శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భగవానులు _నాస్తిక వాది

>> Saturday, June 20, 2009

భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ అధ్యాత్మికవాదులను , ధార్మికులను తన వాద పటిమతో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక ధృడమైన నాస్తిక వాది ఒకరు భగవాను వద్దకు వొచ్చారు.

ఆయన అలవాటు ప్రకారం - "దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా? అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు.

అతని యెడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు- "దేవుని గురించిన చింత నీకెందుకు? ఆయన గురించి ఆయనే విచారించుకొంటాడు Grin.

అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు
."
అని


ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయొమయంగా ఉంది.

అది గమనించి భగవాను అతడిని "నేనెవడిని(Who Am I)"అనెడి పుస్తకము చదవమని ఆదేశించారు.

భగవానును కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు.

" కొన్ని దినముల వరకూ దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను. అప్పుడే నేను ఆనందముగా ఉన్నను. కాని,

ఇప్పుడు "నేనెవడిని""అని ప్రశ్నించుకొని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళములో పడిపోయాను Huh.

సంతోషం కోల్పోయి నేను చాల బలహీన పడినట్లు భావిస్తున్నాను Sad"అని.



భగవాను అతని యెడ అమిత దయతో, ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు--

"నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంభందించినది కాదు. ఇంత కాలమూ నీవు నీ సహజస్థితి యైన ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు.

ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ అజ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది. కనుక అది అభివృద్ధే.

అజ్ఞానము నుండి సంశయ స్థితికి, సంశయము నుండి స్వచ్చతకు (మానసిక), స్వచ్చత నుండి అనుభూతికి, తద్వారా ఆత్మలో లీనమగుట--- ఇదీ అధ్యాత్మిక సాధన మార్గములో ఆరొహన క్రమము." అని

అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి,

ధారళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తివంతులను గావిస్తుంది భగవాను సన్నిధి.



2 వ్యాఖ్యలు:

, June 21, 2009 at 12:26 AM  

బాగా రాశారు. యీ టపాని నేను 'భగవాన్ స్మృతులు ' అనే బ్లాగులో ఉపయోగించుకోవచ్చా?

http://bhagavanmemories.blogspot.com

రవి June 21, 2009 at 8:14 AM  

చాలా బాగా చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP