వైభవోపేతంగా జరిగిన నవరాత్రి ఉత్సవములు
>> Saturday, October 20, 2018
అమ్మ అనుగ్రహం వలన నవరాత్రి ఉత్సవములు వైభవోపేతంగా నిర్వహించబడినాయి. పాఢ్యమి నాడు గణపతి పూజతో మొదలై బాల ,గాయత్రీదేవి ,మహాలక్ష్మి ,రాధాదేవి ,సరస్వతి ,అన్నపూర్ణ ,లలితాదేవి, దుర్గామాత,మహిషాసురమర్ధని , శ్రీరాజరాజేశ్వరి గా అమ్మవారు పూజలందుకున్నారు.
ప్రభాతకాలంలో సుప్రభాతం, సంధ్యాహారతులు ,అభిషేకములు అర్చనలు కుంకుమపూజలు ,హోమములు ప్రత్యేకించి సాయంకాలంలో సంకీర్తనా సేవలతో సాగి పూర్ణాహుతితో ముగిసాయి .ఈసందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తుల గోత్రనామాదులతో అర్చనలు నిర్వహించబడ్డాయి
0 వ్యాఖ్యలు:
Post a Comment