కలి ప్రభావం
>> Saturday, May 26, 2012
ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రవేశించే రోజులలో ఒక బ్రహ్మచారి పొరుగూరు భోక్తగా వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరాడు. దారిలో భుక్తాయాసం వలన దాహం వేసింది. ఎక్కడా బావి కాని చెరువు కాని కనిపించలేదు. కొద్ది దూరంలో ఒక రైతు పొలంలో బెల్లం తయారుచేయడానికి చెరకురసం తీయిస్తున్నాడు. బ్రహ్మచారి అతనిని సమీపించి తన దాహం తీరడానికి చెరకు రసం అడిగాడు. వెంటనే రైతు అతనికి రసం ఇచ్చి దప్పిక తీర్చాడు. బ్రహ్మచారి ఆ రసానికి వెల కట్టి పైకం ఈయబోగా రైతు ‘అయ్యా ఈరసం మీ దాహం తీర్చడానికి ఇచ్చాను. ఇది నా ధర్మం. దీనికి నేను ప్రతిఫలం ఆశించకూడదు’’ అని చెప్పగా బ్రహ్మచారి తిరిగి ఇంటికి ప్రయాణం సాగించాడు. అతనిని ఎవరో ఒకవ్యక్తి వెనుకనుండి వెంబడిస్తున్నాడు. అతడు అది గమనించలేదు. ఇంటికి చేరి తలుపులు కొట్టాడు. తల్లి తలుపు తీసి కుమారుని వెనుకనున్న వ్యక్తిని చూసి అతడు ఎవరు అని ప్రశ్నించింది. అప్పుడు బ్రహ్మచారి వెనుకకు తిరిగి నల్లగా లావుగా మీసాలతో ఉన్న మనుష్యుని చూచి ఇతడు ఎవరో నేను ఎరుగను. నన్ను మెంబడిస్తున్నట్లు కూడా చూడలేదు అన్నాడు.
అప్పుడా వ్యక్తి ‘‘అమ్మా మీ అబ్బాయి అసత్యం చెబుతున్నాడు. నాకల్లు పాకవద్ద కల్లు తాగి డబ్బులు ఇంటి వద్ద ఇస్తానని నన్ను తనతో కూడా తీసుకువచ్చాడు. అందువలన ఈయనతో వచ్చాను’’ అన్నాడు. అతని మాటలు విన్న బ్రహ్మచారి తల్లితో తాను ఏ పాపం ఎరుగనని అతని మాటలు నమ్మవద్దని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మచారి తల్లితో ‘‘అమ్మా, ఇన్ని మాటలెందుకు? ఈయన కల్లు తాగిన విషయం ఇప్పుడే మీ ముందు ఋజువు చేస్తాను. కొంచెం ఉప్పు తెచ్చి ఈయన చేత మింగించండి. అప్పుడు తెలుస్తుంది’’ అన్నాడు. తల్లి అలా చేయగా కొద్ది సేపటికి బ్రహ్మచారికి వమనం అయి పుల్లటి వాసన వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు మీకు నిజం తెసింది కదా అని అనగానే, ఆ సమయానికి ఎక్కడికో వెళ్లిన బ్రహ్మచారి తండ్రి ఇంటికి వచ్చి విషయం గ్రహించి ‘‘ఓరీ భ్రష్ఠుడా నేటి నుండి నీకు మాకు సంబంధం లేదు. నిన్ను బహిష్కరిస్తున్నాను’’ అని కుమారుని ఆవలకు పంపి తలుపులు మూసివేశాడు.
బ్రహ్మచారి ఎంతో బాధతో ఈవలకు వచ్చి తనను ఈ విధంగా మోసం చేసిన వ్యక్తితో ‘‘ఓరుూ నీవు ఎవరో నేను ఎరుగను. ఆ సంగతి నీకు తెలుసు. నిష్కారణంగా నన్ను ఈవిధంగా అప్రతిష్టపాలు చేసి నాకు తీరని అన్యాయం ఎందుకు చేశావు? అని ప్రశ్నించగా అతడు ‘‘నేను కలిపురుషుడను. నా ప్రవేశ లక్షణాలు అపుడే నీలో కనిపించాయి. దాహం తీర్చిన రైతుకి పైకం ఇవ్వచూపావు. ఇది కలి లక్షణం. కలిలో మంచినీరు కూడా విక్రయింపబడుతుంది. రాబోయే రోజులలో సత్యం అసత్యం అవుతుంది. అసత్యం సత్యంగా చెలామణి అవుతుంది. దోషులు తప్పించుకు తిరుగుతారు. దొరికినా వారికి శిక్షలు నామమాత్రం. చెరసాలలు సకల సౌకర్యాలతో ఉంటాయి. నేరానికి ఎవరు భయపడరు. మద్యం ఏరులై పారుతుంది. జూదం అనేక రూపాలలో మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతుంది. స్ర్తిలు రాక్షసుల వలె జుట్టు విరగబోసుకు తిరుగుతారు. నందిని పందిగాను, పందిని నందిగాను ఋజువు చేయగల ప్రాడ్వివాకులుంటారు. ధర్మం క్షీణిస్తుంది. ఇపుడు మచ్చుకి ఒక విషయం నీకు చూపించాను. నీకు ఇంకా చాలా ఆయుర్దాయం ఉంది. నా లక్షణాలన్నీ చూడగలవు అని ఆ వ్యక్తి అంతర్థానమయినాడు. నేటి యుగంలో ఇవి అన్ని చూస్తున్నాం. త్యాగరాజస్వామి వారు చెప్పినట్లు రాజస తామస గుణాలు కలవారి సంఖ్య పెరుగుతుంది. ఈ బాధలనుండి విముక్తికి వేదవ్యాస మహర్షి మానవులకు ఒక తరుణోపాయం చూపాడు. అదే హరినామ స్మరణం. కలిలో ఇదే ముక్తికి రాజమార్గం. ఇంతకుమించినది ఏదీ లేదు.
అప్పుడా వ్యక్తి ‘‘అమ్మా మీ అబ్బాయి అసత్యం చెబుతున్నాడు. నాకల్లు పాకవద్ద కల్లు తాగి డబ్బులు ఇంటి వద్ద ఇస్తానని నన్ను తనతో కూడా తీసుకువచ్చాడు. అందువలన ఈయనతో వచ్చాను’’ అన్నాడు. అతని మాటలు విన్న బ్రహ్మచారి తల్లితో తాను ఏ పాపం ఎరుగనని అతని మాటలు నమ్మవద్దని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మచారి తల్లితో ‘‘అమ్మా, ఇన్ని మాటలెందుకు? ఈయన కల్లు తాగిన విషయం ఇప్పుడే మీ ముందు ఋజువు చేస్తాను. కొంచెం ఉప్పు తెచ్చి ఈయన చేత మింగించండి. అప్పుడు తెలుస్తుంది’’ అన్నాడు. తల్లి అలా చేయగా కొద్ది సేపటికి బ్రహ్మచారికి వమనం అయి పుల్లటి వాసన వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు మీకు నిజం తెసింది కదా అని అనగానే, ఆ సమయానికి ఎక్కడికో వెళ్లిన బ్రహ్మచారి తండ్రి ఇంటికి వచ్చి విషయం గ్రహించి ‘‘ఓరీ భ్రష్ఠుడా నేటి నుండి నీకు మాకు సంబంధం లేదు. నిన్ను బహిష్కరిస్తున్నాను’’ అని కుమారుని ఆవలకు పంపి తలుపులు మూసివేశాడు.
బ్రహ్మచారి ఎంతో బాధతో ఈవలకు వచ్చి తనను ఈ విధంగా మోసం చేసిన వ్యక్తితో ‘‘ఓరుూ నీవు ఎవరో నేను ఎరుగను. ఆ సంగతి నీకు తెలుసు. నిష్కారణంగా నన్ను ఈవిధంగా అప్రతిష్టపాలు చేసి నాకు తీరని అన్యాయం ఎందుకు చేశావు? అని ప్రశ్నించగా అతడు ‘‘నేను కలిపురుషుడను. నా ప్రవేశ లక్షణాలు అపుడే నీలో కనిపించాయి. దాహం తీర్చిన రైతుకి పైకం ఇవ్వచూపావు. ఇది కలి లక్షణం. కలిలో మంచినీరు కూడా విక్రయింపబడుతుంది. రాబోయే రోజులలో సత్యం అసత్యం అవుతుంది. అసత్యం సత్యంగా చెలామణి అవుతుంది. దోషులు తప్పించుకు తిరుగుతారు. దొరికినా వారికి శిక్షలు నామమాత్రం. చెరసాలలు సకల సౌకర్యాలతో ఉంటాయి. నేరానికి ఎవరు భయపడరు. మద్యం ఏరులై పారుతుంది. జూదం అనేక రూపాలలో మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతుంది. స్ర్తిలు రాక్షసుల వలె జుట్టు విరగబోసుకు తిరుగుతారు. నందిని పందిగాను, పందిని నందిగాను ఋజువు చేయగల ప్రాడ్వివాకులుంటారు. ధర్మం క్షీణిస్తుంది. ఇపుడు మచ్చుకి ఒక విషయం నీకు చూపించాను. నీకు ఇంకా చాలా ఆయుర్దాయం ఉంది. నా లక్షణాలన్నీ చూడగలవు అని ఆ వ్యక్తి అంతర్థానమయినాడు. నేటి యుగంలో ఇవి అన్ని చూస్తున్నాం. త్యాగరాజస్వామి వారు చెప్పినట్లు రాజస తామస గుణాలు కలవారి సంఖ్య పెరుగుతుంది. ఈ బాధలనుండి విముక్తికి వేదవ్యాస మహర్షి మానవులకు ఒక తరుణోపాయం చూపాడు. అదే హరినామ స్మరణం. కలిలో ఇదే ముక్తికి రాజమార్గం. ఇంతకుమించినది ఏదీ లేదు.
=========
అహంకారాన్ని , అజ్ఞానాన్ని వదిలివేయుము
+++++++++
అహంకారాన్ని , అజ్ఞానాన్ని వదిలివేయుము
+++++++++
- వేదుల సత్యనారాయణ
0 వ్యాఖ్యలు:
Post a Comment