శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తిమ్మాపురం గ్రామస్తులను పెను ప్రమాదం నుండి కాపాడిన శ్రీరామ నామం

>> Wednesday, July 9, 2014




శ్రీరామ నామము ఎక్కడ స్మరింపబడుతుందో జపించబడుతుందో  అక్కడ హనుమంతులవారు రక్షకులై నిలుచుండి భక్తులను కాపాడతారనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం

హనుమద్రక్షాయాగంలో భాగంగా వివిధగ్రామాలలో రామనామలేఖనం జరిపి భద్రాచలమునకు తీసుకెళ్ళి సమర్పించాము. అలానే నేను ప్రస్తుతం పనిచెస్తున్న తిమ్మాపురం గ్రామంలో కూడా పెద్దలు పెద్దగా సహకరించకున్నా పిల్లలుమాత్రం చక్కగా
శ్రీరామ నామ లేఖనం సాగించారు . శుక్రవారం ఉదయం నాకు రామనామ లేఖన ప్రతులను అందించారు. శనివారం నాడు ఉదయం అందరిప్రతులతోపాటు ఈ గ్రామంనుండివచ్చిన ప్రతులుకూడా  భద్రాచలేశునికి సమర్పించబడ్డాయి.
తిమ్మాపురం గ్రామం నడిబొడ్డులో రామాలయం ఉంది. రోజూ గ్రామంలో పెద్దలంతా అక్కడ కూర్చుని మాట్ళాడుకుంటూ ఉంటారు ఎప్పుడుచూసినా. పిల్లలుకూడా ఆడుతూ తిరుగుతుంటారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఐదుగంటలకు ఒక్కసారిగా రామాలయం పోర్టికో కుప్పకూలింది. అక్కద జనం కూర్చునే బండలుకూడా ముక్కలయ్యాయి. స్వామి అనుగ్రహం వలన ఆసమయానికి అక్కడెవరూ లేరు.తెల్లవారి జరిగిఉంటే పెనుప్రమాదం సంభవించి ఉండేది
అక్కడ ఎప్పుడు కూర్చునేవిధంగా జనం చేరుకుని ఉంటే ఆగ్రామం శోకంలో మునిగిఉండేది. రామనామం లిఖించినచోట అశుభం జరగనిస్తాడా స్వామి ?
అందుకే కాపాడాడు వీరినిలా. గ్రామపెద్దలు పాఠశాలకు వెళ్ళగానే నావద్దకొచ్చి ఈవిషయం తెలిపారు.   ఇప్పటికైనా నమ్మాలి మనం కళ్ళముందు కనపడుతున్న సత్యాన్ని.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP