉంది. తాగడానికి శుభ్రమైన నీళ్లు కూడా లేవు. అయ్యప్పమాలలో ఉన్న నాకు కనీసం పూజ చేసుకునే అవకాశం లేకుండా పోయింది'' ..ఎమ్మార్ అక్రమాల కేసులో అరెస్టై సీబీఐ కస్టడీకి చేరిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ దీనాలాపన ఇది! కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీటిపర్యంతమై చెప్పుకొన్న వ్యథ. కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారి ఇవాళ తనకో చాప, ఫ్యాను, మంచినీళ్లు ఇస్తే చాలని మొరపెట్టుకుంటున్నారు.

నిన్నటిదాకారాజభోగాలు అనుభవించిన ప్రసాద్‌ను చూసి కుటుంబ సభ్యులూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఒక్క కోనేరు మాత్రమే కాదు.. దేశంలో ఇటీవలి కాలంలో బోనెక్కుతున్న దొరబాబులంతా ఇలా 'డబ్బు' చేసినవాళ్లే! ఎంత తిన్నా ఆశ చావక ఇంకా ఇంకా తినీతినీ చివరికి కథ అడ్డం తిరిగి చట్టానికి దొరికిపోయినవారే! రాజా, కల్మాడీ, కనిమొళి, గాలి జనార్దన్‌రెడ్డి, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, శ్రీలక్ష్మి... ఇలా చెప్పుకుంటూపోతే ఈ చిట్టా చాంతాడంత. 'నేరం నాది కాదు ఆకలిది' అని మనకో సినిమా ఉంది.

వీళ్లెవరూ అలా ఆకలితో నేరాలు చేసిన వాళ్లు కారు. మరొకరి ఆకలి తీర్చడానికి నేరాలు చేసిన అపర రాబిన్‌హుడ్‌లూ కారు. దురాశకు నిలువెత్తు ప్రతిరూపాలు. అంతులేని డబ్బు ఆకలితో ఆర్థిక నేరాలకు బరితెగించిన స్వార్థపరులు. అంతా సమాజంలో ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందినవారే! కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులే. వీరిలో కొందరైతే నోట్లో బంగారు చెంచాలతో పుట్టిన కోటీశ్వరుల వారసులే! ఉన్నదాంతో తృప్తిపడక అధికారాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు వేట సాగించారు. ఉదాహరణకు.. సురేశ్ కల్మాడీనే తీసుకుందాం.

కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతికి పాల్పడి దేశం పరువుతీసిన ఈయన.. అప్పటికే కోటీశ్వరుడు. ఇక.. టెలికం మాజీ మంత్రి ఏ రాజా కూడా కోటీశ్వరుడే. కనిమొళి అయితే.. ఒక రాష్ట్రాన్ని ఏలిన రాజకీయ కుటుంబానికి వారసురాలు. రూ.వేల కోట్లకు పడగలెత్తిన కరుణానిధి కుమార్తె. గనుల గాలి జనార్దనరెడ్డిదీ ఇదే కథ. గాలి వాదన ప్రకారమే చూస్తే.. ఓబుళాపురం గనుల లీజుకు ముందే ఆయన శ్రీమంతుడు.

కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనాపాఠీ. అటువంటి వ్యక్తి చట్టం కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడి, రూ.కోట్లు కొల్లగొట్టి, ఇవాళ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. జైల్లో ఇప్పుడీయన మొక్కని దేవుడు లేడు! పూజించని రాయీరప్పా లేదు! సాష్టాంగం పడితే కనీసం పావుగంట దాకా ప్రార్థన ముగించట్లేదంటే మానసికంగా ఎంతగా దెబ్బతిని ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీరంతా వ్యాపారులు. ఆర్జనే ధ్యేయంగా వ్యవహరించడంలో ఆశ్చర్యం లేదు.

కానీ.. లక్షణంగా లక్షలు సంపాదించుకోగలిగిన పెద్దపెద్ద హోదాల్లో పనిచేసిన రాజగోపాల్, శ్రీలక్ష్మి తదితర అధికారుల దురాశ మరీ దారుణం. ప్రజలకు సేవ చేయాల్సిన ఐఏఎస్ అధికారుల దురాశకు ఏం పేరు పెట్టాలి? గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ పదవీ విరమణ చేశాక కూడా.. తన పాత పాపాలకు ఫలితం అనుభవిస్తున్నారు.

ఇక శ్రీలక్ష్మి.. అనారోగ్యం సాకుతో బయటకు కనపడకుండా దాక్కుంటూ సీబీఐ అధికారులు తననెప్పుడు అరెస్టు చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈ పెద్ద మనుషులెవ్వరూ "దురాశ దుఃఖమునకు చేటు'' అని చిన్నప్పుడు బడిలో చదవలేదా? అని అనుమానమేస్తుంది. చదివే ఉంటే ఇవాళ వారి కథల్లో ఇలా విషాదఘట్టాలు ఉండేవి కావేమో బహుశా! కనీసం వీరి కథలైనా అక్రమార్కులకు కనువిప్పు కలిగిస్తే వ్యవస్థ బాగుపడుతుందనడంలో సందేహం లేదు.

Read more...

హనుమన్నామగానంతో దరిశి పట్టణం లో దశదిశలూ మార్మోగాయి ఈవేళ

>> Saturday, November 12, 2011

ప్రకాశం జిల్లా దరిశి పట్టనంలో ఈరోజు హనుమన్నామంతో దశదిశలూ మార్మోగాయి. స్థానిక హనుమద్దీక్షాధారులు దరిశి పదరిశి పట్టణవాసుల క్షేమమునకై శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం పర్యవేక్షణలో సామూహిక హనుమదహిషేకములు నిర్వహించారు . ఉదయం ఐదుగంటలనుండే రుద్రసూక్త మన్యుసూక్తపారాయణములతో స్వామి అభిషేకములు మొదలయ్యాయి . దీక్షాధారులు నూటాఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సాగిస్తుండగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ,పాలు,కొబ్బరినీళ్ళు హనుమత్సేవాసమితి వారందించిన పుణ్యగంగానదీ జలాలతో స్వయంగా స్వామిని అభిషేకించుకుని తన్మయులయ్యారు . భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దీక్షాధారులు వరుసలో పంపుతూ ఎటువంటి వత్తిడి కలుగకుండా భక్తులు అభిషేకించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు . గతంలో పదమూడు సంవత్సరాలక్రితం నేను స్వామి అనుగ్రహంతో ఈ గ్రామంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించాను. మరలా ఇన్నాల్లకు స్వామి అనుగ్రహంతో ధనిక,పేద, వర్గ ,మత విబేధాలులేకుండా అందరిస్వామి అగు ఆంజనేయుని పూజ జరింపించేలా ఆయన అనుగ్రహించారు. ఈసందర్భంగా స్వామి రక్షలను ప్రసాదంగా ఇచ్చిఅలాగే హనుమాన్ చాలీసా ప్రతులను అందజేయటం జరిగింది. జీవితంలో పలుసమస్యలను చాలీసా పారాయణమ్ తో ఎలాపరిష్కరించుకోవచ్చునో వివరించటం జరిగింది .







Read more...

కార్తికపౌర్ణమి వెన్నెలబోలిన శుభకళలూ !

>> Friday, November 11, 2011

మహాదేవశంభో !
కమలాలయా కమలనయనా !
జ్వాలాతోరణం
జ్యోతిస్వరూపాయనమః
జ్యోతిర్లింగార్చన
కలువలతో అర్చనలందుకున్న కనకదుర్గమ్మ
ఓం మగళం ఓంకారమంగళం ఓం నమః శివాయమంగళం

Read more...

దేవుడున్నాడా ? అబ్దులకలాం గారికి వారి ప్రొఫెసర్ గారికి జరిగిన సంవాదం

>> Wednesday, November 9, 2011


దేవుడు ఉన్నాడని ఆస్తికులు, లేనే లేడని నాస్తికులు వాదిస్తారు. వీరిద్దరూ ఎదురుపడితే వాడివేడి వాదన తప్పనిసరి. ఇలాంటి ఆసక్తికర ఘట్టం ఒక కళాశాల తరగతి గదిలో ప్రొఫెసర్, స్టూడెంట్‌ల మధ్య జరిగింది. ఆసక్తికరంగా సాగిన ఆ వాదప్రతివాదాలు మీ కోసం.

ప్రొఫెసర్: దేవుడనే వాడున్నాడా? ఉంటే ఎలాగుంటాడు? దేవుడు మంచివాడా చెడ్డవాడా?

స్టూడెంట్: దేవుడు ఉన్నాడని మాత్రం నేను నమ్ముతాను.

ప్రొఫెసర్: అయితే దేవుడు శక్తిసంపన్నుడా?

స్టూడెంట్: కచ్చితంగా దేవుడు శక్తి సంపన్నుడే.

ప్రొఫెసర్: మరి దేవుడు అంత శక్తివంతుడే అయితే నా సోదరుడు కూడా దేవుడిని నమ్ముతాడు. మరి అతడి అకాల మరణాన్ని మీ దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు?

(స్టూడెంట్ మౌనంగా ఊరుకున్నాడు)

ప్రొఫెసర్: సరే...అదలా ఉంచు...దెయ్యం ఉందని నమ్ముతావా?

స్టూడెంట్: నమ్ముతానన్నట్లు తలూపాడు.

ప్రొఫెసర్: మరి దెయ్యం మంచిదా చెడ్డదా?
స్టూడెంట్: చెడ్డదే!

ప్రొఫెసర్: బాగుంది...మరి దెయ్యాన్ని సృష్టించింది ఎవరు? స్టూడెంట్: దేవుడే! ప్రొఫెసర్: మరి దేవుడు సృష్టించిన దెయ్యం చెడ్డది ఎలా అవుతుంది?

(స్టూడెంట్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనం వహించాడు)

ప్రొఫెసర్: లోకంలో మంచి చెడు, పాపం పుణ్యం, ప్రేమ ద్వేషం, ఇలా అన్నీ రెండు పార్శ్వాలుంటాయి. పంచేంద్రియాలతోనే మనం ఏ వస్తువునైనా గుర్తించగలమని మన సైన్స్ చెబుతోంది. దేవుడనే శక్తిని పంచేంద్రియాలలో ఏదీ గుర్తించలేనపుడు దేవుడి ఉనికిని ఎలా విశ్వసించగలం?

స్టూడెంట్: మీరేమయినా చెప్పండి. నేను భగవంతుడిని నమ్ముతాను.

ప్రొఫెసర్: నమ్మకాలు, విశ్వాసాలు కావోయ్...ఆధారాలు చూపు (శిష్యుడిని నిలదీస్తున్నట్లు అడిగాడు)
(గురువు గారికి గుణపాఠం చెప్పాలనుకుని, ఎదురుదాడి మొదలెట్టాడు స్టూడెంట్)

స్టూడెంట్: సార్! వేడి అనే పదార్థం ఉందా? ప్రొఫెసర్: ఉంది నాయనా...

స్టూడెంట్: మరి చల్లదనం?

ప్రొఫెసర్: అదీ ఉంది.

స్టూడెంట్: గురూజీ మీ వాదన తప్పు.. వేడిలో అనేక దశలు ఉన్నాయి...వేడిని ఎంతటి తీవ్రస్థాయికైనా తీసుకువెళ్లొచ్చు. అలాగే తక్కువ స్థాయికి తీసుకురావచ్చు. కాని శీతలం అనే మాటకే అర్థం లేదు. అది కేవలం భావన మాత్రమే.. చల్లదనాన్ని కొలిచే సాధనమేదీ లేదు. వేడిగా లేకపోవడమే చల్లదనానికి నిర్వచనం. వేడి ఒక శక్తి... ఒక ఇంధనం..వేడికి వ్యతిరేకం శీతలం కాదు. వేడి లేకపోవడమే శీతలం.(గురువు ఆశ్చర్యంగా శిష్యుడి వాదన వినసాగాడు).

స్టూడెంట్: ఇక చీకటి మాటేమిడి గురూజీ...చీకటి అనేది ఉందంటారా?

ప్రొఫెసర్: అవును...చీకటి ఉంది...చీకటి లేకపోతే రాత్రి ఎందుకవుతుంది?

స్టూడెంట్: మళ్లీ మీరు పొరబడ్డారు...చీకటి అంటే వెలుగు లేకపోవడం. అంతేకాని చీకటి అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. వెలుగును మనం ఎన్నో రకాల కాంతులతో చూడవచ్చు. మసక వెలుతురు నుంచి ఉజ్వలమైన ప్రకాశాన్ని వీక్షించవచ్చు. వెలుగు ఎక్కడ లేదో అదే చీకటి. వాస్తవానికి చీకటి అంటూ ఏదీ లేదు. చీకటిని ఎంతటి దట్టమైన స్థితికి తీసుకుపోగలరు మీరు?

ప్రొఫెసర్: ఇంతటీ నువ్వు చెప్పదలచుకున్నది ఏమిటి?

స్టూడెంట్: మీ తాత్వికత లోపభూయిష్టమన్నదే నా అభిప్రాయం...

ప్రొఫెసర్: నా సిద్ధాంతం తప్పా? అదేమిటో నువ్వే చెప్పు!

స్టూడెంట్: గురువు గారు..మీది ద్వైదీ భావ సిద్ధాంతం. జీవం ఉందంటారు...మరణం ఉందంటారు..అలాగే మంచి దేవుడు...చెడ్డ దేవుడు అంటారు. మేము ఉన్నాడని భావించే దేవుణ్ని మీరు ఒక ప్రాణమున్న వస్తువుగా నిరూపించమని సవాలు చేస్తున్నారు. నిజానికి మీరు నమ్మే సైన్స్ మనిషి ఆలోచనలను ఏ పరికరంతో పసిగట్టగలదు? ఏ సైన్స్ నేత్రాలకు మనిషి మేథస్సు కనపడుతుంది? జీవానికి వ్యతిరేక అర్థం కాదు మరణమంటే...మరణమనేది ఘనీభవించిన పదార్థం కాదు. జీవం నశించడమే మరణం. కోతి నుంచి మనిషి పుట్టాడని మీరు పాఠాలు బోధిస్తుంటారు కదా...అది నిజమని మీరు నమ్ముతారా?

ప్రొఫెసర్: మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అది నిజమే...

స్టూడెంట్: మీ కళ్లతో మీరు మానవ పరిణామ క్రమాన్ని చూశారా గురూజీ? (ఈ వాదన ఎక్కడికి దారితీస్తోందో గురువుకు అర్థమైపోయింది. ఓడిపోతున్నానన్న భావనకు వచ్చేస్తూ తల అడ్డంగా వూపాడు)

స్టూడెంట్: ఈ లోకంలో ఎవరూ మానవ పరిణామ క్రమాన్ని స్వయంగా చూడలేదు. ఆ పరిణామ క్రమం సర్వ కాలాలలో జరుగుతూ ఉంటుందని మీరు పిల్లలకు బోధిస్తుంటారు..మీరు శాస్త్రవేత్తలా లేక మీరు నమ్మింది చెప్పే ప్రచారకులా?(క్లాసులో విద్యార్థులంతా గొల్లుమన్నారు. ) ఈ క్లాసులో మన గురువుగారి మెదడును ఎవరైనా చూశారా? (పిల్లల నవ్వులతో క్లాసు రూము మార్మోగింది).

స్టూడెంట్: గురువుగారి మెదడును మీలో ఎవరైనా కంటితో చూశారా? నాసికతో వాసన చూశారా? కనీసం ఎవరైనా తాకి చూశారా?అలా ఎవరూ చేయలేకపోయి ఉంటే గురువు గారు నమ్మే సిద్ధాంతం ప్రకారం ఆయనకు మెదడు లేనట్లే..మీ పాఠాలను మేము ఎందుకు వినాలి? (క్లాసులో నిశ్శబ్దం ఆవరించింది. శిష్యుడి వాక్ప్రవాహంలో తడిసి ముద్దయిన గురువు గొంతు పెకిలించుకుంటూ...)

ప్రొఫెసర్: అలాంటి విషయాలను విశ్వాసంతో ముడిపెట్టాలి నాయనా...

స్టూడెంట్: నేనూ అదే అంటున్నాను గురూజీ.....మనిషికి దేవుడికి మధ్య ఉండే అనుబంధం నమ్మకమే. ఆ నమ్మకమే సృష్టిని ముందుండి నడిపిస్తోంది...మనం కూడా అదే నమ్మకంతో ముందుకు సాగాలి.
ఇంత ఆసక్తిగా సాగిన ఈ వాదసంవాదం యదార్థంగా జరిగిన సంఘటన. దీంట్లో కొసమెరుపు ఏమిటంటే ఈ వాదనలో గురువును మూడు చెరువుల నీళ్ళు తాగించిన శిష్యుడు మరెవరో కాదు మన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కావడం విశేషం.

Read more...

ఇంతకంటే ..ఏమిసేసే మిదే ! మా మానసపూజా..సంతతము నీవూ తొల్లేసర్వసంపన్నుడవు.

>> Monday, November 7, 2011

కార్తీక మాసంలో ఈరోజు చినుకు ద్వాదశి పర్వదినం పూజలలో స్వామి వారి కులుకులివి . స్వామివారు దేవేరి మహాలక్ష్మి తోకలసి బృందావనానికి వేంచేశారు . ఆనక షోడశ కళానిధియగు స్వామికి షోడశోపచారములతో పూజ జరిగింది . తదనంతరం స్వామివారి మూలవర్లకు విష్ణుసహస్రనామములతో తులసీదళార్చన నిర్వహింపబడింది. కోటిమన్మథులైనా స్వామివారి అందానికి సరితూగరనేలా ఉన్న ఆరూపాన్ని చూడటానికి కోటికనులులేకపోయె నే అనిపించింది .



సాయంత్రం పీఠంలో జరిగిన జ్యోతిర్లింగార్చనలో కోరినవారికొంగుబంగారమయ్యే పరమేశ్వరులు ఇలా దర్శనమిచ్చారు..





Read more...

ఇంతకంటే ..ఏమిజేసే? మిదే ! మామానసపూజా..సంతతము నీవూ .భలే సర్వసంపన్నుడవు.

ఈ రోజు









Read more...

కోరికలు త్యజిస్తేనే సన్మార్గం

>> Saturday, November 5, 2011


ఆధ్యాత్మికత అంటే కేవలం సర్వసంగ పరిత్యాగులకే పరిమితమైనదని భావించరాదన్నారు అవతార్ మెహెర్‌బాబా. మనం మన ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి, జీవిత లక్ష్యమైన భగవదైక్యం పొందడానికి సాధనచేయాలని మెహెర్‌బాబా తన భక్తులకు అనేక సందేశాలలో ఉద్బోధించారు.

ఆధ్యాత్మికత సాధన మార్గంలో బాహ్యంగా అనేక భోగభాగ్యాలను త్యజించడమే కాదు అంతర్గతంగా కూడా ఐహిక వాం«ఛలపై మమకారం నశించాలని మెహెర్‌బాబా బోధించారు. మనం నిత్యం చూసే ఆకర్షణలన్నీ ఒక మిథ్య అని బాబా వర్ణించారు. ఆ ఆకర్ణణలు ఎంతటి శక్తివంతవైనా వాటికి లోబడక నిత్యజీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా ప్రాపంచిక విధులన్నిటినీ నీతి నిజాయితీలతో నిర్వర్తిస్తూ భగవన్మార్గంలో పయనించాలని బాబా తన భక్తులకు సూచించారు. ఈ విషయమై మెహెర్‌బాబా చెప్పిన ఒక కథాంశాన్ని ఆయన సన్నిహిత మండలి సభ్యుడు ఏరుచ్ జెస్సావాలా ఇలా వివరించారు.

సద్గురు దర్శనం
ఒక చక్రవర్తి తన రాజ్యంలో ఉన్న ఒక సద్గురువు దర్శనార్థం తన కుటుంబీకులు, బంధు మిత్రులందరితో కలిసి ఆయన ఉండే ఆశ్రమానికి వెళ్లాడు. సద్గురువు ఆశ్రమానికి చాలా దూరంలోనే తన అశ్వ, గజ బలాలన్నింటినీ నిలిపివేసి రాజు తన పరివారంతో నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్లాడు.

ఆ ఆశ్రమం బయట ఉన్న కాపలాదారుడికి తాను ఈ రాజ్యానికి చక్రవర్తినని, సద్గురువు దర్శనార్థం వచ్చానని, దయచేసి ఆయన దర్శనం ఇప్పించాలని వినయపూర్వకంగా వేడుకున్నాడు. సద్గురువు నుంచి పిలుపు వచ్చే దాకా వినయంగా అక్కడే వేచి ఉన్నాడు. ఆ తర్వాత సద్గురువును దూరం నుంచి నిలబడే దర్శించుకుని తన బంధు మిత్రులను సద్గురువుకు పరిచయం చేశాడు. సద్గురువు చాలా సంతోషించి అందరినీ కూర్చోబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.

సాధారణంగా సద్గురువులు పెద్దగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయరు. కుశల ప్రశ్నలతోనే వారు అనేక విషయాలు మన నుంచి గ్రహిస్తారు. అనంతరం సద్గురువు లేచి నిలబడి సెలవు ప్రకటించారు. క్షేమంగా వెళ్లమని అందరికీ ఆశీసులిచ్చాడు. అయితే చక్రవర్తి రెండు చేతులూ జోడించి తమరి సందేశ వాక్కులు ఏమైనా ఇవ్వాలని సద్గురువును వేడుకున్నాడు. ఇందుకు సద్గురువు నవ్వుతూ, నా సందేశం కావాలా అంటూ సరే నాకు గుర్తున్న ఒక కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించమని చక్రవర్తికి తెలిపాడు.

రాజ్యం నీళ్లతో సమానం!
రాజా...నీకు వేటంటే ఇష్టమనుకుంటాను అని సద్గురువు రాజును ప్రశ్నించగా అవును...తనకు వేటంటే ఆరోప్రాణమని రాజు బదులిచ్చాడు. తాను చెప్పబోయే కథ కూడా మంచి వేటగాడైన ఒకానొక చక్రవర్తి గురించేనని సద్గురువు కథ చెప్పసాగాడు. అరణ్యంలో మృగాల వేటకు వెళ్లిన ఒక చక్రవర్తి సాయంత్రం దాకా వేటాడి గురి తప్పి, దారి తప్పి , తన వెంట వచ్చిన సైన్యానిది మరో దారైపోగా ఎడారి లాంటి ప్రాంతంలో ఒంటరివాడై పోయాడు. తానెక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఆ చక్రవర్తిది. తన రాజ్యం సరిహద్దులు కూడా అతను దాటేశాడు. దప్పికతో, అలసటతో చక్రవర్తి నేలకొరిగాడు.

ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందా అన్నట్లుంది అతని పరిస్థితి. ఈ సమయంలో ఒక కుండ నిండా నీళ్లు పట్టుకుని నేను ఆ చక్రవర్తి ఎదుట ప్రత్యక్షమయ్యాను. అయితే మంచినీళ్లు ఇవ్వడానికి తగిన మూల్యం చెల్లించాలని నేను చక్రవర్తికి షరతు విధించాను. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని..మీరు ఇచ్చే మంచినీళ్లకు వెల ఎంత చెల్లించమంటే అంత చెల్లిస్తాను అని మూలుగుతూ చక్రవర్తి జవాబిచ్చాడు.ఓ అలాగా! నీ రాజ్యంలో సగభాగం ఇవ్వాలని నేను షరతు విధించాను. అదెంత భాగ్యం...అలాగే తీసుకోండి. కానీ, మంచినీళ్లు దయచేసి ఇప్పించండని చక్రవర్తి ప్రాధేయపడ్డాడు.

మంచినీళ్లు తాగిన చక్రవర్తి బలం పుంజుకున్నాడు. తన రాజ్యానికి వెళ్లేదారి నా నుంచి తెలుసుకుని బయలుదేరాడు. అయితే కొంత దూరం వెళ్లేసరికి చక్రవర్తికి మూత్రవిసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాని ఎంత ప్రయత్నించినా చక్రవర్తికి మూత్ర విసర్జన చేయడం కష్టమవుతుంది. అప్పటికే చక్రవర్తి తన రాజ్యంలోకి ప్రవేశించాడు. మూత్ర విసర్జన కాకపోవడంతో చక్రవర్తికి విపరీతమైన కడుపునొప్పి రావడంతోపాటు దేహంలో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నొప్పి తట్టుకోవడం కంటే మరణమే మేలని చక్రవర్తి భావిస్తాడు.

ఇదిగో ఈ సమయంలో నేను తిరిగి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. నీ బాధ ఏమిటని చక్రవర్తిని అడిగాను.నన్ను చూడగానే పరమానంద భరితుడైన చక్రవర్తి మూత్రవిసర్జన చేయలేకపోతున్నానని, విపరీతమైన కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. ఎలాగైనా ఈ బాధ నుంచి ఉపశమన కలిగించమని చక్రవర్తి నన్ను వేడుకున్నాడు.

ఈ బాధకు నా దగ్గర మందు ఉందని చక్రవర్తికి చెప్పాను. అయ్యా! దయచేసి ఆ మందును నాకు వెంటనే ఇప్పించండి. మీకేమి కావాలన్నా తక్షణం చేస్తాను..ముందు నాకు నొప్పి తగ్గించండి అని చక్రవర్తి వేడుకున్నాడు. నీ రాజ్యంలో మిగిలిన సగభాగం నాకు ఇవ్వమని షరతు విధించాను. అలాగే తీసేసుకోండి. ఎలాగైనా నా ప్రాణాలను మాత్రం కాపాడండి అని చక్రవర్తి ప్రాథేయపడ్డాడు. అతనికి జ్ఞానబోధ చేసి ఆ బాధ నుంచి తప్పించాను అంటూ సద్గురువు తన కథ ముగించాడు. ఇదే నేను నీకు ఇచ్చే నా సందేశం అని సద్గురువు రాజుకు తెలియచేశాడు.

నీ రాజ్యంలో సగభాగం విలువ నీ దేహంలో ఉన్న నీటితో సమానం. మిగిలిన సగ రాజ్య భాగం నీ దేహం నుంచి విసర్జించే నీటితో సమానం....ఇదే రాజుకు సద్గురువు ఇచ్చిన దివ్య సందేశం. నీతి నిజాయితీలతో నీ విధులు నిర్వర్తించు అంటూ సద్గురువు రాజును దీవించి పంపివేశాడు.

Read more...

సజీవ గురువు కావాలి

>> Friday, November 4, 2011


సజీవంగా ఉన్న గురువుకి...దేహం చాలించిన గురువుకి తేడా ఏమిటంటే.... ఎవరైనా సరే గురువైనా...మీరైనా...ఎవరైనా...జీవించి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం...దీని ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వర్ణించనవసరం లేదు. జీవించి ఉండటం ఏ జీవికైనా ముఖ్యమే. దేహం చాలించిన వారు మన జీవితానికి గొప్ప స్ఫూర్తి కావచ్చు. కానీ వారితో పనిచేయలేము. కొంతమంది గురువులు వారు సంపాదించిన ప్రావీణ్యాన్ని బట్టి కొద్దికాలం మాత్రమే పనిచేయడానికి సిద్ధ పడతారు.

ఇటువంటి గురువుల సమక్షంలో వారి శక్తి వలయం సాధనకు దోహదపడుతుంది. కానీ ఇది కేవలం ఒక అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తుంది. లేదా సాగుకు భూమిని సిద్ధం చేస్తుందని అనవచ్చు. అంతే కానీ మీకు కావాల్సిన మార్గదర్శనం దేహం చాలించిన గురువు ఇవ్వలేరు. మీరు సత్సంగంలో కూర్చున్నపుడు అన్నిటినీ గ్రహించే స్థితిలో ఉండరు. ఎందుకంటే మీ మనస్సు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి. మీ మనసు మిమ్మల్ని ఏలుతున్నపుడు మీకు ఒక సహాయం ఎంతో ముఖ్యం. కానీ మీరే గనక గ్రహణ శీలంతో ఉంటే మీకు మార్గదర్శకుల అవసరం ఉండదు. అంతే కాదు మీకు గురువు కూడా అక్కర్లేదు. ఎందుకంటే అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. అలాంటప్పుడు మీకు గురువు...ధ్యానలింగ...ధ్యానం ఇవేవీ అవసరం లేదు.

ఇలా ఉండటం చాలా అరుదు. ప్రస్తుతం మీరెలా ఉన్నారంటే మీలో ఎక్కువ శాతం మీ మనసే నిండిపోయి ఉంది. అంటే మీ గ్రహణ శీలం చాలా తక్కువగా ఉందన్నమాట. ఏదో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు భౌతిక విషయాల్లో లేదా జీవితానికి సంబంధించిన విషయాల్లో మీ మనసు బ్రహ్మాండంగా పని చేస్తుంది. అంటే ఇటువంటి స్థితిలో మరణించిన వాటికి సంబంధించినది ఏది పనిచేయదు. అందుకే దేహం చాలించిన గురువు ఇక్కడ పని చేయలేడు. మీరే గనక పరిపూర్ణ గ్రహణ శీలులుగా ఉన్నారనుకోండి...అప్పుడు మీరు సజీవంగా ఉన్నవారితోనూ మరణించిన వారితోనూ బ్రహ్మాండంగా ఉంటారు.

అంతటా అనుగ్రహం
అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. అది కేవలం ఒక్క చోటే ఉంటుందని అనుకోవడానికి లేదు. కాకపోతే కొన్ని స్థలాల్లో తీవ్రంగా ఉంటుంది. మీ గ్రహణ శీలత తీవ్రతను బట్టి దాన్ని గ్రహిస్తారు. ఇటువంటి ప్రదేశాల్లో మీరు దాన్ని గ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ తోటలో కూర్చున్నపుడు ఇది తోటే కదా అని ఒకలా ఉంటారు. అదే గుడిలో వెళ్లినపుడు మరొకలా ఉంటారు. కొంతమంది ఎంత మొద్దుబారిపోయి ఉంటారంటే ధ్యానలింగంలో కూర్చున్నా ఏమీ అంటనట్లు ఉంటారు.

లింగం పైనుంచి కారే నీటిబొట్లను చూస్తూ కూర్చుంటారు. ఇలాంటి వారిని తీర్థకుండంలో ముంచి మళ్లీ ఆలయంలో కూర్చోపెడతాం. అప్పుడు వారిలో ఏదో కదులుతుంది. వారు కొద్దిగా అనుభూతి చెందుతారు. మరికొంతమంది ఉంటారు. వారు ధ్యానలింగంలో పెద్దగా ఏ అనుభూతి చెందరు. ఇలాంటి వారిని భైరవి ముందు నిలబెడతాం. ఉన్నట్టుండి వారిలో ఏదో మేలుకుంటుంది. అక్కడ ఉన్న శక్తి అలాంటిది మరి అలాగని ఇక్కడేదో తక్కువుందని అనడం లేదు.

కానీ ఇక్కడ ఉన్న శక్తి మీరు గ్రహించేటంత తీవ్రంగా లేదు...అంతే.
అనుగ్రహం అనేది అంతటా ఉంది. కానీ మనం గుడిలోనే దాన్ని ఎక్కువగా అనుభవించగలుగుతున్నాం. మన చుట్టూ ఉన్న జీవశక్తిని మనం అలాగే గ్రహించగలుగుతున్నామా? లేదు కదా ? ఉదాహరణకు మనం పదార్థాలను ఆహారంగా స్వీకరించడానికి ముందు మనకి సులువైన విధానంలో వండుకుంటాం. మేకలు గడ్డి తినేసి బతుకుతున్నాయి కదా అని మనం ఆ పని చేయలేం కదా ? ఈ సృష్టిలోని ఎన్నో క్రిములు, కీటకాలు తొంభైశాతం సూర్యరశ్మి, గాలిపై బతుకుతాయి.

వాటికి నీరు, ఆహారం అవసరం పదిశాతమే. వాటి శరీరమెంత? ఎంతో సూక్ష్మం...అంటే వాటి ఆహారం ఇంకా సూక్ష్మం...అంతే కదా? ఇది మీలో జరగటం కూడా మీరు గమనించే ఉంటారు...మీరు పరమానందంగా ఉన్న రోజు ఎక్కువ ఆకలి వేయదు. ఎంతో తక్కువ తింటారు. ఎందుకంటే మీ గ్రహణ శీలత ఎక్కువగా ఉంది కాబట్టి...అంటే మీ జీవశక్తులకు కావాల్సిన అరవైశాతం పోషణ...సూర్యరశ్మి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వస్తోంది. నలభైశాతం మాత్రమే ఆహారం ద్వారా వస్తుంది.

గురువు సహాయం తప్పదు
అందుకే మీ గ్రహణశీలతను పెంపొందించుకుంటే జీవించి ఉన్నవీ..లేనివీ,ఉనికిలో లేనివి కూడా మీకు తోడ్పడతాయి. అలా కాని పక్షంలో మీకు గురువు అవసరం ఎంతో ఉంది. మీ మనసే మీలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకొని కూర్చున్నపుడు మీకు గురువు సహాయం తప్పదు. నా గురువు ' నిన్ను ప్రేమిస్తున్నాను' అని స్వర్గం నుంచి ఉత్తరం రాస్తారు.... అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు...ఎందుకంటే మీకు నచ్చేవే మీ మనసు చెపుతుంది కదా?

దీన్నిబట్టి మనకు అర్థం అయింది ఏమిటంటే ...మీ మనసు మిమ్మల్ని ఇలా ఏలుతున్నపుడు దాన్ని ఏలడానికి ఇంకొక మనసు కావాలి...తప్పదు. ఇదేమీ అవసరం లేకుండా...మీరు గ్రహణశీలురై ఉంటే...మీకు ఏ దేవుడూ అక్కర్లేదు. ఒక బండరాయి చాలు...అంతెందుకు? ఒక గడ్డిపోచ మీ గురువు అవుతుంది...కానీ ఇది మీ మనసు పూర్తిగా పోయినప్పుడే సాధ్యమవుతుంది. ఇలా కానీ పక్షంలో మీ మనసు కంటే తెలివైన మనసొకటి దాన్ని లొంగతీసుకోక తప్పదు.


[ from andhrajyothy.com]

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP