విభీషణుని వివేకం
>> Sunday, May 27, 2012
రామాయణం చదవనివారుండరేమో. రామాయణం భక్తిమార్గాన్ని, సత్యశీలాన్ని,
ధర్మమార్గాన్ని ప్రబోధిస్తుంది. తండ్రి మాటకు కట్టుబడ్డ తనయుడు భక్తికి
మించినది మరొకటి లేదనే భక్తుడు, ధర్మానికి స్వప్రజాపేక్షకు సంబంధం లేదన్న
నీతిని ప్రబోధించే ధర్మశీలి ప్రధానంగా కనబడతారు. రామాయణంలో రాముడు, సీత,
లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు- తర్వాత అంతే స్థాయిలో
చెప్పుకోదగ్గవాడు విభీషణుడు.
రాక్షస వంశంలో పుట్టినా ధర్మజ్ఞుడన్న శాశ్వత కీర్తిపొందాడు విభీషణుడు. ఆయన సర్వజ్ఞుడు. విశ్రావసుడు కైకసీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని. రావణునికి తమ్మునిగానేగాక, సలహాదారునిగానూ తన తెలివి తేటలు ప్రదర్శించాడు. విభీషణుడు కూడా తపస్సు చేశాడు. ఆయన బ్రహ్మనుంచి మూడు వరాలుపొందాడు. తాను ధర్మమార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడకుండా ఉండేటట్టు వరమీయమని, బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించడం ఎవరివద్ద శిక్షణ పొందకుండానే దాన్ని ఉపయోగించే శక్తి సామర్థ్యాలు ఇవ్వమని కోరాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి శాశ్వత కీర్తిని ఆర్జిస్తావని మూడో వరం కూడా ప్రసాదించాడు.
రాజు తప్పుదోవన పోతుంటే, అది మంచిది కాదని, ధర్మమార్గాన పోవాలని సూచించడం ప్రజాసంక్షేమంగా విభీషణుడు భావించాడు. అందుకే రాజు, అన్నగారైన రావణుని ప్రతి పొరపాటును విభీషణుడు సరిదిద్దేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. రాజు ధర్మం తప్పితే ప్రజా వినాశనాన్ని చవిచూస్తుందన్నది విభీషణుని అభిప్రాయం. అదే నమ్మాడు. అందుకే రావణుడు సీతను అపహరించి తెచ్చినపుడు అది అన్యాయమని, క్షేమదాయకం కాదని హితవు చెప్పాడు. సీతను వెదుకుతూ వచ్చిన హనుమంతుని చంపడానికి రావణుడు ఆజ్ఞాపించాడు. కాని అది రాజ్యహితం కాదని విభీషణుడు చెప్పాడు. ఆయన సూచనను అంగీకరించి రావణుడు హనుమంతుడిని వదిలేశాడు. కాని, చివరగా రాముడితో యుద్ధానికి తలపడినప్పుడు మాత్రం రావణుడు, తన సోదరుడు, సర్వధర్మాలు తెలిసిన జ్ఞాని అయిన విభీషణుడి సూచనను నిర్లక్ష్యం చేశాడు.
రామునితో యుద్ధం వినాశనానికి దారి తీస్తుందని ఎంత నచ్చచెప్పినా రావణుడు వినలేదు. సీతను అపహరించటమే పెద్ద తప్పు. అది సరిదిద్దుకోవటానికి ఆమెను అప్పగించడం పోయి రాముని అంతటి పరాక్రమవంతునితో యుద్ధానికే దిగడంలో రాజుగా రాజ్యక్షేమాన్ని కోరేవాడిగా ఆలోచించి ఈ ప్రయత్నాలు విరమించుకోమని ప్రాధేయపడ్డాడు.
కాని అందుకు తిరస్కరించి రావణుడు రాముడితో తలపడ్డానికే నిర్ణయించుకున్నాడు. దీంతో విసిగివేసారి రాముడి శరణు కోరాడు విభీషణుడు. విభీషణుని ధర్మనిరతి తెలిసిన రాముడు అందుకు అంగీకరించాడు. లక్ష్మణుడు, హనుమంతుడు ముందు అందుకు నిరాకరించారు. కాని రాముడు విభీషణుని విశిష్టతను ఎరిగినవాడు కనుక వారి అనుమానాలను పట్టించుకోలేదు. కాని ధర్మమే జయించాలన్న నియమాన్ని కార్యరూపంలో చూపింది విభీషణుడేననాలి. రామ రావణ యుద్ధ సమయంలో దుష్ట సంహారం సులభసాధ్యం చేసి, తన అన్నగారన్న సంగతి పక్కన పెట్టి అధర్మాన్ని నమ్ముకున్న దుష్టునిగానే రావణుని భావించి అతని అంతానికి తోడ్పడ్డాడు. రావణాసురుని తర్వాత లంకారాజ్యానికి విభీషణుడినే రాజును చేశాడు రాముడు.
--- వులాపు బాలకేశవులు
========
రాక్షస వంశంలో పుట్టినా ధర్మజ్ఞుడన్న శాశ్వత కీర్తిపొందాడు విభీషణుడు. ఆయన సర్వజ్ఞుడు. విశ్రావసుడు కైకసీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని. రావణునికి తమ్మునిగానేగాక, సలహాదారునిగానూ తన తెలివి తేటలు ప్రదర్శించాడు. విభీషణుడు కూడా తపస్సు చేశాడు. ఆయన బ్రహ్మనుంచి మూడు వరాలుపొందాడు. తాను ధర్మమార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడకుండా ఉండేటట్టు వరమీయమని, బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించడం ఎవరివద్ద శిక్షణ పొందకుండానే దాన్ని ఉపయోగించే శక్తి సామర్థ్యాలు ఇవ్వమని కోరాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి శాశ్వత కీర్తిని ఆర్జిస్తావని మూడో వరం కూడా ప్రసాదించాడు.
రాజు తప్పుదోవన పోతుంటే, అది మంచిది కాదని, ధర్మమార్గాన పోవాలని సూచించడం ప్రజాసంక్షేమంగా విభీషణుడు భావించాడు. అందుకే రాజు, అన్నగారైన రావణుని ప్రతి పొరపాటును విభీషణుడు సరిదిద్దేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. రాజు ధర్మం తప్పితే ప్రజా వినాశనాన్ని చవిచూస్తుందన్నది విభీషణుని అభిప్రాయం. అదే నమ్మాడు. అందుకే రావణుడు సీతను అపహరించి తెచ్చినపుడు అది అన్యాయమని, క్షేమదాయకం కాదని హితవు చెప్పాడు. సీతను వెదుకుతూ వచ్చిన హనుమంతుని చంపడానికి రావణుడు ఆజ్ఞాపించాడు. కాని అది రాజ్యహితం కాదని విభీషణుడు చెప్పాడు. ఆయన సూచనను అంగీకరించి రావణుడు హనుమంతుడిని వదిలేశాడు. కాని, చివరగా రాముడితో యుద్ధానికి తలపడినప్పుడు మాత్రం రావణుడు, తన సోదరుడు, సర్వధర్మాలు తెలిసిన జ్ఞాని అయిన విభీషణుడి సూచనను నిర్లక్ష్యం చేశాడు.
రామునితో యుద్ధం వినాశనానికి దారి తీస్తుందని ఎంత నచ్చచెప్పినా రావణుడు వినలేదు. సీతను అపహరించటమే పెద్ద తప్పు. అది సరిదిద్దుకోవటానికి ఆమెను అప్పగించడం పోయి రాముని అంతటి పరాక్రమవంతునితో యుద్ధానికే దిగడంలో రాజుగా రాజ్యక్షేమాన్ని కోరేవాడిగా ఆలోచించి ఈ ప్రయత్నాలు విరమించుకోమని ప్రాధేయపడ్డాడు.
కాని అందుకు తిరస్కరించి రావణుడు రాముడితో తలపడ్డానికే నిర్ణయించుకున్నాడు. దీంతో విసిగివేసారి రాముడి శరణు కోరాడు విభీషణుడు. విభీషణుని ధర్మనిరతి తెలిసిన రాముడు అందుకు అంగీకరించాడు. లక్ష్మణుడు, హనుమంతుడు ముందు అందుకు నిరాకరించారు. కాని రాముడు విభీషణుని విశిష్టతను ఎరిగినవాడు కనుక వారి అనుమానాలను పట్టించుకోలేదు. కాని ధర్మమే జయించాలన్న నియమాన్ని కార్యరూపంలో చూపింది విభీషణుడేననాలి. రామ రావణ యుద్ధ సమయంలో దుష్ట సంహారం సులభసాధ్యం చేసి, తన అన్నగారన్న సంగతి పక్కన పెట్టి అధర్మాన్ని నమ్ముకున్న దుష్టునిగానే రావణుని భావించి అతని అంతానికి తోడ్పడ్డాడు. రావణాసురుని తర్వాత లంకారాజ్యానికి విభీషణుడినే రాజును చేశాడు రాముడు.
--- వులాపు బాలకేశవులు
========
0 వ్యాఖ్యలు:
Post a Comment