శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చందోలు శాస్త్రిగారి గూర్చి వారి ప్రత్యక్షశిష్యులు

>> Friday, September 5, 2014

ిశేషాలు కొన్ని మీతో పంచు కుందాము అని అనుకుంటున్నాను .వారి స్వగ్రామము చందోలు ,పొన్నూరు దగ్గర రేపల్ల దారిలో ఉన్నది . వారి గృహం లోనే వేద స్మార్త పాఠశాల స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తయారుచేసి వేదాన్ని ,స్మార్త మును రక్షించారు .శ్రీ కంచి కామ కోటి చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామి పరిపాలిత,శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్ర్తి స్మార్త వేద పాఠశాల . నిత్యం గోసేవ చేసే వారు ,బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన చేసేవారు . రోజు రావి చెట్టుకు ప్రదక్షిణం చేసేవారు ,దేవి శరనవరాత్రిలో అద్భుతంగా బాల పూజ చేసేవారు ,సాక్షాత్తు అమ్మవారు అక్కడ తెరిగేది అని , రాత్రి వేళలో గజ్జల చప్పుడు ,అమ్మవారి రాకపోకలు తెలిసేవి అని స్వయానా మామ్మ గారు ( లక్ష్మి ధర సోమయాజులు గారి అమ్మ ) చెప్పేవాళ్ళు మాకు . వారికీ సంతానం లేదు తమ్ముడి కొడుకు ను దత్తత తేసుకున్నారు ఆయనే లక్ష్మి ధర సోమయాజులు గారు ప్రస్తుతం పాఠశాల వారె నడుపు తున్నారు . మేము చదువుకునే రోజుల్లో (1999 ) చాలామంది i.a.s , i.p.s . లు తాత గారి మందిరానికి వచ్చి దరిశనం చేసుకొనే వారు ,వాళ్ళు తాత గారి గొప్పతనం వారి అనుగ్రహం ,ఆగ్రహాలను ,వారి శిష్యరికం లో ఎన్నో విషయాలను విద్యార్ధులం ఆయన మాతో పంచుకునేవారు . దసరాలలో తాత గారు భోజనం చేస్తూ పక్కనే ఇంకో విస్తరి వేయించి వద్దిన్చమనేవారు ,ఎందుకు అని మామ్మ గారు అడిగితె " బాల నా విస్తరిలో పదార్ధాలు లాగేస్తోంది అమ్మ అనేవాల్లుట " అంటే అమ్మవారు చిన్న పిల్ల లాగా వారితో ఆదుకొనేది ఎప్పుడు అయన లోనే అయన తోనే వుండేది . వారి చేతి తీర్ధం తో ఎన్నో రోగాలు ,దాదాపు మృత్యువుతో పోరాదేవాళ్ళు కూడా మళ్లి బతికి చక్కగా వున్నారు అని చెప్పేవాళ్ళు అంటే కాదు అలాంటి వాళ్ళను మేము చూసాం కూడా . ఒక సారి పొలం లో దొంగలు పడి ధాన్యం ఎత్తుక పోతుంటే , ఇంటి దెగ్గర నుండి దిక్భంధనం చేసారు , అంటే వీరు పొలానికి వెళ్ళు వరకు వాళ్ళు అల తిరుగుతూనే వుండిపోయారు అని చెప్పారు .చందోలు గ్రామం లో 90 % ప్రజలు మహమ్మ దీయులు కానీ అయన ఊరిలోకి వస్తే ప్రతి ఒక్కరు నిలబడి జాతి మత భేదం లేకుండా నమస్కరించే వారు ,అంటే కాదు వారు కాలం చేసినప్పుడు వారంతా కూడా వచ్చి కంటతడి పెట్టి కన్నీరు మున్నిరుగా ఎడిచారట .ఈ రోజుకు ఆ ఊరిలో మేము ( అనగా పాఠశాల విద్యార్ధులం ) వెళితే వారి శిష్యులు అని అందరు గౌరవిస్తారు .అంతటి గొప్పవారు తాత గారు . తాత గారు ఆ రోజులలో పొలం లో చాల పెద్ద పడగలు కలిగిన కాల సర్పాన్ని తన మంత్ర బలం చేత అదుపు చేసారు అందుకని అది చాల పాప మని కానీ తప్పక చేసారని చెప్పి పాఠశాల లో మందిరం వెనకాల రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పతిష్ట చేసారు అది ఇప్పటికి అక్కడ చూడ వచ్చు .ఇంకా చాల విశేషాలు వున్నాయ్ ,ఎప్పుడయన అటుగా తెనాలి ,రేపల్ల ,పొన్నూరు వెళితే తప్పక చూసిరండి .అలాంటి వారి పాఠశాల లో చదువు కొనటం ,వారు తపస్సు చేసిన ,నివసించిన ,ప్రదేశంలో ఉండటం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తూ సెలవు . మంగళం మహాత్ .

ఫ్రమ్  ఫేస్ బుక్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP