కోహినూర్ వజ్రం తిరిగొచ్చేనా ??
>> Friday, May 25, 2012
కోడిగుడ్డుకన్నా కాస్త పెద్దగా రంగురంగుల కాంతులీనే ఆ వజ్రానికి నాదిర్షా
''నూర్ కా పహాడ్ అనే పేరు పెట్టాడు. అదే కోహినూర్ వజ్రం నేడు టవర్ ఆఫ్
లండన్ మ్యూజియంలో ఉంది. క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో జిగేల్మంటూ
దర్శనమిస్తోంది. దీన్ని దగ్గరుంచుకున్నవారికి ప్రజలపై అధికారం చెలాయించే
పెత్తనం లభిస్తుందని ఓ నమ్మకం. కానీ చాలా ఏళ్లు ఒకే వ్యక్తి దగ్గర ఈ వజ్రం
ఎప్పుడూ ఉండలేదు. దీన్ని ధరించిన వారి అదృష్టం కూడా విచిత్రంగా మారటం ఇంకో
విశేషం. ఇది మహిళలకి మాత్రం మంచినే చేసిందని చెప్పవచ్చు. దాదాపు 161 ఏళ్ల
బట్టీ కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాణుల వద్దనే ఉండిపోయింది.
మొగల్ పాదుషా మహమ్మద్ షారంగీలా బలహీనుడు కావటంతో కోహినూర్ను తన తలపాగాలో దాచుకునే వాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న నాదిర్షా ఢిల్లీని లూటీచేసి ఎలాగైనా ఆ వజ్రాన్ని కాజేయాలనే పన్నాగం పన్నాడు. ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటుచేసి, మొగల్ పాదుషాని ఆహ్వానించి ''స్నేహితులం, సరదాగా తలపాగాలు మార్చుకుందాం అని చెప్పి, అలా చేసి ఆ వజ్రాన్ని కాజేశాడు. అంతే! ఆ వజ్రపు ధగధగలకు సంభ్రమానికిలోనైన నాదిర్షా, దాన్ని 'కోహినూర్ (కాంతి పర్వతం) అని పిలిచాడు. అలా ఆ వజ్రానికి నామకరణం జరిగింది.
ఈ వజ్రం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎవరూ దీన్ని కొనలేక, అమ్మలేకపోయారు. లేత పసుపు రంగులో పాలిష్ చేయని ఈ వజ్రం గోల్కొండ తవ్వకాల్లో బయటపడింది. దాన్ని షాజహాన్కి ఎవరో సమర్పించారు.
నాదిర్షా నుంచి ఈ వజ్రం ఆఫ్ఘనిస్థాన్కి చెంది అహ్మద్ షా అబ్దాలీకి దక్కింది. ఆయన దాన్ని షాహ్ షుజీ ఉల్క్ ముల్క్కి ఇచ్చాడు. మహారాజా రణజీత్ సింహ్ అతన్ని ఓడించి వజ్రాన్ని స్వాధీపరచుకున్నాడు. ఈ వజ్రం దక్కించుకున్న కొద్ది కాలానికే నాదిర్షా హత్యకు గురయ్యాడు. షుజా ఉల్క్ ముల్క్ దగ్గర కోహినూర్ ఉన్నప్పుడే యుద్ధాల్లో ఓడిపోయాడు. రణజీత్సింహ్ కూడా మృత్యువ్ఞకెరయైనాడు. అతని చిన్నారి కొడుకు దిలీప్సింహ్ చేతికా వజ్రం చిక్కింది. అతణ్ని తొలగించి ఆంగ్లేయులు పంజాబ్ రాజ్యాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అలా కోహినూర్ పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకు న్నారు. అలా కోహినూర్ ఆంగ్లేయుల చేతికి చిక్కింది. సర్ లారెన్స్ ఆదేశంతో రైలు మార్గం ద్వారా బొంబాయి (ముంబై) చేరింది.
ఆ తర్వాత 1850లో హెచ్ఎంఎస్ మీడియా అనే ఓడ ద్వారా సముద్ర మార్గాన ఇంగ్లాండ్ చేరింది. దాన్ని అతి జాగ్రత్తగా ఒక ఇనుప డిస్పాచ్ బాక్స్లో ఉంచి, ఓడ ఖజానా లాకర్లో భద్రపరచి రహస్యంగా తీసుకెళ్లారు. ఈ నౌక మారిషస్ చేరటం ఆలస్యం ప్లేగు వ్యాధి వ్యాపించటంతో నౌకని అక్కడే లంగరువేయక తప్పలేదు. ''ఈ నౌక వల్ల ప్లేగు వ్యాధి మాకూ వస్తుంది. ఇక్కడ నిలపరాదు అని మారిషస్ ప్రజలు గోల చేశారు. ''మీరు నౌకని ఇక్కడ్నుంచి తరలించకపోతే నిప్పంటిస్తాం అని బెదిరిం చటంతో ఓడని బయలుదేరదీశారు. దురదృష్టవశాత్తు ఓడ 12గంటలపాటు తుఫాన్లో చిక్కుకుంది. ఆపై ఎంతో కష్టనిష్ఠూరాలు, ప్రతికూల వాతావరణంలో 3నెలల తర్వాత 2 జులై 1850లో ఇంగ్లాండ్లోని ప్లైమౌత్ ఓడరేవ్ఞ చేరింది. జనం, సామాన్లన్నీ దిగాక ఈస్టిండియా కంపెనీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు దాన్ని బైటికి తీసి ఆ వజ్రాన్ని కంపెనీ చైర్మన్కి అందజేశారు. అతడు దాన్ని ఇంగ్లాండ్ రాజ కోశాగారంలో దాచాడు. క్వీన్ విక్టోరియా కోహినూర్ని చూసి బ్రహ్మానందభరితురాలైంది. దానికి బాగా మెరుగుపెట్టించింది. 186 క్యారెట్ల ఆ వజ్రం అలా 105 క్యారెట్ల బరువ్ఞకి తగ్గిపోయింది. 38రోజుల పాటు దాన్ని చెక్కారు. వజ్రం మెరవటంకోసం 40వేల పౌండ్లు ఖర్చు అయింది. విక్టోరియా రాణి దాన్ని గాజులో పొదిగించి ధరించింది. ఆమె చనిపోయాక అలెగ్జాండ్రా రాణి దాన్ని కిరీటంలో పొదిగించింది. అలా రకరకాల కిరీటాల్లో పొదిగించారు. 1937లో క్వీన్ ఎలిజబెత్ దాన్ని కిరీటంలో ప్లాటినంలో పొదిగించింది. ఆ కిరీటంలో ఇంకా 2800 చిన్నా చితక వజ్రాలున్నాయి.
4వేల ఏళ్లపాటు ఈ వజ్రం కోసం ఎంతో మంది పోరాడారని చరిత్రకారుల అభిప్రాయం. 1947లో మనకి స్వాతంత్య్రం వచ్చాక మనం ఆ వజ్రం కావాలని అడిగాం. దాదాపు 213ఏళ్లు మొగలుల వద్ద, 66 ఏళ్లు ఆఫ్ఘన్ల వద్ద ఉన్న ఈ వజ్రం ఆపైన 161 ఏళ్ల బట్టి ఆంగ్లేయుల వద్ద ఉంటోంది. మనదేశంలోదే కాబట్టి మనం కావాలని అంటున్నాం. యునెస్కో, ఇంకా ఇతర దేశాలు కూడా మనల్నే సమర్ధిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో.
మొగల్ పాదుషా మహమ్మద్ షారంగీలా బలహీనుడు కావటంతో కోహినూర్ను తన తలపాగాలో దాచుకునే వాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న నాదిర్షా ఢిల్లీని లూటీచేసి ఎలాగైనా ఆ వజ్రాన్ని కాజేయాలనే పన్నాగం పన్నాడు. ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటుచేసి, మొగల్ పాదుషాని ఆహ్వానించి ''స్నేహితులం, సరదాగా తలపాగాలు మార్చుకుందాం అని చెప్పి, అలా చేసి ఆ వజ్రాన్ని కాజేశాడు. అంతే! ఆ వజ్రపు ధగధగలకు సంభ్రమానికిలోనైన నాదిర్షా, దాన్ని 'కోహినూర్ (కాంతి పర్వతం) అని పిలిచాడు. అలా ఆ వజ్రానికి నామకరణం జరిగింది.
ఈ వజ్రం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎవరూ దీన్ని కొనలేక, అమ్మలేకపోయారు. లేత పసుపు రంగులో పాలిష్ చేయని ఈ వజ్రం గోల్కొండ తవ్వకాల్లో బయటపడింది. దాన్ని షాజహాన్కి ఎవరో సమర్పించారు.
నాదిర్షా నుంచి ఈ వజ్రం ఆఫ్ఘనిస్థాన్కి చెంది అహ్మద్ షా అబ్దాలీకి దక్కింది. ఆయన దాన్ని షాహ్ షుజీ ఉల్క్ ముల్క్కి ఇచ్చాడు. మహారాజా రణజీత్ సింహ్ అతన్ని ఓడించి వజ్రాన్ని స్వాధీపరచుకున్నాడు. ఈ వజ్రం దక్కించుకున్న కొద్ది కాలానికే నాదిర్షా హత్యకు గురయ్యాడు. షుజా ఉల్క్ ముల్క్ దగ్గర కోహినూర్ ఉన్నప్పుడే యుద్ధాల్లో ఓడిపోయాడు. రణజీత్సింహ్ కూడా మృత్యువ్ఞకెరయైనాడు. అతని చిన్నారి కొడుకు దిలీప్సింహ్ చేతికా వజ్రం చిక్కింది. అతణ్ని తొలగించి ఆంగ్లేయులు పంజాబ్ రాజ్యాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అలా కోహినూర్ పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకు న్నారు. అలా కోహినూర్ ఆంగ్లేయుల చేతికి చిక్కింది. సర్ లారెన్స్ ఆదేశంతో రైలు మార్గం ద్వారా బొంబాయి (ముంబై) చేరింది.
ఆ తర్వాత 1850లో హెచ్ఎంఎస్ మీడియా అనే ఓడ ద్వారా సముద్ర మార్గాన ఇంగ్లాండ్ చేరింది. దాన్ని అతి జాగ్రత్తగా ఒక ఇనుప డిస్పాచ్ బాక్స్లో ఉంచి, ఓడ ఖజానా లాకర్లో భద్రపరచి రహస్యంగా తీసుకెళ్లారు. ఈ నౌక మారిషస్ చేరటం ఆలస్యం ప్లేగు వ్యాధి వ్యాపించటంతో నౌకని అక్కడే లంగరువేయక తప్పలేదు. ''ఈ నౌక వల్ల ప్లేగు వ్యాధి మాకూ వస్తుంది. ఇక్కడ నిలపరాదు అని మారిషస్ ప్రజలు గోల చేశారు. ''మీరు నౌకని ఇక్కడ్నుంచి తరలించకపోతే నిప్పంటిస్తాం అని బెదిరిం చటంతో ఓడని బయలుదేరదీశారు. దురదృష్టవశాత్తు ఓడ 12గంటలపాటు తుఫాన్లో చిక్కుకుంది. ఆపై ఎంతో కష్టనిష్ఠూరాలు, ప్రతికూల వాతావరణంలో 3నెలల తర్వాత 2 జులై 1850లో ఇంగ్లాండ్లోని ప్లైమౌత్ ఓడరేవ్ఞ చేరింది. జనం, సామాన్లన్నీ దిగాక ఈస్టిండియా కంపెనీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు దాన్ని బైటికి తీసి ఆ వజ్రాన్ని కంపెనీ చైర్మన్కి అందజేశారు. అతడు దాన్ని ఇంగ్లాండ్ రాజ కోశాగారంలో దాచాడు. క్వీన్ విక్టోరియా కోహినూర్ని చూసి బ్రహ్మానందభరితురాలైంది. దానికి బాగా మెరుగుపెట్టించింది. 186 క్యారెట్ల ఆ వజ్రం అలా 105 క్యారెట్ల బరువ్ఞకి తగ్గిపోయింది. 38రోజుల పాటు దాన్ని చెక్కారు. వజ్రం మెరవటంకోసం 40వేల పౌండ్లు ఖర్చు అయింది. విక్టోరియా రాణి దాన్ని గాజులో పొదిగించి ధరించింది. ఆమె చనిపోయాక అలెగ్జాండ్రా రాణి దాన్ని కిరీటంలో పొదిగించింది. అలా రకరకాల కిరీటాల్లో పొదిగించారు. 1937లో క్వీన్ ఎలిజబెత్ దాన్ని కిరీటంలో ప్లాటినంలో పొదిగించింది. ఆ కిరీటంలో ఇంకా 2800 చిన్నా చితక వజ్రాలున్నాయి.
4వేల ఏళ్లపాటు ఈ వజ్రం కోసం ఎంతో మంది పోరాడారని చరిత్రకారుల అభిప్రాయం. 1947లో మనకి స్వాతంత్య్రం వచ్చాక మనం ఆ వజ్రం కావాలని అడిగాం. దాదాపు 213ఏళ్లు మొగలుల వద్ద, 66 ఏళ్లు ఆఫ్ఘన్ల వద్ద ఉన్న ఈ వజ్రం ఆపైన 161 ఏళ్ల బట్టి ఆంగ్లేయుల వద్ద ఉంటోంది. మనదేశంలోదే కాబట్టి మనం కావాలని అంటున్నాం. యునెస్కో, ఇంకా ఇతర దేశాలు కూడా మనల్నే సమర్ధిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో.
6 వ్యాఖ్యలు:
ఇంతమందిని చంపినది మన దగ్గర ఉండక పోవడమే మంచిది.
/1947లో మనకి స్వాతంత్య్రం వచ్చాక మనం ఆ వజ్రం కావాలని అడిగాం. /
ఓకే, ఇస్తే ఇపుడు ఎవరి నెత్తిన దాన్ని చేర్చాలని? ! ఇటాలియన్ సామ్రాజ్ఞి నెత్తినెట్టాలనా! హనుమంతరావు, మన్మోహన్ కేబినెట్టూ ఏక కంఠంతో అదే తీర్మానం చేస్తుంది మరి! :D లేదా ఏ రాజా , కల్మాడి, కరుణానిధి, కనిమోళి, జయ, మాయ, జగనో నొక్కేయరని గ్యారంటీ ఏమిటి?
ఈ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ నాశనం జరుగుతుంది అని మా నాన్న గారు చెప్పేవారు. ఆ వజ్రం లండన్ వెళ్ళాకే 'సూర్యుడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం' ఛిన్నాభిన్నం అయిపోయింది. అది ఇండియా రాకపోవడమే మేలు అని అనేవారు.
ఈ వజ్రం శ్యమంతక మణి లాంటిది. ఎక్కడ ఉంటే అక్కడ నాశనం, దెబ్బలాటలు జరుగుతాయి. అది ఉన్నంతకాలం సత్యభామ తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు. ఉత్తరోత్తరా అది కృష్ణుడికి కష్టాలు తెచ్చిపెట్టిండి. సత్యభామ దాన్ని ద్రౌపదికి ఇచ్చింది రాజసూయం సమయంలో. తర్వాత ఏమైందో అందరికీ విదితమే. ఆఖరికి దాన్ని ధౌమ్యులవారు అర్జునిడిచేత గాండీవంతో భూమిలోకి కొట్టింఛారని కధ.
అలాంటి వజ్రాలని సముద్రంలో పారేయాలి అని చెప్పేవారు మా నాన్న గారు. మరి సముద్రానికి చేటు రాదా అని అడిగితే, రాదు 'సముద్ర రత్న గర్భః' అని చెప్పేవారు.నిజానిజాలు పరమాత్మకే ఎరుక.
ఈ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ నాశనం జరుగుతుంది అని మా నాన్న గారు చెప్పేవారు. ఆ వజ్రం లండన్ వెళ్ళాకే 'సూర్యుడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం' ఛిన్నాభిన్నం అయిపోయింది. అది ఇండియా రాకపోవడమే మేలు అని అనేవారు.
ఈ వజ్రం శ్యమంతక మణి లాంటిది. ఎక్కడ ఉంటే అక్కడ నాశనం, దెబ్బలాటలు జరుగుతాయి. అది ఉన్నంతకాలం సత్యభామ తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు. ఉత్తరోత్తరా అది కృష్ణుడికి కష్టాలు తెచ్చిపెట్టిండి. సత్యభామ దాన్ని ద్రౌపదికి ఇచ్చింది రాజసూయం సమయంలో. తర్వాత ఏమైందో అందరికీ విదితమే. ఆఖరికి దాన్ని ధౌమ్యులవారు అర్జునిడిచేత గాండీవంతో భూమిలోకి కొట్టింఛారని కధ.
అలాంటి వజ్రాలని సముద్రంలో పారేయాలి అని చెప్పేవారు మా నాన్న గారు. మరి సముద్రానికి చేటు రాదా అని అడిగితే, రాదు 'సముద్ర రత్న గర్భః' అని చెప్పేవారు.నిజానిజాలు పరమాత్మకే ఎరుక.
ఈ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ నాశనం జరుగుతుంది అని మా నాన్న గారు చెప్పేవారు. ఆ వజ్రం లండన్ వెళ్ళాకే 'సూర్యుడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం' ఛిన్నాభిన్నం అయిపోయింది. అది ఇండియా రాకపోవడమే మేలు అని అనేవారు.
ఈ వజ్రం శ్యమంతక మణి లాంటిది. ఎక్కడ ఉంటే అక్కడ నాశనం, దెబ్బలాటలు జరుగుతాయి. అది ఉన్నంతకాలం సత్యభామ తండ్రి ఏడుస్తూనే ఉన్నాడు. ఉత్తరోత్తరా అది కృష్ణుడికి కష్టాలు తెచ్చిపెట్టిండి. సత్యభామ దాన్ని ద్రౌపదికి ఇచ్చింది రాజసూయం సమయంలో. తర్వాత ఏమైందో అందరికీ విదితమే. ఆఖరికి దాన్ని ధౌమ్యులవారు అర్జునిడిచేత గాండీవంతో భూమిలోకి కొట్టింఛారని కధ.
అలాంటి వజ్రాలని సముద్రంలో పారేయాలి అని చెప్పేవారు మా నాన్న గారు. మరి సముద్రానికి చేటు రాదా అని అడిగితే, రాదు 'సముద్ర రత్న గర్భః' అని చెప్పేవారు.నిజానిజాలు పరమాత్మకే ఎరుక.
ee vajram charithra raasinanduku chala thanks andi.chaala baaga raasaru.nenu chusanu london lo ee vajranni.
nijanga mana deshaniki eppudu vastundo.
Post a Comment