శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిరుమల విషయంలో ఒళ్ళు దగ్గరపెట్టుకొని మెలగండి ..... లేకుంటే ఇక అథోగతే .

>> Sunday, August 29, 2010

తిరుమల పైనున్న స్వామితో ఆటలు చాలాప్రమాదకరం . భక్తితో కొలచినవారికి కొంగుబంగారమై నిలచే ఆపదమొక్కులవాడు అతిచేష్టాలు చేసే వారిని వడ్డితో సహా కక్కించి మరీ శిక్షిస్తాడు .అది వాని ఒక్కనితో పోదు వాని వంశాన్నంతటినీ వేధిస్తుంది . తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవలో ఉండే పరివార దేవతలు క్షేత్రపాలకులు అన్నీ గమనిస్తుంటారు . ఇక్కడచేసే అపచారం వారి వారి పుణ్యరాశులను కొట్టేసి ,స్వామి వారి పట్లచెసే అపచారాలకు కోపగించేది తీవ్రంగా శిక్షించేది వీరే.

ఈపవిత్ర క్షేత్రంలో మన సమకాలీనులలో అపచారం జరిపినందుకు ఎవరెవరు ఎన్ని బాధలు పడ్దారో ఇప్పటికీ పడుతున్నారో నేను గతంలో ఉదహరించానో పొస్ట్ లో . ఆయన కొండకే ఎసరు తలపెట్టిన వారికి దైవీశక్తులు ఎటువంటి గతి కల్పించారో అందరికీ తెలిసినదే . ఆ ప్రభావమేమిటో మనమికా చూస్తూనే ఉన్నాము .
ఆ ... అలాజరిగితే కొండపై ఇన్ని అక్రమాలు జరుగుతాయా అని ప్రశ్నించవచ్చు. మనం రసాయన శాస్త్ర ప్రయోగశాలలోనైతే వెంటనే చూడగలుగుతాము . కానీ ఇవి జీవితాలలో జరిగే ప్రయోగాలు పరిశీలిస్తేగాని కనపడవు .
కొండమీద తలనీలాలు తీసే వారు ఒక్కోమనిషిదగ్గర ఎంతలేదన్నా ఇరవైకి తక్కువలేకుండా వసూలుచేస్తారు . ఆప్రకారం రోజూ వాళ్ళు సంపాదిమ్చేది వేలలో ఉంటుంది . ఆలెక్కన లక్షాధికారులై పోతుండాలి వాల్లు . కానీ వాళ్ల ఇళ్లలో నిత్యం రోగాలు ,గొడవలు కనపడుతుంటాయి . ఏమయ్యా ! ఇంత సంపాదిస్తున్నారు ఏంచేస్తుంటారిదంతా అని సరదాకి అడిగినవారితో ఎక్కడ బాబూ ! కక్కుర్తిపడి సంపాదిమ్చటమే కానీ ఇంటికెళ్ళెసరికి ఏదో ఒక పెద్ద బాధపెడతాడా వెంకన్నబాబు అని వ్యాఖ్యానిస్తుంటారు.
సరే భక్తులకెందుకు ఈ బాధలు మరి అని అన్నప్పుడు కూడా మనం ఆలోచించాల్సినవిషయాలున్నాయి.
బయట ప్రపంచంలో మనం చేస్తున్న తప్పులు మన్ద్వారా ఇతరులు పడేబాధ ఎలా ఉంటుందో అనుభవం లో చూపిస్తారు స్వామి ఇలా వీళ్ళచేత పీడింపజేసి. అదీగాక తప్పుచేయటం ఎంత పాపమో దాన్నిచూసి మౌనంగా ఉండటం అంతేపాపం అని ఆనాడు మహాభారత యుధ్ధంలో చెప్పనే చెప్పాడుకదా ! ఇలా మనమౌనంవలన కూడా అంటుకున్న పాపం ఇలా పీడిస్తుంది .
ఇతరులను నెట్టుకుంటూ బాధపెడుతూ ,వక్రమార్గాలు,పలుకుబడులద్వారా చేసుకునే దర్శనం ఎన్ని కష్టాలు తెస్తుందో అలాంటిమార్గాలు అనుసరించినవారు ఎవరి జీవితంలో వారు పరిశీలించుకుంటే అర్ధమవుతాయి.

తిరుమల మహాశక్తి క్షేత్రం .విష్ణురూపంలో అర్చావతారంగా వెలసిన పరాశక్తి అక్కడ కొలువైనది . ఎట్టిపరిస్తితులలోనూ వక్రమార్గాలు , అహంకారాలు అక్కడ చూపవద్దు . వీలుకాంటే గుడిముందు సాష్టాంగపడి ప్రభూ ! నీదర్శనభాగ్యం ఇవ్వవా అని ఆర్తితో ప్రార్ధించిరండి .అంతేగాని వేలాదిభక్తులు ముందు వేచిఉండగా మనం దర్పంతో ముందు దర్శనానికి వెళ్లాలని ప్రయత్నించకూడదు. ఈడబ్బులు మనదగ్గర లేకుంటే మనం ఆయన దర్శనం కోసం ఎంత సహనం వహిస్తామో అంత పాటించండి .తద్వారా మన పాపాలు పటాపంచలవుతాయి . ఈ టిక్కెట్లు స్పెషల్ దర్శనాలు స్వామిచెంతచేరిన వ్యాపారులు సృష్టించినవి . తన భక్తులకోసం దిగివచ్చి తనకోసం చెప్పులుతయారు చేసిన భక్తునికోరికమేరకు ధరిస్తున్నస్వామి . తన భక్తుని కోసం ఈనాటికి మట్టిమూకుడులో ప్రసాదం ఆరగించేస్వామి ఆయన. సృష్టిలో సకలానికి మాతృస్వరూపుడు ,పితృస్వరూపుడాయన . బిడ్దలంతా ప్రేమ ఆప్యాయతలతో ఒకరికోసం ఒకరు త్యాగంచేసే దైవీభావనలతో మెలగటం ఆయనకిష్టం . అలాకాక ఒకడు ఇంకొకడి అవకాశాలను లాక్కుంటుంటే తల్లిలాగానే నాలుగుపీకి బుధ్ధి చెబుతాడు . అసలు ఇన్ని అక్రమాలు అక్కడ ఎలా జరగగలుగుతున్నాయి ? మనలో ఉన్న స్వార్ధచింతన ,అహంకారాలవలనే కదా ? అటువంటి పనులకు మనలను ప్రేరేపించేవాల్ల చెంప చెల్లు మనిపిస్తే మరలా అలాంటి సాహసం వాళ్ళుచేస్తారా ?
మనకేకాడికి ,వచ్చినదగ్గరనుంచి మన మార్కెట్ లిస్ట్ చదవటంపైనే గాని .ఇది నాతండ్రి దివ్యధామం ఇలాంటిచోట ఎవడుతప్పుచేసినా నిలదీయాలనే బాధ్యతమనది అని అనుకున్నామా ఎప్పుడైనా ?
నావల్లేమి అవుతుంది ? అని అనుకోవటం .చీ ...ఇక్కడకు రాకూడదు . అంతా మోసం అని వాపోవటం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమే . మననుంచి ఒక్కకేక . ఒక్క ఉత్తరం ముక్క ,ఒకమెయిల్ మనం గమనించిన అంశాలమీద పంపుదాము . ఆమాత్రం స్పందించినా ఈదొంగలగుంపులు పలాయనం చిత్తగిస్తాయి. ఈసారి ఎవరు తిరుపతెల్లినా ఒక గంట సమయం ఇక్కడ అక్రమాలు కనిపెట్టడానికి కేటాయించండి ఫిర్యాదుచేయండి మనజేబులో డబ్బు ఎవడన్నా కొట్టెస్తే ఎంత ఆవేదనచెందుతామో అలా ఫీలవ్వండి ..అది శ్రీవారిసేవలో భాగమని నమ్మండి .
[భక్తజనులందరికీ పాదాభివందనం చేస్తూ ....దుర్గేశ్వర]

ఈ విషయంలో మనకు సహాయపడేందుకు
www.omnamovenakatesaya.com వాళ్ళు ఉన్నారు .చూడండి .అక్కడ మెయిల్ అడ్రస్ లు ఫోన్ నెంబర్లన్నీ దొరుకుతాయి .

Read more...

రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ]

>> Saturday, August 28, 2010

24. రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ]

రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీకాకుళంలో పనిచేస్తూ, ఆ సమయంలో తీవ్రమైన భక్తి శ్రద్ధలతో రాధాకృష్ణుల ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆ ధ్యాన సమయంలో అనేక అనుభూతులకు లోనయ్యేవారు. వారి జీవితమంతటినీ తారుమారు చేసిన ఒక దివ్య అనుభూతి.

ఒక రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అనేక అలంకారములతో కూడుకొని మేలి ముసుగు దరించిన 7 , 8 సంవత్సరముల వయస్సు గల ఒక దివ్యబాలిక వారి వద్దకు వచ్చెను. ఆ దేవత యొక్క దివ్య శరీర కాంతి వల్ల ఆయనకు మెలుకువ వచ్చెను. ఆ బాలికను చూచి శ్రీ రాధికాప్రసాద్ గారు _ " ఎవరు తల్లీ నీవు ? " అని ప్రశ్నించిరి. ఆమె గంభీర వాక్కులతో ఇట్లు పల్కెను _ " ఈ ఉద్యోగము ఎంత కాలము చేస్తావు ? నా వద్దకు ఎప్పుడు వస్తావు ? అని ప్రశ్నించి అంతర్ధానమయ్యెను. ఆ దివ్య దర్శనము తర్వాత వారి హృదయము వారి వశము తప్పిపోయినట్లునిపించెను. అప్పుడు వారు _ " ఏనాడో నేను విడిచి పెట్టిన ఎవరో ఒక ఇష్టదేవత నన్ను మేలుకొల్పింది. ఇప్పుడునేను ధన్యుడనైనాను. ఆమెను విడిచి నేను ఒక ఉద్యోగము చేయజాలను" అని తలంచెను.అప్పుడు బ్యాంకులో వారికి డబ్బు లేదు. పైగా ఏడు, ఎనిమిదిమంది అతిథులు వారిపై ఆధారపడి ఉన్నారు. అప్పటికి వారు రెండు మాసములు ఇంటి అద్దె కూడా బాకీ ఉన్నారు. ఇల్లు, ఉద్యోగం, ధన, ధాన్యాదులు అన్నీ విడిచి పెట్టి పరమేశ్వరి సేవను ఈ జగత్తు నందు ప్రారంభించే సమయం వచ్చిందని గ్రహించారు. ఉద్యోగము, ధన సంపాదనల యందు పూర్ణ విరక్తి కల్గినది. " అమ్మయే నాకు దారి చూపిస్తుంది. అమ్మయే నాకు జీవయాత్ర నిర్ణయం చేస్తుంది." అని భావించి సపరివారంగా బయటకు వచ్చిరి. ఎక్కడకు పోవలయునో, వారికి తెలియదు. ఆ స్థితిలో వారు 8 ,9 మైళ్ళ దూరంలో ఉన్న "ఆముదాలవలస " అను రైల్వేస్టేషన్ చేరారు. ఒక వైపు విశాఖపట్టణం, మరొకవైపు "బరంపురం" వీటిలో ఏ దిక్కుకు పోవలయునో నిర్ణయించుకోలేని స్థితి. ఏదో దైవశక్తి తనను నడుపుచున్నట్లు భావించిరి. ఏ బండి ముందు వస్తే అటు వెళ్ళమనే హృదయ ప్రేరణ కల్గెను. "బరంపురం" బండి ముందుగా వచ్చెను. ఆ బండి ఎక్కి "బరంపురం" స్టేషన్ లో తన పరివారంతో దిగిరి. అక్కడ వారికి తెలిసిన వారు ఎవరూ లేరు. ఏమి చేయాలో, ఎవరింటికి వెళ్ళవలెనో తెలియని స్థితి. ఆ స్థితిలోనే గుర్రపుబండిలో కూర్చుండెను. అంత బండి వారు _" స్వామీ ! ఎక్కడికి వెళ్ళాలి" అని ప్రశ్నించగా మనసు ప్రేరణ వల్ల " ఈ పురము నందు రాధాకృష్ణ మందిరము ఎక్కడ్ ఉన్నదో అక్కడికి పోనిమ్మని బండివానిని ఆదేశించెను. బండి వాడు కూడా కొత్తవాడు కావటంవల్ల వాడికి రాధాకృష్ణ మందిరము ఎక్కడ ఉన్నదో తెలియదు. ఎన్ని వీధులు తిరిగిననూ, ఎచటకు పోయిననూ రాధాకృష్ణ మందిరము ఎక్కడ ఉన్నదని ఎవరూ వారికి చెప్పలేదు. ఊరు అవతలకు పోయినప్పుదు ఒక బాటసారి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారిని చూచి _ " అదిగో ఆ వీధిలో రాధాకృష్ణ మందిరము నిర్మించుటకై ఒక షావుకారు పని చేయుచున్నారు. అని దారి చూపించెను. అక్కడికి వెళ్ళి చూడగా _ ఆ ఇంటిలో ఒకే గది, ఒకే వరండా తయారైనవి. గర్భాలయము తయారగుచున్నది. గర్భాలయము ప్రక్కన రెండో అంతస్థుకు దారి చూపు కొన్ని మెట్లున్నవి. అదే సమయంలో ఒక షావుకారు మా వద్దకు వచ్చి _ "అయ్యా ! మీరు మహిమాన్వితులని, దీర్ఘరోగములను హస్తస్పర్శ మాత్రముననే పోగొట్టుదురని విన్నాము. నా భార్య కొన్ని సంవత్సరముల నుండి మూర్ఛ రోగముతో బాధపడుచున్నది. నాకు ఏ దిక్కు తోచలేదు. అన్ని వైద్య సహాయములనూ నిష్పలమయ్యెను. దయ ఉంచి నా భార్యను కాపాడుము" అని ప్రార్హించెను. ఆ క్రొత్త ప్రదేశంలో అప్పుడే ఆ ఇంటిలో ప్రవేశించినాము. అప్పుడే మేము వైద్యము చేయగలమను విషయము ఎవరు8 బయటపెట్టినారో శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి అర్థం కాలేదు. ఏదో విచిత్రమైన దేవతామాయ అని భావించిరి. షావుకారు తన భార్యను బండి నుండి క్రిందకు దింపెను. ఏమి చేయవలెనో దిక్కు తోచని స్థితి. క్రొత్త ప్రదేశం, క్రొత్త వ్యక్తులతో సంబంధము, రోగిని తీసుకువచ్చి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఎదుట కూర్చుండబెట్టిరి. అంత:ప్రేరణవలన శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు " ఆ రోగిని రెండవ అంతస్థుకొరకై వేయబడిన మెట్లను ఎక్కమని" పల్కిరి. తీవ్రమైన నరముల దుర్బల స్థితిలో వున్న ఆమె, ఒకటి ఒకటిగా మెట్లన్నియూ ఎక్కినది. ఎవరి సహాయము లేకుండా మెట్లెక్కుట ఆమె భర్త చూచునాడు. మితిమీరిన ఆశ్చర్యముతో రాధికా ప్రసాద్ మహారాజ్ గారి పాదములపై బడి _ " నాయనా ! నీవు తప్ప నా భార్యకు స్వస్థత చేకూర్చు వారు మరెవరునూ లేరని నేను తెలుసుకున్నాను. మిమ్ములను గూర్చి నేను విన్న మాట సత్యము" అని పలికి నమస్కరించెను. ఇది జరిగిన గంటలో ఒక గుర్రపు బండి నిండా భోజన పదార్థములు వచ్చాయి. వాటిని చూపుతూ ఆ షావుకారు _ " స్వామీ ! ఇందులో మీకు కావలసిన వస్తువులన్నియు ఉన్నవి. పాపం మీరు ఎప్పుడు భోజనం చేశారో , వెంటనే కాఫీ, ఫలహారములు చేయించుకొని తినుడని" చెప్పినాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్ననూ మహాదేవి అన్నియూ సమకూర్చుచున్నది. ఈ ఇంద్రజాలమునకు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆశ్చర్యపడిరి. మరునాడు ఒక వ్యక్తి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ కడకు వచ్చి _ " స్వామీ ! మా అన్నగారు డిప్యూటీ కలెక్టరుగా ఉండి బదిలీ అయిపోయినారు. ఆయన కాపురం ఉన్న మేడ ఖాళీగా మా ఆధీనములోనే ఉన్నది. మీరు అక్కడకు వచ్చినచో ఊరంతటికి మంచి కేంద్రముగా ఉంటుంది" అని పల్కి సామానులన్నింటిని ఆ మేడ పైకి చేర్పించెను. రాధికాప్రసాద్ మహారాజ్ గారు అక్కడ ఒక మాసం పైగా ఉన్నారు. వందలాది ప్రజలు వారిని చుట్టుముట్టిరి. ఒక ప్రక్క భగవన్నామము, ఒక వైపు అన్నదానము లో వీటితో అంతా కోలాహలమే. అక్కడ నుండి కటక్ పురమునకు వెళ్ళుటకు ఏర్పాటు పూర్తి అయినది. ఊరిలోని పెద్ద పెద్ద కుటుంబములకు చెందిన మహిళలందరూ, శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారితాఓ, శ్రీ రాధామహాలక్ష్మమ్మ గారితో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకొనిరి. ఆ ఫొటో ఈనాటికీ గుంటూరులోని రాధాకృష్ణ మందిరమందున పదిలపర్చబడి ఉన్నది.

( 25. గుంటూరులో రాధాకృష్ణమందిర ఆవిర్భావం 1957 ) :

రాసేశ్వరి రాధారాణి ఆదేశం మేరకు వారిరువురూ గుంటూరులో " రాధాకృష్ణ మందిర" నిర్మించాలని తలపెట్టారు. కాని దానికి కావలసిన ధనం లేదు. విగ్రహములు ఏ జైపూర్ నుండో తెప్పించాలి. కొన్ని వేల రూపాయలు ఖర్చు. అయినా సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల అవన్నీ సమకూరినవి. దైవీ ప్రేరణచే ఒక మంత్రివర్యుడు విగ్రహములకయ్యే ఖర్చు తానే భరిస్తానని ముందుకు వచ్చి కొన్ని వేల రూపాయలు భక్తితో సమర్పించారు. దాని ఫలితముగా అందమైన పాలరాతివిగ్రహములు ఉత్తర హిందూ స్థానము జైపూర్ నుండి గర్తపుర వీధులకు దిగి వచ్చినవి. ఈ విధముగా వారి దివ్య సంకల్ప బలం వల్ల గుంటూరులో అరండల్ పేట ఐదవలైనులో "రాధాకృష్ణమందిర్" ఆవిర్భావం జరిగింది. ఆ సమయంలోనే వీరు ( రాధికాప్రసాద్, రాధామహాలక్ష్మీ ) " వేణుగానం" అనే పత్రికా నిర్వహణ కూడా చేశారు. ఆ వేణుగానమనే పేరుటో చాలా సంవత్సరములు మనోహరమైన ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించిజ్ జిజ్ఞాసువుల హృదయాలలో దివ్యభక్తి చంద్రికలను వెదజల్లి సాంస్కృతిక స్పురణ ఎంతగానో కలిగించారు. శ్రీ రాధికాప్రసాద్ గారి నేతృత్వంలో ఈ పత్రిక లండన్, దక్షిణ ఆఫ్రికా, బర్మా మొదలగు విదేశాలకు కూడా వెళ్ళి అక్కడి భక్తులను ఆనందపరుస్తూ ఉండేది. యేర్పేడులోని మళయాలస్వామి, హృషీకేశ్ లోని శ్రీ శివానంద సరస్వతీ మహారాజ్ మొదలైన మహాపురుషులెందరో ఈ పత్రికను పోషించి అభిమానించారు. ఇందులో వెలువడిన అమూల్య రచనలు సాధకులకు, భక్తులకు ఎంతగానో ఉపకరించినవి.

మానవసేవ చేస్తే మాధవుడు సంతోషిస్తాడని ఆర్యోక్తి. అందులకే ఆర్తులను, అనాధులను ఆదరించే మందిరముగా రాధాకృష్ణమందిరం ఖ్యాతిని గడించింది. పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు,రాధామహాలక్ష్మీ గారు ఇరువురూ, వ్యాధిగ్రస్తులై అలమటించు వారిని, దుష్టగ్రహ పీడచే సతమతమగువారిని చేరదీసి వారికి స్వస్థత కూర్చేవారు. అలా వారి నుండి మేలు పొందిన వారు, వారి దివ్య ప్రేమ జీవన స్రవంతిలో మజ్జనమాడినవారు ఆసేతు శీతాచలంలో వేలకు వేలున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందులో కొన్ని సంఘటనలను మటుకు ఇక్కడ పేర్కొనటం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

బందరులో ఆంధ్ర బ్యాంకులో మొండ్రేటి వెంకటేశ్వరరావు అనే ఉద్యోగి ఉండేవారు. అతనికి తీవ్రతరమైన ఉన్మాదం కలిగింది. అతని వల్ల కలిగే న్యూసెన్సు భరించలేక ఇరుగు పొరుగు వారు పోలీసు రిపోర్టు ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇండ్ల మధ్య ఇంత గోల ఉండరాదని ఎక్కడికైనా వెళ్ళమని ఆజ్ఞాపించారు. బ్యాంకు అధికారులు ఉద్యోగం తొలగిస్తామని నోటీసులు పంపించారు. ఆ స్థితిలో కాళ్ళు చేతులు గొలుసులతో కట్టి రాధికాప్రసాద్ గారి వద్దకు తెచ్చారు. తల్లిదండ్రులకు అతను ఒక్కడే కొడుకు. ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన వర్ణనాతీతం ఆ ఉన్మత్తుణ్ణి బాగు చేయటానికి రాధికాప్రసాద్ గారు నిశ్చయించుకొని ఒక తేదీ సూచించి ఆ తేదీ కల్లా అతనికి ఆరోగ్యం కలుగుతుందని, ఉద్యోగ విషయంలో భయపడవలసిన పని లేదనిహామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ఇచ్చిన తేదీఇ శ్రీ వెంకటేశ్వరరావు స్వస్థుడైనాడు. అతను ఇప్పుడు ఉన్నత ఉద్యోగంలో కులాసాగా ఉన్నారు.

నెల్లూరు జిల్లా కావలి వద్ద సిద్ధన గొండూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వర్ధనేని రంగప్పనాయుడు సుసంపన్న గృహస్థు. అతని భార్య మస్తానమ్మ అతి తీవ్రమైన ఉదరశూలతో బాధపడుతూ ఉండేది. మద్రాస్ లోని సుప్రసిద్ధ సర్జన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ ఆమెకు ఆపరేషన్ చేసి, ఇంక మళ్ళీ బాధ వస్తే చేయగలిగిందేమీ లేదని చెప్పి పంపారు. స్వగ్రామానికి వచ్చిన కొద్ది మాసాలకే నొప్పి తిరగబెట్టింది. తుది ప్రయత్నంగా మళ్ళీ మద్రాస్ బయలుదేరారు. కావలి స్టేషన్ లో వీరి బంధువొకడు మద్రాసుకు బయలుదేరుతున్న వీరిని చూచాడు. అతడికి రాధికా ప్రసాద్ గారి గురించి తెలుసు. ఆ సమయంలో రాధికా ప్రసాద్ గారు కావలిలో ప్రసిద్ధుడు శ్రీ శేషాచలంసెట్టి యొక్క బృందావమనే పేరు గల ఆరామ భవనంలో విడిది చేసి యుండి తీర్థ ప్రసాదములతో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. వారిని ఆశ్రయిస్తే ఆమె బ్రతుకుతుందని ఆ బంధువు వాళ్ళను ప్రోద్భలపరిచి ఆ రాత్రి 9 గంటలకు బృందావనం దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ వ్యాధి మూలాన్ని దివ్య దృష్టివల్ల తెలుసుకొని కుదురుస్తానని వాగ్దానం చేశారు వారు. మర్నాటి కల్లా శూల బాధ తగ్గింది. కొద్ది రోజుల్లో వ్యాధి మొత్తం సమూలంగా తొలగిపోయింది. శ్రీ రంగప్పనాయుడు వారిని తన గ్రామం సగౌరవంగా తీసుకెళ్ళి పెద్ద ఉత్సవాలు చేశాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఇంటింటా వారి ఫొటోలు పూజా స్థానంలో చూడవచ్చు.

రాధికా ప్రసాద్ గారు, రాధామహాలక్ష్మీ గారు ఇరువురూ మూగజీవులపట్ల ఎంతో ప్రేమ కల్గి యుండేవారు. ఆశ్రమంలోని ఆ మూగజీవాలకు కూడా వాళ్ళంటే ఎంతో ప్రేమ.

ఈ విధంగా ఇటు మానవసేవ _ మాధవసేవ చేస్తూ తమ జీవితాలని చరితార్ధం చేసుకుంటున్న తరుణంలో రాధామహాలక్ష్మి గారికి "గర్భకోశ వ్యాధి" వచ్చెను. అది పెరిగి రాయవెల్లూరు తీసుకెళ్ళినా ప్రయోజనం లేని స్థితికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు పదహారు సంవత్సరాల క్రిందట వచ్చిన అనుభూతి మళ్ళి మరింత తీవ్రతరంగా రావటం మొదలుపెట్టింది. తన నిజ ధామం ఏ దేవతాభూములలోనో ఉన్నట్లు, అనారోగ్య పీడితమైన యీ దేహం వదలి త్వరలోనే తన స్వస్వరూపాన్ని పొందే సమయం సమీపించినట్లు తోచటంప్రారంభమైనది. తన లౌకిక బాధ్యతలన్నీ శ్రీ రాధికా ప్రసాద్ గారికి అప్పగించి చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఆవిడను ఇంకా సమర్ధులైన డాక్టర్లకు చూపించాలని చుట్టూ ఉన్న జనం తాపత్రయపడుతూనే ఉన్నారు. 19_4_1973 వ తేదీన రాధామహాలక్ష్మి గారిని తీసుకొని వెళ్ళి హైదరాబాద్ లోని నర్సింగ్ హోమ్ లో చేర్చారు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేయడం ప్రారంభించారు. మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే రాధామహాలక్ష్మి గారి ప్రాణాలు అనంతాకాశంలోకి వెళ్ళి పోయినవి. ఆవిడ తను చేరుకోవలసిన రసధామాన్ని చేరుకొంది.

రాధామహాలక్ష్మి గారు ఆశ్రమంలోని మూగజీవాలకు స్వయంగా మేత వేసేది. లాలించేది. ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది. రాధామహాలక్ష్మి గారు ఆవుకు తనపేరే పెట్టారు. ఆవిడకు ఆ ఆవు అంటే ప్రాణం. ఆ ఆవు కూడా ప్రతిరోజు రాధామహాలక్ష్మి రాకకై ఎదురుచూస్తూ ఉండేది. దానికి ఒక దూడ. రాధామహాలక్ష్మి దానికి మాధవుడు అని పేరు పెట్టారు. రాధికాప్రసాద్ గారు కూడా ఈ ఆవును యెంతో ప్రేమతో చూసేవారు. రాధామహాలక్ష్మి గారు నిత్యలీలలో ప్రవేశించిన తర్వాత ఈ ఆవు ఎందుకనో తెలియదు కాని మూడు రోజుల పాటు గడ్డి కాని, నీరు కాని, ముట్టనైనా ముట్టలేదు. బహుశా దానికి తెలిసి ఉంటుంది,ఇన్నాళ్ళు తనను ఆదరంతో సాకిన కరుణామయి రాధామహాలక్ష్మి నిత్యకుంజలో ప్రవేశించిందని. "మూగజీవానికి సైతం హృదయం ఇచ్చిన భగవంతుడు ఎంత కరుణామయుడో కదా !" ఆవు దాణా వేసినా ముట్టడం లేదు. నీరు సైతం త్రాగటం లేదు" అని ఎవరో చెప్పగా రాధికాప్రసాద్ గారు ఆ గోమాత వద్దకు చేరి, తన చేతుల్తో దానిని నిమిరి ఆహారం తినిపించి " అమ్మా ! రేపు వస్తానమ్మా !" యని పల్కెను. ఆవు ఏదో అర్ధమైనట్లు తల ఊపెను. కాని మరునాడు పనుల ఒత్తిడి వల్ల రాధికాప్రసాద్ గారు దాని వద్దకు వెళ్ళుటకు కుదరలేదు. అది ఆ రోజున రాధికాప్రసాద్ గారి దర్శనము కొరకు ఎంతగానో నిరీక్షించింది. మధ్యాహ్నం 12 గంటలకు విషయం గుర్తుకు వచ్చిన రాధికాప్రసాద్ గారు హుటాహుటిన ఆవు దగ్గరకు చేరారు. అది రాధికాప్రసాద్ గారిని అలాగే చూస్తూ కన్ను మూసింది. పూజ్యులు రాధికాప్రసాద్ గారు దానిని మాత రాధామహాలక్ష్మిని పూడ్చిన స్థలముననే పూడ్చిరి. మరుసటి రోజు స్వప్నంలో ఆ ఆవు ఒక సుందర బాలిక రూపం ధరించి రాధికాప్రసాద్ గారితో " ఇన్నాఅళ్ళూ మీ వద్దనే యుండి, మీ సాంగత్యంవల్ల, ప్రేమ వల్ల నాకు సద్గతి ప్రాప్తించింది" అని పలికి అదృశ్యమయ్యెను.

26. శ్రీ రాధామహాలక్ష్మి గారి సందేశాలు :

శ్రీ రాధామహాలక్ష్మి గారు శరీరాన్ని వదలిన తర్వాత కూడా రసయోగి ఆహ్వానంపై అప్పుడప్పుడూ తపోభూముకల నుండి క్రిందకి దిగి వచ్చి తన అమృతమయ సందేశాన్ని అందిస్తూ ఉండేవారు. ఆమెను రసయోగి అంజనీమాత యందు ఆవాహన చేయించేవారు ఆవిడ ఊర్ధ్వలోకములనుండి క్రిందికి దిగి వచ్చి అంజనీమాత రూపమున తన సందేశమును ఇచ్చి తిరిగి వెళ్ళి పోయేది. ఆమె అలా రెండు సార్లు తపోభూమికలనుండి దిగివచ్చి తన సందేశములను ఇవ్వడం యువకుడు చూసెను. ఒక సందేశమును తనే స్వయంగా లిపిబద్ధముకావించెను. ఆ రెండు సందేశములను ఇక్కడ ప్రచురించుచున్నవారము.

శ్రీ రాధామహాలక్ష్మి అమ్మగారి అనుగ్రహ భాషణ

( తేదీ 15_1_1999 రాత్రి గం. 11 లకు )

గుంటూరు

నాజీవితమును ధామమునకు చెందిన వాడు కొన్ని కారణములచేత ఆ ఈ ధామములోకి ప్రవేశించటానికి అవకాశము కలిగినది. ఈ ధామము యొక్క బహుశక్తివంతమైన రసతత్వాన్ని ప్రచారము చేయుటకు కొందరి జీవులయొక్క కర్మశేషాలను నివారించటానికి, ఆ నివారణ వల్ల తానీ పుణ్యము కూర్చి ఇతరులకు శాంతిని చేకూర్చటానికి.....ఈ జీవంతులకు సహజములైన జీవులకుండు ఏ కర్మయు లేదు. వీరిని ఆశ్రయించిన జీవులయొక్క కర్మఫలములనే తాను పొంది అనుభవించుచూ, తన నిజస్వరూపమగు సఖిగా రాధారాణి పరివారములో చేరి, నిత్య నికుంజ సేవకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నారు. ఇహలోక సంబంధమైన వ్యవహార విషయంలో గాని ఏ సంబంధము లేదు. రసతత్వమే తన ఉపాసన. ఆ రసము యొక్క ఉపాసనయే సఖీ భావము. అనగా తానే సుఖమునూ అనుభవించక అమ్మ సుఖములకై తాను నిరంతరమును అహర్నిశలు పాటుపడుచున్నారు. ఇంకా కొంతకాలమే ఈ ధరణి పై ఉండి ఆ రాధారాణి యొక్క సఖీ పరివారములో సఖీగణములో చేరి ఆ అమ్మ నిత్య సేవలో నిత్య నికుంజ సేవానుభూతిని పొందే అవకాశమున్నది. ఆ సమయంలో గల ఈ జీవుల యొక్క కర్మవాసనలను తాను తెలుసుకొని అనుభవిస్తారు. ప్రారబ్దము తనది కాదు. జీవుల యొక్కది. నిత్యం జరిగే లీల అమ్మ యొక్క లీల. అమ్మ లీలలో తాను సఖియై నిత్య నికుంజములో గంధనానులేపనాల సేవ చేయుచూ అచటి అమ్మ యొక్క సేవామృతం పొందుట కొద్దికాలములో జరుగుచున్నది. ఇది గొప్ప కేంద్రము. కేవలం ఇచట విశ్రాంతి తీసుకొని, నిద్రించిన చాలు, కొన్ని వాసనలు తొలగిపోవును. అసలు ధామము బృందావన ధామము. ఇతని యొక్క ధ్యేయం నిరంతరం తన మనసు బృందావనము.....బృందావన రాధాకృష్ణ రసమే ఈయన జీవితము. రసమే ఈయన జీవితము. నిత్య నికుంజసేవలో కొంతకాలం.......ఈ జీవితం అమ్మ సేవా సుఖమే ఈయన జీవిత లక్ష్యం. జీవుని నిరంతర స్మృతియే ఈ ధామానికి సరియగు సోపానం. అదియే ధ్యేయం..........

నాన్నగారు : బిగ్గరగా చెప్పమ్మా

అమ్మ : పని పూర్తి యైనది. చెప్పలేను. ఈ శరీరం తట్టుకోలేదు. ఇక వెళ్ళొస్తాను

నాన్నగారు : బిగ్గరగా చెప్పమ్మా

అమ్మ : నేను ఇక విశ్రాంతి తీసుకుంటాను

శ్రీ రాధామహాలక్ష్మి అమ్మగారి అనుగ్రహ భాషణ

( తేదీ 14_1_1998 రాత్రి గం. 11 లు)

గుంటూరు

పవిత్రధామం ఈ ధామము. బృదావన ఆధ్యాత్మిక సంపద ఇక్కడ ఉన్నది. అద్భుత ఆధ్యాత్మిక చైతన్యం ఇక్కడ కదలాడుతున్నది. రాధికాప్రసాద్ మహారాజ్ రాధారాణి సఖీగణములో ఒకరు. మన పుణ్యము కొద్ది ఈ శరీరాన్ని దరించి ఆ సఖి వచ్చింది. ఎవరునూ వారిని విడువవద్దు. ఆయనను అంటి పెట్టుకొని ఉండటము వలన రాధారాణీని చేరు మార్గము సులభము అవుతుంది. ఈ ధామము మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన ధామంగా మరింత ప్రసిద్ధి గాంచనున్నది. రాధారాణి సఖీగణము పిలుపు మేరకు నేను ఆధామమునకు త్వరలో చేరనున్నాను.

శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ ఈ విధంగా అన్నారు :

అమ్మత్వరలో రాధారాణి సఖీగణములో చేరనున్నది. ఇకపై ఇచ్చటకు వచ్చుట కష్టము కావచ్చును. ఈ ధామమును వదిలి ఆ రాధాధామమునకు వెళ్ళుట కారణముగా ఇక్కడకు వచ్చుటకు రాధారాణి అనుజ్ఞ కావలసివచ్చును. అందువల్ల ఇక పై సంవత్సరము ఇప్పుడంత సులభముగా రాకపోవచ్చును.

పైన శ్రీ రాధామహాలక్ష్మి గారు ఇచ్చిన సందేశానుసారం పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారు శ్రీ రాధాజీ యొక్క ఇష్టసఖియని, జీవులకర్మ వాసనలును తొలగించి వారిని రసోమార్గమున పయనింపచేయుటకు రాధారాణియే స్వయంగా వారిని భూమికి పంపిందని, ఆయన జీవితము రసమయమని వారిని అంటి పెట్టుకొని యుండు సాధకునికి అతని గమ్యమార్గము సుగమము కాగలదని తెలియచున్నది. ఇది మన పూర్వజన్మ సుకృతమే అటు వంటి సిద్ధయోగులు, రసోపాసకులు మన మధ్య మన వానిగా తిరగటం. ఆ మహానీయుని బాటలో నడుద్దాం, ఆ మహానీయునిని కొలుద్దాం. ఇది మన కర్తవ్యం, బాధ్యత.

27. తిరుపతి వెంకన్న సన్నిధిలో రసయోగి

1971 _ 72 నాటి మాట. ఆనాటి కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య గారి భార్య శ్రీమతి లక్ష్మీరెడ్డి గారికి శునకములను పెంచే అలవాటు ఉంది. పాశ్చాత్య దేశముల నుండి కూడా శునకములను తెప్పించేవారు.కానీ ప్రతి వారమూ ఒక కుక్క చొప్పున కారణము లేకుండగనే తలతెగి క్రిందపడి చనిపోఉఎడిది. అప్పుడు డిల్లీలో ఉండే అనేకమంది జంతు వైద్యులును, మంత్రవేత్తలను పిలిపించి చూపించిరి. కానీ వారెవరికి విషయము అంతుబట్టకపోయినది. అప్పుడు దానం వెంకటరెడ్డి గారు తన మేనకోడలు ( క్రొత్తరఘురామయ్య గారి భార్య) తో రసయోగి విషయము తెలియబరిచిరి. అప్పుడు ఆమె గుంటూరు వచ్చి రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారిని కలసి విషయమును తెలియబరచెను. రసయోగి వారిని కొలది కాలము ఆశ్రమంలో ఉండమనెను. ధ్యానంలో వారి పరిస్థితి పూర్వాపరాలను గమనించిరి. ఫలితంగా వారికిఆ ప్రమాదం పూర్తిగా తొలగినది. ఆమె ఆనందంతో రసయోగికి ప్రణమిల్లెను. అటు పై ఆమె ఒకసారి రసయోగిని తన కారులో తిరుపతి తిరుమలకి తీసుకెళ్ళటం జరిగింది. తిరుమలలో మంత్రులు విడిది చేసే ప్రత్యేక మందిర ద్వారము నుండి వారిని స్వామి వారి గర్భాలయమునకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ ఆలయ ప్రధాన పూజారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శయ్యాగారము నుండి ఒక ప్రత్యేక తాంబూలమును తీసుకొని వచ్చి రసయోగికి ఇచ్చెను. " ఇది ఒక అపురూప ప్రసాదము. ఎవరికినీ దీనిని ఇవ్వరు. కానీ మీకు ఇవ్వమని స్వామి ఆజ్ఞ" అని ప్రధాన పూజారి పల్కెను. ఆ మహాప్రసాదమును అక్కడే నోటిలో వేసుకొనిన రసయోగి " ఈ అపురూపమైన ప్రసాదమును ప్రధాన పూజారి సామాన్యముగా ఎవరికినీ ఇవ్వడు. అట్టి ప్రసాదమును ప్రధానపూజారి నన్ను ఆహ్వానించి, నాకు నమస్కరించి, ఆ ప్రసాదమును నా చేతిలో పెట్టెను. దీని వెనుక ఏదియో అంతరార్ధముండి ఇండవలెనను " ఆలోచనలో నుండగా ఆయన మనోఫలకమున ఒక భావము ఉదయించెను _ " స్వామి వారి శయ్యాగారములో నాకు ఏదో ఆధ్యాత్మిక సంబంధముండినది. అందువలనే ఆ విషయము గుర్తు చేయుటకై కలియుగ వైకుంఠమగు తిరుమల శ్రీనివాసుని శయ్యాగారములో తాంబూలము నాకు లభించినది. ఇది స్వామి సంకల్పమే. ఈ జన్మకు ఇది చాలు. స్వామి నా హృదయంలోనే ఉన్నాడు. ఇకపై నేను తిరుమలకు రావలసిన పని లేదు. స్వామి దివ్య దర్శనం అయింది " . ఎంతో ఆనందంతో ఆ మధురానుభూతిని హృదయఫలకం పై పదిలపరచుకొని రసయోగి వెను తిరిగెను. మరల మఖ్ఖీ తిరుపతికి వారు వెళ్ళలేదు.

Read more...

ఓరి ! మీ కెరీర్ కాశీకెళ్ళా ,! ముందు పెళ్ళిచేసుకోండినాయనా ! పెళ్ళికాని ప్రసాదులూ .

>> Friday, August 27, 2010

ఈకాలం లో చదువులమీద ,కెరీర్లమీద పిల్లకాయలకు శ్రద్ధఎక్కువైపోతుంది. జీవితంలో ఎదగాలనుకుని ఎంతో కష్టపడుతున్నారు . హార్డ్ వేర్లు షాఫ్ట్ వేర్లు .ఎమ్సీఏలు .ఎమ్బియ్యేలూ ఒకదానితరువాత మరొకటి చదువుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొర్సులు రావటం పోటిప్రపంచంలో వెనుకబడగూడదనుకుని బాగా చదువుకుంటున్నారు . కెరీర్లో పైకిపైపైకి ఎదగాలనుకుని అలుపెరుగక శ్రమిస్తున్న కుర్రాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తున్నది. కానీ జీవితంలో అతిముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనిపిస్తున్నది .ఈడబ్బు ,కెరీర్ తరువాత వస్తాయేమోగాని వయస్సురాదుకదా ! అందుకే కుర్రాళ్లకు రెండుముక్కలు చెబుదామని పిస్తున్నది .

ఈమధ్య మా బంధువులమ్మాయికి ఒక సంబంధం వచ్చింది కుర్రాడు చాలామంచోడు . ఢిల్లీలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు ఎనభైవేలదాకా సంపాదిస్తున్నాడట . అన్నీ బాగనే ఉన్నాయి కుర్రాడుకూడా గడబొంగులా ఎత్తుగాఉన్నాడు అంతవరుకూ బానే ఉంది . వయసు మాత్రం 38 దాకా ఉన్నాయి . ఇప్పటిదాకా చదువు మీద దృష్టిపెట్టటం వల్ల పెళ్ళి గూర్చి ఆలోచించలేదట. వీల్లు మొత్తం అయిదుగురు సంతానం వీళ్లనాన్నగారు అటెండర్ గా పనిచేసేవారు .ఎప్పుడు ఆన్లైన్లో ఉండేవాడుకూడానట . కాబట్టి కష్టాల్లో పెరిగారు కనుక చదువుమీద .ఉద్యోగాలపైన దృష్టి పెట్టటం వలన అందరికీ లేట్ మారేజ్ లే . పాపం ఈ కుర్రోడు ఆఖరివాడు . ఇక ఈ పిల్లోడ్నిచూసినకాడనుండి అమ్మలక్కలంతా బాగాముదిరిపోయాడు .ఇంతకాలం పెల్లెందుకు కాలేదో ? ఏదో ఉండి ఉంటుంది . అయినా వయస్సంతా అయిపోయాక ఈపిల్ల ఏం సుఖపడుతుంది ? అని మెటికలు విరవటం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇంతవయస్సయినవాడికి పిల్లనివ్వటం బాలేదనిపించి సంబంధం వద్దనుకున్నారు.

ఇలా ఇక్కడ అంతర్జాలం లో పరిచయమైన కుర్రాల్లుకూడా బాగా చదువుకుంటున్నారు . ఇలా సదువుకుని, సదువుకుని అసలు సమస్యను గుర్తించటం లేదు . ఏవయస్సుముచ్చట ఆవయస్సులో జరగాలంటారు పెద్దలు . ధర్మార్ధకామమోక్షాలు వరుసలో సాధించాలి . అందుకు వైవాహిక జీవితం చక్కని బాట. మనిషికి డబ్బుకంటే విలువైనది జీవితం . ఏది సాధించిన ఏస్థితిలో ఉన్నా ,అభినందించి అండగానిలచి సంతోషాన్ని పంచేది జీవిత భాగస్వామే. అదీగాక సరయిన వయస్సులో పిల్లలు పుడితే శరీరం లో ఓపిక ఉన్నప్పుడే బరువులు బాధ్యతలను అలఓకగా నిర్వహించగలుగుతారు. బాగా ముదిరి పోయాక పెళ్ళిచేసుకున్నా సంసారజీవితంలోమాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించలేరు. పెద్దవయస్సులో పుట్టే పిల్లలు పెద్దయ్యేసరికి వీల్లుపెద్దవాళ్లయి పోయి బాధ్యతలు పెనుబారమవుతాయి .

పెళ్ళిచేసుకుంటే చదువు సాగదు. కెరీర్ లో ఎదగలేమనుకోవటం భ్రమ . మనోసంకల్పం ఉంటే అవేమీ ఆటంకాలు కావు. పైగా సహకారాన్నికూడా అందిస్తుంది కుటుంబం . కేవలం చేతినిండా డబ్బు .ఇంటినిండా వస్తువులుంటేనే సుఖసంతోషాలుంటాయనే అపోహ వదలండి . సంతోషం అనేది మనమనస్సుకు సంబంధించింది . కెరీర్ నిర్మించుకోవడం అవసరమే . కానీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ముఖ్యమే. అది మరువవద్దు.

నాకుతెలిసి ఇలా వయస్సు బాగాపెరిగినదాకా పెళ్ళిగూర్చి ఆలోచించని ఆడ ,మగ పిల్లలు మానసికంగా చాలావత్తిడికి గురవుతున్నారు . పెళ్ళివిషయంలో వారి తల్లిదండ్రులు వేదనకు గురవుతున్నారు. మనవల్లు మనవరాల్లతో గడుపుతున్న మిగతావారినిచూసి తమకా అదృష్టం ఇంకారాలేదని కుమిలిపోతున్నారు .
కాబట్టి మీరు మీకుదక్కాల్సినది ఎక్కడికీ పోదు. అలాగని సోమరులుగా కూర్చోమని కాదు . మీ జీవనయాత్రకు జీవితసహచరి తోడేగాని కీడుకాదు .

కాబట్టి నేను చెప్పేదేమిటంటే ఇరవై మూడునుంచి ఇరవైఅయిదుదాకా వేచిచుసినా పరవాలేదుగాని ఇకపై ఆలస్యం చేయకండి .ఈ మందులతిండితినే ఈరోజులలో ఆరోగ్యం.ఆయుష్శు చాలాతక్కువ .గమనించండి . అలాకాక బాగాచదువుకుని చదువుకుని , బాగాసంపాదించటమే ముఖ్యమనుకుంటే చేతినిండా డబ్బు గాడితప్పితే వంటినిండా జబ్బుమాత్రమే మిగులుతాయి. కాబట్టి పెళ్ళికాని ప్రసాదులూ ....................త్వరగా వైవాహిక జీవితాన అడుగుపెట్టండి .మీజీవితం పుష్పించి ఫలించి సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను .
మాకుర్రాళ్లంతా ఇది చదువుతున్నారని తెలుసు . కాబట్టి త్వరగా పెళ్ళిపిలుపులు వస్తాయని అనుకుంటున్నాను .

Read more...

. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం : [రసయోగి _ ౯]

>> Wednesday, August 25, 2010

రసయోగి _ 9

21. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం :

1949 _ 52 సంవత్సరముల సమయంలో వీరభద్రరావు గారు గుంటూరు నగరమందు డి.ఇ.ఓ కు పి.ఏ గా పని చేశారు. ఆ సమయంలో విజయవాడ కనకదుర్గ ఆయనకు స్వప్నములో కన్పడి _ " రాధషడక్షరి" మంత్రాన్ని ఇచ్చెను. ఆ దేవత ఆజ్ఞానుసారం ఆ మంత్ర దీక్ష తీసుకొని ఇంద్రకీలాద్రి పై నలుబది రోజులు తపస్సు చేసి మంత్ర సిద్ధిని పొందుట వారి జీవితంలో ప్రధాన ఘట్టమని చెప్పవచ్చును.

శ్రీ కనక దుర్గా దేవి 8 సం| | ల బాలికగా దర్శనమిచ్చి " రాధాషడాక్షరీ" మహా మంత్రాన్ని అనుగ్రహించి _ " నీవు 40 దినములు నా కొండపైన తదేక దీక్షతో ఈ మహా మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండు. క్రమముగా నీకు ఊర్ధ్వ లోకములను చూడగలుగు శక్తి కలుగుతుంది. అంతేకాదు ఒక చోట నుండి మరొక చోటుకు సూక్ష్మ దేహ ప్రయాణము కూడా నీవు చేయగలవు. ఆ సిద్ధుల వలన అనేక మంది జీవులను ఉద్ధరించ గల శక్తి కలుగుతుంది" అని పల్కెను. ఏనాడో చనిపోయిన తన బంధు జనులను కొందరిని సూక్ష్మ లోకములో చూడగల్గు స్థితి కూడా వారికి కల్గినది. పై లోకములో దిక్కూ మొక్కూ లేకుండా తిరుగుచుండిన కొందరు స్వామీజీలను కూడా వారు చూచిరి. సూక్ష్మ శరీరము దరించిన ఆ జీవులతో మాట్లాడే శక్తి కూడా రాధికా ప్రసాద్ గారికి కలిగెను.

22. సూక్ష్మలోక దర్శనము సంచారము :

శ్రీ దుర్గాదేవి ద్వారా లభించిన మహా మంత్రాన్ని తీవ్రంగా జపించి ఇంకనూ మహాదేవతలను దర్శించుకొనవలెనని తీవ్ర ఆకాంక్ష రాధికా ప్రసాద్ మహారాజ్ గారికి కల్గినది. మహా దుర్గాదేవి దర్శనము తనకు లభించినది, అదేవిధంగానే ఇంకనూ కొంతమంది దేవతల దర్శనము లభించగలదని విశ్వాసముతో తీవ్రముగా ప్రయత్నము చేయనారంభించిరి. వారి మాటలలో చెప్పవలెనన్న _ " నా తపస్సుకు మూడు లక్షణములు. మొదటిది అంతర్ముఖ ధ్యానం, రెండవది నామ రూపాతీతమైన భావ ధ్యానం, మూడవది ప్రాపంచిక సంబంధమైన కామ్యాదులకు వశపడక తీవ్రముగా ఆధ్యాత్మిక ప్రగతినే లక్ష్యమందుంచు కొనుట. కొలది కాలము ఇట్లు చేసిన పిదప నాకు అంతర్ముఖ స్థితిలో ఫాల భాగం వెనుక చంద్రకాంతి వంటి చల్లని తేజో దర్శనము జరిగినది. ఈ విధముగా ధ్యాన రూపమైన తపస్సును పట్టుదలగా కొంతకాలము చేసిన పిదపనేను తీసుకొనిన మంత్ర అధిష్టాన దేవతయగు శ్రీ రాధాదేవికి సంబంధించిన దేవతా దర్శనము ప్రారంభమైనది. నా మనస్సు ఇంకా తీవ్రముగా ఇదే ధ్యాన మార్గాన పోయిన పిదప సూక్ష్మ లోకానికి సంబంధించిన కొన్ని రూపములు దర్శనమైనవి. క్రమక్రమముగా పై ధామమునకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడే శక్తి కూడా నాకు కల్గినది. నా జీవితము ఒక క్రొత్త లోకమునందు ప్రవేశించినది. క్రమక్రమముగా కొంతమంది జీవులయొక్క గ్రహ బాధలు పోగిట్టగలిగితిని. ఆత్మలతో మాట్లాడుతూ, మహాభూతముల హస్తములలో పడి వారు పెట్టుచున్న హింసలకు బాధపడుచుండిన జీవులను అనేకమందిని బాధలనుండి విముక్తుల గావించి, నా మానవతా ధర్మమును నెరవేర్చు భాగ్యము నాకు కల్గినది ".

ఒకసారి గుంటూరు జిల్లాలో, జడ్జిగా పని చేయుచున్న శ్రీ రామానుజులు నాయుడు గారు ఒక ఖూనీ కేసును విచారించుచుండెను. ఖూనీ చేసిన వ్యక్తి సృష్టించిన దొంగ సాక్ష్యాల కారణంగా జడ్జిగారు ఆ ఖూనీ చేసిన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసిరి. ఆ కేసు విచారణ సమయంలో ఖూనీ కాబడిన ఆ జీవుడు తన సూక్ష్మ దేహముతో ఆతృతతో కోర్టు హాలులో కేసు ఏమి అగునో అని తిరుగుచుండెను. జడ్జి గారు ఇచ్చిన తీర్పును బట్టి ఆ ద్రోహిని విడుదల చేసినప్పుడు వాని స్నేహితులందరూ బాండ్ మేళముతో ద్రోహిని గౌరవించిరి. పూలహారములతో నింపి వేసి కోర్టు హాలు నుండి క్రిందికి ఎంతో గౌరవముతో తీసుకెళ్ళిరి. హత్య చేయబడి ఆ హాలులో సూక్ష్మరూపమున తిరుగాడుచుండిన ఆ జీవుడు ద్రోహికి జరుగుచున్నగౌరవాదులు భరించలేక, ఆ జడ్జి ఇచ్చిన తీర్పు దీనికి కారణమని తలచి ఆ జడ్జి గారి తలపై బలంగా ఒక దెబ్బ కొట్టెను. జడ్జిగారు తన ఛాంబర్ లో విశ్రాంతి తీసుకొను సమయమున ఈ దెబ్బ తగులుట చేత ఆ గదిలోనే మూర్ఛపోయెను. ఒక్కసారి ఛాంబర్ లోని వారందరూ జడ్జి గారిని చుట్టుముట్టిరి. జనరల్ హాస్పటల్ నుండి గొప్ప గొప్ప డాక్టర్లందరూ వచ్చిరి. జడ్జి గారు అలా పడిపోవుటకు కారణం ఎవరికినీ అంతుపట్టలేదు. అట్టి స్థితిలో వీరభద్రరావు గారికి కబురు పెట్టగా ఆయన అవ్హటికెళ్ళి ధ్యాన స్థితిలో చూడగా విషయము అవగతమయెను. అంతట రాధికా ప్రసాద్ గారు తన మంత్ర శక్తితో సూక్ష్మ రూపమున తిరుగాడు జీవును దూరముగా పంపివేసిరి. జడ్జి గారికి తెలివి వచ్చింది.

అ ప్రేమశక్తి, కృష్ణ మ<త్రాధిదేవత రాధారాణి కృపవల్ల ఆయన గొప్ప సిద్ధ సాధకుడయ్యెను. స్పర్శ మాత్రమునే వ్యాధులను, వ్యధలను పోగొట్టు గొప్ప శక్తి వారికి లభించింది. ఈ విషయాన్ని ఉత్తర భారతదేశంలోని గోరక్ పూర్ వారి సుప్రసిద్ధ హిందీ "కళ్యాణ పత్రిక " 1968 ఆగస్టు సంచిక గొప్పగా ప్రచారము చేసింది. దానిలో "ప్రాణ చికిత్స" అనే వ్యాసం వ్రాస్తూ జి.యస్.రావ్ తాను ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచున్న కర్ణశూల వ్యాధి వీరభద్రరావు గారు ఒక్కసారి నిమిషము సేపు తన చేతిని చెవి దగ్గర ఉంచగానే తగ్గిపోయిందని వారి యోగశక్తిని, మహిమను కొనియాడారు. ఇది వారి శక్తికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

23. ప్రముఖ రాధా ఉపాసకురాలు శ్రీ రాధామహాలక్ష్మి గారి సాన్నిధ్యంలో :

ఇదే సమయమున వీరభద్రరావు గారికి గుంటూరు వాస్తవ్యులు రాధా మహాలక్ష్మిగా లోకము నందు పేరొందిన కృష్ణ భక్తురాలు శ్రీమతి చయనం హనుమాయమ్మ గారితో పరిచయం ఏర్పడింది. ఆవిడకు కూడా ఇంద్రకీలాద్రి పై వేంచేసిన కనకదుర్గ తొమ్మిది సంవత్సరముల బాలిక రూపంలో కన్పించి "రాధాషడక్షరీ" మహామంత్రోపదేశం చేసింది. ఆ విధంగా రాధా దేవి యొక్క దివ్య కారుణ్య లహరీ విలాసములకు పాత్రులై వారిద్దరూ మరింత దివ్య శక్తి సంపన్నులై మానవసేవా పరాయణులైరి. వారిరువురి పరిచయంకూడా ఒక దైవ ఘటనయే అని చెప్పవచ్చును. రాధా మహాలక్ష్మి గారు నిరంతర కృష్ణుని దివ్య మంగళ రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆ దివ్యానుభవపారవశ్యంలో ఉండాలనే కాంక్ష తీవ్రముగా ఉండటంవల్ల ప్రాపంచిక విషయాలమీద దృష్టి ప్రసరించక పోవటం అటుంచి ఆ ఆవేదనలో, దు:ఖములో పరమేశ్వరానుభూతి కోసం పరితపిస్తూ మురళీధరుని కోసం ఆక్రందిస్తూ, మూర్ఛిల్లుతూ ఉండేవారు. తరచూ ఈ మూర్ఛలు రావటం వల్ల, ఆహార నిద్రలు సరిగా లేకపోవటం వల్ల శరీరం బాగా బలహీనమైనది. చుట్టూ ఉన్నవాళ్ళు ఇది "హిస్టీరియా" ఏమోయని భయపడి డాక్టర్లకు చూపించటం మొదలు పెట్టారు. గుంటూరు సుప్రసిద్ధులైన ఒక డాక్టర్ చేత ఆవిడ భర్త పరీక్ష చేయించగా _ " హిస్టీరియా సంబంధమైన మూర్ఛలు చాలా ఎక్కువగా వస్తుండటం వల్ల గుండె చాలా బలహీనమై పోయిందని ఎక్కువ కాలం బ్రతకదని" నిర్ధారించారు. దానితో అందరికీ గాభరా పుట్టింది. అందరూ దు:ఖ సాగరంలో మునిగియున్నారు. ఆ సమయంలో ఎవరో చెప్పారు బ్రాడీ పేటలో ఉన్న ప్రభుత్వోద్యోగి రాళ్ళబండి వీరభద్రరావు గారని ఒక గొప్ప వ్యక్తి ఎందరిరోగాలనో మంత్ర తీర్ధం వల్ల బాగు చేస్తున్నారని. వారిని అందరూ ఆ రోజుల్లో "తీర్ధాలస్వామి వారు " అని కూడా పిలిచేవారు. వాళ్ళు రాధామహాలక్ష్మి గారిని వీరభద్రరావు గారికి తీసుకువచ్చారు. వీరభద్రరావు గారు వ్యాధి దూరం చేయుదునని వారికి అభయమిచ్చిరి. చెఫ్ఫినట్లు మూడు నాలుగు రోజులలోనే మూర్చలు తగ్గి అందరూ భయపడుతున్న ప్రాణ భయం పోయింది. ఆమె ఆరోగ్యవంతురాలై మళ్ళీ మామూలు మనిషిగా అయినందుకు అందరూ సంతోషించారు. వ్యాధి అనే నిమిత్తం వల్ల వీరభద్రరావు గారితో ఆమెకు, ఆమె భర్తకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ( రాధామహాలక్ష్మీ గారు, వీరభద్రరావు గారు) సాధకులు, తపస్వులూ. ఒకే దివ్య శక్తి ప్రేరణ వల్లనే తాము జీవితాలు గడుపుతున్నట్లు, ఆ శక్తియే తమ ఇద్దరినీ సన్నిహితులను చేయటానికి యీ వ్యాధి అనే నెపాన్ని కల్పించినట్లు వాళ్ళకు విశదమైంది. వారిరువురికీ పురాణ ప్రసిద్ధురాలైన జగజ్జననిగా, ప్రేమదేవతగా, కృష్ణప్రియగా, ఆశ్రిత కల్పవల్లిగా బ్రహ్మాదుల చేత స్తుతించబడిన గోలోక నాయకి శ్రీ రాధాదేవి ఆరాధ్య దైవమైంది. రాధామహాలక్ష్మీ గారు, వీరభద్ర రావు గారిని కుమారునిగా భావించేది. ఆవిడ ఒక రోజు వీరభద్రరావు గారితో _" నాయనా! రాధారాణి కృపా కటాక్షం వల్ల నీవు నాకు లభించావు. నీవు నాకు ఆ గోలోక నాయిక "రాధ" ఇచ్చిన ప్రసాదానివి. కనుక ఈ రోజు నుండి నీవు "రాధికాప్రసాద్" గా పిలువబడుతూ విఖ్యాతినొందుతావు" అని దీవించింది. ఇద్దరూ ఒకే మార్గంలో ప్రయాణించడానికి దేవతా నిర్దేశం కలగటం వల్ల, కలసి ఆధ్యాత్మిక సాధనా మార్గం పయనిస్తూ, బాధాతప్త హృదయములను కాపాడుతూ, వారి వారి వ్యాధులను నివారిస్తూ రాధాకృష్ణ తత్వాన్ని వాడ వాడలా ప్రచారం చేయటం వారి జీవన స్రవంతిలో ఒక భాగమైనది.

రాధికాప్రసాద్ గారి జాతకరీత్యా 1953 సంవత్సరము ఆయనకు గడ్డుకాలము. నాడీ జాతకంలో కూడా ఆయనకు 53 సం లో మృత్యుగండం ఉందని వ్రాయబడి ఉంది. ఈ సమయంలో రాధికాప్రసాద్ గారు బందరులో ఉద్యోగము చేయుచుండిరి. ఆయనకు అనంతపురం బదిలీ అయింది. అప్పటికే వారికి రాధామహాలక్ష్మీ గారితో పరిచయం ఏర్పడింది. వారు ఉద్యోగ నిర్వహణ చేస్తూ తరచుగా గుంటూరు వస్తూ వెళ్తూ ఉండేవారు. సరిగ్గా సమయం ఆగష్టు 21, 1954 సం| | ము రాధికాప్రసాద్ గారికి యాబది మూడో సంవత్సరం నడుస్తున్నది. ఆ సమయంలో వారు బందరు నుండి అనంతపురం బదిలీ అయి రైలులో బందరు నుంచి అనంతపురం బయలుదేరారు. రైలు బండి గుంటూరు స్టేషన్ లో ఆగింది. రైలు గుంటూరు మీదుగా పోతుందని తెలసి వారిని చూచుటకు అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు. భక్తులు రైలు స్టేషన్ కు చేరిరి. రాధామహాలక్ష్మీ గారు కూడా రైల్వే స్టేషన్ కు వచ్చిరి. " బండి ఇక రెండు నిమిషములలో బయలుదేరునని ప్రకటన కూడా చేశారు. రాధామహాలక్ష్మీ గారు ఎందుకనో బిగ్గరగా ఏడ్వసాగెను. అది చూచిన రాధికాప్రసాద్ గారు ఏమమ్మా! నేను త్వరలో వచ్చెదను. బాధపడవలదు" అని పల్కెను. కాని ఆమె ప్రత్యుత్తరమియ్యక ఏడ్చుచునే యుండెను. ఏదో అదృశ్యదేవత ప్రేరణచే ఆమె ముఖత: పల్కెను _ " నీ ప్రయాణం ఆపుకొని ఇక్కడ దిగిపో" దానికి రాధికాప్రసాద్ గారు _ " లేదమ్మా ! వెళ్ళాలి. ఉద్యోగరిత్యా కొన్ని చిక్కులు ఉన్నాయి. వెళ్ళక తప్పదు" అని పల్కెను. దానికి _ " ఆవిడ వీల్లేదు నాయనా ! నీవు ఇప్పుడే రైలు దిగి నాతో మందిరానికి రావాలి. నీకు ఎన్ని పనులున్నా ఇప్పుడు మటుకు నీవు నాతో రావలసిందే" అని బలవంతంగా రాధికాప్రసాద్ గారిని క్రిందికి దింపి వేసెను. రాధికాప్రసాద్ గారు రాధామహాలక్ష్మీ గారితో కలసి మందిరానికి చేరిరి. సాయం సమయం రాధికాప్రసాద్ గారు అక్కడికి విచ్చేసిన భక్తబృందంతో ముచ్చటిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఎడమవైపు తీవ్రముగా "శిరోవేదన" కల్గెను. క్రమముగా శిరోవేదన తీవ్రమయ్యెను. సుమారు 11 గంటలకు జ్వరము కూడా వచ్చెను. 12 గంటలకు జ్వరము తీవ్రమయెను. రాధా మహాలక్ష్మీ గారు కూడా చాలా ఆందోళన చెందుచుండిరి. ఇంతలో ఎవరో ఒక దేవత దివ్య ప్రేరణచే రాధామహాలక్ష్మీ గారి యందు ఆవహించి _ " ఇది సాధారణ శరీర రుగ్మత కాదు, వైద్యుల చేత ఎట్టి చికిత్స చేయించకూడదు.వారి ఆయువు ఇంకా మూడు , నాలుగు గంటలు మాత్రమే ఉన్నది. అందువల్లనే దేవతలు వానిని బలవంతముగా గుంటూరులో ఇక్కడ నిలిపి వేసిరి" అని పల్కెను. జ్వరము ఇంకా తీవ్రమయ్యింది. భక్తజనం అంతా గిమిగూడారు. బంధువులు, స్నేహితులు అందరూ అక్కడకు వచ్చారు. వారిలో కొందరు కోపంగా _ " నాన్నగారు ఇంత అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళకుండా అలా కూర్చున్నారేమిటి? ఇదంతా ఇలా చూస్తూ ఏమీ చేతకానట్లు కూర్చోలేం. నాన్నగారు మీ ఒక్కరి సొత్తేమి కాదు. మా సొత్తు కూడా" యని పల్కిరి. అంతట రాధామహాలక్ష్మీ గారి భర్త శ్రీహరికోటినారాయణ గారు _ " తప్పు నాయనా ! దేవతలు శాసించిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రమాదం" అని పల్కిరి. ఇంతలో మరల రాధామహాలక్ష్మీ గారిని దేవత ఆవహించి _ " మీరు నిజంగా ఇతనిని (రాధికాప్రసాద్ గారిని) బ్రతికించుకోగోరిన మీలో యెవరైనా మన:స్పూర్తిగా మీ ఆయువును ఆయనకు సమర్పించిన ఆయన దీర్ఘకాలము జీవింతురు. అట్టివారు ముందుకు వచ్చిన నేను వారి ఆయువును రాధికాప్రసాద్ గారి ఆయువుతో ముడివేతును" అని పల్కెను. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడిరి. కొందరు అక్కడి నుండి జారుకొనిరి. కానీ రాధామహాలక్ష్మీ గారికి కోటినారాయణ గారికి రాధికాప్రసాద్ గారి పట్ల పుత్ర వాత్సల్యం ఉండేది. వారు మన:స్పూర్తిగా దేవతను _ " తల్లీ ! యుగానికొక్కడు మహాత్ముడు జన్మిస్తాడంటారు. అది నిజమో కాదో మాకు తెలియదు. కానీ ఈ బిడ్డడు ( రాధికాప్రసాద్) కారణ జన్ముడే. అదృష్టం కొద్దీ మాకు అమృతభాండం వలె లభించాడు. చూస్తూ చూస్తూ దాన్ని పారేసుకోలేము. మా ఆయుష్షు తీసుకొని ఇతనికి దీర్ఘాయువునివ్వు" యని ప్రార్ధించిరి. మరి ఆ పల్కులు దేవత విన్నదో లేదో తెలియదు కానీ తెల్లవారు జామున మూడు గంటలకు రాధికా ప్రసాద్ గారికి స్వస్థత చేకూరింది. జ్వరం, శిరోభారం తొలగింది. అందరికీ ఎంతో ఆనందం వేసింది. స్వస్థతతో , పరిపూర్ణ ఆరోగ్యంతో అందరినీ మాట్లాడిస్తున్న రాధికాప్రసాద్ గారిని చూచిన రాధామహాలక్ష్మీ, కోటినారాయణల ఆనందానికి అవధుల్లేవు. ఈ విధంగా రాధికాప్రసాద్ గారు తల్లి రాధామహాలక్ష్మీ కృపవల్ల మృత్యుగండం నుండి బయటపడ్డారు. మరునాడు తిరిగి అనంతపూర్ కి బయలుదేరి వెళ్ళారు. అటు తర్వాత కొంతకాలానికి పదవీవిరమణ చేసి గుంటూరులోనే రాధామహాలక్ష్మీతో కలసి రాధామాధవ సేవలో భాగస్వాములైనారు.

రాధామహాలక్ష్మి గారి సాంగత్యం ఏర్పడిన తర్వాత రాధికాప్రసాద్ గారిలో రోజు రోజుకీ భావోద్రేకం అధికమవ్వసాగెను. ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు వారు " రాధారాణి" చింతనలో ధ్యానమగ్నులై ఉండి పోయేవారు. పోనూ పోనూ వారి ధ్యానానికి ఉద్యోగం ఒక ఆటంకం గా అన్పించింది. పెద్ద ఉద్యోగం, దాని వల్ల కోరికున్నంత ధనం సంపాదించవచ్చు, దాని వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టలు . అయినా రాధికాప్రసాద్ గారు చలించలేదు. భోగభాగ్యాలను, కీర్తికాంక్షలను ఆయన ఏనాడు ఆశించలేదు. చేస్తున్న ఉద్యోగానిక్ తిలోదకాలుసమర్పించి నిరంతర రాధారాణి చింతనలో మునిగిపోతలచెను వారిరువురి దారి ఒకటే. గమ్యం ఒకటే. వారి దృష్టి బృందావనేశ్వరి మీద ఉంది. హ్లాదినీశక్తి రాధారాణి నివాస ధామం బృందావనం. ఆ క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుదామని వారి సంకల్పం. సుప్రఖ్యాతులైన ప్రభుదత్త బ్రహ్మచారి తన ఆశ్రమానికి చేరువలో వారికొక స్థలం చూసిపెట్టారు. అది కొని అక్కడ ఒక రాధాకృష్ణ మందిరం నిర్మించి అక్కడ నివాసం ఏర్పరుచుకోవాలని సంకల్పించారు. కానీ ఆ రాత్రి రాసేశ్వరి రాధారాణి వారికి దర్శనమిచ్చి "ఇక్కడ మందిర నిర్మాణానికి ఇంకా సమయం ఉందని, ఆ సమయం తానే సూచిస్తానని, అంత వరకు ప్రస్తుత నివాస స్థానం ( గుంటూరు )లోనే ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడే సేవ చేసుకుంటూ ఉండమనీ ఆజ్ఞాపించింది.

Read more...

పౌర్ణమి పూజలు

>> Tuesday, August 24, 2010

పౌర్ణమి పూజలు








Read more...

సుందరాకాండ ఆడవాళ్ళు పారాయణం చేయవచ్చా ?

>> Sunday, August 22, 2010

నిరభ్యరంతరంగా చేయవచ్చు. కొందరు సుందరాకాండ ,భగవద్గీత ఆడవాల్లు చదవవచ్చా? అని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సద్గురు మళయాళస్వాములవంటి మహనీయులు సప్రమాణంగా సమర్ధించారు. వేదం చెప్పిన "సత్యం వద ధర్మచర " అనే రెండు ప్రధానాంశాలను నిఖిలమానవులకు బోధించడానికి తద్వారా వారిలోని పశుత్వ,రాక్షసత్వ లక్షణాలను నాశనం చేసి మానవత్వాన్ని ప్రతిష్టించడానికి రామాయణ భారతాలవతరించాయి . అంతే తప్ప వీటికి రిజర్వేషన్లులేవు.కులమతాలతో సంబంధం లేదు. ఆర్ధికస్థితి ప్రమేయం అసలే లేదు. అందరూ వీటిని చదవాలి .వినాలి,చూడాలి సత్యవాక్పాలనం ధర్మపరాయనత్వం అలవరుచుకోవాలి అదే వాల్మీకి,వ్యాసుల వారి కాంక్ష ,.

సర్వేజనా సుఖినోభవంతు

Read more...

మన బ్లాగ్లోక ఆడపడుచుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేద్దాం

>> Saturday, August 21, 2010

మనతెలుగుఆడపడుచు ,ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు ఆదివారం భద్రాచలం శ్రీసీతారామ స్వామి వారి సన్నిధిలో వైవాహిక జీవితం లోకి అడుగుపెడుతున్నారు. వీరి దాంపత్యం సకలశుభాలతో నిత్యసంతోషముతో విలసిల్లాలని కోరుకుంటున్నాము . మన ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలియజేయవలసిదిగా మన తెలుగు బ్లాగర్లనందరినీ కోరుతున్నాము.

Read more...

దుర్గాస్తుతి

>> Friday, August 20, 2010

విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం

యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం

కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం

వాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీం

భారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాం

స్తోతుం ప్రచక్రమే భూయో - వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ - రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే - కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే - పూర్ణచంద్రనిభాననే

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి

భాసి దేవి యథా పద్మా - నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ - విశదం తవ ఖేచరి

కృష్ణచ్ఛవిసమా కృష్ణా - సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ - శక్రధ్వజసముచ్ఛ్రయౌ

పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం - కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ - కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన - శ్రోణీసూత్రేణ రాజతా

భ్రాజసే చావబద్ధేన - భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా - ముచ్ఛ్రి తేన విరాజసే

కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ

త్రైలోక్యరక్షణార్థాయ - మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే - దయాం కురు శివా భవ

జయా త్వం విజయా చైవ - సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి - వరదా త్వం చ సాంప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే - తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి - సీధుమాంసపశుప్రియే

కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ - పుత్రతో ధనతో పి వా

దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం - మగ్నానాం చ మహార్ణవే

దస్యుభి ర్వా నిరుద్ధానాం - త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః - హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా - జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః - శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి - సత్యే సత్యా భవస్వ నః

శరణం భవమే దుర్గే - శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ - దర్శయామాస పాండవం

ఉపగమ్య తు రాజాన - మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో

భవిష్య త్యచిరా దేవ - సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం

రాజ్యం నిష్కంటకం కృత్వా - భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ - ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం

మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య - మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి - లోకే విగతకల్మషాః

తేషాం తుష్టా ప్రదాస్యామి - రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి - సంగ్రామే శత్రుసంకటే

అటవ్యాం దుర్గకాంతారే - గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా

న తేషాం దుర్లభం కించి - దస్మిన్ లోకే భవిష్యతి
య ఇదం పరమ స్తోత్రం - శృణుయా ద్వా పఠేత వా

తస్య సర్వాణి కార్యాణి - సిద్ధిం యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ - విరాటనగరే స్థితాన్

న ప్రఙ్ఞాస్యంతి కురవో - నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ - యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం - తత్రై వాంతరధీయత

ఇతి దుర్గా స్తోత్రం సర్వవ్యాధి హరం.

దుర్గాస్తుతి

Read more...

పెళ్లి ఆలస్యమవుతున్న మగ పిల్లల కొరకు

>> Thursday, August 19, 2010

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా
పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు
మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార
మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో
అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల
సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది.
అందునా మంచి భార్య లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన
అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా
వెతుకుతున్నాను.

అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ
స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి
ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక
దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి
వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ
అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత
కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము
ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన
కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు
సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి
కాదు.




సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే |
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే ||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే |
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం ||

సర్వ సంపత్ స్వరూపత్వం సంతుష్టా సర్వ రూపిణీం |
రాశేశ్వర్యధిదేవీత్వం త్వత్కళాః సర్వయోషితః ||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే ||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవ దేవీ సరస్వతీ |
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః ||

కృష్ణ ప్రాణాధి దేవీ త్వం గోలోకే రాధికా స్వయం |
రాశే రాశేశ్వరీ త్వంచ వృందావన వనేవనే ||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే |
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ ||

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే |
కుంద దంతీ కుంద వనే సుశీలా కేతకీ వనే ||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ |
రాజ లక్ష్మీ రాజ గేహే గృహ లక్ష్మీ గృహే గృహే ||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వ మునయో మనవస్తథా |
రూరూదుర్నమ్ర వదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః ||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం |
యః పఠేత్ ప్రాతరుత్థాయ సవైసర్వం లభేత్ ధృవం ||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |
సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం ||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం ||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశశ్వినం |
భ్రష్ఠ రాజ్యో లభేత్ రాజ్యం భ్రష్ఠ శ్రీర్లభతే శ్రియం ||

హత బంధుర్లభేత్ బంధుః ధన భ్రష్ఠో ధనం లభేత్ |
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాచ లభేత్ ధృవం ||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం |
హర్షానందకరం శాశ్వత్ ధర్మ మోక్ష సుహృత్పదం ||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

[ మిత్రులు రాజశేఖరుని విజయ్ శర్మ గారు అందించిన శుభకరమైన స్తుతి ]

Read more...

వీళ్ళకెంత కండకావరమో చూడండి ....

>> Wednesday, August 18, 2010

ఈదేశ ప్రజలన్నా ,ఇక్కడ ఆచారాలు ధర్మమన్నా గడ్డిపోచకింద లెక్కయిపోయింది . ఇది చూడండి










Blenders Pride A Multi National Wisky making Company has abused our Holi Siva Linga like this. In this Advertisement, an Young woman stand at Holi Siva Linga and put her Knee on the Holi Siva Linga.

Read more...

శ్రావణ శుక్రవార పూజలకు మీ గోత్రనామాలు పంపండి


మహాలక్ష్మీ దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం లో అమ్మవారి విశేషార్చనలు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్నది . ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకము ,కుంకుమార్చన పూజలలో భక్తుల గోత్రనామాలు చెప్పి వారితరపున నివేదనలు చేయబడతాయి . తమ పేరున పూజ జరపించు కోవాలని సంకల్పం కలిగిన వారు తమ గోత్రనామాలను తెలియజేయండి . వివాహితులు తప్పనిసరిగా భార్యాభర్తలిరవురి పేర్లు పంపండి . ఇక్కడ జరిపిన పుజా ప్రసాదాలను పంపమని కోరేవారు మాత్రం పోస్టల్ ఖర్చులు వారే భరించగలరు . పూజ జరిపించు కొనుటకు ఏమీ పంపనక్కరలేదు .

మీ గోత్రనామాలను ఈ చిరునామాకు పంపండి .

durgeswara@gmail.com

Read more...

గురు సిధ్ధారూఢులు,అనిబిసెంట్ లతో సమాగమము...అమ్మ జ్ఞానప్రసూనాంబ దర్శనం

>> Sunday, August 8, 2010

రసయోగి _ 8

11. సిద్ధారూఢస్వామి వద్ద శివ ప0చారీ మ0త్రదీక్ష (1924) :

హుబ్లీలో ఒక గొప్ప యోగి ఉన్నాడని , అతను గొప్ప మహిమ కలవాడని విన్న వీరభద్ర రావు గారు వారిని స౦దర్శి౦చటానికి "హుబ్లీ" వెళ్ళిరి. హుబ్లీలో ప్రశా౦త వాతావరణ౦లో ఆయన ఆశ్రమ౦ ఉ౦ది. ఆ యోగి పేరు "శ్రీ సిద్ధరూఢ స్వామి ". తన ధ్యాన శక్తితో పరమేశ్వర సాక్షాత్కార౦పొ౦దిన గొప్పసాధకుడు. సాక్షాత్తు శివునిఅవతార౦గా కొలువబడిన సిద్ధ పురుషులు శ్రీ సిద్ధారూఢా స్వామి. ఈయన మహిమ గురి౦చి అనేక కథలు ప్రచార౦లో ఉన్నాయి. కాశీలో ఒక అన్న స౦తర్పణలో భోజన౦ చేసిన విస్తరి అక్కడే వదిలి వెళ్తున్న సిద్ధారూఢస్వామిని _ " నీవు తిన్న ఎ౦గిలాకు నీయబ్బ వచ్చి తీస్తాడా" యని అక్కడి కార్యకర్త కొట్టబోగా, కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై ఆ విస్తరి ఎత్తివేశాడట. మ౦గళగిరి కొ౦డ మీది పానకాల స్వామినిచేయెత్తి ఆశీర్వదిస్తు౦టే" తప్పు" అని చెప్పిన పూజారితో " మావ౦టి వారి ఆశీర్వచన౦ దేవునికి కూడా అవసరమే" అన్న మహా తపస్స౦పన్నులు శ్రీ సిద్ధారూఢ స్వామి వారు. " శ్రీ సిద్ధారూఢా స్వామి వారి చరిత్ర " అనే పుస్తకాన్ని శారదా వివేక్ గారు తెలుగులో వ్రాశారు. అ౦దులో మరెన్నో విషయాలు శ్రీ సిద్ధారూఢ స్వామి వారి జీవితానికి స౦బ౦ధి౦చి కూల౦కుష౦గా చర్చి౦చారు. అటువ౦టి తపోధనుడిని దర్శి౦చ వీరభధ్రరావు గారు "హుబ్లీ" చేరారు. వీరభధ్ర రావు గారు ఆశ్రమ ప్రాగణ౦లోకి ప్రవేశి౦చారు. అక్కడ ఒక చెట్టుకు ఒక కొబ్బరి తాడుతో ఒక పులి కట్టివేయబడి ఉ౦ది. అది ఆవు వలె చతికిల పడి కళ్ళు మూసుకొని యు౦ది. కు౦దేలు పిల్లలు దాని పై ఎక్కి అటూ నిటూ దూకుతున్నాయి. పక్షులు దాని తలపై నృత్య౦ చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఆ దృశ్య౦ తిలకి౦చారు శ్రీ వీరభధ్ర రావు గారు. ఆశ్రమ౦లోకి ప్రవేశి౦చారు. _ " ఆశ్రమమే ఇ౦త మహత్తు కలిగి ఉ౦టే ఇక ఆ యోగి ఎలా ఉ౦టారో, ఎ౦తటి మహత్తు కలవాడో " అని అనుకు౦టూ ఆశ్రమ౦లోకి అడుగు పెట్టెను. ఆశ్రమ౦లోకి అడుగిడిన వీరభధ్ర రావు గారిని ఆ యోగి లోపలకు సాదర౦గా ఆహ్వాని౦చి _ " నాయనా ఆ పరమేశ్వరుడు నాకు ఆరాధ్య దైవము. నిన్ను చూస్తు౦టే నాకు ఏదో తెలియని మమకారము ఏర్పడుతున్నది. నీకు పరమపావనమైన, సర్వశక్తి దాయకమైన " ప౦చాక్షరీ మ౦త్ర౦" ఉపదేశిస్తాను. ఇది ఈశ్వరేచ్ఛ అని నాకు తోచుచున్నది. ఈ మ౦త్రాన్ని భక్తి శ్రద్ధలతో సాధన చేసి పరమేశ్వరును కృపకు పాత్రుడివి కావలయునని" పల్కెను. సిద్ధారూఢా స్వామి "ప౦చాక్షరీ మ౦త్రాన్ని వీరభధ్ర రావు గారికి ఇచ్చెను. వీరభధ్ర రావు గారు ఆ మ౦త్రాన్ని సాధన చేసి మ౦త్ర సిద్ధినిపొ౦దడమే కాక, ఆ పరమేశ్వరుడు ఏ దేవి ధామానికి గోపీ రూపాన "గోపేశ్వర" నామ౦తో పిలువబడుతూ క్షేత్రపాలకుడై ఉ౦డెనో, ఆ కృష్ణమ౦త్రాది దేవత అయిన శ్రీ రాధాదేవిని సైత౦ తన హృదయ౦లో ప్రతిష్ఠి౦చుకొను ధీమాన్యుడయ్యెను. గురువును మి౦చిన శిష్యుడయ్యెను.

12. అనిబిసె0ట్ తో రసయోగి :

1925 _ 27 స0వత్సర0లో ధియోసాఫికల్ సొసైటీలో తమిళ భాషావేత్త హై కోర్టు జడ్జి గారు ఒకరితో శ్రీ వీరభధ్ర రావు గారికి పరిచయ0 ఏర్పడి0ది. వారి ప్రోత్సాహ౦తో అనిబిసె౦ట్ మత౦ స్వీకరి౦చట౦ జరిగిది. అరువాత మద్రాసులో అడయారుకి తరచుగా వెళ్తూ ఉ౦డేవారు. అనిబిసె౦ట్ పరిచయ౦ ఏర్పడి౦ది. ఒకసారి డా| | అనిబిసె౦ట్ తో స౦భాషణ జరిగి౦ది.

" అమ్మాజీ | మన హిందూ మతమునకు స౦బ౦ధి౦చి ఒక ముఖ్య ప్రశ్న ఉన్నది. ఒక మహర్షిని అవమానపరచిన కారణమున మహర్షి కుమారుడు పదకొ౦డు స౦వత్సరముల వాడైన శృ౦గి భారతదేశ చక్రవర్తిగా ఉన్న పరీక్షిత్తు మహారాజుని, కోపమున సర్పగ౦డముతో మరణి౦తువు గాక అని శపి౦చినాడు. ఆ శాపమును ఎవరూ ప్రతిఘటి౦చలేకపోయిరి. ఆ సమయ౦లో పరాశర, వ్యాసాదులు ఉన్ననూ ఈ బాలుని శాపమును ఎవరూ ప్రతిఘటి౦చలేకపోయిరి. దీనిని బట్టి ఒక బాలుడు కూడ ఎ౦త శక్తివ౦తుడో మనకు స్పష్టమగుచున్నది. మరియూ పరశురాముడనే ఒక బ్రాహ్మణుడు తన త౦డ్రి యగు జమదగ్నికి అవమానము జరిగిన కారణము ఎట్టి సేనయు లేకనే ఒ౦టరిగానే భారతదేశమ౦దు౦డిన రాజుల౦దరినీ ఓడి౦చి వారి ఐశ్వర్యమును 21 మార్లు భస్మీభూతము గావి0చెను. ఆ రోజులలో మహర్షులు, మ0త్రవేత్తలు వేదమున0దలి మ0త్ర శక్తులను తమ చేతులలో ఉ0చుకొనెడివారు. పూర్వ కాల0లో ఉ0డే మహర్షులు దేశ క్షేమమును, వేద శక్తినితమ చేతులలో పెట్టుకొని కాపాడ ప్రయత్ని0చిరి. ఈ వేద మ0త్రములన్నియు శక్తి మ0త్రములు. కొన్ని మ0త్రములతో శత్రు నాశనము కోరునట్టి శాపములతో కూడుకొనియున్నవి. ఈ మ0త్రములన్నియు కొద్దిమ0ది చేతులలోనే ఉన్నవి. ఆనాడు ముద్రణాలయము లేవియు లేవు. మ0త్ర విజ్ఞానమ0తయు ఒక నోటి ను0డి మరియొక నోటికి నడుచుచు0డెడిది. ఆ నాడు ఒక ఋషి మహారాజు వద్ద వచ్చినచో మహారాజులు గడగడ వణుకుచూ ఋషుల ఆజ్ఞలను పాలి0చెడివారు. దీనికి కారణము ఆనాటి రుషుల, మునుల హస్తములలో మహా మ0త్రశక్తులు0డెడివి. ధిక్కరి0చిన రాజులను ఒక్క శాపముతో అణిచి వేసెడివారు.

వాల్మీకి రామాయణములో _ రామచ0ద్రుని కలుసుకొనుటకై భరతుడు కొన్ని లక్షల మ0ది పరివారముతో కలసి పోవుచూ దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమమున విశ్రా0తి తీసుకొనెను. అప్పుడు మహర్షి భరతుని చూచి నీవు ఈ నాటి రాత్రికి నీ పరివారముతో సహా అతిథులుగాఉ0డమనికోరెను. తెల్లవారి నా దర్శనము చేసుకొనుము అని చెప్పెను. అక్కడ ఉన్నవాడు ఒక్క రుషి. ఇద్దరు ముగ్గురు శిష్యులు అ0తే. ఒక గ0ట విరామములో లక్షలాది మ0ది పరివారమునకు, అనేక గుర్రములు, ఏనుగులు వీటన్ని0టికీ ఏ విధముగా వి0దు ఏర్పాటు చేయగలడని స0దేహము వచ్చినది. కాని వారు రుషి యొక్క మ౦త్ర శక్తిని ఊహి౦చలేకపోయిరి. ఆ శక్తితోనే ఆయన వారికి ఆతిథ్యమును ఏర్పాటు చేసెను. ఈ మ౦త్ర బలమే రుషి యొక్క గుప్త ధనము. అదే పూర్వ కాలమ౦దలి భారతదేశ శక్తి. ఆ శక్తి యిపుడేమయి౦ది ? మహమ్మదీయులు వేయి స౦వత్సరములు పరిపాలి౦చి భారతదేశ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కొల్లగొట్టుకొనిపోయారా? కాశీ విశ్వేశ్వరుడు ఇపుడు కాశీలో లేడు. అటువ౦టి హీనస్థితికి వచ్చి౦ది భారతదేశ౦. ఎ౦దుకు అలా జరిగి౦ది ? అ౦తటి శక్తి వ౦తమైన దేశ౦ ఇలా ఎ౦దుకు మారి౦ది? అని అమ్మను ప్రశ్ని౦చెను.
దానికి అమ్మ యిట్లు సమాధానము చెప్పినది నాయనా | నాయమాత్మాబలహీనేన అలభ్య:" అని వేద వాక్యము. బలహీనులకు భగవ౦తుడు చిక్కడు. ఈసూత్రముననుసరి౦చి వేదమ౦త్రములపై ఆధారపడుచు ఋష్యాదులు జీవయాత్ర సలుపుచు౦డిరి. వారి జీవితమే తపస్సు. ఆ విజ్ఞానమ౦తయు నేడు పోయినది. ఆ వేదమ౦త్రములు ఇపుడు స్పష్టముగా పఠి౦చు వారు కూడా కన్పడకున్నారు. నా దృష్టిలో ఇప్పటి విశ్వ విధ్యాలయాలు, కళాశాలలు, గురుకులములలోను ఆ వేద విజ్ఞానమునకు పునర్జీవనము కలుగజేయవలెను" అని చెప్పినది. ఈ స౦భాషణ ఫలితమే వీరభధ్రరావు గారు శ్రీ రాధాకృష్ణ సేవకు అ౦కితమగుటకు ముఖ్య కారణమైనది.

13. కలకత్తాలో నారాయణ చ0ద్రఘోష్ యి0టి పైన లీల :

1937 _ 38 స0వత్సరములో శ్రీ వీరభధ్రరావు గారు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమములకై కలకత్తా వెళ్ళిరి. కలకత్తాలో ఒక న్యాయవాదిగా పనిచేయు చు0డిన నారాయణ చ0ద్రఘోష్ అను ఒక మహనీయుడు బాలకృష్ణుని సేవ చేయుచూ బాలకృష్ణుని కోరికపై తన మూడవ మేడపైన ఒక వనమును సృష్టి0చి దానిలో గోపాలుడు ఆడుకొనుటకు కొన్ని నెమళ్ళు, చిలకలు పె0చుచు0డెను. ఆయనను దర్శి0చుటకై వీరభధ్రరావు గారు ముగ్గురు, నల్గురు స్నేహితులతో వెళ్ళెను. పూజను ముగి0చుకున్న పిదప ఘోష్ గారు బయటకు వచ్చి వీరభధ్ర రావు గారికి సాష్టా0గ నమస్కారము చేసి _ " ఓ మహాత్మా 400 స0వత్సరముల క్రి0దటే మీరు శ్రీ చైతన్య ప్రభువుతో కలసి స0చరి0చుటను చూచితిని" అని చెప్పుచూ కన్నీరు పెట్టుకొనెను. ఈ వాక్యమును విని స్నేహితులు ఆశ్చర్యపోయిరి. పై లీలను బట్టి శ్రీ వీరభధ్ర రావు గారు బహు కాలము ను0డియే కృష్ణ భక్త పరివారమునకు చె0దిన మహనీయునిగా తెలుసుకొనవచ్చును.

తన నిర0తర ఆసాధనా బల0 వల్ల, భక్తి భరిత భావ భరిత హృదయ0 వల్ల, పరమేశ్వరి కృపవల్ల వీరభధ్ర రావు గారికి అనేక శక్తులు వచ్చెను. కానీ వాటిని ఆయన తన కొరకు ఎన్నడూ ఉపయోగి0చే వారు కాదు. ఆయన ఒక సిద్ధయోగి. సుఖదు:ఖాలకు అతీతుడు.

14. సుఖదు:ఖాలకు అతీతునిగా :

వీరభధ్ర రావు గారికి సుమారు 26 _ 27 స0వత్సరములు0డవచ్చును. విజయవాడలో స్కూల్స్ ఇనిస్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఒక రోజు వారి భార్యవారిని కాకినాడలో తన పుట్టి0టి వారిని ఒకసారి చూసి వద్దామని కోరి0ది. కాని పని ఒత్తిడి వల్ల _ " ము0దు నీవు వెళ్ళు. వెనుక నేను రె0డు మూడు రోజుల్లో వస్తాను" అని పల్కిరి. ఆమె తన రె0డవ కుమారుని తన వె0ట తీసుకొని కాకినాడ చేరెను. పిల్లవానికి రె0డు స0వత్సరములు ఉ0డును. పిల్లవానికి త0డ్రియన్న మిక్కిలి ప్రేమ. ఎప్పుడూ త0డ్రినే కలవరి0చుచూ ఉ0డును. త0డ్రికి కూడా అతనన్న ప్రాణము.

రె0డు రోజులతరువాత వీరభధ్ర రావు గారు పనులు ముగి0చుకొని "కాకినాడ" బయలుదేర సిద్ధమయిరి. ఇ0తలో వారి మిత్రులు శ్రీపెమ్మరాజు రామచ0ద్రరావు గారు అమలాపుర0 ను0డి "ఒకసారి అమలాపుర0 వచ్చి వెళ్ళమని " ఉత్తర0 వ్రాసారు. స్నేహితుడు రామచ0ద్రారావు గారికి ఒక్కగానొక్క కుమారుడు0డెను. అతనికి వీరభధ్రరావు గారన్న అమితమైన ప్రేమ. ఆపిల్లవాడు వీరభధ్ర రావు గారిని " మామయ్య గారూ |" అ0టూ స0భోధి0చేవాడు. అ పిల్లవానికి చిన్నతన0లోనే కవిత్వ0 అబ్బినది. వీరభధ్రరావు గారికి కవిత్వ0తో ఉత్తరాలు వ్రాస్తూ ఉ0డేవాడు. కనుక ఒకసారి అమలాపుర0 వెళ్ళి వాడిని చూసి అటు ను0చి కాకినాడ వెళ్దామని నిశ్చయి0చుకొని వీరభధ్ర రావు గారు అమలాపుర0 బయలుదేరిరి.

వీరభధ్ర రావు గారు అమలాపుర0లో తన స్నేహితుని ఇ0టికి చేరేసరికి _ స్నేహితుడూ, అతని భార్య ఒక మ0చ0 ప్రక్కన నిలబడి ఏడుస్తున్నారు. మ0చ0 మీద పిల్లవాడు " ఫిట్స్" తో బాధపడుచు0డెను. ఆ పిల్లవాడు వీరభధ్ర రావు గారిని చూసి _ " నీవు నాకు 12 రూపాయలు బాకీ ఉన్నావు " అని మూర్చిల్లెను. అది ఏ జన్మలోని రుణమో తెలియదు. అదే విషయ0 వీరభధ్ర రావు గారు కొలది సేపు ధ్యాన0లో కళ్ళు మూసుకొని తిరిగి ఆ ద0పతులతో _ రుణను బ0ధ రూపేణ పశుపత్ని సుతాలయా:" అ0టారు పెద్దలు. ఈ పిల్లవాడు అడిగిన 12 రూపాయలు నేను ఇచ్చెదను. కాని నేను ఇచ్చిన వె0టనే అతను ఈ శరీరాన్ని వదిలి వేయును. నేను ఇవ్వకున్న ఈ విధకుగానే ఫిట్స్ తో బాధపడుతూ ఉ0డును. ఏమి చేయ మ0దురో మీరే నిశ్చయి0చ0డి ? నేను డబ్బులు ఇచ్చిన వె0టనే ఈజీవికి ఈ జగత్తుతో రుణ0 తీరిపోవును." అని పల్కిరి. దానికి వారు బాధపడుతూ _ " పిల్లవాని బాధను చూడలేకున్నాము. ఇలా బాధపడుతూ మా కళ్ళెదుట ఉ0డే క0టే వాడు ఆ భగవ0తుని దగ్గరే క్షేమ0గా ఉ0టే చాలని" పల్కిరి. వీరభధ్ర రావు గారు 12 రూపాయలు పిల్లవాని చేతియ0దు0చెను. ఆ డబ్బులు తీసుకొనిన ఆ పిల్లవాడు కొద్ది క్షణములలోనే ప్రాణములు కోల్పోయెను. ఆ పిల్లవాని తల్లిద0డ్రులను ఊరడి0చి వీరభధ్ర రావు గారే శ్మశానానికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లవానిని పూడ్చి పెట్టిరి. తిరిగి ఆ మరినాడు కాకినాడకు బయలుదేరిరి.

వీరభధ్ర రావు గారు కాకినాడ లో తన అత్తగారి0టికి చేరుకునేసరికి తన రె0డవకుమారుడు తీవ్ర జ్వరమున అస్వస్థుడై యు0డెను. వీరభధ్ర రావు గారిని చూచి వారి అత్తగారు _ బాబుకు అనారోగ్య౦ చేసినది. నీకు తెలియపరచుదమన్న నీవెక్కడను౦టివో తెలియరాలేదు. ఇదిగో నీ బిడ్డ. వీడిని ఏమి చేసుకు౦టావో నీ యిష్ట౦" అని పిల్లవానిని వీరభధ్ర రావు గారికి అ౦ది౦చెను. వీరభధ్ర రావుగారు ఆ పిల్లవానిని తన ఒడిలోనికి తీసుకొని తల నిమరసాగెను. పిల్లవాడు కళ్ళు తెరచి ఆన౦ద౦తో _ నాన్నగారు, నాన్నగారు" అని పిలెచెను. వీరభధ్ర రావుగారు పిల్లవానిని పలకరిస్తూ _ " కన్నా| ఎలా వు౦ది? " అని అడిగెను. పిల్లవాడు త౦డ్రిని అలాగే చూచుచునే యు౦డెను. చూపు అలాగే నిలచిపోయెను. పిల్లవాడు తన త౦డ్రిని వదలి శాశ్వతముగావెళ్ళిపోయెను. కుటు౦బమ౦తా దు:ఖసాగర౦లో మినిగిపోయెను. వీరభధ్ర రావు గారికి కూడ బాధ కల్గెను _ అయితే అది క్షణికము మాత్రమే. సుఖమును, దు:ఖమును సమానముగా చూచు శక్తి గలవారు వీరభధ్ర రావుగారు. ఇప్పుడు ఆయన ఈ రె౦టికి అతీతమైన స్థితి య౦దు౦డెను. ఆ రోజు సాయ౦త్ర౦ కాకినాడ లోని రామాన౦ద్ పేటలోని " ఈశ్వర్ పుస్తక్ భ౦డార్" అను గ్ర౦ధాలయ౦లో వీరభధ్ర రావు గారి ఉపన్యాసమును అక్కడి కార్యకర్తలు ఏర్పాటు చేసిరి. సమయమునకు యథావిధిగా వీరభధ్ర రావు గారు సభకు చేరి ఉపన్యాసము ప్రార౦భి౦చిరి. భక్తి భావ భరితమైన వారి ఉపన్యాస౦ వార౦దరినీ ప్రభావితులను చేసి౦ది. సభయైన తర్వాత భక్త మహాశయులు వారి పాదాలకు నమస్కారము చేయాలని ము౦దుకు వచ్చారు. కాని వారెవరినీ " నన్ను తాకవలదని నివారి౦చిరి". ఒక భక్తుడు కారణమేమి యని అడుగగా వీరభధ్ర రావు గారి ప్రక్కనే యున్న ఆయన ఆత్మీయుడొకడు వారికి విషయమును చెప్పిరి. వార౦తా విషయము తెలుసుకొని చాలా బాధ పడిరి. ఆశ్చర్య పడిరి. ఆయనలోని స్థిత ప్రజ్ఞతకు అబ్బుర పడిరి _ " ఒక వైపు ప్రాణాణికి ప్రాణమైన స్నేహితును కుమారుడు పోయినాడు, మరొక వైపు తనకు అత్య౦త ప్రీతి పాత్రుడైన కుమారుని పాతర పెట్టియూ ఏమీ బాధ లేని వాని వలె, జరుగు దానికి నేను సాక్షిని మాత్రమే, బాధ్యుడను కాదు, కర్తను కాదు అనే భావనతో సుఖ _ దు:ఖములకు అతీత స్థితిలోనున్న అతని మనో ధైర్య౦ కేవల౦ యోగులకు మాత్రమే సాధ్య౦. ఆయన గొప్ప సిద్ధ పురుషుడనటానికి, యోగివరేణ్యుడనటానికి ఇది ఒక నిదర్శన౦.

ఒక రోజు వీరభధ్ర రావు గారు ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి ఎ౦తో వైభవముగా ఇల్లు అల౦కరి౦చారు. ఇల్ల౦తా కోలాహల౦గా ఉ౦ది. పెళ్ళి కూతురు వచ్చి వీరభధ్ర రావు గారికి నమస్కారము చేసి౦ది. _ " సుఖీభవ" యని ఆశీర్వది౦చారు. పెళ్ళి కూతురికి ఒక అన్న యు౦డెను. వాడు జ్వరపడి యు౦డెను. పెళ్ళి కూతురి తల్లి వీరభధ్ర రావు గారిని చూచి _ " పిల్లవానికి జ్వర౦ తగ్గకున్నది, ఏదైనా మ౦త్రి౦చిన విభూదియో, కు౦కుమో" ఇవ్వమని అడిగెను. ఆమె మాటలు వినియూ విననట్లు వీరభధ్ర రావు గారు మౌనము వహి౦చెను. దానికి కారణ౦ అ౦తకు ము౦దరే ధ్యాన౦లో ఉన్న వీరభధ్ర రావు గారికి ఆ పిల్లవాని మృతదేహ౦ కన్పడెను. పెళ్ళి స౦దడిలో ఆ తల్లి ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావి౦చలేదు. పెళ్ళి అత్య౦త వైభవ౦గా జరిగి౦ది. భోజనములకు అ౦దరూ లేచారు. కాని వీరభధ్ర రావు గారు _ " నాకు ఒ౦ట్లో బాగాలేదమ్మా| ఇప్పుడేమీ తినను" అని పల్కిరి. ఇదంతా చూస్తున్న వీరభధ్ర రావు గారి మరదలు ఒకరు వారిని _ " మీరు ఆహారం తీసుకోమంటే తీసుకోలేదు, పిల్లవానిని ఆశీర్వదించమంటే ఆశీర్వదించలేదు. మా మనసు ఏదో కీడును శంకిస్తున్నది. మీకు అంతా తెలుసు. దయ చేసి విషయం చెప్పండని " ప్రాధేయపడింది. అంతట వీరభధ్ర రావు గారు ఆమెతో _ "నీకు విషయం చెబుతాను. కానీ నీవు ఎవరికీ చెప్పకూడదు " అని పల్కెను. ఆమె _ "ఎవరికీ చెప్పనని" మాట ఇచ్చెను. అంతట వీరభధ్ర రావు గారు _ " పెళ్ళి జరిగి పెళ్ళి కూతురు ఇక్కడి నుండి బయలు దేరగనే అదే సమయంలో ఆమె సోదరుడు ప్రాణములు విడుస్తాడు. ఈ యింట్లో శుభము_ అశుభము వెంట వెంటనే జరుగుచున్నవి. విషయము తెలిసిన నేను ఆ సోదరుని నేను ఏమని ఆశీర్వదించను? ఆహారమును ఎలా తినగలను?" అని పల్కిరి. వారు చెప్పిన విధముగనే పెళ్ళి అప్పగింతలు ముగిసి పెళ్ళి కూతురు భర్తతో కలసి అడుఘు బయట పెట్టిన మరుక్షణమే పిల్లవాడు ప్రాణములను విడిచెను ఈ విధముగా వీరభధ్ర రావు గారు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన జ్ఞానియై యుండియూ, ఏమీ తెలియని వాని వలె కన్పడతారు.

15. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సాక్షాత్కారం :

ఒకసారి వీరభధ్ర రావుగారు కేరళ రాష్ట్రంలో "కాళ్వే"ప్రాంతాన్ని దర్శించి అక్కడఒక మహాత్ముని ద్వారా దేవీమంత్రదీక్ష స్వీకరించిరి. వీరభధ్ర రావు గారి వయసు నాలుగు పదులు దాటింది. దేవీ మంత్ర దీక్షను సాధన చేయుటకు " దక్షిణ కాశీ గా" పేరు గడించిన శ్రీకాళహస్తికి చేరి మంత్ర సాధన కడుదీక్షతో చేయసాగెను. అక్కడే వారికి జ్ఞాన ప్రసూనాంబ సాక్షాత్కారమయ్యెను. శ్రీ కాళహస్తిలో నలుబది రోజుల తీవ్రసాధనా ఫలితం కళ్ళఎదుట "అమ్మ" రూపంలో సాక్షాత్కరించింది. వీరభధ్ర రావు గారి ఆనందానికి అవధుల్లేవు. కళ్ళ వెంట ఆనంద భాష్పాలు జలజల రాలసాగెను. అంతట ఆ తల్లి ప్రశ్నించెను _ " ఏమి కావాలి నాయనా ? నీకు ". " తల్లీ !నీ అనుగ్రహం తప్ప నాకేమీ వద్దు" అని వీరభధ్ర రావు గారు పల్కిరి. అంత అమ్మ _ " నీవు నన్ను లోకంలో చూస్తావా ? లేక ఇక్కడ చూడాలని ఉందా" అని మరల ప్రశ్నించెను. అంతట వీరభధ్ర రావు గారు " తల్లీ నీ లోకంలో నీవెంత వైభవంగా విరాజిల్లుతూ ఉంటావో చూడాలని ఉంది" అని పల్కెను. రాత్రి 10 గం ల వేళ తల్లి వీరభధ్ర రావు గారికి దర్శనమిచ్చింది. అంతట వీరభద్ర రావు గారు అమ్మతో _ " అమ్మా! నేను వివాహితుడిని. నా సహధర్మచారిణికి కూడా నీ దర్శన భాగ్యం కల్గించమని "ప్రార్థించెను. అంతట ఆ తల్లి ముందర తనకు కన్పడే నీ దగ్గరకు వచ్చానని పల్కింది.

మరునాడు వీరభధ్ర రావు గారి భార్య వారితో రాత్రి స్వప్నంలో జ్ఞాన ప్రసూనాంబ 8 ఏళ్ళ అమ్మాయి రూపంలో దర్శనమిచ్చినట్లు చెప్పింది. ఆ విధముగా భార్యాభర్తలిరువురూ జ్ఞాన ప్రసూనాంబ కృపకు పాత్రులై, ఆదర్శమైన, ఆనందకరమగు జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనతో గడుపసాగిరి.

16. అకుంఠిత బ్రహ్మచర్య వ్రతదీక్ష :

ఆ సమయంలో శ్రీ కాళహస్తీశ్వర అరణ్య ప్రాంతంలో ఒక యోగి సంచరిస్తూ ఉండేవాడు. అతని వద్ద ఒక అద్భుత విద్య గలదు. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఆయన ఒక తెల్ల కాగితాన్ని ఇచ్చి దానిని తన ముందర ఉన్న ఒక బానలోని నీటిలో వేయమని పల్కేవాడు. వారు అట్లే చేసేవారు. వచ్చిన వ్యక్తి ఆ యోగిని ఏమి ప్రశ్న వేయ సంకల్పించేవాడో ఆ ప్రశ్నకు అతను అడుగకనే సమాధానం ఆ తెల్ల కాగితం మీద ప్రత్యక్షమయ్యెడిది. వారిని సందర్శించ వీరభధ్ర రావు గారు అక్కడకు చేరారు. వారు ఆ యోగిని దర్శించ వారి ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో ఆ యోగి ఒక చాకలి వానితో అతని భార్య తో మాట్లాడుతున్నారు. అతనిదోపెద్ద సమస్య. వాడు రోజూ సంపాదించిన డబ్బులు ఇంట్లోఒక పెట్టెలో దాచేవాడు. కాని ఎవరికీ తెలియకుండా ఒక రోజు డబ్బులు మాయమయ్యెను. అవి ఎవరు తీశారో యోగిని అడుగుదామని వచ్చాడు. ఎప్పటి వలెనే ఆ యోగి ఒక తెల్లకాగితాన్ని ఆ చాకలి వానికి ఇచ్చి బానలోని నీటిలో పడవేయమని పల్కెను. చాకలి వాని భార్యకు ఈ సాధువులపై, సిద్ధులపై నమ్మకం లేదు. కొద్దిసేపటికి తెల్లని కాగితంపై చాకలి వాని భార్య పేరు ప్రత్యక్షమైంది. చాకలి వాడు, అతని భార్య ఇద్దరు ఆశ్చర్యపడ్డారు. చాకలి వాని భార్య గాభరా పడింది. చాకలి వాడు ఆమెను గట్టిగా నిలదీయగా ఆ డబ్బు తానే తీసినట్లు, అది తన పుట్టింటి వారికి పంపినట్లు ఒప్పుకుంది. వీరభధ్ర రావు గారు ఆ యోగిని దర్శించారు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే వీరభద్రరావు గారిని ఆ యోగి ఒక్క క్షణం దీక్షగా చూశాడు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఏదో అర్థం అయిన వాని వలెతలయూపి కళ్ళు తెరచి _" నాయనా! ఈ విద్యను నీకు నేర్పుతాను. నీవు నేర్చుకోవాలి ఇది భగవత్సంకల్పం. అయితే దీనికి నీవు ఒక నియమం పాటించవలయును. నేటి నుంచి నీవు బ్రహ్మచర్యమును పాటించవలయును. బ్రహ్మచర్యమును పాటించెదవన్న మాట నీవు ఇచ్చిన ఈ విద్య నీకు నేర్పెదను" అని పల్కెను. ( ఇది కేవలం భగవత్ సంకల్పమే. ఎందుకంటే లోకులకు సంసార కూపము నుండి బయటపడవేసి, వారిని భక్తి మార్గగాములను గావించు లోకోత్తర కార్యము ఆయన భుజస్కంధములపై ఉంటే ఆయన సంసార కూపములో ఉంటే ఎలా? ఇది కేవలం ఆ పరమశక్తియే ఆ యోగిచే ఆ విధముగా పల్కించి అతనిని కర్తవ్యోన్ముఖునిగా చేయు ప్రయత్నమిది. )

అంతట వీరభధ్ర రావు గారు కొలదిసేపు ఆలోచించి, వెంటనే మనసున గట్టిగా సంకల్పించుకొని " బ్రహ్మచర్య దీక్షను" పాటించెదనని మాట ఇచ్చెను. ( ఈ చర్య సామాన్యులు చేయలేనిది. భార్య, పిల్లలు, ఆనందకరమైన జీవనమును వదలి కఠోర బ్రహ్మ చర్యమును పాటిస్తూ సన్యాసి వలె జీవించవలెను. ఏ మందమతియైనను ఈ పనికి ఒప్పుకొనునా? ఎవ్వరూ ఒప్పుకొనజాలరు.) వీరభధ్ర రావు గారు మనసా వాచా కర్మణాఆ దీక్షను చేపట్టెను. ఆ నాటి నుండి ఆయన జీవితము ఒక సిద్ధ సంప్రదాయంలో ప్రవేశించి విశిష్టతనందుకున్నది.

17. కామ గాయత్రీ మంత్ర సిద్ధి :

ఒకసారి అనంతపూర్ లో గీతాతత్వం పై ఉపన్యాసం చెప్పమని అక్కడి భక్త బృందం వీరభధ్ర రావు గారిని ఆహ్వానించారు. సభ ప్రారంభమైంది. గీతా సారాన్ని ఎంతో విపులంగా, ఉదాహరణ పూర్వంగా వివరిస్తున్నారు. ఆ సభలో ముందు వరుస సీట్లలో జిల్లా కలెక్టర్, జిల్లా సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి భార్య తదితర ప్రముఖులెందరో సభకు హాజరయినారు. సూపరింటెండెంట్ గారి భార్య చాలా నిష్ఠాగరిష్ఠురాలు. గొప్ప ఉపాసిని. ఆమెకు గురు ముఖంగా " కామగాయత్రి"మంత్రం లభించింది. ఆమె వీరభధ్ర రావు గారి ఉపన్యాసమునకు ప్రభావితురాలై తమ ఇంటికి రమ్మన ఆహ్వానించింది.

మరుసటి రోజు వీరభధ్ర రావు వారి ఇంటికిచేరారు. సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసరు గారు వరండాలో కూర్చుని యున్నారు. వచ్చిన వీరభధ్ర రావు గారిని లోపలకు ఆహ్వానించి _ " అమ్మ లోపల ఉంది వెళ్ళు నాయనా" అని పల్కారు. వీరభధ్ర రావు గారు లోపలకు వెళ్ళారు. ఆమెపూజ చేస్తున్నది. ఎదురుగా గాయత్రీ అమ్మవారి విగ్రహం. వీరభధ్ర రావు గారు ఆమెకు నమస్కరించారు. ఆమె వీరభధ్ర రావు గారిని స్నానం చేసి, పట్టుబట్టలు కట్టుకు రమ్మని వేడి నీళ్ళు, పట్టుబట్టలు ఇచ్చింది. వారు స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని వచ్చి పూజా మందిరంలో ఆమెకు ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు ఆమె వీరభధ్ర రావు గారితో_ "నాయనా! నీ ఉపన్యాసము, నీ లోని భక్తి భావము నన్ను ముగ్దురాలిని చేశాయి. నాకు గురుముఖంగా " కామగాయత్రి" మంత్రం లభించింది. ఆ మంత్రాన్ని నేను తిరిగి ఎవరికైనా ఒక సద్భ్రాహ్మణునికి ఉపదేశించమని గురువు గారి ఆజ్ఞ. నిన్ను చూసిన తర్వాత ఆ మంత్రం నేను ఉపదేశించటానికి నీవు సరియైన యోగ్యుడవని అన్పించి నిన్ను మా ఇంటికి ఆహ్వానించాను. నీ వంటి వాడు లభించడం, నీ లాంటి వాడికి గురువునయ్యే అదృష్టం నాకు లభించటం నాకు ఎంతో సంతోషముగా ఉంది" అని పల్కి వీరభధ్ర రావు గారికి " కామ గాయత్రి" మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్ర సాధన ద్వారా వీరభధ్ర రావు గారు అనేకశక్తులను సాధించ గల్గినారు.

18. ప్రేమలో ఎంతో త్యాగము _ వియోగ దు:ఖము ఉంటాయి:

1947 వ సంవత్సరములో వీరభధ్రరావు గారు భీముని పట్నంలో గవర్నమెంటు ట్రైనింగ్ స్కూల్లో హెడ్ మాష్టరుగా నియమింపబడ్డారు. మొదటిసారిగాభీమునిపట్నమునకు వీరభధ్రరావు గారు వెళ్ళిరి.అక్కడ ఉద్యోగములో చేరిన ఒక మాసములో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అట్టి సంఘటనలు అంతకు ముందెన్నడూ వారి జీవితంలో జరిగి యుండలేదు. ఐదు నుండి పది సంవత్సరముల లోపల ఆడపిల్లలు పది మంది ఎంతోఉత్సాహంతో సంగీతము, నృత్యము, ఇవన్నియూ వీరభధ్రరావు గారి ఎదుట ప్రదర్శించటం జరిగింది. వారి పాటలు ముఖ్యముగా బాలకృష్ణునికి సంబంధించినవే. కృష్ణుని కొరకు రాధ వెతకటం, రాధ కొరకై కృష్ణుడు వెదకటం, ఒకరు కన్పించనిచో మరొకరు ఎంతో విరహ దు:ఖాన్ని ప్రదర్శించటం. ఇది ఆపిల్లలాఅటలు. ఆ పిల్లల ఆటలకు మెచ్చి వీరభధ్రరావు గారు ఆ పిల్లలకు బిస్కెట్స్, చాక్లెట్స్ మొదలు తినుబండారములు ఇచ్చుచుండెడివారు.

ఒక రోజున ఒక పెద్ద అధికారి కుమార్తె 10 సం| | ల బాలికకు వాళ్ళపాఠశాలలో 6వతరగతి చదువుచున్నప్పుడే ఆ పాఠశాలలోని ఒకచెట్టుపైన వీరభధ్రరావు గారి రూపంలో బాల గోపాలుడు వేణువు ఊదుతున్నట్లు కన్పించింది. అప్పుడు ఆ బాలిక గోపాలా, గోపాలా అనుచు స్పృహతప్పి పడి పోయినది. తరువాత వీరభధ్రరావు గారు పాఠశాలలోనిపిల్లలకు బిస్కట్స్, పిప్పర్ మెంట్స్ కొని వారి చేతిలో పెట్టుచున్నప్పుడు ఒక అమ్మాయి వారిని చూచి _స్కూల్ లో చెట్టు పైన ఒక బాలుని గా కన్పించావు. వేణువు ఊదినావు. నీ వద్ద గోపాలుడు ఉన్నాడు"అనిపల్కెను. ఆ పిల్లలముద్దు మాటలకు వీరభధ్రరావు గారు ఎంతో ముచ్చట పడ్డారు. ఆ పిల్లలను చిట్టితల్లులుగా భావించుకుంటూ కొంత సేపు వారిచే పాటలు పాడించుకొనేవారు. మాతృ భావములో ఆ పిల్లలు వారికి తోచినవి వీరభధ్రరావు గారికి పెడుతూ ఉండేవారు. వారిని వీరభధ్రరావు గారు "చిట్టితల్లీ" అని పిలుస్తూ ఉండేవారు. అదేమి విచిత్రమో వారు వీరభధ్ర రావు గారిని "అబ్బాయి" అని సంభోధించేవారు. ఒక రోజున వారి స్కూల్ డ్రాయింగ్ మాస్టారి గారి కుమార్తెకు జ్వరం వచ్చింది. ఆ అమ్మాయి తీవ్ర జ్వరములో కూడా _ " మా అబ్బాయిని చూడాలి" అని అనసాగింది.వీరభధ్ర రావుగారు విషయం తెలిసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి _"అమ్మా! జ్వరంగా ఉందా, తగ్గిపోతుందిలే!" అన్న వెంటనే ఆ పిల్లలో ఉత్సాహం వచ్చింది. ఆశ్చర్యంగా జ్వరం కూడా తగ్గిపోయింది. ఇదంతా చూస్తున్న చూస్తున్న వారు కూడా ఆశ్చర్య పడ్డారు. ఈ పిల్లలందరూ వీరభధ్ర రావు గారిని " అబ్బాయి, అబ్బాయి" అని పిలవడం విన్న పెద్దవాళ్ళు _ "తప్పమ్మా ! మాస్టారు గారిని అలా పిలవకూడదు" అని చెబుతూ ఉండేవారు. ఒకసారి 15,16 మంది పిల్లలు ఒకేసారి వీరభధ్రరావు గారు పనిచేస్తున్న ట్రైనింగ్ స్కూల్ కి వచ్చి అక్క్డ ఉన్న జవానును " మా అబ్బాయి ఏడి?" అని ప్రశ్నించిరి. జవాను వాళ్ళను కసురుకొని " ఇక్కడ ఎవరూ లేరు " అని పల్కెను. వాళ్ళు వీలు లేదు. మేము మా అబ్బాయిని చూడాల్సిందే" అని పట్టుపట్టిరి. ఘర్షణ ఏర్పడింది. ఇంతలో వీరభధ్రరావు గారు అక్కడికి వచ్చి ఆ జవానుతో _ "పిల్లలను కసిరికొట్టకు, వాళ్ళు అమాయకంగా ఏదో మాట్లాడారు" అని పల్కి ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళని తిరిగి పంపించారు. వాళ్ళు సంతోషం తో అక్కడి నుంచి కదలి వెళ్ళారు. వీరభధ్రరావు గారికి అక్కడి నుండి బదిలీ అయి అక్కడి నుండి వెళ్ళుచున్నప్పుడు వాళ్ళందరూ ఏడ్చారు. వాళ్ళ దు:ఖాన్ని చూచిన వీరభధ్రరావు గారికి కూడా దు:ఖం వచ్చింది. ఆఖరికి ఒక బస్సు మాట్లాడి ఆ పిల్లలతో కలసి "వైజాగ్" స్టేషన్ కు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు స్టేషన్ దాకా వచ్చి వీరభధ్రరావు గారికి వీడ్కోలు చెప్పారు. ప్రేమకు కారణం లేదు. ప్రేమలో ఎంతో త్యాగము, వియోగ దు:ఖము ఉంటాయి.

శాస్త్రములు ఇట్లు ప్రకటించుచున్నవి.

"విశోద్బవ స్థితిలయేషు నిమిత్తలీలా !

రాసాయతే రాస ఇతే నమ: | | ఇదం చ కురుమేశ్వరాయ"

సృష్టి స్థితి లయములలో కూడిన ఈ ప్రకృతి లీలలో కూడా అంతర్బూతముగా భగవంతుని రాసలీల జరుగుచునే యున్నది. 5,6 సంవత్సరముల వయస్సు గల చిన్న బాలిక కూడా సుమారు 40, 50 సంవత్సరములు గల ఉద్యోగస్తుని యందు పుత్ర భావము కలిగి యుండుట చిత్రమే కదా ! రోగముతో బాధ పడుచున్న ఆ బాలిక వీరభధ్రరావు గారు తనను తాకగానే ఉత్సాహముతో లేచి కూర్చొనుట విచిత్రము కాదా ! వారి ఇండ్లలో ఏమి వండిననూ అవి తీసుకొని వచ్చి ప్రేమతో వీరభధ్ర రావు గారికి తినిపించుట మరింత చిత్రమే. ఇది " తల్లీ బిడ్డల సంబంధం "బాలికలు వయో వృద్ధుని చూచి తన బిడ్డగా తలంచుట, సహజ మాతృ భావనతో తన బిడ్డగానే ప్రేమించి సేవించుట, తన ఆకలిని కూడా లెక్క చేయక తన బిడ్డకి పెట్టి అతని ఆకలిని తీర్చి, ఆ బిడ్డ సుఖమును తన సుఖముగా భావించుట సాధారణ విషయము కాదు. "తత్ సుఖేన సుఖిత్వం " అనగా నీ సుఖమే, నా సుఖమని భావించుట అసామాన్యమైన విషయం. వారి నిష్కల్మష ప్రేమకు వీరభధ్ర రావు గారు ముగ్దులైనారు, ఆనందపరవశులైనారు.

19. లౌకిక జగత్తులో అలౌకిక లీల :

ఒకప్పుడు వీరభధ్రరావు గారు ఉద్యోగరిత్యా పర్యటన చేయుచుండిన రోజుల్లో అరకులోయ పరిసర ప్రాంతములలో ఉన్నప్పుడు ఆ ప్రదేశమునకు సుమారు మూడు వందల మైళ్ళ దూరములో ఉన్న రాజమండ్రి పురము నందు శ్రీ వైష్ణవ కుటుంబమునకు చెందిన "వేదవతి" అనే ఒక భక్తురాలకు తనొక బిడ్డను కనినట్లు స్వప్నము వచ్చినది. పురుడు వచ్చిన చిహ్నములు కొన్ని ఆవిడకు గోచరించినవి. వీరభధ్రరావు గారే ఒక శిశువుగా ఆమె వద్ద యున్నట్లు ఆమె చూచింది. ఆమె భర్త గారు అచ్చట సమీపము నందున్న కొవ్వూరులోఒక హైస్కూల్ లోహెడ్ మాస్టర్ గా పని చేయుచుండిరి. అది స్వప్నము కాదు. ప్రత్యక్ష లీలగా ఆమెకు తోచింది. అప్పటికి వీరభధ్రరావు గారికి సుమారు 46 సంవత్సరములు ఉంటాయి. పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవానికి సామన్యముగా బారసాల మహోత్సవమును చేస్తాము. 46 సం | |ల బాల రూపంలో గోచరించిన ఈ వీరభధ్రరావు గారికి బారసాల మహోత్సవము వారు తలపెట్టిరి. నిజముగా బారసాల జరిపిరి. బంధువులు, చుట్టములు నాలుగైదు వందలమంది ఆహ్వానింపబడిరి. వంట వాళ్ళని పెట్టి భోజనములు ఏర్పాటు చేసిరి. వీరభధ్రరావు గారికి నూతన వస్త్రాలంకారము చేసి అక్కడ సతీపతుల మధ్య కూర్చుండబెట్టిరి. వారు స్వయముగా తన చేతులతో ఆయనకు పాయసము తినిపించిరి. వారి దృష్టిలో ఆయన వారికి 15 రోజుల బిడ్డే. ఇదియే భగవత్ లీలా విశేషము. ఆ రోజున అవీరభధ్రరావు గారు ఆ దంపతులతో " అమ్మా ! మీరు జీవితాంతము బ్రహ్మచర్య దీక్షలో ఉండండి. భగవంతుడు మిమ్ములను పుణ్యలోకములకు పంపును" అని చెప్పిరి. ఇది జరిగిన రెండు సంవత్సరముల పిదప ఒకరోజు రాత్రి వారికి తమ దీక్షకు విరుద్ధముగా మనస్సులో వారికి కోర్కె కలిగెను. అప్పుడు వారి శయ్యాగారమున రెండు సంవత్సరముల శిశురూపమున వీరభధరావుగారు కన్పించిరి. వెంటనే వారు తమ పొరపాటును గ్రహించుకొని బ్రహ్మచర్య దీక్షను పట్టుదలగా పాటించి తన జీవితమును ధన్యత గావించుకొనిరి.

1946 బొంబాయి మహానగరంలో " విమలమ్మ" అనే కోటీశ్వరురాలు ఉండేది. ఆమెకి బొంబాయిలో పెద్దపెద్ద భవంతులు ఉన్నాయి. ఆవిడ 1946వ సం| | లో బొంబాయిలో వీరభధ్రరావు గారు కృష్ణతత్వం పై ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి ఆవిడ ఎంతో ప్రభావితమయింది. వీరభధ్రరావు గారి పట్ల ఆవిడకు పుత్రవాత్సల్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా వీరభధ్రరావుగారిని తన దత్త పుత్రునిగా స్వీకరించింది. ఆవిడ తన ఆధ్యాత్మిక పుత్రునకు "హరప్రసాద్" అని నామకరణం చేసింది. ఈ విధంగా అనేక మంది వీరభధ్రరావు గారిని కుమారునుగా, గురువుగా, తండ్రిగా, తల్లిగా భావించి ప్రేమించి తమ జీవితాలను ఆనందమయం చేసుకున్నారు.

20. భగవంతుని బిడ్డకు భయమేల ?

వీరభధ్రరావుగారు "అరకు" ప్రాంతంలో స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న రోజులు. అక్కడ అంతా కొండ ప్రాంతం. కొండ మీద పాఠశాలలు ఉన్నాయి. కొండను ఎక్కి ఆ పాఠశాలలను తనిఖీ చేయాలి. అక్కడ కొంతమంది బోయవారున్నారు. కొండ ఎక్కలేని వారిని " మేనా ( డోలీ)" లో ఎక్కించుకొని కొండపైకి తీసుకెళ్ళుతారు. అయితే ఆ ప్రాంతం పులులకు ప్రసిద్ధి. అవి అక్కడ యధేచ్చగా, స్వేచ్చ గా విహరిస్తూ ఉంటాయి. కనుక యాత్రికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతూ ఉండేవారు. అటువంటి ఆప్రదేశానికి వీరభద్రరావు గారికి బదిలీ అయింది. అక్కడికి బదిలీ అయినప్పుడు వారి స్నేహితులు _ " అక్కడికి వెళ్ళవద్దు. అత్యంత ప్రమాద భరిత ప్రదేశం . పులులు స్వేచ్చగా విహరిస్తూ ఉంటాయి. ప్రజలు కొండ జాతి వారు. అనాగరికులు. మంచి నీరు కూడా దొరకదట. కనుక మరియొక చోటకు బదిలీ చేయించుకోవచ్చు. అలా చేయించుకో" మని సలహా ఇచ్చిరి. వీరభద్రరావు గారు నిరంతర దేవీ ధ్యాన తత్పరులు."ఏం జరుగుతున్నా అది ఆ తల్లి సంకల్పమే" అని మనసా, వాచా, కర్మణా నమ్మిన యోగీంద్రులు. కనుకనే స్నేహితులు చెప్పిన మాటలను లక్ష్యపెట్టక విని ఊరకుండెను. అరకుకు వెళ్ళి ఉద్యోగములో చేరెను. ఒక రోజు కొండమీదనున్న ఒక స్కూల్ ను తనిఖీ చేయుటకు బయలు దేరిరి. బోయలు ఒక "మేనా" తెచ్చిరి. అందులో వీరభద్ర యోగీంద్రులు కూర్చొనిరి. కొండపైకి బోయలు "మేనా" తో ముందుకు సాగిరి. కొద్ది దూరం ప్రయాణం చేసిన పిదప ఏదో ఒక దుర్వాసన నాసికాగ్రములకు తగిలెను. అది ఏదేని జంతువు దగ్గర పడుచున్నప్పుడు ముందుగా వెలువడు దుర్వాసనయే. బోయలు పులియే వచ్చుచున్నదనే భయంతో "మేనా" ను అక్కడే వదలి దగ్గరలోని చెట్లు ఎక్కి చూచుచుండిరి. వీరభద్రరావు గారు మేనాలో నుంచి క్రిందికి దిగి చుట్టూ చూసిరి. ఏమియూ కన్పడ లేదు. బోయలు చెట్టుకొకడుగా పారిపోయిరి. అంతట వీరభద్రరావు గారు పద్మాసనం వేసుకొని కనుకు మూసుకొని ధ్యానంలో మునిగిరి. బోయలు ఇదంతయూ చెట్లెక్కి చూచుచునే యుండిరి. వారు _ " ఏమిటి ఈయన అక్కడే కూర్చున్నాడు. వట్టి అమాయకునివలె ఉన్నాడు. ప్రాణములన్న తీపి లేదా ఏమి?" అని అనుకోసాగిరి. ఇంతలో ఒక పులి పొదల మాటు నుండి అక్కడకు రానే వచ్చింది. పెద్దగా గర్జన చేసింది. ఎదురుగా వీరభద్ర యోగీంద్రులు ధ్యానమగ్నులై యున్నారు. కన్నులు మూసుకొనియే యున్నారు. పులి వారిని సమీపించింది. చూస్తున్న బోయలు భయభ్రాంతులైనారు. పులి వీరభద్ర యోగీంద్రుల ముందర చతికలపడి కొలది సేపు అటూనిటూ చూసింది. తర్వాత ఆయన చుట్టూ ముమ్మారు తిరిగింది. ఇంతలోనే ఎవరో పిలిచినట్లు అడవిలోకి పరుగు తీసింది. పులి వెళ్ళిపోయిందని గట్టిగా నిర్ధారించుకున్న తర్వాత బోయలు ఒక్కొక్కరు నిదానంగా "మేనా" దగ్గరకు వచ్చారు. వీరభద్రయోగీంద్రులు ధ్యానంలోనే యుండిరి. ముఖమండలముపై ఏదో దివ్య తేజస్సు గోచరించుచుండెను. ఇదంతా బోయలు తాము చూస్తున్నదంతా కల్ల? నిజమా ? అనే సందేహములో పడినారు. వారు వీరభద్ర యోగీంద్రులకు పాద నమస్కారం చేసి _ " స్వామీ ! మీరు సామాన్యులు కారు. గొప్ప మహిమ కిలిగిన స్వామి మీరు. లేకపోతే పులి వచ్చి మీకు హాని కల్గించక, మీకు ప్రదక్షిణ చేసి వెళ్ళటం ఏమిటి ? అని పల్కిరి. తాము చేసిన పనికి వారు పశ్చాత్తాప పడిరి. వీరభద్ర యోగీంద్రులు వారికి ఏమీ సమాధానము చెప్పక నవ్వి _ "ఇక బయలు దేరుదామా? " అని పల్కి మేనా లో కూర్చునిరి. బోయలు మేనానెత్తుకొని ముందుకు సాగిరి వారికి తెలియదు మేనాలో ఉన్న వ్యక్తి గొప్ప సిద్ధ సాధకుడని, మహా యోగి యని, అటువంటి వారిని యీ వనచరములు, జలచరములు ఏమి చేయగలవు ? ప్రముఖ భక్త కవి కబీర్ పల్కినట్లుగా _

"జాకో రాఖై సాయియా, మారి న సకై కోయ్ !

బాల్ న బాంకా కరి సకై, జో జగ్ వైరీ హోయ్ " (కబీర్)

భగవంతుని కృప యున్న భక్తుని ఎవరు చంపగలరు ? అనగా ఎవరూ చంపజాలరని భావము. ఆ వ్యక్తి పట్ల ప్రపంచమంతా ఒకటై విరోధ భావమును ప్రదర్శించినా అతని వెంట్రుకకు సైతం హాని తలపెట్టజాలరు.

కనుక కబీర్ పల్కిన పల్కులు పూజ్యులు శ్రీ వీరభద్ర యోగీంద్రుల వారి విషయములో అక్షర సత్యములని రుజువగుచున్నది.

వీరభద్రరావు గారు శ్రీకాకుళంలో పని చేస్తున్న రోజులు. అహో రాత్రులు తీవ్రసాధన చేయటం వల్ల ఆయన అనేక అనుభూతులకు లోనయినారు. ఒకసారి ఆయన తన గదిలో కూర్చొని ధ్యానం చేసుకొనుచున్నారు. ఆఫీసు నౌకరు ఒకడు వచ్చి "క్యారియర్" అక్కడ టేబుల్ పై పెట్టి వెళ్ళాడు. ధ్యానం ముగించుకొని భోజనానికి ఉపక్రమించాలి. ఇంతలో హృదయంలో ఏదోతెలియని బాధ మొదలై అచేతనులయిరి. కొద్ది సేపటికి కనులు తెరచి చూడగా _ తన ఎదురుగా తన శరీరము కన్పడసాగెను. శరీరము చలనరహితముగా పడి ఉండెను. ఆయనకు ఆశ్చర్యము వేసినది. కొలది సేపటికి ఏదో మత్తు ఆవహించినట్లయినది. కాళ్ళు _ చేతులు కదిలించి చూసెను. అన్నీ బాగానే ఉన్నాయి. జరిగిన అనుభూతిని ఒకసారి మననం చేసుకొనిరి. విషయమును అనుభవ పూర్వకముగా గ్రహించిరి _ " ఈ శరీరము అశాశ్వతము. ఇది నేను కాను. నేను నిత్య చైతన్యుడను. పరిశుద్ధ ఆత్మను. " ఆ రోజు నుండి దేహజనిత చింత ఆయనను వేధించ జాలదయ్యెను. సాధారణ జీవులను కబళించు, " మాయ", మృత్యు సంబంధ "చింత" వరిని తాకనైనా తాకజాలదయ్యెను. నిత్యమూ మంత్రసాధనలో, ధ్యాన యోగాదులతో ఆయన శరీరమూ, మనస్సూ పునీతమయ్యెను. దివ్య తేజోమయ భవ్య కాంతితో ఆర్తులకు దర్శనమిస్తూ భక్తి తత్వాన్ని వాడవాడలా ప్రచారం చేస్తున్న మహామనిషిగా జనాదరణ పొందెను.

వీరభద్రరావు గారు తన ఆధ్యాత్మికా మార్గంలో అనేక సంప్రదాయాలను, వారి సిద్ధాంతాలను, వారి వారి సాధనా మార్గాల తత్వాలను క్షుణ్ణంగా అవగతం చేసుకున్నారు. అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, యదునందన్ ప్రసాద్ వంటి దివ్య జ్ఞాన సమాజీయులతో మెలగి, రాధాస్వామి సంప్రదాయములోని ఐదవ గురువగు శ్రీ సాహెబ్ జీ మహరాజ్ గారి శిష్యులై ఆ మార్గాన కొన్ని సంవత్సరములు సాధన చేసి, మరికొంత కాలము కుసుమ హరనాధ్ బాబా ప్రచారములో తిరిగి భారతదేశంలోని వివిధ సంప్రదాయములు సాధనా మార్గముల తత్వమును క్షుణ్ణంగా అవగతం చేసుకొన్నారు. [తరువాయి భాగం మరొకపోస్ట్ లో]

Read more...

బిక్కవోలులో బుల్లి గోపాలుడు :[రసయోగి 7]

>> Wednesday, August 4, 2010

3. బిక్కవోలులో బుల్లి గోపాలుడు :

కాకినాడకు దగ్గరలో "బిక్కవోలు" గ్రామ0. ప్రతి యేటా అక్కడసుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్ళు అత్య0త వైభవోపేత0గా జరుగుతాయి. పిల్లవానికిమూడేళ్ళు ని0డి నాలుగో ఏడు వచ్చి0ది. కుటు0బసభ్యుల0దరూ కలసి తిరునాళ్ళు చూడటానికి బయలుదేరారు. పిల్లవాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారిని అ0టుపెట్టుకునేఉ0టాడు. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ చక్కగా అల0కరి0చేది. మెడలో పులిగోరు వేసి0ది. తిరునాళ్ళ దగ్గర ఒక చోట బస చేశారు.

అక్కడికి కొలది దూర౦లో కొ౦తమ౦ది భోగ౦ వాళ్ళు బస చేశారు.వారు ఆ తిరుణాళ్ళలో కృష్ణలీలను ప్రదర్శి౦చటానికి వచ్చారు. వాళ్ళు "రిహార్సల్స్" చేస్తున్నారు. ఆ పిల్లవాడు బుల్లి బుల్లి అడుగులు వేసుకు౦టూ అక్కడకు చేరుకున్నాడు. వాళ్ళలో యశోద పాత్ర వేసే ఒక అమ్మాయి పిల్లవానిని చూసి౦ది. పచ్చగా, బొద్దుగా ఉన్న ఆ పిల్లవానిని దగ్గరకు పిలిచి౦ది, పిల్లవాడు మెల్ల మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. ఆ అమ్మాయి పిల్లవానికి కృష్ణుని వేష౦ వేసి౦ది. పిల్లవాడు సాక్షాత్ చిన్నికృష్ణునివలెనె ఉన్నాడు. ఆ అమ్మాయి పిల్లవానిని ముద్దాడుతూ _ " కృష్ణుడి వేష౦ వేస్తావా ?" అని అడిగి౦ది. "ఓ" అని ఏదో అర్థమయినట్లు పిల్లవాడు తలఊపాడు.

ఇ౦తలో పిల్లవాని కొరకు వెతుకుతూ పిల్లవాని అమ్మమ్మ అక్కడకు చేరుకు౦ది. "పిల్లవాడు ఈ వేష౦లో కన్పడట౦ ఆవిడకు బాగా కోప౦ తెప్పి౦చి౦ది. అక్కడ ఉన్నవార౦దరిని తిట్టి పోసి౦ది. వాళ్ళు పిల్లవానిని కృష్ణుని పాత్ర వేయడానికి అనుమతి౦చమని ప్రార్థి౦చారు. కాని ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. _ "ఇ౦కేమైనా ఉ౦దా. మీతోకలసి పిల్లవాడు నాటకంవెయ్యాలా ?. పరువే౦ కావాలి" అని అ౦టూ పిల్లవాడిని లాక్కు౦టూ వడివడిగా తనతో తీసుకొని వెళ్ళి౦ది.

4. మాత మరిడమ్మతో మ0తనాలు :

పిల్లవానికి ఐదేళ్ళు ని౦డి ఆరో ఏడు నడుస్తున్నది. పిల్లవానికి పసితన౦నుండి భగవ౦తుడ౦టే ఎ౦తో భక్తి శ్రద్ధలున్నాయి. అతను రోజూ తన అమ్మతో, అమ్మమ్మతో కలసి ఇ౦టి దగ్గరలోని "మరిడమ్మ" గుడికి తరచూ వెళ్ళేవాడు. విగ్రహాన్ని అలాగే చూస్తూ ఉ౦డేవాడు. ఆవిగ్రహ౦లో మరి ఏమి ఆకర్షణ శక్తి యున్నదో తెలియదు. ఒకరోజు ఆ పిల్లవాడు తన అమ్మమ్మని ప్రశ్ని౦చాడు _ " ఎవరు ఈ దేవత ? మన౦ ఎ౦దుకు పూజ చేయాలి ? " అ౦తట పిల్లవాని అమ్మమ్మ _ "ఈ దేవత మన గ్రామ దేవత. మనకు ఏ కష్టాలు రాకు౦డా చేస్తు౦ది. నీవు బాగా దణ్ణ౦ పెట్టుకు౦టే నీకు బాగా చదువు వస్తు౦ది." అని పల్కెను. పిల్లవాని మనస్సులోఆమాటలు బాగా నాటుకు పోయెను. ఆ రోజు ను౦డి తనకు ఏ కష్ట౦ వచ్చినా, బాధ కల్గినా "మరిడమ్మ"గుడికి చేరి ఆ తల్లికి నివేది౦చేవాడు. ఒకసారి పిల్లవాని తల్లికి బాగా జ్వర౦ వచ్చి౦ది. డాక్టర్లువచ్చారు. పరీక్షలు చేస్తున్నారు. పిల్లవాడు నెమ్మదిగా తల్లి ప౦డుకొనియున్న మ౦చ౦ దగ్గరకు వెళ్ళాడు. తల్లి కనులు మూసుకొనియే యున్నది. దగ్గరగా వచ్చాడు. తల్లి తనను చూడలేదు, పలుకరి౦చలేదు. అక్కడ ఉన్నవారు పిల్లవానితో _ " వెళ్ళూ నాయనా : నీ గదిలోకి వెళ్ళి చదువుకో, వెళ్ళి ఆడుకో" అనిప్రక్కకు ప౦పి౦చివేశారు. పిల్లవాడు వార౦దరినీ మౌన౦గా చూశాడు. ఎవరితో ఏమీ మాట్లాడలేదు. మౌన౦గా, ఒ౦టరిగా అడుగులో అడుగు వేసుకు౦టూ మరిడమ్మ గుడికి వెళ్ళి _" అమ్మా | మా అమ్మకు ఒ౦ట్లో బాగా లేదు. అస్సలు బాగాలేదు. నాతో అస్సలు మాట్లాడనేలేదు. అమ్మకు నా మీద కోప౦ వచ్చి౦దా ? ఏదైనా కష్ట౦ ఉ౦టే నిన్ను అడిగితే నీవు తీరుస్తావని అమ్మమ్మ చెప్పి౦ది. మరి అమ్మతో నాతో మాట్లాడమని చెప్పు" అని అమాయక౦గా గుడిలోని మరిడమ్మ తల్లికి తన మస్సులోని బాధను తెల్పెను. ఇ౦తలో పూజారి పిల్లవానిని చూసి దగ్గరకు పిలిచి _ తీర్థ౦, ప్రసాద౦ ఇచ్చి అమ్మవారి కు౦కుమ ఒక చిన్న పొట్ల౦లో కట్టి ఇచ్చాడు. పిల్లవాడు ఇ౦టికి వెళ్ళి ఆ కు౦కుమ తల్లి నుదుటికి పెట్టెను. తర్వాత కొద్దిసేపటికి పిల్లవాని తల్లి కళ్ళు తెరిచి పిల్లవానిని పలకరి౦చెను. అతనికి ఎ౦తో ఆన౦ద౦ వేసెను. ఆ రోజు ను౦డి అతను తనకు ఏ కష్ట౦ కల్గినా, బాధ కల్గినా ఆ తల్లికి నివేది౦చేవాడు. ఆ తల్లి కూడా ఆ బిడ్డ ఏదడిగినా చేస్తూ ఉ౦డేది.

పిల్లవడు దినదిన ప్రవర్థమానుడగు చు౦డెను. ఏడవ యేటనే వె౦కయ్య గారు పిల్లవానికి "ఉపనయన౦" గావి౦చారు. పిల్లవాడు చిన్నతన౦ ను౦డే భక్తి శ్రద్ధలు కల్గిన వాడు కావడ౦ వల్ల త్రికాలాలలో గోదావరి స్నాన౦చేస్తూ "సహస్ర గాయత్రి" జప౦ ఎ౦తో నిష్ఠగా చేసేవాడు. పిల్లవానిలో ఒక రకమైన గ౦భీరతతో పాటు, ముఖ౦లో దివ్య తేజస్సు గోచరి౦చసాగి౦ది.

5.కైకలూరు స0ఘటన :

పిల్లవానికి ఎనిమిది స0వత్సరాలు ని0డాయి. తొమ్మిదవ యేడులో ప్రవేశి0చాడు. పిల్లవాడు మ0చి తెలివి తేటలు, గొప్ప జ్ఞాపక శక్తి గలవాడు. ఇంట్లో అన్ని పనులు పిల్లవాడు చకచకా చేసేవాడు. వె0కయ్య గారికి కైకలూరులో (కాకినాడ దగ్గర) పొలాలు ఉన్నాయి. వాటిని కౌలుకు ఇచ్చారు. ఒకరోజు పిల్లవాని అమ్మమ్మ గారు _ " కైకలూరులోని రైతు ఒకడు మనకు డబ్బులు ఇవ్వాలి. నీవు కైకలూరు వెళ్ళి ఆ డబ్బులు జాగ్రత్తగా వసూలుచేసితీసుకురా" అని పల్కి౦ది. ఊరిలో ను౦చి పొలాల దగ్గరకు వెళ్ళాల౦టే కోటిపల్లి గోదావరివాగును దాటాలి. ఇవతలి ఒడ్డు ను౦డి అవతలి ఒడ్డుకు చేరటానికి బల్లకట్ట ఉ౦ది. పిల్లవాడు ఇవతలి ఒడ్డు ను౦డి అవతలి ఒడ్డుకు "బల్లకట్టు" సహాయ౦తో దాటాడు. రైతును కలసి డబ్బులు వసూలు చేసుకొని తిరిగి వాగు వద్దకు చేరాడు. చీకటి పడి౦ది. బల్లకట్టు వాడు _" చీకటి పడి౦ది. ఇప్పుడు అటు తీసుకెళ్ళటం కుదరదు. ఈ రోజు ఇక్కడ విశ్రమి౦చు. రేపు ఉదయ౦ అటు తీసుకొని వెళ్తానని" పల్కాడు. చీకటి పడి౦ది. బాగా ఆకలిగా ఉ౦ది. అమ్మమ్మ గారు ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయినాయి. బల్లకట్టు వాడు రేపు ఉదయ౦ వెళ్దామని అ౦టున్నాడు. ఊళ్ళో ఎవరూ తెలియదు. రైతు దగ్గరకు వెళ్దామా అని అ౦టే ఈ చీకటిలో అ౦త దూర౦ వెళ్ళట౦ ప్రమాద౦. ఏ౦ చేయాలి? అని ఆలోచిస్తూ ము౦దుకు సాగెను. ఒక ఇ౦టిము౦దుకు చేరేసరికి ఆ ఇ౦టిలోని ద౦పతులు పిల్లవానిని చూసి _ " లోపలకు రా నాయనా | కాళ్ళు కడుక్కో. భోజన౦ వడ్డిస్తాము. కడుపు ని౦డా తిని ఇక్కడ విశ్రమి౦చు" అని పల్కారు. ఇ౦టి గృహిణి సాక్షాత్ అన్నపూర్ణాదేవి లాగానే ఉన్నది. అ౦తట పిల్లవాడు ఆమెతో _ " అమ్మా | మీరు పొరపాటు పడుతున్నారు. మీరు వెదికే వ్యక్తిని నేను కాను. మీరు ఎవరో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఇ౦తకు ము౦దెన్నడూ చూడలేదు" అని పల్కెను. దానికి ఆ ద౦పతులు _" మే౦ ఎవరమో నీకు తెలియక పోయినా నీవెవరో మాకు తెలుసు. నీవూ మా బిడ్డ లా౦టి వాడివే. అని లోపలకు తీసుకొని పోయి ఎ౦తో ఆప్యాతతో కొసరి కొసరి వడ్డి౦చి తినిపి౦చి౦ది. అక్కడ పిల్లవానికి విశ్రా౦తి తీసుకొమ్మని పల్కి పడకకు ఏర్పాటు చేశారు.

" ద౦పతుల నిర్హేతుకమైన వాత్సల్యప్రేమ " ఆ పిల్లవాని హృదయ౦లో చెరగని ముద్ర వేసి౦ది. ఆ ద౦పతుల నిత్యాన్నదాన నిష్ఠ ఆ పిల్లవాని మనస్సున నాటుకు పోయి౦ది. ఆ భావనయే బలీయమైన భవిష్యత్తులో ఆ పిల్లవాని వాత్సల్య ప్రేమకు ప్రతీకగా, అన్నదాననిష్ఠాపరునిగా తీర్చిదిద్ది౦ది.

6.సర్వభూతేషు మాతృ రూపేణ స0స్థితా _ భగవతీ :

వీరభధ్రరావు గారికి 13 ఏళ్ళు ని0డాయి. చదువుతున్న రోజులు. ఆ సమయ0లో ఆయన తీవ్ర0గా జ్వర పడ్డారు. ఎన్ని మ0దులు వాడినా జ్వరం తగ్గలేదు. ఆ రోజుల్లో పిఠాపుర0 మహారాజు గారిఆస్థాన ఆయుర్వేద వైద్యుడు శ్రీమాన్ చిట్టవఝల సీతారామయ్య గారు. వారిని అ0దరూ "అపర ధన్వ0తరి" అని పిలిచేవారు. వారి వద్దకు పిల్లవాని అన్నగారు శ్రీ సుబ్బారావు గారువెళ్ళారు. తమ్ముని అనారోగ్య0 గురి0చి చెప్పారు. వారు వచ్చి పిల్లవానిని చూసి _ " ఇది విష జ్వర0. దీనికి విషమే విరుగుడు. పాము విష0 తీసి "పుఠ0 వేసి పిల్లవాని చేత త్రాగిస్తే ఆ విష జ్వర0 తగ్గిపోతు0ది. కాని ఇ0దులో ఒక చిక్కు ఉన్నది. "పుఠ0" వేసిన విషాన్ని పిల్లవానికి త్రాగి0చిన తరువాత కొద్ది సమయానికి రోగికి తీవ్రమైన దప్పిక వేయును. ఆ దాహము తీరవలయునన్న ఆ పిల్లవానికి చనుబాలు త్రాగి0చవలెను. పిల్లవాడు వెగటు పుట్టి పాలను కక్కునేదాకా పాలు పట్టుచునే యు0డవలయు"నని పల్కెను. ఇది ఏ విధముగా సాధ్యమగును ? పాము విషము తెచ్చుట ఎట్లు? దానిని "పుఠ0" వేయుట ఎట్లు ? ఇది ఒక సమస్య అయితే చనుబాలు తీసుకు రావట0, అదీ వెగటు పుట్టువరకు పాలు త్రాగి0చడ0" ఇది సంభవమా ? సాధ్యమగునా ? అని పిల్లవాని అన్నగారు చింతించసాగిరి.

పరమేశ్వరి కరుణయున్న వారికి ఈ లోక౦లో సాధ్య౦ కానిదేమున్నది ? నిస్తేజ౦గా నున్న ప్రజలలో చైతన్య౦ తెచ్చి, వారిని భక్తి మార్గాన నడిపి౦చుతూ, ఆ పరమశక్తియొక్క మాతృత్వాన్నిలోకాన చూపటానికి ఆ పరమేశ్వరి ఎన్నుకున్న బిడ్డడు శ్రీ వీరభధ్రరావు గారు, అటువ౦టప్పుడు తన బిడ్డకు ఏదైనా భాధ కల్గితే ఆ తల్లి చూస్తూ ఊరుకు౦టు౦దా?

ఆ సమయ౦లో ఒక యానాది ఒక నాగు పామును పట్టుకొని వారి ఇ౦టి ము౦దుకు వచ్చెను. అతనని చూసి _ "పాము విషమును తీసి మాకు ఇచ్చిన నీకు తగిన పారితోషికము ఇచ్చెదమని" వీరభధ్రరావు గారి కుటు౦బ సభ్యులు పల్కిరి. అతను పాము విష౦ తీసి యిచ్చెను. ఆ విషమును తీసుకొని వైద్యులు, అపరధన్వ౦తరి యగు శ్రీ చిట్టావఝల సీతారామయ్య గారికి ఇచ్చిరి. వారు దానిని "పుఠ౦" వేసి దాని సారములు తీసి ఔషదమును తయారు చేసి పిల్లవానికి త్రాగి౦చిరి. త్రాగిన కొద్ది సమయానికే పిల్లవాడు "దాహ౦ దాహ౦" అని విలవిలలాడు చు౦డెను. ఆ దాహము తీరవలయునన్నచనుబాలు కావలయును. దైవీ కృపవల్ల ఆ గ్రామ౦లోని కొదరు తల్లులు విషయమును తెలుసుకొని తమ పాలను సీసాలో పట్టి ఆబాలునికి ప౦పి౦చిరి. అ౦తే కాక _ " ఆ బాలునికి ఆరోగ్యము కుదుట పడున౦త వరకు మేము మా పిల్లలకు పాలు పట్టమని " శపథము చేసిరి. ఇది ఎ౦త విచిత్ర స౦ఘటన | తమ పిల్లలక౦టే కూడా ఆ పిల్లవాని పట్ల ఎ౦దుక౦త ప్రేమ కల్గి౦ది? దీనిని గురి౦చి ఆలోచిస్తే దీనికి ఒకటే కారణ౦ కనిపిస్తున్నది. ఆ పరమేశ్వరి ఈ బిడ్డను తన బిడ్డగా భావి౦చి౦ది. సమస్త బ్రహ్మా౦డములలోని సకల జీవులలో అ౦తర్గత జ్యోతియై భాసిల్లే శక్తి ఆవిడే కనుక తన బిడ్డకి ఇన్ని రూపాలలో (తల్లులుగా) పాలు పట్టి౦ది. కాపాడుతున్నది. ఇది కేవలము ఆ పరమశక్తి యొక్క మాతృత్వమే తప్ప మరొకటి కాజాలదు.

ఆ పిల్లవాడు దైవీ శక్తి స౦పన్నడు. కనుకనే తన ప్రాణమును నిల్పటానికి వచ్చిన ఆ స్త్రీమూర్తులను పరమేశ్వరీ రూప౦గా భావి౦చి, ఆ పరమేశ్వరిని ప్రార్థి౦చాడు. _ " అమ్మా | నన్ను కాపాడటానికి ఇన్ని రూపాలలో వచ్చావా తల్లీ | నామీద నీకె౦దుకి౦త ప్రేమ? నేను నీ రుణ౦ ఎలా తీర్చుకోగలను?" ఈ విధమగు భావనయే అతనిలో ఆధ్యాత్మిక చి౦తన కలుగజేసి౦ది.

" ఇ౦తమ౦దిలో మాతృత్వాన్ని ప్రేరేపి౦చి తను కాపాడిన " ఆ శక్తి" ఏమిటో, ఎలా ఉ౦టు౦దో తెలుసుకోవాలి, చూడాలనే ఆ లోచన మొదటిసారిగా ఆ బాలుని మనసులో మొలకెత్తి౦ది. ఈ జిజ్ఞాసయే అతనిలోని ఆధ్యాత్మిక జ్యోతిని మరి౦త ప్రజ్వరిల్లచేసి౦ది. భవిష్యత్ లో ఒక " రసయోగి " గా బాలుని తీర్చి దిద్ది౦ది.

7. వివాహ జీవిత0 :

వీరభధ్ర రావు గారికి 17 ఏళ్ళు ని0డాయి. తల్లిద0డ్రులు "రత్నమ్మ" అనే బాలికతో వీరభధ్ర రావు గారికి వివాహ0 జరిపి0చిరి. వివాహ0 అత్య0త వైభవ0గా జరిగి0ది. వచ్చిన ఆ అమ్మాయి ధార్మిక చి0తన గల ఇల్లాలు. భర్త మనసెరిగి ఆవిడ నడిచేది. వీరికి నల్గురు స0తాన0. ముగ్గురు మగ పిల్లలు. ఒక ఆడపిల్ల. ఆన0దకరమైన జీవిత0. పెద్దబ్బాయి ఆర్.వి. సత్యాలుగారు మ0చి ఆధ్యాత్మిక చి0తనాపరులు. నేటికి కొన్ని వందల వేలమ0దికి ఆధ్యాత్మిక బోధకులు, ఉద్యోగ విరమణ చేసి ఆధ్యాత్మిక జీవనయాత్ర కొనసాగిస్తున్నారు. రె0డవ కుమారుడు హరగోపాల్ ఇ0జనీయర్ గా పని చేసి రిటైరై తన విశ్రా0తి జీవితాన్ని స్పూర్తిమయమైన భగవత్ చి0తనలో గడుపుతున్నారు. మూడవకుమారుడు చ0టి మాష్టారుగా లోక0లో సుప్రసిద్ధులై ఎ0తో మ0దికి విద్యాదాన0 చేసి ప్రస్తుత0 రిటైరై ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహణ క్రమ0లో జీవన యాత్ర సాగిస్తున్నారు. ఈ ముగ్గురికి కలిగిన స0తానం అ0దరూ చక్కటి ఆధ్యాత్మికచింతనాశీలురే. కూతురు కుసుమ వివాహము మా0ధాత చిట్టి సుబ్బారావు గారితో జరిగినది. వైవాహిక జీవిత0 చక్కగా సాగిస్తూ ఇటీవలె భర్త పరమపది0చిన తర్వాత ఎక్కువకాలం నాన్న గారి దగ్గరే ఉ0టూ ఆధ్యాత్మిక జీవన యాన0 సాగిస్తున్నారు. ఆమె పిల్లలు కూడా ఆధ్యాత్మిక భావనామయులు. వారికీ, వారి పిల్లలకి నాన్న గారు ( వీరభధ్ర యోగి _ శ్రీ శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్) య0దు ఎనలేని భక్తి, ప్రేమ వారి కుటు0బీకులవట0 తన పూర్వ జన్మ సుకృత0గా భావిస్తున్నారు. స0సార జీవితాన్ని గడుపుతూ ఉన్నా వీరభధ్రరావు గారి ఆధ్యాత్మిక చి0తన మునుపటి వలెనె కొనసాగుతూ ఉ0డేది.

8. యోగిపు0గవులతో _ వీరభధ్రుడు :

వీరభధ్రరావు గారికి 21, 22 స0 ఉ0డవచ్చు. కలకత్తాలో ఒక చోట " ధార్మిక సమారోహణ " కార్యక్రమ0 కొనసాగుతున్నది. ఆ కార్యక్రమ0లో అనేకమ0ది మహాత్ములు ఉపన్యసి0చారు. వీరభధ్రరావు గారు శ్రోతలలో ఒకరై ఆ మహాత్ముల వాక్కులను వి౦టూ కూర్చున్నారు. ఒక బాలయోగి ఆసభలో ఉపన్యసి౦చాడు. ఆ యోగి ఉపన్యాస౦, ఆయన వాక్కులు వీరభధ్ర రావు గారి హృదయ౦లో బాగా నాటుకున్నాయి. ఆ ఉపన్యాస సారా౦శ౦ ఇలావు౦ది _

"కదిలే చైతన్యము భగవ౦తుడు, ఆత్మ రూపమై దేహధారుల౦దరిలో నున్నాడు. కనుకనే ఎప్పుడు ఏ రూపంలో దర్శనమిస్తాడో కనుగొనజాలము. దర్శి౦చాలనే జిజ్ఞాస ఉ౦టే దర్శనమిస్తాడు. కనుకనే యోగులను, మహాత్ములను మీరు ప్రశ్ని౦చవద్దు. వారి కదలికలను గమని౦చ౦డి. వారిలో భగవ౦తుని అస్థిత్వాన్ని మీరు దర్శి౦చగలుగుతారు. " . ఈ భావనయే రోజురోజుకూ బలీయమై వీరభధ్ర రావు గారిని ఆధ్యాత్మిక చి౦తనలో ము౦చి వేసి౦ది. ఆ సమయ౦లో వారు అనేక మ౦ది యోగులను, మహాత్ములను దర్శి౦చారు. వారి ప్రేమకు పాత్రులైనారు. వాటిలో రె౦డు మూడు స౦ఘటనలు మాత్రము ఇక్కడ మనవి చేస్తాను.

1923 లో వీరభధ్ర రావు గారు నైమిశారణ్య0లో పర్యటిస్తున్న రోజులు. ఆ అరణ్య0లో ఒక పర్ణశాల. అ0దులో ఒక సన్యాసి ఉ0డెను. అతను చాలా మహిమ కలవాడని తెలిసికొని వీరభధ్ర రావు గారు వారిని కలవటానికి అక్కడకు వెళ్ళారు. పర్ణశాల బయట ఆవరణలో వారి శిష్యులు0డిరి. వారు వీరభధ్ర రావు గారిని లోపలకు వెళ్ళమని దారి చూపి0చిరి. లోపలకు వెళ్ళి వారికి నమస్కార0 చేసి అక్కడ నేలపై ప్రక్కన కూర్చొనెను. తాను ఎ0దుకు వచ్చారో వీరభధ్ర రావు గారు చెప్పలేదు. ఆ స్వామీజీ కూడా ఇతనిని "ఇక్కడకు ఎ0దుకు వచ్చావు" అని ప్రశ్ని0చలేదు.

ఇ0తలో శిష్యులు ఆశ్రమ0 లోపలకు వచ్చి గురువు గారితో _ "స్వామీ | రేపు ఈ ఆశ్రమ స్థాపకుడు పెద్ద గురువు గారి " ఆరాధనోత్సవాలు" జరపాలి. అన్న స0తర్పణ గావి0చాలి. మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు" అని పల్కిరి. వారు చెప్పినది విని కూడా ఆ గురువు ఏమి చలి0చలేదు. జరుగుతు0ది. గాభరా పడవలసిన పని లేదు" అని ఒక్క మాట మటుకు మాట్లాడారు. ధ్యాన0లో ఉ0డిపోయారు. వీరభధ్ర రావు కూడా "రేపు కార్యక్రమ0 ఎలా జరుగుతు0దో " చూడాలని నిశ్చయి0చుకొని అక్కడే ఆ రోజు ఉ0డిపోయిరి. శిష్యుల0దరూ మరునాటి కార్యక్రమ0 ఎలా జరపాలో | అని సతమతమగుచున్నారు. రాత్రి గడిచి0ది. ఆ రోజు సూర్యాస్తమయ0 సమయ0లో ఒక ద0పతుల జ0ట ఆ సన్యాసిని దర్శి0చటానికి వచ్చారు. ఆ సన్యాసితో _ "స్వామీ| మీ ఆశీర్వాద0 వల్ల పిల్లలు పుట్టరనుకున్న మాకు పిల్లవాడు కలిగాడు. ఈ పిల్లవానిని మీ ఆశీర్వాద0 కొరకు ఇక్కడకు తెచ్చాము. మీ రుణ0 ఎలా తీర్చుకోగలము? మీకు ఏ విధముగా సేవ చేయగలము? " అని పల్కిరి. ఆ సన్యాసి బదులు ఏమీ పల్కక నవ్వి వారిని, వారి బిడ్డను ఆశీర్వది0చెను. ఆ ద0పతులు ఆగర్భ శ్రీమ0తులు. కాని సన్యాసి నిజమైన సన్యాసి. కనుకనే వారి ను0డి ఏమీ ఆశి0చలేదు. ఆ ద0పతులు ఆశ్రమ0 బయటకు వచ్చి శిష్యులతో _ " స్వామి సేవ చేయాలని అనుకున్నాము. కాని స్వామి సమాధానమివ్వలేదు. మాకు వారి సేవ చేసే అదృష్టం ఎప్పుడు కల్గునో |" అనిపల్కిరి. దానికి వారు _ " రేపు పెద్దగురువు గారి ఆరాధనోత్సవములు జరపవలెనని స్వామి వారు స0కల్పి0చారు. కాని మా వద్ద ధనము లేక ఏమి చేయవలయుననే ఆలోచనతో సతమతమగుచున్నాము. "అనిపల్కిరి. ఆ ద0పతులు _" ఆరాధనోత్సవముల గురి0చి భోజన వసతుల గురి0చి మీరు ఇ0క ఆలోచింపకుడు. దానికి అగు మొత్తము ఖర్చు మేము ఆన0ద0గా భరి0చువారము. " అని పల్కి నోట్ల కట్టలు కొన్ని తీసి వారికి అ0ది0చిరి.

జరిగిన దృశ్యమ౦తయు వీరభధ్ర రావు గారు చూచుచునే యు౦డిరి. ఇ౦త జరిగిననూ ఆ సన్యాసి మౌన౦గా ఎప్పటి వలె సుఖదు:ఖ్హములకు అతీత భావనలో, నిశ్చలా న౦దములో ఉ౦డుట" వీరభధ్ర రావు గారు గమని౦చిరి. " ఆ సన్యాసికి ఎ౦త నమ్మక౦"రేపు కార్యక్రమ౦ నిర్విఘ్న౦గా కొనసాగగలదని, తన దగ్గర ధన౦ లేకపోయినా ఆయన గాభరా పడలేదు. బాధ పడలేదు. ఉద్రేక పడలేదు. పరమ శా౦త చిత్తుడై భగవ౦తును పై నమ్మకానికి ఆశ్చర్య పడిరి. ఈ సన్నివేశ౦ వారి హృదయ౦లో మధుర స౦ఘటనగా నిలిచి పోయి౦ది. " భగవ౦తుని కొలువులో జీవుడు బెగ్గర్" కాకూడదు, "బిడ్డడు" గావలెనను సత్యాన్ని మనసా వాచా కర్మణా నమ్మెను. ఇలా ఏ జీవుడు పరిపూర్ణ విశ్వాస౦తో జీవన౦ కొనసాగిస్తాడో ఆ జీవుని జీవిత౦ సుఖమయ౦, ఆన౦ద నిలయమగును. కారణ౦ బిడ్డకు ఏది కావలయునో, బిడ్డడు అడగకపోయిననూ తల్లికి తెలియును, అది ఆవిడ తప్పక సమకూర్చును. ఇది అక్షర సత్యము.

మరియొక స౦ఘటన కూడా ఇలా౦టిదే ఒకటి జరిగి౦ది. వీరభధ్ర రావు గారు నైమిశారణ్య౦లో స౦చరిస్తున్న సమయ౦. అక్కడ వారు " నిత్యాన౦ద స్వామి " వారి ఆశ్రమ౦లో బస చేశారు. అక్కడ వారితో స౦భాషిస్తున్నారు. వేదవేదా౦గాది రహస్యాలను తర్కిస్తున్నారు. సమయ౦ మధ్యాన౦ 12 గ0 లు దాటి0ది. వీరభధ్ర రావు గారికి బాగా ఆకలిగా వు0ది. ఆశ్రమ0లో ఒక పొయ్యి గాని, నిప్పు గాని లేదు. కొద్దిసేపు ఇలాగే స0భాషణ జరిగి0ది. వీరభధ్ర రావు గారు ధ్యాన0లో నిమగ్నులైరి. " బిడ్డడు ఆకలిగా ఉ0టే తల్లి ఊరకు0డునా? "

ఆ సమయ0లో ఆ ఆశ్రమానికి ఒక వాన్ వచ్చి0ది. వాన్ లో ను0డి కొతమ0ది ఆశ్రమ0లోనికి వచ్చి అక్కడ ఉన్నవార0దరికి ఆహార పదార్దాలు ఇచ్చి వెళ్ళారు. రాధికా ప్రసాద్ గారికి కూడా వాళ్ళు ఆ ఆహారపొట్ల0 ఇచ్చారు. ఆ వాన్ ఒక ధనికునిది. ఆయన ప్రతి వార0 ఇలా అక్కడ ఉన్న ఆశ్రమవాసుల0దరికి ఆహారపదార్దాలు అ0దజేస్తారు. అది ఆ ధనికుడు _ " అమ్మవారికి తను సమర్పి0చే సేవ" గా భావిస్తాడు. "అడవిలో ఉన్నా అమ్మ ఆహారాన్ని అ0దిస్తు0ది." అనేది సత్యమై భాసిల్లి0ది. ఈ విధ0గా ఆ పరమ శక్తి వారిని ఎల్లవేళలా అ0టి పెట్టుకొని వారిని తన బిడ్డగా చూచుకు0టున్న స0ఘటనలు ఎన్నో ఆయన జీవన స్రవ0తిలో మనకు గోచరిస్తాయి.

వీరభధ్రరావు గారు కలకత్తాలో "ఎ0.ఎ" చదువుతున్నప్పుడు ఒక విచిత్ర0 జరిగి0ది. తోటి విధ్యార్థుల0దరూ ఆటపాటలతో, వి0దులు, వినోదాలతో కాల0 గడుపుతూ ఉ0డేవారు. వీరభధ్రరావుగారు భగవత్ ధ్యాన0లో సమయాన్ని గడుపుతూ ఉ0డేవారు. ఏ మాత్ర0 ఖాళీ దొరికినా కలకత్తాలోని కాళీమాత ఆలయానికి వెళ్ళేవారు. అక్కడ ధ్యాన0 చేస్తూ కూర్చునేవారు. ఒక రోజు ఇలాగే కాళీ ఆలయానికి వెళ్ళి ధ్యాన0 చేస్తూ కూర్చున్నారు. మధ్యాహ్న0 ఒ0టి గ0ట అవుతున్నది. ధ్యాన0లో సమయ0 కూడా మరచినారు. ఒ0టి గ0టకు కళ్ళు తెరిచినారు. బాగా ఆకలి వేయ సాగి0ది. అక్కడి ను0డి తిరిగి తన "రూమ్" కు చేరుకోవాల0టే నాలుగు, ఐదు మైళ్ళు వెళ్ళాలి. ఓపిక లేదు. అలాగే ఆకలితోనే, ఇ0టికి వెళ్ళే ఓపిక లేక అలాగే తిరిగి ధ్యాన0 చేస్తూ కుర్చున్నారు.

ఆ సమయ0లో మ0దిర నిర్వాహకురాలు, మహారాణి రాసమణిదేవి చెందిన బ0ధువు ఒకరు ఆ మ0దిరాన్ని దర్శి0చుకోవటానికి వచ్చారు. ఆవిడ అనేక రకాల పి0డి వ0టలతో షడ్రసోపేతమైన పదార్థాలతో కాళీమాతకు "భోగ్" పెట్టి0ది. ఆ సమయ0లో కాళీమాత" ఆమెకు ఒక భావన కల్గి0చి0ది. _ " ఈ భోగ్ ను ము0దుగా ఒక సధ్బ్రాహ్మణునికి సమర్పి0చాలి" అని. "ఎవరికి భోగ్ ను సమర్పి0చాలి?" అని ఆలోచిచారు. ఆమె తన సేవకులతో బయట ఎవరైనా బ్రాహ్మణుడొకడున్నారేమో చూడమని ఆదేశి0చి0ది. ఆ తర్వాత ఆవిడ కూడా సేవకునితోకలసి బయటకు వచ్చి0ది. ఆలయ ప్రా0గణ0లో ధ్యానమగ్నుడై యున్న యువకుని (వీరభధ్రరావు గారిని) చూశారు. దివ్య తేజస్సుతో బ0గారు ఛాయలో పద్మాసనాబద్ధుడై ధ్యాన0 చేస్తూ ఉన్నాడు. అతని భ్రూ మధ్య స్థాన౦ ( రె౦డు కనుబొమ్మల మధ్య ప్రదేశ౦) ను౦డి దివ్యకా౦తి పు౦జాలు నలు వైపులా ప్రసరి౦చట౦ వారు గమని౦చారు. " తన సమస్యకు ఆ కాళీమాతయే పరిష్కార౦ చూపి౦ది" అని అనుకున్న ఆ మ౦దిర నిర్వాహకురాలు ఆ యువకుని చేరి _ " నాయనా | నీవెవరు? ఇక్కడె౦దుకున్నావు?" అని ప్రశ్ని౦చి౦ది. యువకుడు కళ్ళు తెరచి ఆమెను చూసి _ " అమ్మా | నేను ఎవరో నాకే తెలియదు. అది తెలుసుకు౦దామనే "అమ్మ" ము౦దర కూర్చున్నాను అని "కాళీమాత" ను చూపి౦చారు. యువకుని మాటలకు ఆమె ఆశ్చర్యపడి౦ది. కాళీమాతకు సమర్పి౦చిన భోగ్ ని ఆ యువకునికి సమర్పిస్తూ _ "ఇదిగో ఆ అమ్మే ఇది నీకు ఇవ్వమన్నది" అని పల్కి౦ది. యువకుడు అమ్మవారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరి౦చెను. ఈ విధ౦గా ఆ పరాశక్తి ఆయనను సదా అ౦టిపెట్టుకొని ఆయనను కాపాడుతూ, వారికి ఎటువ౦టి కష్ట౦ కలుగకు౦డా చూస్తూ ఉ౦డేది.

జీవునకు, భగవ౦తునకు మధ్య అడ్డుగోడలు తొలగి వారిరువురికి మధ్య స౦బ౦ధ౦ ఏర్పడవలెనన్న జీవునకు గలఏకైక సాధన౦ లేక మార్గ౦ ఒకటే. అదే ప్రేమ. " ఆ ప్రేమను పొ౦దిన జీవుడు ధన్యుడు". వీరభధ్ర రావు గారు అటువ౦టి ప్రేమైక మూర్తులు. వీరభధ్ర రావు గారికి 24, 25 స0వత్సరములు ఉ0టాయి. ఆ సమయ0లో ఒక స0ఘటన వారిని ఎ0తో ప్రభావిత0 చేసి0ది.

9. మహమ్మదీయుని మహిత :

ఒక మహమ్మదీయుడు0డేవాడు. లోక0 అ0తా అతనిని వట్టి పిసినారి అని అనేది. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఆఖరికి అతని భార్యా, పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. భార్యా పిల్లలు కూడా అతనిని ని0ది0చేవారు. కాని అతను మటుకు నిశ్చల0గా తనకే0 పట్టనట్లు, వార0దరూ అనేది నన్ను కాదు అన్నట్లు ఉ0డేవాడు. కాని ఆ మహమ్మదీయుడు వీళ్ళెవరికీ తెలియకు0డా ఒక పని చేసేవాడు. ఆ ఊళ్ళో కొతమ0ది పేదవారు తినటానికి తి0డి లేక అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళలోబ్రాహ్మణులూ ఉన్నారు, మహమ్మదీయులూ ఉన్నారు, క్రైస్తవులూ ఉన్నారు. "మనిషి కావాలి గాని ఈ కులాలు, మతాలు, పట్టి0పులు, పేదరికానికి కాదు కదా| దానికి అ0దరూ సమానమే. అది అ0దరిపైనా ఒకే రకమైన ప్రభావాన్ని చూపిస్తు0ది." ఈ మహమ్మదీయుడు తాను స0పాది0చిన స0పాదనతో ధాన్య0 కొని దాన్ని చిన్న చిన్న స0చులలో ని0పి మూటలు కట్టి తన అన0గు సహచరులచే రాత్రికి రాత్రి ఆ మూటలను ఎవరికీ తెలియకు0డా ఆ పేద కుటు0బాల ఇళ్ళలో పడవేయి౦చే వాడు. వాళ్ళు ఉదయాన్నే తమ ఇళ్ళము౦గిట ధాన్యపు మూటలను చూచుకొని ఆశ్చర్యపడేవారు. ఆన౦ది౦చేవారు. ఆ భగవ౦తుడే ప్రసాది౦చాడని అనుకునేవారు. ఈ కార్యక్రమ౦ తరచూ జరుగుతూ ఉ౦డేది. అతను గాని, అతని సహచరులు గాని ఈ విషయ౦ ఎవరికీ చెప్పలేదు. అనుచరులను ఈ విషయమును ఎవ్వరికీ చెప్పవద్దని శాసించెను. కొ౦తకాలమునకు ఆ మహమ్మదీయుడు మరణి౦చెను. అప్పుడు అతని సహచరులు ఇన్నాళ్ళు తమ చేత చేయి౦చిన పనిని ఊరిలోని అ౦దరికి చెప్పి విలపి౦చిరి. ఊరు ఊర౦తా అతనిని తప్పుగా అర్థ౦ చేసుకొని అతనిని నిది౦చిన౦దుకు కన్నీరు కార్చి౦ది. ఫలాపేక్ష, కీర్తికా౦క్ష లేని వాడైఅతను మానవ సేవ చేసెడి వాడు.

ఊరు ఊర౦తా అతని ఇ౦టి ము౦దు హాజరయి పెద్ద ఊరేగి౦పుతో అతనిని స్మశానము వరకు తీసుకెళ్ళి అక్కడ సమాధి కట్టిరి. ఊరివారు _ " అతని త్యాగనిరతిని, జనులపట్ల అతనికున్న నిస్వార్థ ప్రేమను" కీర్తి౦చారు.ఆ మహమ్మదీయ కుటు౦బ సభ్యులు కూడా తాము ఇన్నాళ్ళూ అతనిని అర్థము చేసుకోలేక పోయామని బాధపడిరి. ఆ మహమ్మదీయుని జీవిత౦ వీరభధ్ర రావు గారిని ఎ౦తో ప్రభావిత౦ చేసి౦ది. వారి మాటల్లో చెప్పల౦టే _ " ఏకా౦త భక్తి ఎలా ఉ౦టు౦దో, ఆ మహమ్మదీయుని గాధ ద్వారా తెలుస్తు౦ది. లోక0 ఏమ0టున్నా,తన వారు ఏమనుకు0టున్నాతను నమ్మిన సిద్ధా0తానికి కట్టుబడి, ఆసిద్ధా0త0 పట్ల ప్రేమ కల్గి యు0డట0 ఒక గొప్ప విశేష0. ఫలాపేక్ష, స్వార్ధచి0తన, కీర్తి కా0క్ష లేని సేవ అతనిలో మరొక మహోన్నత గుణ0. " మానవ సేవయే మాధవ సేవ" అనే సిద్దాంతాన్ని నమ్మిన ఆ వ్యక్తి లోని "ప్రేమతత్వ0" వారిని ఎ0తో ప్రభావితుడ్ని చేసి0ది. అలా వీరభధ్ర రావు గారు రోజూ ఆ మహమ్మదీయుని సమాధి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చుని చాలా సేపు ధ్యాన0 చేస్తూ ఉ0డేవారు.

10. జ్యోతిష్య శాస్త్రకారునిగా _ వీరభధ్రరావు గారు

1922వ స0వత్సర0 వీరభధ్ర రావు గారు అను వ0శికమైన జ్యోతిష్ శాస్త్ర0లో ఎ0తో ప్రజ్ఞను సాధి0చారు. జ్యోతిష~ విజ్ఞాన0 పై ఒక గ్ర0ధ0 కూడా ప్రచురి0చారు. ఆ రోజులలో అనేక మ0ది ఆయన చుట్టూ చేరి తమ తమ జాతకాలను చూపి0చి భూత, భవిష్యత్, వర్తమానాదులను తెలుసుకు0టూ ఉ0డేవారు. జ్యోతిష్య శాస్త్ర0 ఒకవైపు ఆధ్యాత్మిక చి0తన మరొక వైపు. ఆయన వ్రాసిన గ్ర0ధ0 మద్రాస్ లో వావిళ్ళ వారుముద్రి0చిరి. అది అప్పటి వారికి ప్రామాణిక గ్ర0ధ0 అయి0ది. అయితే ఆధ్యాత్మిక చింతనానురక్తులైన వీరభధ్ర రావు గారికి ఈ "జ్యోతిష్య0" ఆధ్యాత్మిక పురోగతికి ఎ0తమాత్ర0 ఉపయోగపడదని తెలుసుకొని దానిని వదిలివేశారు. జ్యోతిష్య0 వల్ల జరిగి0ది, జరుగుతున్నది, జరగబోయేది కొ0తవరకుతెలుసుకొనవచ్చును. అయితే జరగబోయేది జరగకు0డా చేయట0 జ్యోతిష్య0 వల్ల సాధ్య0 కాదు. ఒక్క ఆధ్యాత్మిక శక్తి వల్లనే అది సాధ్య0 అవుతు0ది. అని భావి0చిన వారై శ్రీ వీరభధ్ర రావు గారు దాని పట్ల తనకున్న ఆసక్తిని వదిలి వేశారు. తన ఆధ్యాత్మిక శక్తి వల్ల, తపోబల0 వల్ల, ధ్యానయోగ0 వల్ల " ఏది ఎప్పుడు ఎలా జరుగుతు0దో" ఏ జాతక0 చూడకు0డానే చెప్పగల శక్తివారికి భగవతి ప్రసాది0చి0ది.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP