శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొంచెం కంఫ్యూజన్ గా ఉంది !హిందూ ధర్మం వేరే, హిందూమతం వేరేనా..?

>> Sunday, February 20, 2011



Anonymous said...

దుగ్గేశ్వర్ గారూ,
కొంచెం కంఫ్యూజన్ గా ఉంది. ధర్మం లోకి మారడం వేరే, మతం లోకి మారడం వేరేనా..? హిందూ ధర్మం వేరే, హిందూ మతం వేరేనా..? దయచేసి వివరించగలరని మనవి.


అజ్ఞాతగారూ
ఇంత మంచి ప్రశ్నవేసినందుకు చాలా సంతోషం .
ముందుగా మతం అంటే ఏమిటి ?చర్చిద్దాం .మతం అంటే ఒక వ్యక్తి లేక కొద్దిమంది మనుషుల అభిప్రాయం. సామాన్యమానువులు కాక విశేషశక్తికలిగిన మహాత్ములమనస్సునుంచి ఉద్భవించిన మార్గం. సాధారణ జీవనంలో మనమెవరిమీదన్నా విసుగువస్తే వాడిమతం వేరురా! అంటుంటాం కదా .అంటే అక్కడ అతని ఆలోచనవేరు అని అర్ధం.

దీనిని ప్రామాణీకరిస్తూ ఒక సిద్దాంత,లేక ఆలోచనారీతి ఉండవచ్చు.దానిని వివరించే ఒక గ్రంథం ఉటాయి ప్రమాణంగా చెప్పటానికి.
అయితే ధర్మం ఇంకావిస్త్రృతమైనది. అది సత్యం ,మారటానికి వీలులేనిది . మనకు అందుబాటులో ఉన్న ఉదాహరణ నొకటిచెబుతాను. "సూర్యుడు తుర్పున ఉదయిస్తాడు ".అన్నది సత్యం .

ఈ సత్యాన్ని ఎవరు చెప్పినా భాషలలో తేడాతప్ప భావంలో తేడాఉండదు . ఇదీ ధర్మమంటే. అనేకానేకమతాలు ఈ సత్యాన్ని చెప్పటానికి అనేకవిధాలుగా ప్రయత్నించవచ్చు , కానీ చెప్పబడే సత్యం ఒక్కటే .
ఈ తీరున చూస్తే మనది మతం కాదు .ధర్మం . హిందూ ధర్మం . సనాతనం .అంటే అనాది .ఆది కూడా ఇదే.

అందుకనే మనకు ఈ ధర్మంలో అనేకమతాలు కనపడతాయి ,అద్వైత.ద్వైత,విషిష్ఠాద్వైత,బౌద్ధ,జైన ములనుండి అనేకం ఇందులో . వీటన్నింటి మూలసూత్రాలు ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్నిమతాల మూలసిధ్ధాంతాలు ఇందులోనే కనిపిస్తాయి. దీనికి మిగతామతాలలాగా ఒకే మతగ్రంథం ప్రామాణికం కాదు. అదీగాక ఇది ఎవరో ఒక మహానుభావుని భావాలనుండి మాత్రమే ఉద్భవించిన సిధ్ధాంతం కాదు. అనేకానేకమంది ద్రష్ట లు భగవంతునినుండి పొందిన దివ్యజ్ఞానాన్ని పొందుపరుస్తుండగా అనంతంగావిస్తరించి,మనిషి సంపూర్ణమానవునిగా ఎదగటానికి అవసరమయ్యే విజ్ఞానభాండాగారం . ఇది యుగయుగాలుగా సుసంపన్నమవుతూ సాగుతున్న గంగ . కనుకనే మనం దీనిని ధర్మం అనిపిలవాలి . కాకుంటే వాడుకలో హిందూమతం అనేపిలుపుకు అలవాటయ్యాం. అదికూడా ఒకశుభకరమైన అలంకారమే . సృష్టిలోఉన్నసమస్తంలోనూ భిన్నత్వం కనపడుతుంది .అందులోభాగమైన మనుషులలోనూ భిన్నత్వం ఉంటుంది . ఈభిన్నత్వాల ఆలోచనలన్నీ ఏకత్వానికి చేరుకుంటాయని చెబుతూ,ఆసత్యాన్ని గ్రహించటానికే ఈ ధర్మంలో వివిధ ఉపాసనారీతులు,ఆరాధనలు ,యోగాలు కనపడతాయి. నేనుచెప్పినది నువ్వునమ్మటం కాదు .సత్యాన్వేషణలో నువ్వుసాగుతూ నేతి,నేతి,అంటూ అన్వేషణ సాగించు అంటూ మానవునికి సంపూర్ణస్వాతంత్ర్యాన్ని ఇచ్చిప్రోత్సహించే మార్గం ధర్మం కనుక ఇక్కడే . కనపడుతుంది . ఆకాశత్పతితం తోయం..యథాగచ్చతి సాగరం... అన్నట్లు చివరకు ఈ అన్వేషణలన్నీ పరమ ,చరమ సత్యమైన పరమాత్మవద్దకు చేరుస్తాయి. దానిని బోధించి అనుసరించమనదు.అన్వేషించు ,అన్వేషించు,నువ్వు అనంతశక్తిగలవానివి అనిచెబుతుంది.

కనుకనే దీనికి మతాలకున్నట్లు ఏఒక్కప్రవక్తో,ఒకమతగ్రంథము మాత్రమో ప్రమాణం కాదు. అనంతమైన పరమాత్మతత్వాన్ని అనంతంగా వివరిస్తూ సాగుతూనే ఉంది.

ఇక్కడ మీరింకొక ప్రశ్నవేయవచ్చు.

ఇంకేం !,అన్నీ ఇందులోనివే అయినప్పుడు దీనిని ఇంకోమతం ధ్వంశం చేస్తే మాత్రమేమి ?అదికూడా దీనిలోనిదే కదా అనవచ్చు.
చాలాగొప్పగా విస్తరించిన మహావృక్షంలో అనేకానేక శాఖలు ఉంటాయి . కొన్నిశాఖలు క్షీణించినా ,నశించినా కొత్త కొమ్మలు వస్తాయి ,కొత్తభావాలతో. ఇబ్బందిలేదు . కానీ మూలాన్ని నాశనంచేస్తే ? ఇక కొమ్మలుండవు రెమ్మలుండవు. ఇప్పుడు ఈయుగపురుషుడైన "కలి" చేస్తున్నదిదే . మూలాన్ని నాశనం చెయ్యాలని కొమ్మలనాశ్రయించి ముందుకొస్తున్నాడు.కనుక ధర్మాన్ని కాపాడుకోవాలి.అందుకోసం ధర్మాన్ని ఆశ్రయించాలి.

జైశ్రీరాం

4 వ్యాఖ్యలు:

Anonymous February 20, 2011 at 3:07 AM  

దుగ్గేశ్వర్ గారూ..

nice post

ఇంతకూ హిందూ మూలాన్ని నాశనం చేయటం అంటే ఏమిటి..? కలి అంటే ఎవరు? దయచేసి వివరించగలరు. ధన్యవాదములు.

durgeswara February 20, 2011 at 3:19 AM  

మీకు తెలియకకాదు. ఇక్కడచాలారోజులుగా రాద్దామని అనుకుంటూనే ఉన్నాను .సమయం చాలటంలేదు. మీరు ఒకసారి భాగవతం ,భవిష్యపురాణం చదవగలరు.

The Team February 20, 2011 at 6:47 AM  

chhala baaga chepparadi.

astrojoyd February 20, 2011 at 7:49 PM  

ఇంతకూ హిందూ మూలాన్ని నాశనం చేయటం అంటే ఏమిటి..? an0ny-mataaniki moolam dharmam.dharmmaanni naasanam cheyadame hindu-moolaalanu naasanam cheyadam.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP