విజయ సంకేతం
>> Monday, May 28, 2012
జీవితమొక భయంకర సమరం. ఈ సంగ్రా మము నేడు ప్రారంభమైనది కాదు. అనేక వేల
జన్మల నుండి సాగుతూ ఉన్నదే. మనలోని భక్తి భావాలకు, విషయ పిపాసకు మధ్య
అనాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది. భక్తి జయించిన నాడే బ్రతుకు ధన్యమవ్ఞ
తుంది. భగవత్కృప లభించినప్పుడే భక్తికి విజయం లభిస్తుంది. భగవంతుడు
దయాసాగరుడు. ఆయన సర్వ వ్యాపి. ఇది నిజమో! కాదో! అనుభవములో దర్శిం చుటయే
సాధన. ఆహారమును ఆరగించే పని మనది. దానిని జీర్ణము చేయుపని భగవంతునిది.
'పచామ్యన్నం చతుర్విధం నీవు భుజించే నాలుగు రకములైన పదార్థములను జఠరాగ్ని
రూపంలో తానే పచనము చేస్తూ ఉన్నట్లు పరమాత్మ గీతలో ఎరుకపరచాడు.
అలాగే జీవిత సమరంలో పోరాడే పని మనది. గెలిపించే పని అతనిది. గెలుపు మన
మీదే ఆధార పడి యున్నదని మనం భావించుటయే కొన్ని వేల జన్మలలో మన ఓటమికి
కారణమైంది. గెలిపించే వాని వైభవమును స్మరిస్తూ పోరాడటం అలవర చుకోవాలి.
విజయం మనల్ని వరిస్తుంది.''నేను చాలా కాలంగా సాధన చూస్తూ ఉన్నాను. భగవత్కృప నాకు లభించలేదు. నా బాధలు తీరడం లేదు. కష్టాలు కరగడం లేదు అని వాపోవటం శుద్ధ మూర్ఖత్వం. నేడు మనం చేసే సాధనలు మనకు గోచరిస్తున్నాయి గాని అనేక జన్మలలో మనం ఆచరించిన పాపాలు మనకు తెలియవ్ఞ. బాధలు మిగిలున్నాయంటే ఇంకా సాధన చేయవలసియున్నదని భావం. శత్రుశేషం మిగిలియున్నంతవరకు విజయం లభించలేదనే అర్థం.
ఎంతగా శ్రమించినా, ఆర్జించినా, అన్యుల నుండి సాయమును పొందినా మనం సుఖిం చలేము. మనదోషములను తొలగించువాడు, మనకు తోషమును ప్రసాదించువాడు భగవాను డొక్కడే.
పరమాత్మను విశ్వసించుట అనేది లోకులు భావించినంత తేలికైన పనికాదు. విశ్వాసం విలువ మాటల కందనిది. అదొక కవచధారణవంటిది. నిర్భయమును, నిర్మలత్వమును ప్రసాదించునది భగవంతునిపై నీకున్న విశ్వాసమే.
మన భారాన్నంతా భగవానునికి అర్పించాలి. జగన్నాథుడైన పరమాత్మను పూర్ణవిశ్వాసముతో ఆశ్రయించాలి. విశ్వామిత్రుని యాగశాల ముందు కోదండమును ధరించి నిలిచినట్లు మనజీవితంలో రాముడు ప్రవేశిస్తాడు. భగవంతునిపై భారం నుంచి చరించడమంటే శ్రీకృష్ణుని మన బ్రతుకు బండిలో కూర్చోబెట్టుకోవడమని అర్థం.
'రక్షస్యతీతి విశ్వాసః. 'భగవానుడు నన్ను రక్షించును అనెడి విశ్వాసము మనల్ని ఉద్ధ రిస్తుంది. పరమాత్మ నిజముగా నన్ను రక్షించునా? అనే సంశయము అధోగతిని కల్పిస్తుంది.
ప్రపంచములో కీర్తిప్రతిష్టలు ఉండవచ్చు. ధనం ఉండవచ్చు. దుఃఖమును పోగొట్టలేకపోతే అవి ఉండి ఏమి ప్రయోజనం? దుఃఖమును పోగొట్టు వాడు, అనంత సుఖమును ప్రసాదించువాడు పరమాత్మ ఒక్కడే.
నమ్మి చెడినవారు లేరు. నమ్మక సుఖించిన వారూ లేరు. ప్రారబ్దాలు ప్రజల శత్రువ్ఞలై నిలిచి ఉన్నాయి. పురుషార్థమనే మిత్రుడుగా చేసుకుని, అవిశ్రాంత పోరాటమును సాగించి, భగవత్కృపతో విజయమును సాధించాలి. ఇదొక్కటే సాధకుల కర్తవ్యం.
----స్వామి సుందర చైతన్యానంద
0 వ్యాఖ్యలు:
Post a Comment