శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఒక మంచి వ్యాసం

>> Wednesday, March 31, 2010

వినోదం- వ్యసనం
- ఎర్రాప్రగడ రామకృష్ణ
జూదానికి పిలుపు రాగానే ధర్మరాజు ప్రయాణమయ్యాడు. అక్కడ ఉన్న ధేమ్యుడు కలగజేసుకుని 'ఆట ఆటలా ఉండాలిగాని, అరిష్టాల దాక పోరాదు' అని హెచ్చరించాడు. 'అబ్బే, ఇది సుకృత్‌ ద్యూతమే' అంటూ వెళ్ళాడు ధర్మజుడు. మొదలుకావడం వినోదంగానే మొదలైంది. క్రమంగా వ్యసనరూపం దాల్చింది.

నూతన సభ ప్రారంభం అన్నారు- వెళ్ళాం. కాసేపు కాలక్షేపానికి పాచికలు అన్నారు- ఆడాం. పందెం లేకపోతే మజా లేదన్నారు- కాశాం. ఆరోజు హస్తవాసి బాగోలేదు, కొంత పోగొట్టుకున్నాం, ఇంటికి వచ్చాం... అన్నట్లుంటే- అది వినోదమే అయ్యేది. ఒళ్ళు మరచిపోయి పందాలు ఒడ్డే స్థితి వచ్చిందంటే- అది వ్యసనమే! ధర్మరాజు విషయంలో జూదం కచ్చితంగా వ్యసనమేనని భారతం చెబుతోంది.

ఏ పెద్ద పండుగ రోజునో అయినవాళ్ళంతా చేరినప్పుడు కాలక్షేపానికి పేకాడుకుంటే- అది క్రీడా వినోదం. రోజూ క్లబ్బుల్లో కూర్చుని చేతులు కాల్చుకుంటే- అది ద్యూతవ్యసనం. తోక బిళ్ళలు అంటించిన ప్రామిసరీనోట్లతో సహా పెట్టుబడిదారుడొకడు సిద్ధంగా కాచుకుని ఉంటే- మొదట జేబులోది, ఆపైన ఒంటిమీదది కరిగిపోయి, నోటి మాట కూడా దాటిపోయి నోటుమాటకు తెగించి సంతకాలకు సిద్ధపడిపోవడం... ఓడిన కొద్దీ రెచ్చిపోవడం... పెద్దపేకాట వ్యసనం.

నిరంతరం ధారావాహికల్లో మునిగిపోయి, వీధి తలుపులు వేసి ఉన్నాయో లేదో చూసుకోకుండా ఎవడేనా ఇంట్లో దూరినా తెలియని స్థితిలో ఉంటారు కొందరు. కథానాయిక కష్టాలకు కరిగిపోతూ, చీరకొంగు చేతివేళ్ళకు చుట్టబెట్టుకుంటూ, కథలో లీనమై కళ్లు ఒత్తుకుంటూ రక్తపోటు తెచ్చుకోవడం- ధేమ్యుడు చెప్పినట్లు ఇంటికీ ఒంటికీ కూడా అరిష్టం.

మృగయావినోదం ప్రభువులకు ముచ్చట. క్రూరమృగాలను వధించడం, వాటి బారినుంచి ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభువుల బాధ్యత. కనుక, వేట వారికి ధర్మమే. అంతేకాదు, శాకాహారంతో సరిపెట్టుకోవలసిన అగత్యం వారికి లేదు. పరివారం కోసం కూడా. మృగాలను వేటాడవచ్చు. ఈమాట అగస్త్య మహర్షి స్వయంగా చెప్పాడు. 'క్రూరమృగాల వధ మా కర్తవ్యం. మృగయా వినోదం మాకు వేడుక. ఇందులో దోషం ఏమీ లేదు' అని వాదించాడు పాండురాజు. అందుకనే కిందముడు అనే మునిశాపానికి గురయ్యాడు. వినోదానికీ వ్యసనానికీ గల తేడాను చెప్పిన ఈ కథ భారతంలోది.

వేటకు పోతూ పాండురాజు తన భార్యలిద్దరినీ వెంటపెట్టుకుని మరీ వెళ్ళాడు. వారు చూస్తుండగా తన మగటిమిని, పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించే క్రమంలో పాండురాజు కర్తవ్యం, క్షత్రియ ధర్మం రెండూ వ్యసనంగా పరిణమించాయి. లేళ్ళ రూపంలో రతిక్రీడ సాగిస్తున్న కిందముడనే మునిని, ఆయన భార్యను పాండురాజు వధించాడు. 'నువ్వు చేసింది తప్పుకదా!' అని నిలదీశాడు కిందముడు. రాణులను వెంటబెట్టుకుని వేటకు రావడం ఒక తప్పు. భార్యలు చూస్తుండగా రెచ్చిపోయిన గజేంద్రుడిలా, పాండురాజు వేటను ధర్మంగా కాక- పరాక్రమ ప్రదర్శనగా భావించడం రెండో తప్పు. రతిక్రీడలో ఉన్న మృగాలను హింసించడం మరో తప్పు. 'తప్పయింది' అని ఒప్పేసుకుంటే పోయేదానికి- అగస్త్యుడి మాటలు ఉటంకిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునేలా వాదించడం అన్నింటికన్నా పెద్దతప్పు. ఆడవాళ్ళు చూస్తున్నారని రతికి పాల్పడిన గజేంద్రుడు మొసలినోట చిక్కినట్లు- పాండురాజు కిందముడి శాపానికి గురయ్యాడు. 'మైథున క్రియలో ఉన్న మా పట్ల అతిగా ప్రవర్తించావు కనుక మైథునమే నీకు మరణం అవుతుంది' అని కిందముడు శపించాడు.

వినోదం సంతోషాన్నిస్తుంది. వ్యసనం, అరిష్టాన్ని తెస్తుంది. అతిగా పరిణమించిన వినోదమే వ్యసనంగా మారుతుంది. అదీ ఈ కథలో సందేశం!

Read more...

ఆశ్చర్యం కలిగించే లౌకికవాద విశ్వరూపం [ నాకొచ్చిన మెయిల్]



MEDIA (CPI(M)) NDTV

Prannoy has secretly converted to Christianity.
Suzanna Arundhati Roy is niece of Prannoy Roy (CEO of NDTV)
Prannoy Roy married to Radhika Roy
Radhika Roy is sister of Brinda Karat (CPI(M))
Brinda Karat married to Prakash Karat (CPI(M) - General Secretary)
CPI(M)'s senior member of Politburo and Parliamentary Group Leader is
Sitaram Yechury.
Sitaram Yechury is married to Seema Chisthi.
Seema Chisthi is the Resident Editor of Indian Express
Burkha Dutt works at NDTV
Rajdeep Sardesai was Managing Editor at NDTV
Rajdeep Sardesai married to Sagrika Ghose
Sagarika Ghose is daughter of Bhaskar Ghose.
Bhaskar Ghose was Director General of Doordarshan.
Sagarika Ghose's aunt is Ruma Pal.
Ruma Pal is former justice of Supreme Court.
Sagarika Ghose's another aunt is Arundhati Ghose.
Arundhati Ghose was India's permanent representative/ambassador to United Nations.
Dilip D'Souza was member of PIPFD
Dilip D'Souza's father was Joseph Bain D'Souza.
J.B.D'Souza was former Maharastra Chief Seccretary and activist.
Teesta Setalva member of PIPFD
Teesta Setalvad married to Javed Anand
Teesta and Javed run Sabrang Communications.

Javed Anand is General Secretary of Muslims for Secular Democracy { ?? }
Javed Akhtar is spokesperson for Muslims for Secular Democracy
Javed Akhtar married to Shabana Azmi

Karan Thapar owns ITV
ITV produces shows for BBC
Karan Thapar's father was General Pran Nath Thapar COAS during 1962 war,
when India lost under his watch.
Karan Thapar was very good friend of Benazir Bhutto and Asif Ali Zardari.
Benazir Bhutto was Pakistan's Prime Minister.
Benazir Bhutto's father was Zulfikar Ali Bhutto.
Z.A.Bhutto served as Pakistan's President.
A.A.Zardar is the current Pakistani's President.

Karan Thapar's Mama was married to Nayantara Sahgal.
Nayantar Sahgal is daughter of Vijayalakshmi Pandit.
Vijayalakshmi Pandit was sister of Jawharlal Nehru.
Medha Patkar is a leading spokesperson for Narmada Bacho Andolan.
NBA was helped by Patrick McCully of International Rivers (formerly Internal Rivers Network.)
Angana Chatterjee was on the board of IRN
Dipti Bhatnagar was an Intern/Volunteer at IRN.
Dipti Bhatnagar is an activist at NBA.
[color]Dr. Angana Chatterjee part of PROXSA
PROXSA mother-ship of FOIL
ASHA endorsed by FOIL
Sandeep Pandey co-founder of Asha for education (ASHA)
Dr. Angana Chatterjee is married to Richard Shapiro
Richard Shapiro is Director and Associate Professor of the Grad.
Anthropology Prgm at CIIS
Shubh Mathur co-wrote a letter with Angana on 'Humanitarian Crisis in J&K'
Biju Matthew is co-founder of FOIL.
Vijay Prasad is co-founder of FOIL.
Vijay Prasa co-authored with Angana Chatterjee and wrote against IDRF.
ASHA has association with AID
AID works with FOSA
FOSA started by a Pakistani - Ali Hasan Cemendtaur.
Amitava Kumar associated with FOIL
FOIL & FOSA opposed California Text Book Edits.

California Text Book Edits was opposed by Michael Witzel.
M.Witzel is Wales Professor of Sanskrit at Harvard University.
Rahul Bose is brother-in-law of Khalid Ansari.
Khalid Ansari is the Chairman of Mid-Day Group of Publication based in Mumbai.
Khalid Ansari is Chairman of M.C.Media Ltd.
M.C.Media Ltd. has a join-venture with BBC for FM radio brodcasting.
Khalid Ansari's father was Abdul Hameed Ansari.
A.H.Ansari was a freedom fighter and active Congressman.
Dr.John Dayal worked as a journalist with the N.Delhi edition of Mid-Day.
Narasimhan Ram is the Editor-in-Chief of 'The Hindu'.
N.Ram's first wife was Susan.
Susan, an Irish, was in charge of Oxford University Press publications in India.
N.Ram and Susan's daughter is Vidya Ram.
Vidya Ram is a journalist.
N.Ram is now married to Mariam.
N.Ram, Jennifer Arul and K.M.Roy participated in closed door Catholic

Bishops Conference of India in Thrissur, Kerala.
Jennifer Arul is the Resident Editor and Bureau Chief in South India for NDTV.
Jennifer Arul is Chief Operating Office for Astro Awani - Indonesian news
and information channel.
K.M.Roy was a reporter in `The Hindu'
K.M.Roy is the General Editor of the group of the `Mangalam' Publications.
Mangalam Group of Publications was started by M.C.Varghese
K.M.Roy received the `All India Catholic Union Lifetime Award'
All India Catholic Union's National Vice President is Dr.John Dayal.
Dr.John Dayal is also Secretary General of All India Christian Council (AICC)
AICC's President is Dr. Joseph D'souza
Dr. Joseph D'souza founded Dalit Freedom Network (USA)
Dr.Joseph D'Souza participated in the inaugural Religious Freedom Day
The Religious Freedom Day was attended by former Republican Sentor Rick Santorum
AICC claims Confederation of SC/ST Organizations (India) as a
sister organization.
AICC claims Christian Solidarity Worldwide (UK) as a sister organization.
AICC claims Release International (UK) as a sister organization.
Release International states it supplies bibles and literature to meet
the need of growth and evangelism.
Dalit Freedom Network's partner's with Operation Mobilization India.
OM India's South India Regional Director is Kumar Swamy
Kumar Swamy is the State President of Communal Harmony Committee.
Kumar Swamy serves with Karnataka State Human Rights Commission.
OM India's North India Regional Director is Moses Parmar.
Moses Parmar serves as North India Public Relations officer of the
All India Christian Council (AICC)
OM seeks to plant and strengthen churches in areas of the world
where Christ is least known.
OM ministries work with Dalit-Bahujan people in India.
Operation Mercy Charitable Company (OMCC) grew out of OM India
OMCC works with Dalit Freedom Network.
DFN has Dr. Kancha Illaiah on its Advisory Board.
Dr. Kancha Illaiah is a Professor in Osmania University, Hyderbad.
DFN has William Armstrong on its Advisory Board.
William Armstrong is a former US Senator from Colarado (Republican).
William Armstrong is currently the President of Colorado Christian University.
Colorado Christian University's one of the strategic objective is to
share the love of Christ around the World.

DFN has Udit Raj on its Advisory Board.
Udit Raj claims Joseph Pitts as a great friend of India.
Joseph Pitts is a Republican US Congressman from Pennsylvannia.
Joseph Pitts sent a letter to Condoleezza Rice, Secretary of State – USA,
requesting USA to deny visa to N.Modi.
Joseph Pitts has led a Congressional delegation to Pakistan & India.
Joseph Pitts is Founder and Co-Chairman of the `Kashmir Forum'.
Joseph Pitts along with Congressman John Conyers introduced legislation
condemning actions of N.Modi.
John Conyers is Congressman from Michigan's 14th congressional district.
The 14th district contains Dearbon, a major city.
Dearbon has the largest Arab Americans for a city of its size.
Udit Raj is member of National Integration Council, Government of India.
Udit Raj is National Chairman of Buddha Education Foundation.
Udit Raj is National Chairman of All India Confederation of SC/ST
Organizations.
Udit Raj leads Dalit International Foundation
Udit Raj leads Lord Buddha Club.
Udit Raj was part of an international Steering Committee on Kashmir

Majid Tramboo promoted the Steering Committee.
DFN has Baroness Caroline Cox on its Advisory Board.
Baroness Caroline Cox is Deputy Speaker, House of Lords, England.
Suhasini Haidar is daughter of Subramanian Swamy
Suhasini Haidar is daughter-in-law of Salman Haidar
Nadira Alvi married V S Naipaul
Nadira Alvi, a journalist, is sister of recently assassinated Maj Gen Amir
Faisal Alvi, the ex-chief of Pakistan's elite SSG
"Resalat" is a Tehran-based Persian daily.
"Ettela'at" is another Tehran-based Persian daily.
"Resallat" and "Ettela'at"signed MoU with "Siyasat" and "Munif"
Siyasat and Munif are Hyderbad, Andhra Pradesh based dailies.
Toseeh is another Persian daily.
Toseeh has tied up with Vaarta.
Vaarta is one of the dailies from A.G.A.Publications Pvt Ltd.
A.G.A Publications Pvt Ltd is one of the companies in Sanghi Group
Sanghi Group was co-promoted by Gireesh Sanghi with his brothers.
Gireesh Sanghi is Congress M.P, Rajaya Sabha
Gireesh Sanghi is All India Vaish Federation National President.

Mahendra Mohan Gupta is on the Advisory Board of AIVF
Mahendra Mohan Gupta is Chairman of Dainik Jagran Group
Ramoji Group is headed by Ramoji Rao
Ramoji Rao is Founder & Chairman of Eenadu
Eenadu is the largest Telugu news daily in Andhra Pradesh.
Ramoji Group also owns ETV Network.
ETV Network produces content in Telugu, Bangla, Marathi, Kannada,
Oriya, Gujarati, Urdu & Hindi.
Ramoji is reported to be close to Chandra Babu Naidu and supported
of Telugu Desam Party.
Ushodaya Enterprises Pvt. Ltd's parent company is Ramoji Group.
Blackstone Group is reported to have invested Rs600 crore in UEL.
Deccan Chronicle Holdings Ltd brings out The Deccan Chronicle newspaper.
DCHL also brings out "Andhra Bhoomi" a telugu newspaper.
DCHL also brings out "Asian Age".
DCHL became a publishing parter of `The New York Times'.
DCHL began publishing `The

Thanks & Regards,


Sudhir Srinivasan

Read more...

"సన్యాసాశ్రమంలో ఉండి సాధనచేయటం కోటవెలుపలకొచ్చి పోరాడటం వంటిదైతే ,గృహస్థాశ్రమంలో ఉండి చేసే సాధన కోటలోపలుండి పోరాడటం వంటిది ".

>> Monday, March 29, 2010

శాస్త్రాదులలో చెప్పబడిన సన్యాసి లక్షణాలేమిటి ? ఇప్పుడు కలి లో చూస్తున్న లక్షణాలేమిటో చూద్దాం.

గురుచరిత్రలో శ్రీగురుడు తన గృహస్థు శిష్యులకు చేసిన బోధలో విషయాలు చూడండి.

ఉపనయాది సంస్కారాలతో బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తిగా గురువును సేవించాలి .అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావమ్తుడు కావాలి. చివరకు గురువునకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి .అతుతరువాత గురువు అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక ,అతనికి సర్వస్వము అప్పగిమ్చి భార్యతోగూడ అరణ్యానికి వెళ్ళి గ్రామ్యవిషయాలు వదలి వానప్రస్థం గదపాలి. భార్య అనుమతితో సన్యసించాలి.

ఇక సన్యాసికి జపము,భిక్షాటనము, ,ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రిమ్చరాదు. నిరంతరము ఆత్మద్రష్టయై ఉందాలి. వెదురు,సొరకాయ,చెక్క,మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారియై పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్ధాటన చేస్తూ మూడుపగళ్లు మించి ఏగ్రామం లోనూ నివశించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరం లో శక్తిలేకుంటే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మాహాక్షేత్రం లో నివశించాలి.
ఇది యత్యాశ్రమంలో నిబంధన
ఇక క్షణికావేశం లో సన్యాసం స్వీకరిస్తే వాసనా క్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రం హెచ్చరిస్తున్నది.
దైవమార్గాన పయనించదలచినవానికి అర్హతానుసార మార్గం ఎన్నుకోవటం తగియున్నది. గృహస్థాశ్రమం లో్ సాధన వలన గొప్ప ఉపయోగమేమిటంటే సాధకుని పతనావస్థకు చేర్చే కామాదులనుంచి రక్షణ లభిస్తుంది. అందువలనేనేమో మన మహర్షులు అడవులలో ఆశ్రమాలలో సపత్నీసమేతంగా నివాసంఉండేవారు.
అందుకే రామకృష్ణపరమహంస ఇలా అంటారు."సన్యాసాశ్రమంలో ఉండి సాధనచేయటం కోటవెలుపలకొచ్చి పోరాడటం వంటిదైతే ,గృహస్థాశ్రమంలో ఉండి చేసే సాధన కోటలోపలుండి పోరాడటం వంటిది ". మనకు కనపడుతున్న ప్రత్యక్షప్రమాణాలు చూస్తుంటే సాధకులు పెద్దల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటం వలన తెచ్చుకున్న ముప్పు అని అర్ధమవుతున్నది. అవును మరి ఇది కలి కాలం . జిహ్వచాపల్యం ,అంగచాపల్యం తో మానవులను పతితులను చేస్తానని ప్రతినపూని వున్నాడు కలిపురుషుడు. నిరంతరం డాలు తో దెబ్బలు కాచుకు కూర్చున్న ఎంతటి యోధునకైనా ఏకాస్త ఆదమరపు వచ్చినా చాలు ....................తల తెగిపడుతుంది ..

{కాషాయం ఫాన్సీ డ్రస్ కాదు .ఎవరుబడితే వాల్లు ధరించడానికి . అది పదునైన కత్తి మొనపై నడుస్తూ విన్యాసాలుచేసే సాధకుల యూనిఫాం }



Read more...

అందరివీ రిక్త హస్తాలే !

>> Sunday, March 28, 2010

ఒకనాడు ఒక రాజుగారు తన సభ నుద్దేశించి ఇలా అన్నాడు" ఈ రోజు మీకు చిన్న సమస్య ఇస్తాను దీనిని పరిష్కరించినవారికి లక్షరూపాయలు. " అన్నాడు. వెంటనే సభలో నుంచి ఒక పెద్దపండితులవారు లేచి ,నిలబడి మహాప్రభో ! ధనం అవసరం నాకు ఎక్కువగా ఉన్నది. అమ్మాయి పెండ్లిచేయాలి కాబట్టి ఆ అవకాశాన్ని ముందు నాకే ఇప్పించండి అన్నాడు. ఇతర పండితులంతా ఇతను చాలా తెలివైనవాడుగనుక బహుమతి అతనికే దక్కుతుందని తీర్మానించుకుని వేడుకచూస్తున్నారు.
అయితే నేను వేసే ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు రాజు. అలాగేనన్నాడు పండితుడు. ప్రశ్నవేస్తానన్నాడేగాని ఏమడగాలో తోచలేదు రాజుకు. ఆయన ఆలోచిస్తుండగానే అగలేని పండితుడు అసహనం తో " మహాప్రభో ! నా లక్షరూపాయలు నాకిప్పించండి అంటూ రెండూచేతులూ యాచకునిలా ముందుకు చాచాడు. ఆచేతులు చూసిన రాజుగారికి మెరుపులా ఒక ఆలోచనవచ్చింది. "అ ఇదిగో అడుగుతున్నాను .మనదేహం లో ఎక్కడచూసినా రోమాలున్నయికదా ! మరి నీ అరచేతిలోలేవెందుకని ? అని అడిగాడు. పండితుడు చాలాగట్టివాడు. పైగా లక్షరూపాయలమీద ఆశ. ఒక్క క్షణం ఆలోచించి మహా ప్రభో ! ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు . నేనెప్పుడు దానాలు తీసుకునే వాణ్నిగనుక అలా దానాలు తీసుకుని తీసుకుని నా అరచేతులలో వెంట్రుకలు లేకుండాపోయాయి అన్నాడు. చప్పట్లు మార్మోగాయి .
కానీ రాజుగారు అంతటితో ఆగకుండా "బాగానే ఉంది మరి నాచేతిలో వెంట్రుకలు లేవెందుకని అని అడిగాడు. అందరూ సమాధానం కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.పండితుడేమీ సామాన్యుడుకాడు , అయ్యా !మీకు దానాలుచేసే అలవాటువల్ల, దానాలు చేసీ చేసీ దానివలన మీ అరచేతిలో వెంట్రుకలు లేకుండాపోయాయి అన్నాడు

పరిపాలించేవాల్లేమైనా చిన్నవాల్లా ? కాబట్టి రాజుగారు కూడా ఏమాత్రం తగ్గకుండా , దానాలు చేసీ్చేసీ నాకు,దానాలు తీసుకుని ,తీసుకుని నీకు అరచేతులలో రోమాలు లేవు సరే ! మరి ఈసభలో ఇంతమంది ఉన్నారు వీరందరికీ లేవు కదా ఎందుకని ?అన్నాడు రాజు.

అప్పుడు పండితుడు మహాప్రభో ! దానాలు తీసుకుని తీసుకుని నాకు లేకుండాపోయాయి. దానాలు చేసీచేసీ
మీకు లేకుండాపోయాయి .మనిద్దరినీ చూసి అదీ ఇదీ ఏదీ చేయలేకపోతున్నామే అని, చేతులు నలుపుకుని నలుపుకుని వీళ్లందరికీ అరచేతులలో రోమాలు లేకుండాపోయాయి అని అన్నాడట.


Read more...

ఒకనాడు ఒక రాజుగారు తన సభ నుద్దేశించి ఇలా అన్నాడు" ఈ రోజు మీకు చిన్న సమస్య ఇస్తాను దిని పరిష్కరించినవారికి లక్షర్

Read more...

దృఢమైన దైవ విశ్వాసం లేనిభక్తి, మానవతా వాదం కూడా అంధవిశ్వాసమవుతుంది

>> Saturday, March 27, 2010

మానవ చరిత్ర పొడవునా దేవుడున్నాడని విశ్వసించి జీవింపజూసేవారూ , అట్టి విశ్వాస మవసరం లేదనిధర్మంగా జీవిస్తే చాలని తలచేవారు ఉన్నారు.భగవంతుడు మనస్సుకు ఇంద్రియాలకు గోచరించడు గనుక ,సామాన్యులకెన్నడూ ఆయన ఉనికిని నిరూపించే అనుభవాలుండవు గనుక అట్టివిశ్వాసము ,భక్తిదృఢమవటం ఆస్తికులకు కష్టం . అట్టిది ప్రసాదించమనే అందరూ ఆయనను ప్రార్ధింపజూస్తారు. కానీ ప్రార్ధన విశ్వాసం పైన విశ్వాసం అనుభవంపైన ఆధారపడతాయి,గనుక అదికూడా సరిగా కుదరదు.

మరొక వంక దైవ విశ్వాసం అవసరం లేదని ,నీతిగల జీవితమే చాలనుకునేవారికి కూడా నీతిగా ఉండటం ఎందుకు సరియైనదో స్పష్టంగా తెలియదు. బలహీనమైన ప్రాణులనుతరిమివేసి హింసించి బలవంతమైన ప్రాణూలు జీవించటమే ప్రకృతియంతటా చూస్తాము. మానవ సమాజం లోనూ అదే కనపడుతున్నది. .అటువంటప్పుడు నిస్వార్ధమైన జీవితమెందుకు ప్రసస్థమైనదో సహేతుకంగా తెలుపలేము. జడపదార్ధానికి సుఖ దు:ఖాలు.దానధర్మాలు ఉండజాలవు. ఒక్కూక దేహానికి పరిమితమైన ఆత్మలుంటాయని తలచినా పై జెప్పిన ప్రాకృత జీవితమే సమంజసమవుతుంది. సర్వజీవులకు ఆత్మ ఒకటే అయితేమాత్రమే సాటివారిని తనవలె ప్రేమించడం _ అంటేనీతిగా బ్రతకడంహేతుబద్దము వాంఛనీయము అవుతుంది. అంటే శుద్ధమైన ఆథ్యాత్మికతను అంగీకరించక నైతిక జీవితము సహజము ,సమంజసము కాజాలదు .అందుకే దృఢమైన దైవ విశ్వాసం లేని మానవతా వాదం కూడా మానవులు కల్పించుకున్నస్వర్గ నరకాదులవలె అంధవిశ్వాసమవుతుంది. అందువలననే నీతిని వాచా ప్రవచిస్తూగూడా ఆచరణలో ఎక్కువమంది విఫలులవుతారు .

అయితే ఆస్తికులమనుకునేవారుగూడా ఆత్మసర్వగతమన్న అనుభవం లేకపోవడం చేత అట్టి దుస్థితిలోనే చిక్కుతారు. దృఢమైన దైవవిశ్వాసం కలగాలన్నది అనేకకోరికలలో ఒకటిగా మాత్రమే మిగులుతుంది. దీనినే ఆథ్యాత్మ పదజాలం లో ఇలా చెప్పవచ్చు. పరమాత్మ ఇంద్రియ మనస్సులకు ప్రత్యక్షంగా గోచరించడు. అందుకని సామాన్యంగా అనుభవం కాదు. దానివలననే దృఢమయిన విశ్వాసం కలగటం కష్టం . అనుభవముంటేగానివిశ్వాసం కుదరదు.దృఢమైన విశ్వాసం ఉంటేగాని అనుభవం కలగదు. అటువంటప్పుడు ఆస్తికులకు అథ్యాత్మిక జీవనము తదితరులకు నైతిక జీవితము ఎలా సంభవము ?

ఇందుకు సమాధానం మహనీయులజీవితం ,మతగ్రంథాలనుంచి లభిస్తుంది. మానవులకు తన ఉనికిని స్వల్పంగానైనా తెలిపి సన్మార్గానికి ఆకర్షించడానికి పరమాత్మయే ప్రేమతో బద్ధకంకణుడయ్యాడు. సృష్టి,స్థితిలయకారకులు,పరమ సత్యము తానే అయినపరమాత్మ యోగమూర్తియగు దత్తాత్రేయ స్వామిగా భూమిపై అవతరించారు .అంటే సృష్టి పరమాత్మ కల్పించిన కావ్యమనుకుంటే కల్పితమయిన ఒక ప్రధానపాత్రగా అందులో తనను గూడా కల్పించుకున్నాడన్నమాట. "గురు బ్రహ్మ ........." అనే శ్లోకం ఇదే చెబుతుంది. పూర్ణపురుషుల రూపం లో మానవులకెల్లప్పుడు భూమిపై లభ్యమయ్యేది ఈ అవతార తత్వమే . అంటే భగవంతుడు సర్వ మానవ కళ్యాణానికి దత్తమయ్యాడన్నమాట.ఆమ సమర్పన చేసుకున్నాడన్నమాట.

ఈ దత్తస్వామి ఈ యుగం లో ఈ పుణ్యభూమిపై మొదట గోదావరీ తీఓరం లో పిఠాపురం లో శ్రీపాదశ్రీ వల్లభులుగాను,తరువాత కరంజా అనే గ్రామం లో అవతరించి శ్రీనృసింహ సరస్వతి గా గాణ్గాపురం లోను ప్రసిద్దమయ్యారు. నైజాము నవాబులకాలం లో మాణిక్యనగర్ లో మాణిక్యప్రభువుగాను ,అటతర్వాత 1856 లో స్వామి సమర్ధులుగాను ,ఆపై శిరిడీసాయిబాబాగాను అవతరించారు. ఆమొదటి ఇద్దరి చరిత్రలు "శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి " {గురుచరిత్ర] అనుగ్రంథం లో ప్రచురించడమైనది.వీరందరి చరిత్రలు శ్రద్ధాదీక్షలతోపారాయణం చేసి ముముక్షువులు పూర్ణగురుని అనుగ్రహనికి పాతృలుగావాలి. అదే దత్తసాంప్రదాయం.

_____________ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారి ప్రబోధములనుండి

Read more...

అహా ! ఇక ఈలాంటి గొప్ప తీర్పులను వినే అదృష్టం కూడా పట్టనుందామనకు !

>> Wednesday, March 24, 2010

చిన్నప్పుడు పెద్దవాల్లు రచ్చబండమీద కూర్చుని చెప్పుకునే పిట్టకథల్లో బుడ్డవాల్లం ఆడుకుంటూ విన్నవి కొన్ని ఇంకా గుర్తున్నాయినాకు. వాటిలో ఒక కథ .

ఒక మోసకారి సన్యాసి నీతినియమాలుగల ధర్మప్రభువని పేరు పొందిన ఒక రాజుగారిని ధర్మసంబంధమైన ఇరకాటం లో పెట్టి ఆయన రాజ్యాన్ని కాజేసాడు. సరే రాజుగారు ఇచ్చినమాటకు కట్టుబడి తనప్రజలందరినీ కూడా ఆ సన్యాసి రాజుగారు చెప్పినట్లేవినాలని తనపై అభిమానంగల తనరాజ్య ప్రజలందరినీ ఒప్పించి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు . ఇక కొత్తగా సింహాసనమీద కూర్చున్న ఆమోసకారి సన్యాసి తనబుద్ది ననుసరించి పరిపాలన చేస్తున్నాడు. ఆరోజులలో రాజే సర్వోన్నత న్యాయమూర్తి గనుక తీర్పులుకూడా తన మేధస్సును మధించి అద్భుతమైన తీర్పులు చెప్పేవాడు .అలాంటి తీర్పులలో ఒకటి ఇది.
ఆ రాజ్యంలో గల రంగయ్య ,గంగయ్య అనెఇద్దరు చాకలి వాల్ల గొడవ గ్రామ న్యాయస్థానం నుంచి పరిష్కారంగాక ఆపై న్యాయస్థానాలను దాటుతూ చివరకు మన సన్నాసి రాజుగారి సమక్షానికొచ్చినది . ఇక అక్కడ రాజుగారు విచారణ మొదలెట్టారు.

ఏమిటి ? తగాదా ? రాజుగారు ప్రశ్నించారు .
మంత్రిగారు లేచి " ప్రభూ ! రంగయ్య , తనజీవనాధారమైన గాడిద కాలు ఈ గంగయ్య విరగ్గొట్టాడని అభియోగం మోపుతున్నాడు.
ఈ గంగయ్యేమో , రంగయ్యే ఐదోనెల గర్భవతి ఉన్న తనభార్యను కాలితో తన్నటం తో తన భార్య గర్భం పోయిందని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తమరు విచారించి న్యాయం చేయాలి .క్రింది న్యాయస్థానాల తీర్పుకు ఇద్దరు అంగీకరించటం లేదు . వివరించాడు.

రాజు రంగయ్యతో " ఏరా ! ఏమిటి నీ అభియోగం ?
రంగయ్య " ప్రభూ ! ఈ గంగయ్య రాయి తోకొట్టటం తో నా గాడిద కాలు విరిగింది . నాజీవనధారమైన గాడిద లేక నాకు చాలా నష్టం కలిగింది.
రాజు " ఏరా !గంగయ్యా వీడు చెప్పేది నిజమేనా ?
గంగయ్య " లేదు ప్రభూ ! వాని గాడిద నేను ఆరవేసిన గుడ్డలు తొక్కుతుంటే ఏయ్ కాల్లిరగ్గొడతా హాయ్, అని ఊరికే బెదిరించాను , అంతే కాలు విరిగింది . నేను విరగ్గొట్టలేదు .కానీ ప్రభూ వీడు అలా నాపై కోపంతో ఇంటికివచ్చి నేను ఇంటలేకపోవటం తో ఆకోపం తో నాభార్యను తన్నాడు .దానితో నాభార్యకు గర్భస్రావమైపోయిందిది .ఇటువంటి కౄరున్ని మీరు శిక్షించాలి .
రాజుగారు ఆగ్రహం తో ఏరా ! అది నిజమేనా ? అని గద్దించాడు
వెంటనే రంగయ్య "లేదు మహారాజా కోపంలో, ఏమే ! ఎక్కడే నీమొగుడు ? నాగాడిద కాలిరగ్గొడతాడా ? ఒక్కతన్ను తంతా , ఏమనుకున్నారో అని కాలెత్తాను ,అంతే ! దానికి కడుపు పోయింది .ఇందులోనాతప్పేమీలేదు . ఏప్రమాణం చేయమంటే ఆప్రమాణం చేస్తా ! వాడే గాడిద కాలిరగ్గొట్టాడని ఫిర్యాదు చేసానని ఈ ప్రమాదానికి నేనే కారణమని అబద్దాలాడుతున్నాడు అని లబలబలాడాడు.
రాజు గారు ఎంత ప్రశ్నించినా ఇద్దరూ తమ కథనాలను అలాగే వినిపిస్తున్నారు. ఏప్రమాణం చేయటానికైనా సిద్ధమంటున్నారు. పోనీ సాక్ష్యం అడుగుదామంటే రెండు సన్నివేశాలలో ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు. అయినాసరే తన మేధస్సుపై అపార నమ్మకం గల రాజుగారికి ఎవరికీ అన్యాయం చేయకుండా తీర్పునివ్వగల నేర్పు తనకుందని గొప్ప నమ్మకం .సభ రాజుగారి తీర్పెలా ఉంటుందా అని ఉత్కంఠం గా ఎదురు చూస్తున్నది. ఆయన తన మేధస్సునంతా మధించి ఇలాతీర్పునిచ్చారు.

ఒరే ! మీ మూర్ఖత్వం వల్ల వల్ల ఇద్దరు నష్టపోయారు
విలువైన మాసమయం వృధాచేశారు . కనుక జరిగిన నష్టానికి ఇద్దరు బాధ్యత వహించవలసినదే ! కనుక మీలో గాడిద కాల్లిరగ్గొట్టిన వాడు ఆగాడిదను తీసుకెళ్ళి దాని కాలు నయమై బాగా నడిచేదాకా వైద్యం చేయించి తిరిగి దాని యజమాని కప్పజెప్పాలి. ఇక రెండో వాడు కాలితో తన్ని గర్భస్రావం జరిగేందుకు కారణమవటం క్షమించరాని నేరం . మానవునికి సంతానం కన్నా గొప్పసంపద లేదు . కాబట్టి కాలెత్తి తన్నినవాడు ఆ స్త్రీని తన ఇంటికి తీసుకెళ్ళి మరలా ఆమెకు ఐదోనెల గర్భం వచ్చినదాకా సంరక్షించి అప్పుడు భర్తకు భద్రంగా అప్పజెప్పాలి. ఇది మాధర్మనిర్ణయం .ఎవరేది కోల్పోతే దానినితిరిగి పొందాలి. ఈమాత్రం చెప్పటానికి క్రింది న్యాయస్థానాలో వారికి చేతకాలేదా ? గంభీరంగా ప్రకటించారు తీర్పును రాజుగారు.

అంతే సభ దద్దరిల్లి పోయింది..........................లతో .
{సభ అన్నాక అన్ని రకాలవాల్లుంటారు కనుక ,మీరు కూడా ఆసభలో ఉండి తీర్పును వింటే ఆసభను ఎలా దద్దరిల్లజేసి ఉంటారో చెప్పండి .........తెలుసుకోవాలని ఉంది .]



Read more...

రామనామ మాలా భజరే శ్రీరామనామ మాలా

>> Tuesday, March 23, 2010



కీర్తన
..............

రామనామ మాలా భజరే శ్రీరామనామ మాలా
ఈ ప్రేమ సుమాలా భజరే ..... భజరే రామనామ మాలా //రామనామ//

మాలా సీతా స్వయంవరంలో సాధించిన మాలా
ఈప్రేమ సుమాలా భజరే.......భజరే రామనామ మాలా //రామనామ//

మాలా లక్ష్మణుడు ఎళ్లవేళలా జపియించినమాలా
ఈ ప్రేమసుమాలా భజరే...........భజరే రామనామ మాలా. //రామనామ//

మాలా హనుమా ఎళ్లవేళలా భజియించెడిమాలా
ఈప్రేమ సుమాలా భజరే ....భజరే రామనామమలా //రామనామ//

Read more...

మనసున రాముడున్నంతకాలం మానవత్వం మిగిలిఉంటుంది .






రాముడు సుగుణాభిరాముడు . స్వయం గా భగవంతుడైనా ఈ అవతారంలో తన భగవత్తత్వాన్ని పక్కనుంచి సంపూర్ణమనవుని లక్షణాలను ఆచరణాత్మంగా చూపించి మనిషిలో మానవత్వం మిగిలి ఉండాలంటే మనుషులెలా నడుచుకోవాలో చూపించాడు . మనుషులు మనిషితత్వాన్ని మిగుల్చుకోవాలంటే ఆయనను అనుసరించాల్సిందే . ఆయనను భగవంతునిగా గుర్తించలేని గుడ్డితనం మన మనసులను కమ్మేసినా మనిషిగా ఎలానడుచుకోవాలో ఆయనచరితద్వారా తెలుసుకోగల అవకాశం ఉంది.

రాకుమారుడుగా పుట్టి క్షత్రియోచితమైన బాధ్యతలను నెరవేరచటానికి పసితనంలోనే బయలుదేరటం ,గురువును అనుసరించటం ,ఋషులను గౌరవించటం ద్వారా మన పిల్లలు ఎదిగేవయస్సులో నేర్చుకోవాల్సిన లక్షణాలివి .
ఇక ఆయన జీవితంలో కెళ్ళీనకొద్దీ రత్ననిధులవంటి శుభగుణాలు లభ్యమై జాతి ఆ అపురూపసంపదను అందిపుచ్చుకుంటూ సాగుతున్నది యుగాలుగా .

పొద్దుటే సకలసామ్రాజ్యవైభోగ సంపదలు తనకు సంక్రమించనున్నాయి. ఆసమయంలో బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడుపుతున్నాడు . విధి నిర్ణయం వేరుగాఉంది. అర్ధరాత్రికి పరిస్థితులు మారిపోయాయి . పట్టాభిషేకం చేస్తామన్న వారే పట్టుబట్టలు త్యజించి అడవులకేగమని ఆజ్ఞఇచ్చినట్లు తెలుసుకుని కూడా ఆయనమోములో ఏమాత్రం మార్పులేదు అదే ఉల్లాసం . పామరునిలాగా , నాకిస్తామన్న ఆస్తి వేరొకరికిస్తావా ? అని తండ్రితో తగాదకు దిగలేదు. ఆవేశపడ్డ తమ్మునికూడా శాంతపరచి "ఈశరీరం తండ్రివలన సృష్టించబడినది కనుక దీనిపై సంపూర్ణహక్కులు తండ్రికున్నవని వివరించి పితృవాక్యపరిపాలనకై అడవులకేగాడాయన.
ఇక తనకు సంబంధలేకపోయినా ఈ విషయంలో అన్నకు జరిగిన అన్యాయానికి అవేశపడటమేకాదు ,అన్నకులేని సుఖం తనకక్కరలేదని ఆయనవెంట నదచిన లక్ష్మణుడు ,సవతికొడుకు అనిచూడక అన్నదమ్ములమధ్య ఉండాల్సిన ప్రేమ బంధాన్ని బలపరుస్తూ వెళ్లమని ఆజ్ఞాపించిన సుమిత్ర , అందుకు అంగీకారం తెలిపిన ఊర్మిళాదేవిల త్యాగం మానవాళికి ఆదర్శం .
తనహితుడు భక్తుడైన గుహుని తన కౌగిలితో పులకరింపజేసి గౌరవించిన రాముని దీనజనబాంధవత్వం చెప్పనలవికానిది .
ఇక ఇద్దరుభాగస్తులు అడవికెళ్ళారు. తల్లి ఏ ఆటంకం లేకుండా రాజ్యసంపద తెచ్చి చేతిలో పెట్టింది . కానీ భరతుడు తన తల్లి చేసినపని అసహ్యించుకుని ,నా అన్నకులేని సంపదలు నాకక్కరలేదని పరుగున పోయి రామపాదాలపైవాలి అయోధ్యకు రమ్మని ప్రార్ధించాడు . ఆహా ! ఏమిత్యాగమూర్తులువారు. ఎలాపొగడగలం ? చిన్నచిన్న భాగాలకోసం కత్తులు దూసుకుని ముఖాలుకూడా చూసుకోని ఆసురీభావాలుగల అన్నదమ్ములు ఈపండుగనాడైనా రామకథలో ఈ సన్నివేశాన్ని గుర్తుతెచ్చుకున్నా మరలా కలుస్తారు. అందుకే లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు , "భార్య ఏదేశం లోనైనా దొరుకుతుంది ,తోడబుట్టినవాడు మరలా లభిస్తాడా" అని విలపిస్తాడు శ్రీరామచంద్రుడు. ఇవినేర్పగలిగారు గనుకనే మనలో ఇంకా అన్నదమ్ములమధ్య అనురాగాలు మిగిలున్నాయి.

అడవికి బయలుదేరేప్పుడు భార్యను నావెంటరా ? అని ఆజ్ఞాపించలేదు .నువ్వు ఈకష్టాలు పడలేవు ఇక్కడో లేక మీపుట్టింటిలోనో ఉండమంటే ఆతల్లే " నేనెలా కనపడుతున్నాను ? భర్తకు సంపదలున్నప్పుడు వెంటనుండి ,కష్టసమయంలో వదలివెల్లటానికి " అని ఆగ్రహంతో అడిగి నాభర్త ఎక్కడుంటే అదే నాకు పరమసుఖమైనప్రాంతమని చెప్పి ఆచరించి నేటికీ కోట్లాదిమంది భారతస్త్రీలకు ఆదర్శప్రాయమై వెలుగొదుతున్నది ఆమహాసాధ్వి. భర్త ఎక్కడున్నాడో తెలియదు . భయానికి ,ఆశలకు ,పరపురుషుని సంపదకు ఆశపడక కేవలం గడ్డిపోచను అడ్డుపెట్టి అంతశక్తివంతుని నిరోధించి పాతివ్రత్య శక్తిని చాటి తరతరాలకు మార్గదర్శకత్వం వహిస్తున్నది నేటికీ అంతర్గతంగా.
తనభార్య దూరమైతే నిజమైన ప్రేమగల భర్త ఎలావిలపిస్తాడో చెట్టునూ ,పుట్టనూ పట్టుకుని దు:ఖితుడవుతున్న రాముని చూస్తే తెలుస్తుంది.

మిత్రత్వాన్ని నెరపిన సుగ్రీవునికోసం బలవంతుడైన వాలిని చంపాడు. నన్నడిగితే ఆ రావణున్ని తెచ్చి నీ కాల్లముందు పడవేసేవాన్ని కదా ? ఇలా చేసావేమి ? అని చావుబ్రతుకులమధ్యలో ప్రశ్నించిన వాలికి ,ధర్మమేమిటో తెలియజెప్పాడు రాముడు. అంతేగాని తన లక్ష్యం కోసం అధర్మానికి పాల్పడలేదు.
తనశక్తిని అజ్ఞాతంగా ప్రసరింపజేసి హనుమంతుని అనుగ్రహించి భగవత్తత్వమేమిటో చూపాడు.
శరణువేడిన విభీషనునికి అభయమిచ్చి .రావణుడనావచ్చివేడితే అతనికికూడా రక్షిస్తానని ప్రకటించిన దయాహృదయుడు ,క్షమాగుణానికి నిలువెత్తు నిదర్శనం స్వామి.

యుద్దంలో గెలిచాక " అన్నా ! అయోధ్యకంటే ఈ లంకావైభోగం చాలాగొప్పది ఇక్కడే ఉందామా ? "అని సూచించిన తమ్ముని తో జననీ జన్మ భూమిశ్చ.........................అని మాతృభూమి గొప్పతనాన్ని వివరించిన దేశభక్తులకు ఆదర్శమయ్యాడు. లోకం ది నరం లేని నాలుక కనుక తనలో దు:ఖాన్ని దాచుకుని తనభార్య శక్తి పట్లగల సంపూర్ణవిశ్వాసంతో "ఆతల్లి గతం లో లక్శ్మణుని అనుమానించి వేదన కలిగించిన పాపం పోయేలా" మాటలాడి అగ్నిపరీక్షకు గురిచేశాడు.

రాజు ఏమైనా చేయొచ్చు అనే అహంకారం కూడదు ,పరిపాలకులు జనాభీష్టం కోసం తన సుఖాలను ,కూడా త్యాగం చేయాలని ,జనంమాటే ప్రభుత్వం బాట అని చూపిస్తూ . కట్టుకున్న భార్యను సైతం కారడవులకు పంపాడు .అదీ పాలకునికుండవలసిన లక్షణం/ అంతనిబద్దతగా బ్రతకగలిగేవాళ్ళు పాలకులైతే రామరాజ్యమే . నిత్యకల్యాణం పచ్చతోరణమే జనజీవితాన .

[రామాయణం ఇరువది నాలుగు వేల శ్లోకాలతో విస్తరిల్లినదని గాయత్రీ మంత్ర శక్తి సంకేతమని చెబుతారు. అలాచూస్తే మూలమైన వాల్మీకిరామాయణం లో రామ చరితలో ఎక్కడా మచ్చలేదు. అయితే ప్రక్షిప్తాల ను చొప్పించి అవాల్మీకమైన కథలను జొప్పించి వాటిద్వారా రాముని చరితపై బురదచల్లాలనుకున్నవాల్ల ప్రయత్నాలన్నీ ఆకాశం మీద ఉమ్మువేసినచందంగా తయారవుతున్నాయి.]

రాముని దేవునిగా పూజిచతానికి అభ్యంతరమైనా పరవాలేదు కానీ ఆయన చరితలోని ఈ సుగుణాలను అందుకునే లక్షణాలను కోల్పోతే మనిషిలో మానవత్వం మిగలదు . ఇప్పటికే రాముని దివ్యగుణాలంటే భయపడే ఆసురీ శక్తులవిజృంభణతో కొత్తతరాలు ఈ సుగుణాలకు దూరమవుతున్నాయి. దానితోపాటు పెరుగుతున్న అనర్ధాలను మన తరం లోనే కల్లారా చూస్తున్నాము . ఇప్పటి కైనా మేల్కొని రామకథను మనబిడ్డలకు బోధిద్దాము వాల్లు మనుషులుగా ఎదగటానికి ,మానవత్వం మిగలటానికి

అదే మనం జరుపుకుంటున్న శ్రీరామనవమి ఉత్సవానికి నివేదించే పుష్పాంజలి .



Read more...

మీప్రాంతంలో హనుమత్ సాధకులు,భక్తిప్రచారకుల వివరాలను అందజేయండి

>> Sunday, March 21, 2010


భగవద్బంధువులకు విజ్ఞప్తి.

మీప్రాంతంలో మీకు తెలిసిన హనుమత్ సాధకులు ,ఉపాసకులు భజనమండలి నిర్వాహకుల వివరాలు కావాలి. హనుమద్భక్తిని కలిగి ఆయన నామ మహిమను లోకకళ్యాణం కోసం పారాయణ ప్రచారాలను చేస్తున్నవారెందరో ఉన్నారు .
లోకహితం కోసం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని పెద్దలు ఒక యోచన చేస్తున్నారు. దానికొరకై వీరందరి సహకారం కావలసి యున్నది. మీరు కొద్దిగా శ్రమతీసుకుని మీ ప్రాంతంలో గల హనుమత్ సాధకుల వివరాలు.అంటే అడ్రస్ ,ఫోన్ ఉంటే ఈ మెయిల్ అడ్రస్ లను సేకరించి ఇవ్వగలరు . లోక క్షేమం కోసం చేపట్టనున్న ఈ కార్యక్రమానికి మీవంతుగా ఈ సహాయాన్ని అందించగలరు.
ధన్యవాదములు
.జైశ్రీరామ్

మెయిల్ durgeswara @gmail.com 9948235641


Read more...

శ్రీరామ చంద్రుని ధర్మ బాణం

>> Friday, March 19, 2010

ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా దుర్మార్గులను శిక్షించి "మన "వంటి సన్మార్గులను రక్షిస్తానని వాగ్దానం చేసినందువల్ల భగవంతుడికి మరలా మరలా అవతరించక తప్పటం లేదు. దేశమంతటా రామాలయాలలో రామాయణ కథాగానాలతో మనహృదయాలు కృతజ్ఞతతో పరవళ్లు తొక్కుతాయి. కానీ రాముడు ,ఆయన కథ ద్వారా వాల్మీకి మహర్షి మనకు ధర్మాన్ని తెలపాలని .మనంధర్మమార్గాన నడచి తరించాలని ఆశించారు. .అలాచేసిననాడే మనం జరుపుకునే శ్రీరామనవమి ఆ ధర్మవిగ్రహుడికి ,మహర్షికి సంతోషాన్నిస్తుంది.

లోకహితం కోసం తపస్సు ,యజ్ఞము ,శిష్యశిక్షణా చేసే ఋషులను పోషించటమ్ రాజధర్మము .కానీ పుత్రవ్యామోహం తో యాగరక్షణకోసం విశ్వామితృనివెంట రామున్ని పంపటానికి దశరథుడు ఇష్టపడలేదు. తన బిడ్దను బ్రహ్మర్షి విశ్వామితృడు రక్షించగలడన్న విశ్వాసాన్ని కూడా మమకారం కప్పివేసింది .చివరకు వశిష్ఠులవారి ఆజ్ఞకు తలొగ్గిమాత్రమే రాముణ్ణి పంపాడు . బ్రహ్మవేత్తలైన గురువుల ఆదేశానికి తలొగ్గటమే మన కర్తవ్యమని రాముడు గమనించాడు.

ఈ చివరి వాక్యం మినహా మిగిలిన వాక్యాలన్నీ మనకు అనుభవమే. నిత్యము రాముణ్ణో సాయిరామున్నో " నీవే తల్లివిదండ్రివి ,నాసర్వస్వమూ " అని స్తుతిస్తుంటాము. మన ఇంద్రియాలను, బుద్ధులను, తను, మన,ధనాలను స్వజనాన్ని ఆయన సేవకర్పించే శ్లోకం చదువుతాము. అంతేకాదు రాముడు రాజభవనాన్ని త్యజించి యాగరక్షణకోసం అడవికి వెళ్లాడని .దశరథుడతన్ని కేవలం గుర్వాదేశం మేరకు మత్రమే పంపాడని ,ప్రహ్లాదుడు తనవారందరినీ కాదనుకుని శ్రీహరినే అర్చించాడని చదివి ఆనంద భాష్పాలు కారుస్తాము.

కానీ ఆచరణలోకొచ్చేసరికో ???????????

తనబిడ్డ శ్రీహరిసేవ చేయడాన్నిష్టపడని హిరణ్యకశిపుని చీదరించుకుంటూగూడా .మనమూ మనబిడ్డలు రోజులో వ్యర్ధంగా గడిపే సమయాన్నికూడా స్వామిసేవకు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండము. ఫ్యాన్ గాలిమేస్తూ సోఫాలో కూర్చుని హాయిగా సధ్గ్రంథాలు చదివి మనమూ వారిలా మాహత్ములవాలనీ ,అవుతామనీ ఆశిస్తాము. ఇహపర సుఖాలను "ఆయన" మనకు ప్రసాదించలేదని ఒక్కో సారి సతాయిస్తాము. ఎక్కడో మతకలహాలో ,గాలివానలో వస్తే అక్కడి మనవారికి "ఆయన" బంట్రోతై కాపలా కాయాలి. మనం గాని మనవారుగాని స్వామి సేవలో సహకరించవలసివస్తే "వాళ్లంతా ఉన్నారుగదా ! మనం వెళ్లకపోతేనేమి " అనుకుంటాము .

సాయి తన గురువును 12 సంవత్సరాలు సేవించారు. 12 సం..లు వేపాకుతిని భూగృహం లో తపస్సుచేసారు. 60 సం...లు షిరిడిలో ఉదయం అరునుండి రాత్రి పదిగంటలవరకు వచ్చేవారినందరినీ ఆదరిస్తూ కూర్చున్నారు. రాత్రిసమయాలలో నిద్రకూడా ఎరుగక భక్తులనుగాచారు. .మనమో మహా సమాధి తరువాత గూడా ఒక్క క్షణమైనా ఆయనకు విశ్రాంతి నివ్వము. మనబ్బాయికి జ్వరంగా ఉందని ఉత్తరం వచ్చింది. ,ఆఫీసులో మనకు వత్తిడి వచ్చింది, లేక ప్రమోషన్ రాలేదు. ,మనబ్బాయి మన మాట వినటం లేదు. ఇక సాయికి కంటిమీద కునులేకుండా గోరుచుట్టలా నలిపేస్తాము. ఔను మరి మనం రోజూ అగరొత్తి పెట్టటం లా ? అప్పుడప్పుడూ టెంకాయ కొట్టటం లా ? రాముడుగాని ,సాయిగాని _ వారు ఆజన్మసిద్ధమైన సహనం తో మనను సహిస్తున్నారు. కనుక కొలుస్తాము.

కనీసం మనకూ మనవారికీ పనికిరాని విరామ సమయాన్నైనా ఆయన సేవచేయడమో లేక చేసేవారితో సహకరించడమో నేరిస్తే రామ ; సాయి అవతార కార్యము రామనవమి ఎంతైనా సార్ధకమైనట్లే . రామ బాణానికి బలమున్నట్లే .

[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు ..... సాయిబాబా మాసపత్రికనుండి }

Read more...

పంచాంగకర్తలకొక మనవి ........శాస్త్రాన్ని జనంలో పలుచనచెయ్యొద్దు .[500వ పొస్ట్]

>> Thursday, March 18, 2010






భారతీయ ఖగోళ గణిత విజ్ఞానానికి అద్భుత ఉదాహరణ పంచాంగం . ఈనాడున్న గొప్ప గొప్ప యంత్రాల సహాయం లేకుండానే నాటి భారతీయ శాస్త్రవేత్తలు విశ్వరహస్యాలను వివరంగా చెప్పగలిగి జగద్గురువు ఈదేశమని గుర్తింపువచ్చేలా చేశారు. ఎందరో తపోధనులు తమ జీవితాలను ఈ విజ్ఞానరహస్యాలను కనుగొనేందుకే వెచ్చించారు . నాటి వారి త్యాగం వలన ప్రపంచం లో ఎవరికీ అందనంత శాస్త్రవిజ్ఞానం మనకందినది. దానిని లోకకళ్యాణానికి ఉపయోగించాలనే ధ్యేయంతో ఖగోళంలో జరిగిగే గ్రహాల చలనాలు భూమ్మీద ఏఏ ఫలితాలను కలగజేస్తాయో , మానవుల మనసు మీద వీని ప్రభావమేమిటో తమ జీవితపర్యంత పరిశీలించి ,పరిశోధించి లోకానికందించారు. ఇదో గొప్ప శాస్త్రంగా ప్రజలు సప్రామాణిక ఉదాహరణలతో పోల్చుకుని చూసి అమోదించి ,తమజీవితాలలో పెద్దలసూచనలను ఆచరిస్తున్నారు .ఈశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు పంచాంగాల రూపంలో జనసామాన్యానికి అందుబాటులో ఉంచుతూ తరతరాలుగా జాతికి సేవచేస్తున్న మహానుభావులు పంచాంగ కర్తలు. వీల్ల సూచన కోట్లాది జనుల నమ్మకాలను ప్రభావితం చేస్తుంది .ప్రపంచ మంతా కాలగమనంలో జరిగేమార్పులను సంఘటనలను భారతీయులు ముందుగానే ఇంతచక్కగా ఎలా వివరిచగలుగుతున్నారా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఈ శాస్త్రరహస్యాలను అధ్యయనం చేస్తున్న కాలమిది. ఇంతటి గురుతర బాధ్యత తలకెత్తుకున్న నేటి పంచాంగకర్తలలోను అపార మేధావులు ,అత్యంత నియమనిష్టలతో శాస్త్రాధ్యయనం చేసేవారున్నారు. ఇంతమంది పెద్దలు ఉండి నేడు పంచాంగం అంటే జనంలో గౌరవభావం పలుచనయ్యేవిధంగా వాతావరణం ఏర్పడటానికి కారణమేమిటో ఒక్కసారి ఆలోచించాలి.

కలి ప్రభావం అన్నింటినీ కలుషితం చేస్తున్నట్లుగానే ఇక్కడా వీరిమీదకూడా ప్రసరిస్తున్నట్లు అనిపిస్తున్నది. శాస్త్రకారుడు వాస్తవాన్ని మాత్రమే తెలిపే అధికారం కలిగి ఉన్నాడు. దైవానికి , విజ్ఞానద్రష్టలగు పూర్వ ఋషులకు మాత్రమే అభిమాని అయ్యుండాలి . శాస్త్ర విషయాలను శోధించి వివరించేప్పుడు మీ మనసులమీద ఏ అభిమానాలు లౌక్యాలు ప్రభావం చూపినా మీరు ఋషి రుణం తీర్చుకోవటమేమోగాని వారిపట్ల దోషం చేసినవారవుతారు.
మీ మీ వ్యక్తిగత అభిమానాలు ,ఎవరికైనా శుభవార్తలే చెప్పి సంతోషపెట్టాలనే లౌక్యం మీకు మేలుచేసి , నట్లు లోకానికి మేలుచేయదు. మిమ్మల్ని గౌరవించేది కేవలం శాస్త్రవిజ్ఞానం పట్లగల గౌరవంతోమాత్రమే . మీరు అభిమానాలకు లోనై పందిని నందిగా వర్ణించే కవితాగానాలు చేపడితే ,అది కాలగమనం లో వాస్తవరూపమేమిటో తెలిసాక ముందు మన శాస్త్రాలమీద ,ఆవెనుకనే మీమీద అందరూ నమ్మకం పోగొట్టుకుంటారు . మీరు అభిమానించే నాయకులతో సహా . ఎప్పుడు శాస్త్రాలలో ప్రామాణికత లోపిస్తుందో అది జనానికి దూరమైపోతుంది . తద్వారా ఆపాపం మీకే చుట్టుకుంటుంది . గత పది సంవత్సరాలుగా చూస్తున్నాము పంచాంగరచన చేసే శాస్త్రవేత్తలు పెరుగుతున్నారు . కానీ వారి అంచనాలు జనంలో గందరగోళం సృష్టించే అంశాలను కూడా ఎక్కువగానే చూస్తున్నాము. పండగల ను నిర్ణయించటం వద్దనుండి ఫలితాల దాకా . ఎందువలన జరుగుతున్నదిది ? శాస్త్రనిర్ణయాలలో సందేహాలొచ్చినప్పుడు .అదీ కోట్లాది ప్రజలమనో భావాలతో ముడిపడి ఉన్నప్పుడు మీరు కలసికూర్చుని సత్యశోధనకు పూనుకోరా ? ఇక్కడ ఎవరు ఏమి చెప్పారు ? అని చూడరు. పంచాంగం ఏమి చెబుతున్నది అనిమాత్రమే చూస్తారు సామాన్యజనం . అలాంటప్పుడు పాండిత్యస్పర్ధ లోకానికి మేలుచేస్తుందా ? కీడుచేస్తుందా ?అని ఆలోచించటం లేదా మీరు ?

సరైన పరిజ్ఞానం లేకుండానే పలనా పార్టీ గెలుస్తుందనిమీ వ్యక్తిగత అభిమానలతో బల్లగుద్దివాదిస్తూ ,కనిపిస్తారు టివీలలో కొందరు.అది మిమ్మల్ని ఒకవంక ఎగతాళిచేస్తూ నే దాన్ని మరింతగా బహిరంగపరచేందుకు కుర్చీలలో కూర్చోబెట్టి ప్రసారం చేసే టీవీ ప్రోగ్రామ్ముల్లో ఒకటని తెలిసీ పాల్గొంటుంటిరి. మరొకవంక పంచాంగ శ్రవణం లోనూ ఒక్కో పంచాంగానిది ఒక్కోమాట , సిద్ధాంతి కొక లెక్క అని మీ అభిమాన రాజకీయులచే మిమ్మల్నే విమర్శించే అవకాశం మీరే ఇస్తుంటిరి . ఏందుకీ అవమానం శాస్త్రానికి ? బిడ్డలు పెద్దవాళ్లై పదిమందిచే తల్లిదండ్రులను పొగిడేలా చేయాలి . కానీ తల్లివంటి శాస్త్రాన్నే అవహేళనపరచే స్థితి తీసుకువస్తున్న పెద్దలు మీ కేమని చెప్పగలము . అయ్యా ! మీపై మాకు విశ్వాసమున్నది .అంటే మీరు మాకు వ్యక్తిగతంగా పరిచయమై కాదు. మీరు ఆశ్రయించి వున్న శాస్త్రజ్ఞానం ఆధారంగా . దయచేసి మీరు ఆలోచించి శాస్త్రం విలువ తగ్గకుండా చూస్తారనే ఆశ మాకు ఉంది. ఇది మీపట్ల చులకనతో వ్రాయటం లేదు . పండితులైన మీరు సమదర్శులు . సామాన్యుల తరపున మేము తెలియజేస్తున్న విన్నపాన్ని ఆవేదనను అర్ధం చేసుకోవాలని మహోన్నత భారతీయ విజ్ఞానపరంపరకు వారసులుగామీరు జాతి కరదీపికలుగా మిగలాలని నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాము .

Read more...

అమ్మకు మీ తరపున వైభవంగా జరిగిన "సహస్ర కమాలార్చన" సేవ

>> Tuesday, March 16, 2010


కొత్తసంవత్సరం ప్రారంభమైన ఈరోజు అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకు పీఠములో "సహస్ర కమలార్చన" అత్యంత భక్తిశ్రద్దలతో నిరవహించబడినది. తెల్లవారుఝామున నాలుగుగంటలనుంచి అభిషేకాదులు పూర్తిచేసి ఆరుగంటలకల్లా చెరువులోకి వెళితే పదిగంటలయింది, వేయిపూలు కోసుకుని చెరువులోంచి బయటకు వచ్చేసరికి. అమ్మ ఎవరిచేత ఏసేవచేపించుకుంటుందో తెలియదు ,అనుకోకుండా శుక్రవారం అమ్మ వారికి ఒక చీరపంపిస్తాను మాతరపున ధరింపజేస్తారా అని హైదరాబాద్ నుంచి విజయజ్యోతిశ్రీనివాస్ గారి ధర్మపత్ని లక్ష్మీసుజాతగారు ఫోన్ చేసి అడగగానే అమ్మసంకల్పంగాభావించి సరేనమ్మా పంపమన్నాము .వారుపంపింన నూతనవస్త్రాలను అమ్మవారికి ధరింపజేసాము . శ్రీవేంకటేశ్వర స్వామివారికి పీఠం తరపున వస్త్రాలు సమర్పించాము.. పాపం ఏపండగైనా సరే ఏనాడూ నాకిది కావాలి,అని అడగని అమాయకస్వామి శివయ్య మాత్రం జలాభిషేకంతోనే సంతోషించి ఆనందపడిపోయాడు .. తదనంతరం భక్తులందరి గోత్రనామాలను అమ్మవారికి నివేదించి వారందరి తరపున అమ్మవారికి పాదపద్మాల కు సహస్రకమలాలతో అర్చన జరుపబడినది.. అమ్మ పాద పద్మాల శోభ కు మేము వెలవెల బోతిమే ! అని చిన్నబుచ్చుకున్నా ,ఏజన్మలో పుణ్యమో ఇలా తల్లిపదములు చేరే భాగ్యందక్కినదికదా ! అని కలువలు మురిసిపోయాయి. ఆపూలలతో కలిసిన మన భక్తిభావతరంగాలు కూడా అమ్మపాదాలనుచేరి మన వేదనలను తల్లికి తెలియజేసాయి . ఇలా అనుకోకుండా కార్యక్రమాలను నిర్ణయించి జరిపించడం అమ్మకొక క్రీడ . అసలు వేయి కలువలు సేకరించగలమా అనే అనుమానం కూడా మనసులో మెదిలి భయపెట్టినదిమధ్యలో . కలువలుబాగా పూసే కాలం కాదు ఇది. అంతపెద్ద చెరువుమీద బరువైన పడవను తిప్పుతూ మూడుగంటలసేపు మంచినీరుకూడా తాగలేదండి కల్లుతిరుగుతున్నాయని చెబుతూనే కలువలు సేకరించేందుకు గడవేస్తూ పడవను నడిపిన నూజండ్లకుచెందిన నా పూర్వ విద్యార్ధి చిరంజీవి నాగరాజు కు ఈకార్యక్రమం లో వచ్చే పుణ్యం లో సింహభాగం దక్కాలి. అమ్మవారికిప్రీతి పాత్రమైన ఈసేవ కోసం వెచ్చించిన సమయమే నిజంగా సద్వినియోగమైన సమయమనే విషయాన్ని నమ్మకం కలిగేలా నేను వివరిస్తూ వానికి సహాయ పడుతూ ఉండగా తొమ్మిదవతరగతి విద్యార్థులు చిరంజీవి గుణశేఖర్ ,శివాజీనాయక్ లు పూలు కోస్తూ గంపలకు పేర్చారు . మనం వేయిరూపాయలు వెచ్చించి పూలుకొనవచ్చు కానీ అవకాశమున్నప్పుడు మనం స్వంతగా శ్రమించి భగవంతునికి చేసే సేవకు సాటిరాదు మరేదీ. కనుకనే మనం చెమటోడ్చి సేవచేయాలి అది హనుమత్ స్వామి మనకు నేర్పుతున్న పాఠం అని వివరించింది నాగొంతు , మాపిల్లలకు ... కానీ ఆపాఠం నాలో నుండి నాకే ఎవరో బోధిస్తున్నట్లుగా అర్ధమయింది ఆక్షణాన . మీగోత్రనామాలతో అమ్మకు పూజచేస్తాను అని చెప్పగానే నమ్మి నాకు తమ గోత్రనామాలు పంపిన వారందరికీ నాబాధ్యతను నేను నెరవేర్చానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను .

చిత్రామాలికను ఇక్కడ చూడండి


http://picasaweb.google.com/durgeswara/Sahasrakamalarchana















Read more...

అందరికీ ఉగాది శుభాకాంక్షలు .వివిధప్రదేశాలలో రేపు విద్యార్థుల జయార్ధం జరుగనున్న హనుమత్పూజలు.

>> Monday, March 15, 2010






ముందుగా అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు . వికృతి నామ సంవత్సరాన మీకు మీకుటుంబానికి అన్నింటా శుభములు,సంతోషములు కలుగజేయాలని జగన్మాతను ప్రార్ధిస్తున్నాము.

నిన్న కనీసం రెడువందలు ఖర్చుపెట్టి మీ ఊరిలో విద్యార్ధులకోసం ప్రత్యేకపూజలు చేపించమని నే కోరిన వెంటనే స్పందిస్తున్న భక్తజనులకు కృతజ్ఞతలు . మొదట అర్ధంకాలేదని ,మీరు చెప్పినవిషయం విన్నాక అనుమానాలుతీరాయని తెలుపుతున్నవారికి ధన్యవాదములు.
రేపు తాడేపల్లిగూడెం .ఇనిమెళ్ళ,ముప్పాళ్ల , నూజండ్ల,నరసరావుపేట లలో ఆంజనేయస్వామి ఆలయాలలో విద్యార్థులకోసం ఈకార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అక్కడనుండి కార్యక్రమనిర్వహనకు ముందుకొచ్చిన ధార్మికమితృలు తెలియజేస్తున్నారు. చాలా తక్కువసమయం లో ఏర్పాట్లు కష్టం కనుక వచ్చేశనివారం మరికొన్నిచోట్లచేయడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు మితృలు చెబుతున్నారు.

ఇక భాగ్యనగరం [హైదరాబాద్] లో గల ప్రముఖదేవాలయాలలో విద్యార్థులకోసం ప్రత్యేకపూజలు ఏర్పాటుచేసినట్లు విశ్వహిందుపరిషత్ కార్యకర్తలు తెలిపారు. NTR గార్డెన్స్ ఎదురుగా గల హుస్సేన్ సాగర్లోని హనుమదాలయం .విద్యుత్ సౌధ ఎదురుగా గల హనుమత్ క్షేత్రం ,అలాగే అత్తాపూర్ లో గల కాలాహనుమాన్ ఆలయంలో తిరుమలలో జరిపిన సరస్వతీయాగం నుండి తెచ్చిన రక్షలు ఉంచామని హాల్ టిక్కేట్ చూపిన విద్యార్థులకు ఉచితంగా అర్చనచేపించి, రక్షలు,పూజలో ఉంచిన పెన్నులుకూడా అందజేస్తున్నట్లు మల్లావాసుబాబు చెప్పారు.

[ రెండువందలు ఖర్చు అని నిన్నఫోశ్ట్ టైటిల్ చూసి ,ఆశ్చర్యపోయామని,కొందరు నాగూర్చి తెలిసిన మితృలు ఫోన్ చేశారు . అవి స్థానిక ఆలయంలో పూజాధికములకోసం కార్యక్రమానికి ఉపక్రమించినవారు వెచ్చించవలసిన ఖర్చు. ఇతరులకెవరికీ ఇవ్వటానికి కాదు .ధన్యవాదములు]

ఇక్కడ పీఠములో రేపు సహస్రకమలార్చన లో గోత్రనామాలు పంపిన భక్తులందరితరపున పూజచేస్తున్నాము.ఇప్పటికే మీకుపంపిఉన్న నామావళిని జపించవలసినదిగా మనవి.

మరొకసారి శుభాకాంక్షలు .

సర్వేజనాసుఖినోభవంతు .

Read more...

మీ జేబులోంచి ఓ రెండువందలుమీఊర్లో ఖర్చుబెట్టి ,మీసమయం లోంచి 24 గంటలు నాకు దానమివ్వగలరా ?

>> Sunday, March 14, 2010




మీరు రెండువందల రూపాయలు మీఊర్లో ఖర్చుపెట్టి 24 గంటల సమయాన్ని ఇవ్వగలిగితే మీరు స్వామి పరివారంగా మారి లోక కళ్యాణకరమైన ఒక కార్యక్రమం మీచే నిర్వహింపజేపించాలనే సంకల్పం కలిగినది.

ప్రస్తుతము పిల్లలు పరీక్షలకు సిద్దమవుతున్నారు. మానవశక్తి కి పరిమితమెంతో అంతవరకు కృషిచేసి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. అయితే తమ ప్రయత్నమంతా కూడా సఫలతపొందాలంటే ఆపిల్లలకు ఏ ఆటంకం కలగకుండా ఉండాలి చివరి పరీక్షవరకు. వీరిలో బాగా చదువుతూ కోడా నవసరమైన భయాలకు లోనైతప్పులు చేశేవారు,కంగారుఎక్కువై తడబడేవారు, వీరితో బాటు ఎంత చదివినా గుర్తుకురాక ఇబ్బందిపడేవారు తీరా అన్నీబాగున్నా ఏదో హఠాత్తుగా ఇబ్బందులు వచ్చి పరీక్షసరిగా వ్రాయలేక పోయేవారు కూడా ఉంటున్నారు. దీనికితోడు తల్లిదండ్రులు చదువునొక జీవన్మరణ పోరాటంగా నూరిపోసి పసిబిడ్డలపై అధికవత్తిడి తెస్తున్నారు.

సరే ! ఇప్పుడు మనం చేయవలసిన పనేమిటంటే ! సకల భయాలను పారద్రోలి ,అపారధైర్యాన్ని ,జ్ఞాపకశక్తిని బుద్ధి కుశలతను ప్రసాదించి తానెక్కడ ఉంటే అక్కడ విజయాన్ని ప్రసాదించగల పవనసుతుని శక్తిని విద్యార్థుల మనోశక్తికి అనుసంధానం చేద్దాము . పిల్లలకు ఆయనపట్ల విపరీతమైన అభిమానము . ,ఆయన తమ వెంటనుంటే కొండలనైనా అవలీలగా పైకెత్తగలమనే ఆత్మ విశ్వాసం ఉంటుంది. ఆయనను శరణువేడి ఆయన అనుగ్రహం తో ఈ పరీక్షలలో దిగ్విజయంగా సాగటానికి " శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం " ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేస్తున్నది ఈప్రాంతం లో.
అదేవిధంగా మీరు నివాసమున్నచోటనే మీరే ఈఖర్చుతో విద్యార్థులకోసం ఈకార్యక్రమాన్ని చేపట్టే విధానము తెలియజేస్తాము . మీకు పైన నేను చెప్పిన ఖర్చుతప్ప అదనపు భారం కలగకుండా నే భారీ కార్యక్రమముగా ఈపూజ సాగుతుంది .అదీ హనుమంతుడు భక్తునికి ప్రసాదించే శక్తికి చిన్న ఉదాహరణ. ఈకార్యక్రమంలో పాల్గొనుటద్వారా విద్యార్థులు హనుమంతుని కృప పొంది, తరువాత జీవితం లో ఆయనయొక్క దివ్యగుణాలను ఆదర్శంగా తీసుకుని సమాజంపట్ల ఉపకారబుద్దిని పెంపొందించుకుంటారు . ఇలా సహకరించి, పదిమందికి మీద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిగే మేలువల్ల పోగుపడే పుణ్యరాశి మీ వెంటనుండి శుభాలను కలిగిస్తుంది మీకు., మీరు స్వామి పరివారంలో వారౌతారు . ఈకార్యక్రమాన్ని మీరు ఎవరితరపున ,ఏ ఆథ్యాత్మిక సంస్థ తరపున చేయటం లేదు .కేవలం హనుమద్భక్తులుగా చేస్తున్నారనే విషయం మరువకండి . మీకు కావలసిన సూచనలను సహాయము అందించడానికి నేను ఫోన్ లో 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఇదిచదివి మీరు ఈ హనుమత్కార్యక్రమం చేయాలి అనే సంకల్పం కలిగితే మాత్రం క్షణమాగవద్దు ,అది స్వామి మనకిచ్చిన అవకాశంగా గ్రహించి ముందుకు దూకండి. అవలీలగా స్వామి ఈమహత్తర కార్యక్రమాన్ని మీచే ఎలా జరిపిస్తాడో చూడండి .[ నాక్కూడా అంతే ఖర్చయ్యాయి అదీ నాప్రయాణాలకోసం ఈ కార్యక్రమం చేపట్టడానికి మీవెంట ఇంకో నలుగురు హనుమద్భక్తులు ఉంటే మీ అందరికీ కలిపి అంత ఖర్చులవుతాయి అంతే . ఇది హనుమత్సేవకు ఉపక్రమించాలనుకునే భక్తులకొరకు మాత్రమే వ్రాసినపోస్ట్ దయచేసి నచ్చితే చదవండి లేదా నచ్చకుంటే తొలగిపొండి . మాకు స్వామి మీదున్ననమ్మకం తో చేపడుతున్న కార్యక్రమాన్ని మిగతా హనుమద్భక్తులకు అందజేయుటకు వ్రాయబడినది . అనవసర వ్యాఖ్యలకు చోటివ్వవద్దు]

జై భజరంగబలీ కీ
జై పవనసుత హనూమాన్ కీ
నా నంబర్ 9948235641


Read more...

దరిశిలో విద్యార్థుల జయార్ధమై ఈరోజు జరిగిన హనుమత్ పూజ

>> Friday, March 12, 2010

ప్రకాశం జిల్లా దర్శి లో పదవతరగతి విద్యార్థులజయార్థమై ఈ రోజు హనుమత్ పూజలు ,ధ్యానములు జరిగాయి. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున విద్యార్థులలో ఆత్మ విశ్వాసం ,ఏకాగ్రత ధారణాశక్తి పెరగడానికై హనుమత్ కృప కోరుతూ పట్టణం లో ఉన్న ఆరామ క్షేత్రమైన హనుమంతుని గుడిలో ఈ పూజలు నిర్వహించుట జరిగినది. ఉదయాన్నే స్వామికి విద్యార్థులపేరున పంచామృతాభిషేకములు,తమాలార్చన జరిపి అనంతరం విద్యార్థులచే హనుమత్ రక్షాధారణ చేపించటం జరిగింది. అనంతరం ఒక సాధకుడు తన లక్ష్యాన్ని చేరుకోవడమెలాగో హనుమంతుని జీవితచరిత్రనుంచి విశ్లేషించి చెప్పబడినది. హనుమంతునిలా ఏకాగ్రత ,ధైర్యం ,సునిశిత బుద్ధి శక్తి ఎలావచ్చాయో వివరించాము. ,ఆయనలా సదాచారము , మంచి ఆలోచనలు చేస్తే మీరే స్వామి ప్రతిరూపాలౌతారని , రాముడిని గుండెలలో ఎలా దాచుకున్నాడో ,మీ మనసులో ఆయన అలా వచ్చికూర్చుంటాడని చెప్పగానే పిల్లలు కేరింతలు కొట్టారు. సోమరిపోతులకు దైవమెప్పుడూ సహాయపడడని ,భగవంతుడిచ్చిన అవయవాలను సక్రమంగావినియోగించుకుని ,ఆయనపై భక్తి కలిగియుంటే సత్ఫలితాలొస్తాయని చెప్పాము. సముద్రాన్ని అవలీలగా ఉల్లంఘించిన స్వామి మీమనసులో నిలబడితే ఆరు సబ్జక్టులు ఒకలెక్కలోనివా ? ఇంకా పరీక్షలంటే భయపడేవారున్నారా అని ప్రశ్నిస్తే .లేదులేదు అని కోరస్ గా అరచిన పిల్లలు స్వామి అండతో మేము విజయం సాధిస్తామని ,కొండలెత్తిన స్వామి అండ ఉండగా విజయం సాధించటం మాకొకలెక్కకాదు ,, జైభజరంగభళీకీ ....అని నినాదాలు చేశారు. చాలీసాలోని సంపుటీకరణ మంత్రాన్ని ధ్యానం చేయడం నేర్చుకుని ఉల్లాసంగా ఆత్మధైర్యంతో తిరిగి వెళ్లారు పిల్లలు .వికలాంగులైన పిల్లలు కూడా స్వామి శక్తితో అద్భుతవిజయం సాధిస్తామని ధైర్యంగా చెబుతుంటే , స్వామి అనుగ్రహం తో వాళ్ళు కొండలు పిండిచేయగలరనిపించింది.

ఒక్కోపాఠశాలనుండి బృందాలుగా వచ్చిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో కార్యక్రమం లో పాల్గొన్నారు.
























Read more...

ఉగాది రోజుజరిగే "సహస్రకమలార్చన"కు గోత్రనామాలు పంపి మీరూ పాల్గొనండి

>> Thursday, March 11, 2010




నూతనసంవత్సర ప్రారంభమయ్యే ఉగాది పర్వదినమున శ్రీ వేంకటేశ్వరజగన్మాత పీఠం లో లోకశ్రేయస్సుకోరుతూ అర్చనా ప్రియ అగు ఆ జగన్మాతకు "సహస్ర కమలార్చన " చేయ సంకల్పించబడినది. ఆతల్లి అనుగ్రహం తో కొత్తసంవత్సరం ప్రతి ఇంటా సకల శుభాలు,సంతోషము వెల్లి విరియాలని అమ్మను ప్రార్ధిస్తూ అర్చన జరుపుతాము. అందుకోసం పూజకు 1008 తామరపుష్పాలను ఉపయోగించుట జరుగుతుంది. లక్ష్మీప్రదమైన కమలాలతో అర్చించటం వలన తల్లి అనుగ్రహం వర్షించి భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని ప్రగాఢనమ్మకము .

ఈ కార్యక్రమములో భక్తులు తమ గోత్రనామాలను పంపితే వారి తరపున ఒక్కొక్కరి తరపున ఒక్కొక్క పుష్పము అమ్మవారికి అర్చనలో సమర్పించబడుతుంది. దానికోసం లలిత సహస్ర నామావళిలోని 1008 దివ్యనామములను పఠించటం జరుగుతుంది. ఇక్కడ గోత్రనామాలు పంపిన ప్రతివారికి వరుసక్రమంలో అమ్మ సంకల్పాను సారం ఒక్కో నామం తెలియజేయబడుతుంది. ఆనామాన్ని పండుగరోజు ఉదయం పూజలో మీరు 108 సార్లు జపించవలసిఉంటుంది. ఇంకా మీ ఇఛ్చాను సారం జపం చేయవచ్చు. మీ మితృలు బంధువులకు కూడా తెలియపరచి పాల్గొనేలా చేయవచ్చు. వారి గోత్రనామాలు మీరు పంపినచో వారు పఠించవలసిన నామం కూడా మీద్వారా తెలియజేయబడుతుంది. ఉదయాన్నే మీ ఇల్లలో జరుపుకునే పూజలో మీరు ఈ నామాన్ని పఠించి మీ ఇష్ట దైవానికి పూలు సమర్పించాలి. సర్వదేవతాస్వరూపమైన అమ్మకు అదిమీరుచేసిన అర్చన అవుతుంది. మహాప్రభావం చూపగల ఈ నామ జపం ద్వారా మీ ఇంటిలో సకలశుభాలు నెలకొనాలని ఇక్కడ అమ్మకు అర్చనలో సంకల్పం చేసి నివేదించబడుతుంది. ఇంతమంది భక్తుల మనసులు ఏకమై చేసే ఈ నామ పఠనము వలన మహాశక్తి అనుగ్రహ ధారలు తప్పనిసరిగా వర్షిస్తాయి. పైన చెప్పిన సంఖ్య సూచన మాత్రమే . మీమనస్సులయమైనతరువాత ఎంత సంఖ్య ఎలా చేపించాలో గురుమండలరూపిణ్యైనమోనమ: అని స్తుతించబడే అతల్లే మరలా గురువుగా మారి చేపిస్తుంది మనచేత.
గోత్రనామాలను మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియబరచండి
durgeswara@gmail.com 9948235641

భక్తజనదాసుడు
దుర్గేశ్వర .


Read more...

కలిసేన నాపై " కత్తి"గట్టిందెందుకు ?

>> Wednesday, March 10, 2010





ఇక నా వంతు ప్రయత్నమేమి చేయాలి ? ఎవరుకొత్తగా చెప్పేదేమీ లేదు . ఆ అవసరం అసలే లేదు . కావలసినదంతా మహాత్ములు ఇచ్చే ఉన్నారు. దానినుపయోగించుకుని భౌతికంగా ఈలోకంలో భగవంతుని ఉనికిని మన జీవితయానం లో గమనించి ఆయనపట్ల శద్దను పెంచుకోవటమే . ఈ విపత్కర స్థితిలోను కలి ప్రభావం వలన సనాతనమైన ఈ ధార్మిక ప్రవాహాన్ని అనుసరిస్తూ, సాధారణమానవులను ఈ దివ్యప్రవాహం తో మమేకం చేస్తూ మహనీయులెందరో తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. కలి ప్రభావం వలన కాస్త కూస్త సాధనచేసి అల్పశక్తులను పొందిన కొంతమంది రకరకాల సిద్దాంతాలను జనం ముందుకు తెస్తూ గందరగోళ పరుస్తున్నారు.

ఒకాయన సాధనచేసి నువ్వు భగవంతుడవౌతావని అంటాడు. కృష్ణుడు ,రాముడు మానవమాత్రులేనంటాడు. వాల్లంతా సాధనతో దేవుల్లయ్యాడంటాడు. [కృష్ణుడు పసిపిల్లవానిగా పూతన ప్రాణాలు హరించినప్పుడు భగవంతుడే .కంసాది దానవులను నిర్మూలించినప్పుడు భగవతుడే .మహాభారత యుద్దభూమిలో విశ్వరూపాన్ని చూపినప్పుడూ భగవంతుడే. యన ఏ సాధనతోను భగవంతుడు గా గుర్తించబడలేదు.. అని సప్రమాణం గా భాగవతాదిగ్రంథాలు ,గీతాబోధ స్పష్టం గాచెప్పినా ఈయన తనకొలతలతో చిన్నగా చేయాలనే ప్రయత్నం,వ్యాఖ్యానాలు తమతమ ఆలోచనలతో వ్రాస్తుంటారు.] మరొకవైపు భగవద్భక్తులైన సద్గురువులు యథాతథంగా భగవంతుని మాటలను అంగీకరించాలని వివరిస్తున్నా ఇటు వంటి వారి కెక్కవు. మరికొందరు శిష్యులను హఠాత్తుగా శక్తి పాతాలతో నేరుగా భగవత్ సన్నిధికే పంపుతామంటారు. ఇంకొకరు కొత్తరకం యోగం ,ధ్యానం అంటారు . ఇలా ఆథ్యాత్మిక రంగం గందరగోళంగా కనిపిస్తున్నది బయటనుంచి చూసేవారికి .
ఈ లోపల కొత్తాదేవుడండీ ! అంటూ మరో బృందగానం మొదలవుతుంది . ఇక మహాభారత కాలంలో సాక్షాత్తు పరమాత్మకు సన్నిహితునిగా ఉన్న అర్జునుడు శివున్ని కొలచి నా వాల్లు ఏబేధం చూపక అనుగ్రహించిన వైనం చదివినా కొందరింకా ఆబేధాలను మరచిపోలేదు.. ఇక మానవాళిని అనుగ్రహించటమే ధ్యేయంగా భూమిపై పలుప్రాంతాలలో అక్కడ అవసరాన్ని బట్టి దత్తాంశతో జన్మించి మానవు లకు మోక్షమార్గాన్ని బోధించిన సద్గురువుల బోధలను, తమ తమ వ్యాఖ్యానాలతో మరుగు పరచి విస్తరణవాద సిద్దాంతాలుగా మలచి దానిని ప్రచారమ్ చేసి ఈధర్మం నుంచి జనాన్ని వేరు చేసే గుంపుదాడులు . మాసిద్దాంతాన్ని నమ్మకపోతే నరకటానికైనా సిద్దమనే పద్దతి ఒకటైతే.మిగతా మార్గాలలో భగవంతుని వైపు వెళ్ళేవాళ్లంతా పాపులు కనుక, మీ పాపము మాగుంపులో చేరితే పోతుంది. మావలెనే మానవులందరినీ మార్చాలనే సంకల్పంతో మీకోసం మేము శ్రమిస్తున్నాము కాబట్టి మీరు మీధర్మాన్ని విడచి మా గొర్రెపిల్లలవలే అగుడీ... అని రకరకాల వ్యూహాలతో ముంచుకొస్తున్న ముప్పొకటి. వీరందరినీ తట్టుకుని నిలబడి ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్న జనం,వారికి సనాతన ధర్మాన్ని వివరిస్తూ సాగుతున్న సత్ పురుషులు,సాధుపుంగవులు కలి సేన దాడులతో అల్లల్లాడుతున్నవైనం మనకు కనపడుతున్నది. ఈ తాకిడుతట్టుకుని మాహాత్ములు తమ దివ్యసంకల్పాలతో మానవజాతిని మోక్షమార్గం వైపు మళ్ళించే పని సాగిస్తూనే ఉన్నారు. వారిని ఎగతాళి చేసినా,అవమాన పరచినా అసలు పట్టించుకోకున్నాగాని వారి ప్రేమ భావతరంగాలు మనలను సన్మార్గం లో నడచేప్పుడు పడిపోకుండా చేయిపట్టుకుని నడుపుతూనే ఉన్నాయి. కాబట్టే భూమాత ఈ కలి ఆగడాలను ఇంతవేదనతోనైనా తట్టుకుని ఉన్నది. మన ప్రాచీన రుషులు నడచి బాగా నలగిన బాటే శ్రేయస్కరము తప్ప మరొకటి మానవాళికి మార్గము కాదు. వారు చెప్పని కొత్త సిద్దాంతాలు మనకవసరం లేదు .

ఉడుత భగవత్ కార్యానికి ఇసుకరాల్చి ధన్యమయిన చందంగా మనం మన ప్రయత్నం చేయాలి. మనుషులు పరుగుపందెం గా జీవితాన్ని మార్చుకుని ఉన్నారు .ఇన్ని ఆధునిక సౌకర్యాలొచ్చినా భగవంతుని సేవించే సమయం చాలక ఏదో మొక్కుబడిగా ,భయంతోనో ,భక్తితోనో ఆయనగూర్చి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతున్నది . మనసులో భగవంతుని పట్ల భక్తి ఉన్నా ఏదో ఒక సందర్భం ఉంటేగాని అభ్యాసపూర్వకంగా ప్రతిరోజూ దైవనామస్మరణ చేయరు. [అందరూ అనికాదు నా ఉద్దేశ్యం] ఎక్కువమంది స్థితి ఇలా ఔతున్నది. కాబట్టి ప్రతిరోజు ఏదో కొద్దిసేపైనా ఆభగవంతుని దివ్యనామాన్ని స్మరిస్తుంటే ఖర్మ ఫలాలు తొలగి జీవితం లో ఎదురయ్యే ఆటకాలను దాటగలుగుతారు. దానికోసమే సద్గురువులు అనేకమంది సత్సంగాలు భజనలు, పూజాదులు లోకంలో చేపిస్తున్నారు. ఆరీతిలోనే ఎలాగూ పీఠములో చేస్తున్న సేవను నా ఒక్కడికోసమే గాక పలువురికోసం పంచుకోవటం లో తప్పేముంది ?. కనుకనే అనుకోకుండా ఈ అంతర్జాలం లోకి ప్రవేసింపబడ్డ నేను ఇక్కడ నాతో పాటు కార్యక్రమాలలో పాల్పంచుకునేందుకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇక్కడ బాగా గమనించి చూడండి . నేనెప్పుడూ మీ కోసం నేనే సాధన చేస్తానని చెప్పలేదు. ఈకార్యక్రమంలో మీగోత్రనామాలతో ఇక్కడ పూజ జరపాలంటే ఆకార్యక్రమానికి అనుసంధానంగా పంపినవారు భగవన్నమమో ... మంత్రమో ,రోజూ..జపించాలని స్పష్టం చేస్తున్నాను. రోగి ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సెలైన్ ఎక్కిస్తాము .తరువాత ఆహారం తీసుకుని రోగిశక్తివంతుడు కావాలి . అదీ నా నమ్మకం .అలానే స్వయంగా భగవంతుని శరణువేడాలి ఎవరైనా .మిగతావారు చేసే సహాయం స్వల్పం మాత్రమే నని నా అభిప్రాయం. అయితే వీరబ్రహ్మేంద్ర ,రాఘవేంద్ర ,సాయి నాథులవంటి సద్గురువులు ఈ నియమానికి లోబడరు. వారు సమర్ధులు కనుక తమ అనుగ్రహం చేత ఏమైనా చేయగలరు. నేను చెప్పేది సాధారణ సాధకుల విషయం . నాకైతే అటువంటి శక్తి ఇసుమంతా కూడా లేదనేది సత్యం . కాబట్టి స్వయంగా మీరు ఈసాధన చేయండి ఈ పద్దతిలో అని చెబుతూ వివిధ సందర్భాలలో కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నాను .. ఇది నాతె లివితేటలతో చెబుతున్న విషయం కాదు . మహాత్ములు మహర్షులు మనకిచ్చిన మహా సంపద . ఫలానా నామాన్ని .లేదా ఫలానా మంత్రాన్ని ఇలా [సంఖ్యప్రధానం కాకపోయినా ఒక అభ్యాసం కోసం చెబుతుంటాము] జపించి చూడండి . మీసమస్య ఎలా మీరే పరిష్కరించుకోగలుగుతారో చూడండి అని చెబుతున్నాను. ఇదొక ఆథ్యాత్మిక ప్రయోగం ,ఫలితం పొందాకైనా వాళ్లు భగవంతుని పట్ల ద్విగుణీకృతప్రేమభావంతో భక్తిని పెంచుకుని ఆయనను సేవిస్తూ తమతమసాధనలను సాగిస్తారు. అందుకోసం నేను చేసే ఈపని వల్ల వాళ్ల పుణ్యం లో నాకూ కొద్దిగా భాగం వస్తుందికదా అన్న నాస్వార్ధం ఉండొచ్చు.
నేనెప్పుడూ ఈ కార్యక్రమాలకోసం మీరు డబ్బు ఇవ్వాలని అడగలేదు . ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ,పూజలు ఆ సందర్భంగా జరిగే అన్నదానములు చూసి తమంత తాముగా మాతరపున ఈకార్యక్రమం లో ఖర్చుచేయమని కోరినవారిని స్వయంగా మీరే వచ్చి ఆన్నదానమో మరొక కార్యక్రమానికో ఖర్చుపెట్టమని ఆహ్వానిస్తూ ఉంటాను. అలా రాలేని వాల్ల తరపున ఖర్చుపెట్టినా నయాపైసలతో సహా లెక్కరాసి ఉంచాను .అయినా ఈ రెండున్నర సంవత్సరాలలో ఓ ఇరవైమంది అలా ఖర్చుతాముభరించి కార్యక్రమాలకు తోడ్పడ్డారు అంతే . అందులో కొందరు ఇక్కడకొచ్చి స్వయంగా నిర్వహించారు. అయితే ఈకార్యక్రమాలు అత్యంతాశ్చర్యకరంగా అద్భుత ఫలితాలనిచ్చాయి .
ఖండాంతరాలలో నివాసముంటూ కష్ట సమయం లో తోడెవరూ లేరని బాధపడుతున్న ఒకరికి శివాభిషేకం చేసుకోండి అన్నాను . ఆయన సమస్య మబ్బులా విడిపోయిందన్నాడు. మరొకరు సంకటం లో హనుమంతుని స్తుతి మీరుచెప్పినవిధగా చేశాను నాసమస్యను స్వామి తొలగించాడని చెప్పారు. ఒకతల్లి ! తనబిడ్ద అమెరికాలో ఆరునెలలుగా ఉద్యోగయత్నాలు ఫలించక బాధపడుతున్నాడని ఆవేదనతో అడిగితే , అమ్మా! ఈబాధ మనం మనం పంచుకుంటే లాభమేముంది ? ఆ బాధేదో ఆయనముందు వ్యక్తం చేయి అని, ఇలాంటి కష్టసమయం లో ఏమిచేయమని పెద్దలు చెప్పారో దాన్నే ఇక్కడ ఆతల్లిని ,అక్కడ ఆ అబ్బాయిని చెయ్యమని చెప్పాను . చిత్రంగా హనుమత్ రక్షాయాగం జరుగుతున్నప్పుడు నలభై రోజులదీక్షతో అతనుసాధనచేస్తూ ముప్పై తొమ్మిదో రోజు కూడా ఇంకా ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేయగా నేను స్వామి ని నమ్మావు ఇంకా నలభైఎనిమిది గంటల సమయమున్నదికదా అని ఓదార్చాను. నిజ్జంగా నలభై రోజులు పూర్తయ్యేసరికి అప్పటిదాకా అతని నిరీక్షణ కు ఫలితానిచ్చాడు పవనసుతుడు. అతను అతని తమ్మున్ని పంపి మొన్న కార్తీకమాసం లో అన్నదానం పంచాక్షరీ జపహోమం జరిపించాడు . మద్రాసునుంచి వచ్చిన ఆ అబ్బాయి దీపమాలికతో నిర్మించిన శివలింగం ఫోటోలు తీస్తుండగా ఆదీపాలమీదనుంచి జ్యోతిప్రవాహం వస్తున్న ఫోటో కనపడి మమ్మల్ని ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేయటమే కాక మా భక్తిశ్రద్దలను మరింతగా పెంచింది .ఆఫోటో పైన స్లైడ్ షో లో ఉంది చూడండి . చదువులలో ధిట్ట అయిన ఓ విద్యార్ధి ఏడుసంవత్సరాలుగా తనను వేధిస్తున్న తలనొప్పి నుండి నలభైరోజుల హనుమత్ రక్షాయాగం లో చాలీసా పఠనం వలన విముక్తికలిగిందని సంతోషంగా ఉన్నాడు. తన ఉన్నతవిద్యాభ్యాసం కున్న ఆటంకాలు లలితా పారాయణం ద్వారా తొలగిపోయాయని ఓ సోదరి చెప్పింది . విష్ణు సహస్రనామ పారాయణం నారాయణయాగం తో మరికొందరు తమ ఇబ్బందులు తొలగించుకున్నామని చెప్పారు. ఇలా ఇంక కొంతమంది కూడా .ఇక్కడ పైన చెప్పిన క్రియలన్నీ నా స్వంత తెలివితేటలతోనో నేను కనిపెట్టినవేమీ కాదు. తరతరాలుగా మనకు వారసత్వ సంపదగా వస్తున్న మహానిధులే . సాధన వారిది . ఫలితమిచ్చిన వాడు దయామయుడైన భగవంతుడు. ఇక్కడ నేను నాకు తెలిసిన దానిని చెప్పటం వరకు మాత్రమే సహాయ పడ్డాను. బాగా చదివితే కలెక్టర్ వు అవుతావని ఎవరైనా చెప్పొచ్చు . కాని సాధించిన వానిది, కరుణించిన వానిదే ఫలితమంతా . అలాగే చుట్టుపక్కల పల్లెలలో పట్టణాలలో అక్కడ స్థానిక దేవాలయాలలో జరిపిన కార్యక్రమలు ఒక్కక్కచోట ఒక్కో సత్ఫలితాలనిచ్చాయి . ఫాక్షన్ గ్రామంగా పేరుబడ్ద వి .అప్పాపురం లో జరిపిన హనుమదభిషేకాలు విబేధాలుబాపి ఊరికి మేలు జరిగేలా ఫలించాయి. కొన్నిచోట్లదేవాలయాలు ఆగిపోయినవి పూర్తయ్యాయి . ఇక విద్యార్థులకోసం మేము జరుపుతున్న పూజలతో విద్యార్ధులలో నెలకొన్న అనవసర భయాలు తొలగిపోయి వారిలో ఆత్మ విశ్వాసాని స్వామి మా వెంటవున్నాడనే నమ్మకాన్ని పెంచి విజయాలు సాధించేందుకు తోడ్పడుతున్నాయి. ఇక్కడైనా మేము సోమరిపోతులకు స్వామి అనుగ్రహం లభించదు శ్రమించాలని అటువంటి వారికే ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నాము.వారికి వచ్చిన సత్ఫలితాలతో నమ్మకంకుదిరితే హనుమంతునిలా సద్గుణాలతో జీవించాలని మద్యపాన ధూమపానాదులు స్వామికి ఇష్టముండవని తప్పుడుపనులకు పాల్పడకుండా జీవించాలని బోధిస్తున్నాము.నమ్మి ఆశ్రయించిన పిల్లలు ఫలితాలు చెబుతుంటే స్వామి కరుణకు మేము పులకించిపోతున్నాము . అయితే ఎక్కడా పిల్లలను కాని ,పెద్దలను గాని మీరు ఇప్పటివరకు ఆచరిస్తున్న ధర్మాలు తప్పనిగాని, అవివదిలేయమనిగాని ఎక్కడా చెప్పలేదు..


ఇక ఒక్కోసారి ఒక్కో రూపంతోఈ పూజలేమిటి ?ఏం సీజనుకొక దైవమా అని ఎగతాళి చేసడొకాయన. ఇక్కడ చిన్నవిషయం గమనించాలి .కరెంట్ అనే ఒకేశక్తి అనేక పనులను జరుపుతుంది ,ఫాన్ తిప్పగలదు,ఫ్రిడ్జ్ లో శీతలీకరించగలదు,పొయ్యిలో మండించగలదు .ఇలా అనేక పనులుచేయగలదు. మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా నానమ్మకు కోడలుగా బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే. బహురూపాలుగా వ్యక్తమవుతున్నది ఒకే పరమాత్మ అన్న గమనిక ఈసనాతనధర్మంలో ప్రతి సాధారణ మనిషికి ఉంది . కనుకనే ఏ రూపంలో భగవంతుడున్నా అంగీకరించే జ్ఞానవంతమైన జాతిగా మిగిలింది. సహనంతో పరులను అక్కున చేర్చుకుంటున్నది ఆదరిస్తున్నది .ఈ గడ్డపై ప్రతిబిడ్డా ఈ భావాన్ని ఉగ్గుపాలతో నేర్చుకుంటుంది. కనుక వివిధరూపాలు వివిధ ఆరాధనారీతులన్నీ ఒకటేననే నమ్మిక మాకందరకూ ఉంది .అదే ఈ జాతి దైవీభావాలతో వర్ధిల్లటానికి కారణం .


ఇక్కడ నేను ఎవరికీ గురువును కాను ,ఆ పదానికి అర్హత నాకులేదు అనేది స్పష్టం . అందుకే నేను ఇక్కడ ప్రవేశించిన మొదట్లోనే అందరికీ మనవిచేసాను నన్ను గురువుగారు అనిపిలవద్దు అని. అది కొద్దిమంది మహాత్ములపట్లమాత్రమే వాడదగ్గపదం అని . దీనిపై వ్రాసిన పోస్ట్ ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2008/11/blog-post_8411.html

భగవంతుని పేరుతో జరిగే మోసాలకు ,అనాచారాలకు నేను వ్యతిరేకం అనేది నా పాతపోస్ట్ లు చదివినవారికి తెలుసు. వీధివీధికొకరు తామే దేవుళ్లమని ప్రకటించుకునేవారు పుట్టుకొస్తారని కాలజ్ఞానం లో తాతగారు చెప్పినట్లుగానే ప్రస్తుత కాలంలో కొత్తాదేవుడండీ ! అని పాటలుపాడే గుంపులను నేనెప్పుడూ అంగీకరించను.
అటువంటి ప్రమాదం లో ఇరుక్కున్న మా బధువొకాయనను ఎలా బయటపడేశామో ఇక్కడ చూడండి.

http://durgeswara.blogspot.com/2008/10/blog-post_21.html

నిన్నొక పెద్దాయన అడిగాడు .నువ్వేమన్నా ఈధర్మానికి రక్షకుడవా ? నువ్వు ప్రయత్నించకపోతే ఈధర్మం ఏమైనా నశించి పోతుందా? అని తిడుతూ వ్రాసాడు. అందుకు నాసమాధానమిదిగో.
అయ్యా ! నేనంత మూర్ఖున్ని కాను, అంత ఒల్లుబలిసి మాటలు మాట్లాడటానికి . నేనెంత ? నాబ్రతుకెంత ? . భగవత్ స్రుష్టియగు ధర్మం ఆధారంగా జన్మించి జీవిస్తున్నాము . ధర్మం సనాతనం . మనిషి సూర్యున్ని సృష్టించాను ,రక్షించానంటే వాడు మూర్ఖుడో ,పిచ్చివాడో అయ్యుండాలి . ఇక ఒక సమాజంలో రక్షణకోసం ఒక వ్యవస్థ ఉంటుంది. అయినంతమాత్రాన రక్షణ అనేది దానిపని కదా అని ఊరుకోక ,ఏ అర్ధరాత్రో ఎవడో ఒక దొంగవెధవ మనకల్లబడితే దొంగ ..దొంగ అని అరుస్తాము కదా .అందులో తప్పులేదుకదా . అలాగే ఇసుకరేణువులు రాల్పినంత మాత్రాన ఉడత వారధికట్టగలుగుతుందా . ఏ పూర్వపుణ్యమో ఈధర్మంలో జన్మించినందుకు నావంతు ధర్మావలంబనలో ఉన్నాను. భజనచేసే భక్తబృందంలో నా గొంతుకూడా కలుపుతున్నాను . తప్పుకాదు కదా !


ఇక నువ్వు చెప్పేది నిజమా , మిగతా ధర్మాలు అవలంభించేవారు అవి వదలి రావాలా ? నీది మతోన్మాదం కాదా ? అన్నారాయన

స్వామీ ! నేను చెప్పేపద్దతిలో భగవంతుని కృపను పొందవచ్చు అనటం లో తప్పులేదు .నేను చెప్పినపద్దతి మాత్రమే సరైనది అనేది మూర్ఖత్వం . లోకంలో ఉన్న ఇతర మతాలను ప్రతిపాదించిన వారెవరూ పరాయివారు కారే ? వాల్లంతా దత్తావతారాలైన సద్గురువులని నేను పూర్తిగా నమ్మి ఉన్నాను. వారినవమానించే స్థితికి దిగజారలేదునేను. ఆవిషయమ్ భవిష్యపురాణం వివరిస్తున్నది. ఆయాప్రాంతాలలోని మానవాళిని ఉద్ధరించటానికి ఆ సద్గురువులెలా అవతరిస్తారో ! ఏమి చేస్తారో అని.. కానీ వారిపేరుతో ప్రపంచం లో భగవంతుడు మాకు తెలిసిన మార్గం లో తప్ప మిగతామార్గాలలో కనపడడు . అలా ప్రయత్నించేవారు పాపులు .వారిని మార్చాలి,లేక నశీంపజేయాలనే వాదాలను ,ప్రచారాలను ఖచ్చితంగా నిరసిస్తాను. కనుకనే నాకు అని మతాలలో స్నేహితులున్నారు. వారెవరినీ నేనుచేసే కార్యక్రమాలలో బలవంతంగా పాల్గొనమనిగాని, మీమతం మార్చుకొమ్మనిగాని ఏరోజు చెప్పలేదు. కాబట్టే వాల్లు నాకింకా స్నేహితులుగానే ఉన్నారు.అలా అనుమానంతో నన్ను ధూషించిన వారితో నాసమాధానం తరువాత వాల్లు తమ తప్పుతెలుసుకున్నవైనం ఈక్రింది పోస్టుల వ్యాఖ్యలలో చూడండి.

http://durgeswara.blogspot.com/2008/11/blog-post_6830.html

http://durgeswara.blogspot.com/2008/11/blog-post_12.html


నియమానుసారంగా రోజు నమాజ్ చేసే ఆస్థికులను, పగలల్లా పనిపాటలు చేసుకుని సాయంత్రం అర్ధరాత్రి వరకు ప్రార్ధనలు చేసుకునే భక్తులువారి ధర్మనిష్ఠకు నేనెప్పుడూ ముగ్దుడనవుతుంటాను.
గుంటూరు మస్తానయ్య దర్గా దగ్గర నేను ధ్యానం చేసుకుంటుంటే పక్కనే నమాజ్ చేసుకుంటున్న వారు నాసోదరులుగానే భావనవస్తుందిగాని వేరుగాదు. అల్లామాలిక్ అని స్మరించే సాయి మాకు సద్గురువే. వచ్చిన చిక్కల్లా ఆ మహాత్ములు చూపిన బాటనకాక ఈసనాతన ధర్మాన్ని పతనం చేయాలని యత్నిస్తున్న నికృష్ఠబుద్దులతోనే.
నీతండ్రిని నువ్వుప్రేమించు ,నాతండ్రిని నేనుప్రేమిస్తాను. మనిద్దరం వారిద్దరిని గౌరవిద్దాము .అనేది ఈ సనాతన ధర్మం ఈధర్మాన్ననుసరిస్తున్నవారందరికీ నేర్పిన నీతి. నేను నాతండ్రినిని ప్రేమిస్తాను,నువ్వు నాతండ్రిని గౌరవించు మనిద్దరంకలసి నీతండ్రిని లేకుండా చేద్దాం అన్నది ప్రస్తుతం కలిసేన సిద్ధాంతం. కనుక నేను నాధర్మాన్ని అచరిస్తాను . మిగతా మత ధర్మాలను గౌరవిస్తాను . ఏది లోకానికి శ్రేయోదాయకమో విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం.

ఇలా ఇంటర్ నెట్లో పూజలు ప్రచారాలేమిటి? ఇదొక మోసం జాగ్రత్త అని విమర్శలొస్తున్నాయి. ఇంటర్నెట్ ను ఈ సనాతనధర్మాన్ని విమర్శించేవాల్లకు మాత్రమే పరిమితం చేశారేమో నాకు తెలియదు .లేక గుత్తకుతీసుకున్నారో నాకు ఎవరూ చెప్పలేదు. సామూహికంగా నమాజులు, ప్రార్ధనలు పూజలుచేసుకుని భగవంతుని ప్రార్ధిస్తున్నారు లోకంలో . తమ భావాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, టీవీలు .అలాగే ఇతరప్రసారసాధనాలద్వారా ఇతరులకు తెలుపుకుంటున్నారు. సామూహికంగా జరిపే ప్రార్ధనలకు పెద్దఎత్తున జనాన్ని తరలిస్తున్నారు .ఈ అంతర్జాలంలో లెక్కలేనన్ని ఇతర మతాలకు చెందిన మతసంబంధమయిన సైట్లున్నాయి. ఆయా మతబోధకులు తాము చేసే ప్రార్ధనలకు ఆహ్వానిస్తూ తమ సైట్లలో వివరాలుంచారు. ఇప్పుడు సనాతనమైన ఈ ధర్మం అవలంబిస్తున్నానుగనుక నేను ఇక్కడ నాభావాలను వెల్లడించకూడదా ? పోనీ నానుంచి ఎవరు మోసపోయారు? నేను ఒక్కనెలకు సంపాదించే నాజీతమంతా ఇస్తాను ఎవరైనా రహస్యంగా వచ్చి నాగూర్చి విచారణ జరిపి నిర్ధారించి అప్పుడు నాపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించండి . నేను చేసే పని ని ప్రోత్సహించే వారంతా మూర్ఖులుగా జమకట్టి నోరు అదుపులేకుండ పేలుతున్నవారు ,తాము ఏపాటి జ్ఞానులో, వీల్లతో చదువులోనో మరేదన్నా నిర్ధారణ పరీక్షలోనో పోటీపడి నిరూపిచుకుంటామంటే నేను వీల్లందరినీ ఒప్పిస్తాను . ఇక ఈదేశం లో హేతువాదులుగా చలామని అయ్యే వాల్లంతా రహస్యంగా నిధులుపొందేది ,పనిచెసేది , అదీ! ఎవరిని కించపరచాలని పనిచేసేది అందరికీ తెలిసినదే. ఇప్పుడు నాపై కత్తిగట్టి నేను మోసాలు చేస్తున్నానని ,ఇతరులను వేధిస్తున్నానని అభాండాలతో దౌర్భాగ్యపు ప్రచారానికి దిగినవారు వాటిని సప్రమాణంగా నిరూపిస్తే నేనిక్కడ నుండి నిష్క్రమించటానికి సిద్దం. అసలు ఇప్పుడు నేనెందుకిక్కడ టార్గెట్ అయ్యాను వీళ్లకు? . నేను ఇంటర్నెట్లో ప్రవేసించిన మొదటిలోనే నాపై దాడులు చేసారు మానసికంగా నన్ను చికాకు పరచాలని . అంతకు మునుపు ఈ ధర్మానికి సంబంధించిన ఎవరు బ్లాగుల్లోకొచ్చినా వారిని హేలనచేసి వివిధ వ్యాఖ్యానాలతో చికాకుపరచి తమంత తాముగా బ్లాగులు మూసుకునేట్లు చేసినచరిత్రవుంది వీరికి ఎవరొ ఒకరిద్దరు అప్పటిదాకా మొండిగా పోరాడుతుండేవారు వీల్లకు సమాధానమిస్తూ . ఈసనాతన ధర్మాన్ని రెండునాలకలధోరణితో విమర్శిస్తూ సాధారణ ధర్మావలంబులకు ఈధర్మం పట్ల అపనమ్మకం ,చులకన భావన కలగజేయటం వీల్ల లక్ష్యం . నాపై దాడి ఫలించలేదు . ఎందరో మేధావులైన ఆస్తిక మితృలు , తల్లులు ,నన్ను తమకుటుంబసభ్యునిగా అభిమానించి అదరిస్తున్నారు. యువత నన్ను మాస్టారూ అని గౌరవించి తమ సమస్యలగూర్చి సలహాలడుగుతూ గౌరవిస్తున్నారు పెద్దలు ఆశీర్వదించి నన్ను ప్రోత్సహిస్తున్నారు. దానికి తోడు సనాతన ధర్మావలంబులైన బ్లాగర్ల సంఖ్యపెరిగి ధార్మిక విషయాలపట్ల చర్చలు పెరిగాయి . ఇది కలిసేనకు కంటగింపు . భగవన్నామముగాని ,తత్సంబంధిత క్రియలుగాని ఏమాత్రం సహించలేని కలి సేన అన్నిరంగాలలో ధర్మం మీద విరుకుపడుతున్నట్లే ఇక్కడా తమ దాడి జరుపుతున్నది . ఈ ఉడతూపులకు భయపడి పారిపోయే పిరికితనం లేదిక్కడెవరికీ . మేము సర్వసంగ పరిత్యాగులము గాము ,భగవంతుని ఆశ్రయించి సంసారరణరంగం లో శస్త్రధారులమై నిలబడ్దయోధులము .

పైకి ఇది నాపై జరుగుతున్న దాడి అనిపిస్తున్నప్పటికీ వాస్తవమేమిటో గుర్తించండి .
[నాగూర్చి నేను ఇంత వివరంగా వివరించ గలిగే అవకాశం కల్పించిన వారికి ధన్యవాదములు .]


భగవత్సేవలో నాప్రయాణం ఏనాడు పక్కదారి పట్టకుండా కాపాడమని ఆ పవనసుతుని కోరుతూ .........





Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP