శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సెల్ ఫోన్ చార్జింగ్ దగ్గర నిర్లక్ష్యం తో దేశానికి పదివేలకోట్ల నష్టం కలుగుతుంది

>> Wednesday, December 30, 2015


జీవితంలో మనం ఏది చిన్న విషయం అనుకుంటామో అది చాలా పెద్ద విషయంగా మారవచ్చు. అధిక ప్రభావాన్నీ చూపించొచ్చు. అలాంటి కోవలోకి చెందినదే ‘సెల్‌ఫోన్‌ చార్జింగ్‌’. నిద్రపోయే ముందు సెల్‌చార్జింగ్‌ చేసి ఉదయాన్నే చార్జింగ్‌ను తీసేసే వారు ఈ విషయం తెల్సుకుంటే అసలైన విషయం బోధపడుతుంది.
 
ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ చేస్తుంటాం. సాధారంగా మొబైల్‌ రెండు గంటల్లోపే చార్జింగ్‌ ఫుల్‌ అవుతుంది. దీనికి నాలుగు వాట్స్‌ కరెంట్‌ ఖర్చవుతుందట. అయితే మనం రాత్రంతా అంటే దాదాపు ఆరుగంటల పాటు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పిన్‌ తీయకుండా వాడితే మొత్తం 24 వాట్స్‌ కరెంటు ఖర్చు అవుతుంది.
 
మన భారతదేశంలో సుమార్‌ ఎనభై కోట్ల మందికి సెల్‌ఫోన్స్‌ ఉన్నాయి. వీరిలో దాదాపు పదిశాతం అంటే ఎనిమిది కోట్ల మంది ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి మర్చిపోతే 19.2 లక్షల కిలోవాట్స్‌ కరెంట్‌ ఏ పనికీ ఉపయోగపడకుండా అనవసరంగా ఖర్చు అవుతుంది. ఈ 19.2 లక్షల కిలో వాట్స్‌ కరెంట్‌ను మెగావాట్స్‌లో 1920 మెగావాట్స్‌ అవుతుంది.
 
ఒక మెగా వాట్‌ కరెంట్‌ను తయారు చేయటానికి ప్రభుత్వం ఐదు కోట్ల ఖర్చు పెడుతోంది. అంటే దాదాపు 1920 మెగావాట్స్‌ కరెంట్‌ తయారు చేయడానికి పదివేల కోట్లు ఖర్చుపెడుతుంది. కేవలం సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం వేస్టేజ్‌ అయిన కరెంట్‌కు మన ప్రభుత్వం ఇంత విలువ చెల్లించటం, అదంతా చివరికి మన తలకు ట్యాక్స్‌ రూపంలో పడుతోంది. సో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ విషయంలో ఈ రోజునుంచైనా జాగ్రత్తపడండి, మిగతా విషయాల్లోనూ కరెంట్‌ను ఆదా చేయండి
 from  andhrajyothy.daily

2 వ్యాఖ్యలు:

Narendar Reddy December 31, 2015 at 12:07 AM  

ఒకసారి బాటరీ ౧౦౦% ఛార్జ్ అయ్యాక విద్యుత్ సరఫరా నిలిచి పోతుంది

Vamshi Krishna January 3, 2016 at 12:41 AM  

Chala manchi vishayam chepparu sir. Dhanya vaadamulu. Vilainantha varaku nenu kuda itharulaku teliyachestanu. Nenaithe yelago rathri puta charging alage petti padukonu.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP