శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు గోపాష్టమి పూజలలోపూజలందుకున్న గోమాత

>> Sunday, November 10, 2013


ఈరోజు గోపాష్టమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పీఠంలో గోపూజ చేయటం జరిగింది .
కార్తీకసాధనా శిబిరంలో పాల్గొంటున్న సాధకులు ఉదయాన్నే రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరిపారు
ఆతరువాత పీఠంలో నెలకొని ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారలకు పూజలు జరిపి గోమాతను
తులసీవనం దగ్గరకు ఆహ్వానించి శోడశోపచారములతో  పూజలు నిర్వహించారు. ఆపై గోమాతకు ప్రసాదములు నివేదించి
ప్రదక్షిణలు చేశారు. సర్వదేవతలూ గోమాతశరీరంలో నివసిస్తారని ఆతల్లికి పూజచెస్తే సకలదోషాలు తొలగి సంపదలు కలుగుతాయని
గోవును పోషించేవారికి కలిగే పుణ్యం అనంతమైనదని ,గోవును  హింసిస్తే ఆగృహానికి ,గ్రామనికేకాదు దేశానికే అరిష్టమని సర్వదా గోమాతను కాపాడుకోవటమే రైతుకు శ్రీరామరక్ష అని పీఠప్రధానసేవకులు దుర్గేశ్వర వివరించారు.
.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP