దైవాన్ని ,ధర్మాని విమర్శించేప్పుడు తేలికే ,ఫలితం అనిభవించేప్పుడు గాని తెలియదు ,ఎంతఘోరంగా వుంటుందో?
>> Friday, June 26, 2009
దైవాన్ని ,ధర్మాని విమర్శించేప్పుడు తేలికే ,ఫలితం అనిభవించేప్పుడు గాని తెలియదు ,ఎంతఘోరంగా వుంటుందో?
నేను ఈ వివాదం లోకి రావటం సముచితం కాదని మిత్రులు కొందరు సూచించారు . నేనిప్పటివరకు ఇటువైపు రాలేదు ,నాకు చేతనైన సహాయం చేయగలిగితే చెయటమేగాని. ఈరోజు తురీయం అనే బ్లాగులో నన్ను ప్రస్తావిస్తూ కత్తి మహేష్ గారు ఒక కామెంట్ వ్రాయటం తో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రతి వ్యక్తికీ తన తన సంచిత ప్రారబ్ద ,ఆగామి కర్మలననుసరించి కొంత సుఖం,సంపద ,సంతోషాలు ప్రాప్తిస్తాయి. చెడుఖర్మలవలన లభించే కష్టాలు,దు:ఖాలు కూడా తప్పనిసరి అప్పులే. ఇక చేసే కర్మలు మంచివయితే అదనంగా శుభాలు జమపడుతూవుంటాయి. అలాగే చెసే చెడు ఖర్మలవలనా అప్పులు పేరుకు పోతుంటాయి. తనకు వచ్చిన శుభాలు ,సంపదలు సంతోషాలు ఎలావచ్చాయో తెలిసినా తెలియకున్నా వివేకవంతుడు భగవంతుని పట్ల ధర్మము పట్ల సాటి జీవరాశి పట్ల వినయాన్ని ,గౌరవాన్ని కలిగి వుంటాడు. ఇక మాయ కు లోనైన జీవి ఇదంతా తన స్వయంకృషి తోనే సాధించాననే భ్రమలో వుండి తనమనస్సు చెసే మాయలకు లోబడి అహంకార పూరితుడవుతాడు. విదురనీతి లో కూడా ఒక పద్యం లో ఈవిషయాన్ని చెబుతాడు . సంపద, కులము,విద్య,ధనము పదవి .సాత్వికునికి వినయాన్ని వివేకాన్ని తెస్తే ,దుర్మార్గుడికి అహంకారాన్ని గర్వాన్ని తెచ్చి పెడ్తాయని.
ఒక పక్క వాని పుణ్యసంచయనం వలన లభించిన సుఖాలనే సంపద ఖర్చయి పోతూవుంటుంది. అప్పటిదాకా తీర్చాల్సిన అప్పు వున్నది కదా అది సమయం చూసుకుని వసూలు చేయటానికి సిద్ధంగావుంటుంది. దాని ప్రభావం వలన అహంకార పూరితుడైన మానవుడు ,కన్నూమిన్నూ గానక భగవంతుని ,ధర్మాన్ని విమర్శిస్తూ పాపపు రాశి పెంచుకుంటాడు. అది పెరిగి పెరిగి పెద్దదై తన పుణ్యఫలము ఖర్చైపోయిన క్షణం నుంచి మొదలవుతాయి .దు:ఖాలు. వాటిని అనుభవం లో భరించలేక విలవిలలాడుతుంటాడు. శుభాలన్నీ తనవల్లనే సంపాదించుకున్నానని నమ్మే మనిషి కష్టాలను కూడా తానే కొనితెచ్చుకున్నానని అగీకరించడు. అహంకారం తో దైవ దూషణ ధర్మ ధూషణ,సాధు దూషణ ,ఇతరుల మనసు నొప్పింఛే పనులు వీటివలన వచ్చే ఫలితాలు అనుభవించే నాడు విలవిల లాడుతూ మూర్ఖం తో పరనింద చేస్తూ పాపాన్ని ఇంకా పెంచుకుంటాడు. అప్పుడైనా ఏ పుణ్యఫలము తోనో భగవంతుని ప్రేమకు పాతృడైతే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. తన ఖర్మ ఫలితాన్ని అనుభవించి అప్పుతీర్చుకుంటాడు.ఆయన కరుణ వుంటె రక్షింపబడతాడు కూడా .
ఇక అది తెలియని వాడు తన కష్టాలకు వేరెవరో కారణమని ఇంకా దౌర్భాగ్యపు పనులకు పాల్పడుతూ పతనం చెందుతుంటాడు.మరలమరలా నీఛ జన్మల నెత్తుతూ ఫలితాన్ని అనుభవిస్తుంటాడు.
ఇందులో కొన్ని ఫలితాలు సత్వరంగా కనిపిస్తే ,మరికొన్ని కాయపండి రాలి నట్లు ఆలస్యంగా అనుభవం లోకొస్తాయి.
నేను ప్రత్యక్షం గా చూసిన మూడు సంఘటనలను మీకు మనవి చేస్తాను.
మావూరిలో వెంకట రెడ్డి అనే అతను వున్నాడు .నాచిన్నతనం లో అంటె పదేళ్లలోపు లో అతను నిండుయవ్వనం ,మదగర్వం తో వున్నాడు రాములవారి మేడదగ్గర ఏదో సంభాషణ వాదనగా మారి పెద్దలతో దేవుడా గీవుడా ..ఎక్కడ నా ...... లో దేవుడు .అని బూతులు మాట్లాడుతూఏదీ ఏమిచేస్తాడో చూపించమని గర్వంగా మీసం మెలేసాడు. అక్కడ పెద్దవాల్లు కొందరు మౌనంగావుండగా మరికొందరు ఏదో అన్నారు. నేను ఇంటి్ లో కొచ్చి అడిగాను అమ్మా ! వెంకటరెడ్డి మామ దేవుడ్ని తిట్టాడుకదా ! దేవుడ్నితిడితే కల్లు పోతాయంటారు కదా ? మరి ఆయనకి కల్లు పోలేదే?అని .దేవుడన్నీ చూస్తాడురా అని సమాధానం మాపెద్దలు చెప్పినా నాకంతగా అర్ధం కాలేదు. దేవుడ్ని తిడితే వెంకటరెడ్డిమామకు కల్లు పోలేదెందుకని ?అలాప్రశ్న మిగిలి పోయింది. పాతికేళ్ళతరువాత అప్పుడు చూపించింది సమాధానం ప్రకృతి . ఆయన పెద్దవాడయ్యాడు. ఈమధ్య ఆయన నాలుకకు ఏదో గడ్డలాగా లేస్తే అనేక రకాల వైద్యాలు చేసి తగ్గక ఆబాధభరించలేక విలవిల లాడి పోయేవాడు. చివరకు గుంటూరు లో డాక్టర్లు అది కేన్సర్ గడ్డగా గుర్తించి ఏ నాలుకతో నైతే భగవద్దూషణ చేసాడో ఆనాలుకను కోసి చికిత్స చేశారు. ఇప్పుడు మాట్లాడలేడు . కాని యవ్వనం లో గుడివైపు చూడనివాడు .ఎప్పుడన్నా రాములవారి మేడలో భజన జరుగుతుంటె వచ్చి బయటె నిలబడి మౌనంగా వింటుంటాడు.
ఇక మావూరిలో నా సహవయస్కుడొకడున్నాడు .వానికి నామీద చిన్నతనం లో ఆటలనుండి కోపం ఎందుకో తెలియదు. నావయస్సు వారిలో నాకొక్కనికే వుద్యోగం వచ్చినది. అదొక అసూయ . తిరుణాల్లలో డాన్సులకు చందాలు వసూలు చేస్తుంటె నేనివ్వను ,అది దైవాని కి ఏమాత్రం ఇష్టం కాని పని అని వాదించాను. ఆసందర్భంగా వాడు నాతో నీవొక్కడివే పెద్దభక్తునివా అని వాదన వేసుకున్నాడు. ఆమంటతో ఒకసారి రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న కోటి చాలీసా కార్యక్రమము గూర్చి నేను బజారు లో నిలబడి కొందరి తోమాట్లాడుతూ వారికి కార్డులు ఇస్తున్నసమయం లో వచ్చి తగాదా వేసుకున్నాడు. తిరుణాళ్ళకు చందాఇవ్వమంటె ఇవ్వవు ,చాలీసా బోడి........ బూతులు మాట్ళాడుతూ వాడీష్టమొచ్చినట్లు మాట్లాడాడు. పక్కనున్నవారు ఆగుఆగు అని వారిస్తున్నా వినకుండా ఆరోజు వాడిమనసులో కసి తీరా నన్ను తిట్టాలనుకుని భగవంతుని తిట్టాడు ఆవేశం తో .అప్పటివరకు వాడు పాలకేంద్రం ,మిగతావ్యాపకాలతో బాగా సంపాదిస్తున్నాడు. నీకిష్టమైతే చేయి లేకుంటే లేదు అంతేగాని మాటలెందుకురా అని నేను అక్కడనుండి వచ్చేశాను. తరువాత నెల రోజులకు వినుకొండనుంచి వస్తుంటే మోటర్ బైక్ పడి ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయి . మొన్న వీడు అనవసరంగా భగవంతుని తిట్టాడు ,అందుకే అని కొందరన్నా నేను వారించాను తప్పు కష్టాలలో వున్నవాన్ని అలా బాధించకూడదు అని. ఆతరువాత వానికి మండు అలవాటయింది, దానికి తోడు పరస్త్రీ వ్యామోహం ,వీటితో సంపద నశించింది. కుతుంబము లో కలతలు ,అప్పులు నాలు గేళ్ళలో దిగజారి పోయిం<ది స్థితి .బాగు పడతాడని అయ్యప్పమాల వేస్తే మాల లోనే తాగి దరిద్రం పట్టించుకున్నాడు. చివరకు భార్యకూడా వదలి వెళతాననే పరిస్థితి. చావాలనే ప్రయత్నం కూడా. కూడా .ఏదో ఆ అమ్మాయి పుణ్యం వలన మరలా మాల వేపించినతరువాత కొద్దిగా కోలుకున్నాడు. ఆతరువాత ఇక్కడ పీఠము లో అన్నదానం జరుగుతుంటె వచ్చి దుర్గా ! ఒక్కరోజు నాతరపున స్వాములకు అన్నదానం చేయనివ్వు ,నాదగ్గర కొద్దిగా డబ్బుమాత్రమే వున్నది సరి పుచ్చవా అని అడిగాడు. దాని దేముందిరా నీకు దీనివలన మంచి జరుగుతుందని నమ్మితే అలాగే చేద్దాము అని అతని చేత అన్నదానం చేపించానొక రోజు. ఆతరువాత పరిశ్థితి క్రమేపీ కోలుకుని ఇప్పుడు బాగుంది అతని స్థితి .చక్కగా పూజా పునస్కారాలు చేసుకుంటూ ఇంతకుముందు కొంగరి మాటలు తగ్గి అందరితో మర్యాదగా వుండటం నేర్చుకున్నాడు.
ఇక వుద్యోగం లో నాతో పాటు చేరిన విజయకుమార్ అనే మిత్రుడొకాయన వున్నాడు.నన్ను బావా ,బావా అని పిలుస్తాడు. కిరిస్తానీ. ఆయన నాతో స్నేహంగానేవుంటడు కానీ హిందూ మతమన్నా ఈ ఆచారాలన్నా మంట. సందొస్తే చాలు నన్ను నా ఆచారాలను విమర్శిస్తుంటాడు. మా నాయనమ్మ వాల్లు కూడా ఇలా పూజలు పునస్కారాలు చేసి .......... అనవసరం ఈపిచ్చిపనులు ఇలా వుంటాయి ఈవ్యాఖ్యలు. ఏమిటీ రాయిరప్పనీ పూజించటం ,స్నానం చేయకుండా వండితే నువ్వు తినవా ? ఇలా అతని మనసులో ద్వేషాన్ని వెల్లగక్కుతుంటాడు, నేనెన్ని విధాలుగా వివరించాలని ప్రయత్నించినా అవన్నీ ట్రాష్ అంటాడు. చూడు విజయకుమార్ ! నీవు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించు .రోజుకు పదిసార్లు ప్రేయర్ చేయి .తప్పులేదు అది నీకు మంచిది . కానీ నీకు తెలియని విషయాలను గూర్చి ఇతర మతాలను గూర్చి ,తప్పుగా మాట్లాడకు అది చెరుపు చేస్తుంది అనీ హెచ్చరి
ంచేవాడిని. కానీ అతని పరమత విద్వేషం దాచుకోలేడు. మా బైబిల్ చదువు ,నీపూజలు మానుకుని ఇది అచరించి చూడు అని బోధించటం ఎక్కువైంది. మీతో ఇదేతంటా ! పరాయి మతానికి మారగనే మనుషులు దేవుడిని నమ్మటమేమోగాని హిందూ ద్వేషులుగా ,ఈదేశానికి చెందనివారిగా భావిస్తారా? అసలు చర్చిలలో మీకు భవత్ సాధనలు నేర్పుతారా ? లేక ఇతరులను ధూషించటం నేర్పుతారా? నాకు తెలిసిన ధర్మం లో దోషాలేమీ లేవు నేనామార్గం లో చక్కగా సాగుతాను నీబోధలు ఆపు అని కసురు కునేవాడిని. మీరు మూర్ఖులు ! సత్యం తెలియదని మాట్లాడేవాడు. అయితే అతను ఇతరులకు సహాయపడటం లోను స్నేహం లో వ్యక్తిగతంగా మంచివాడవటమ్ వలన నేను స్నేహం వదులుకోలేక పోయేవాడిని మాయింటి కొచ్చి మా ఆవిడను అక్కా ! అని పిలిచి అన్నీ అడిగి వడ్డించుకుని తినేవాడు స్వతంత్రంగా. సమాజం లో మమ్మలను ఇలా తక్కువ చెశారు అలాచేశారు అని ప్రశ్నిస్తే , నేము చెప్పేవాడిని , ఇవి సామాజికంగా మనుషులు ఏర్పరచుకున్న అసమానతలు వాటిని మనుషులే దిద్దు కోవాలి.అనాదిగా మహాత్ములెందరో ఆప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అమెరికాలో పుట్టుకతో క్రిష్టియన్లైనా నల్లవారిని తక్కువగనే చూస్తారు. ఆ అసమానతలు బాపటానికే మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు పోరాడినది.కానీ వారు మతం మార్చుకోలేదు. అలా పోరాడటం మనహక్కు ,మనమే పరిష్కరించుకోవాలి.అంతే గాని దానిని దేవునికి మతానికి ఆపాదించి ధర్మ ద్వేషులుగా మారిపోవాలా? తద్వారా మనవారి పట్లనే అంతర్గతం గా శతృత్వం పెంచుకుని దైవనిందచేస్తూ పాపం రాశి పోసుకోరాదు అని వివరించేవాడిని .కానీ వాల్లకు నరనరాల్లో ఎక్కించిన హిందూద్వేషం నుంచి బయట పడలేక పోయేవాడు. నేను హెచ్చరిస్తున్నా వినకుండా దైవధూషణ చేసేవాడు కొద్దిగా వాదనయ్యేది. ఆతరువాత మామూలు మాటలలో కలసి పోయేవాడు.ఇది చాలాపాపం నీకు ప్రమాదమని హెచ్చరించినా వినేవాడు కాదు నేనే ఆ వాదన తుంచేవాడిని.
భార్యభర్తలిరువురూ ఉద్యోగులు ఇద్దరు పాపలు .ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్ వాల్లకు క్లాసులు చెప్పి అదనంగా సంపాదిస్తాడు. స్థలాలు బంగారమ్ కొన్నాడు . అతని దైవధూషణాఫలితం ప్రభావం చూపించటం ప్రారంభించినది. అనుకోకుండా అతని చెల్లెలిని వాల్ల బావగారే హత్య చేయటం ,ఆషాక్ నుంచి తేరు కోకముందే భార్యా భర్తావిబేధాలు . మీ అమ్మగారిని మనైంటికి తీసుకు రావద్దని ఆంక్షలు. ట్రాన్స్ఫర్ల సమయం లో విబేధాలొచ్చి గొడవజరిగితే నేనే సర్ది చెప్పి అతను ఆఅమ్మాయి కోరుకున్న విధం గానే వాల్ల అత్తగారి ఊరికే కోరుకునేట్లు ఒప్పించాను. ఆమధ్య ఫోన్ చేసి నువ్వు నామాట వినకుండా ఇక్కడకు పొమ్మని ఆరోజు సర్ది చెప్పావు, నా బాధ ఏమని చెప్పుకోను ఇక్కడ మా అత్తగారు ,భార్యనుంచి నరకం చూస్తున్నాను,నా చావు కబురు వింటావుఅని ఫోన్ లో బాధపడుతున్నాడు.ఏంతక్కువచేసానని నాకీ నరకం అందరికంటె ఎక్కువగానే సంపాదిస్తున్నాను. అడిగనివన్నీ చేపించాను ,నేను తాగు బోతునో తిరుగుబోతునో కాదు నాసంగతి నీకు తెలుసుకదా ? ఎందుకు నాకీ బాధ అని వాపోతున్నాడు. బాధలో వున్నవాడితో నీవు చేసుకున్న దైవదూషనే అని చెప్పలేనుకదా ? రెండేళ్ళు నరకం అనుభవించాడు .వాల్ల అత్తగారి తరపువారితో తన్నులు కూడా తిన్నానని విలపించాడు. చివరకు విడాకులు తీసుకోబోతున్నామని బాధపడ్డాడు.నాకోశం ఏదన్నా పూజలన్నా చేయవయ్యా అని. నేను అప్పుడు చెప్పాను పిల్లలు అన్యాయమవుతారుమీరు విడాకులు తీసుకుంటే.. మనం చేసుకున్న పాపాలే ఇలా బాధలుగా వస్తాయి గుర్తు చేసుకో అని . నీవు నిష్టగా ప్రార్ధనలు చేయి నీకోసం నేను ఇక్కడ అభిషేకాలు చేస్తాను అని చెప్పాను. ఆతరువాత అతని స్థితి ఏదో సర్దుబాటయినదని చెప్పాడు. నన్ను ఒకసారి వచ్చిపొమ్మంటున్నాడు గాని వీలుగావటం లేదు. ఇక దైవదూషణకు పాల్పడడని నానమ్మకం.
ఇక నా స్వవిషయము లోనైతే తీవ్రమైన వేగం తో అనుభవానికి తెస్తున్నది" అమ్మ’ పాపపుణ్యఫలితాలను.
గుడివద్ద గుంతచేసి పనుకున్నదని రాయి వేసినందున "కుక్క" కాలువిరగగా పడ్దబాధను నాకు మూడు నెలల్లోనే యాక్సిడెంట్ రూపంలో కాలి ఎముకలు చిట్లి ఆబాధ కు విలవిల లాడేలా చేసి ఇతర జీవికి కలిగించే బాధకు పర్యవసానమేమిటో బోధించింది . కనుక మానవ జన్మ ఎత్తినందుకు జ్ఞానాన్ని పెంపొందించుకుని సన్మార్గం లో నడుద్దాము. దైవదూషణ ధర్మ దూషణ చేసి లేని కష్టాలను తలకెత్తు కోకుందుముగాక.మాబుద్ధులను సత్యమార్గం లోనడపమని గురు పరంపరను వేడుకుంటూ ...............................
దుర్గేశ్వర
2 వ్యాఖ్యలు:
"పరాయి మతానికి మారగనే మనుషులు దేవుడిని నమ్మటమేమోగాని హిందూ ద్వేషులుగా ,ఈదేశానికి చెందనివారిగా భావిస్తారా? అసలు చర్చిలలో మీకు భవత్ సాధనలు నేర్పుతారా ? లేక ఇతరులను ధూషించటం నేర్పుతారా?"
They will answer everything else except this question
వారికి జిలానదం ఉందని అందరికి తెలుసు. కాని కొందరు బ్లాగర్లు పరువం భిషా, పల్లొజు బాబా లాంటి వార్లు వీరేదొ దేశాన్ని ఉద్దరిస్తుంట్లు మద్దతు తెలపతం అనేది చాలా చికాకు కలిగించే విషయం. ఆ అజ్ఞనికి ఈ జ్ఞానుల మద్దతా? వారు చేసిన స్క్రిన్ షాట్ల తయారి మీద ఎందుకు నొరు మెదపరు?
Post a Comment