శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"హిందూ మతములో దళితుడుని శంకరాచార్యను చెయ్యమనండి."

>> Sunday, August 30, 2015

నయనార్లు పీఠాధిపతులతో సమానంగా జ్ఞానులు.
రాత్రి వార్తలకోసం చూస్తుంటే ఒక చానల్ చివర శ్రీమాన్ ఐలయ్య గారి దర్శనం అయ్యింది. వారు చివరగా చెప్పినది ఆ మహానుభావుని జ్ఞానపు అంచులు విప్పింది.
వారు ఛాలెంజ్ గా అడిగినది --చెప్పినది "హిందూ మతములో దళితుడుని శంకరాచార్యను చెయ్యమనండి."
ఆ టీవీ యాంకర్ "ఇంక సమయం అయిపోయింది" అని ఆ చర్చని ముగించారు. ఆ చర్చ దేనిగురించో నాకు తెలియదు. కాని శ్రీమాన్ ఐలయ్యగారి నటన గురించి మనకు తెలియాల్సింది నేను చెప్పాలనుకున్నాను.
వారు నయనార్లు అనే వారు ఉన్నారని తెలుసుకోవాలి వారికి తెలిసే ఉంటుంది. శివారాధకులకు వారిని గురించి తెలియని వారు ఉండరు. ఆ నయనార్ల లో అరవై మూడు మంది నయనార్లు ముఖ్యులు. వారిలో చాలామంది శ్రీమాన్ ఐలయ్య గారు ప్రతిసారి ఉటంకించే దళితులు అనే మానవుల నుండి వచ్చినవారే ఎక్కువ . వారిలో మనకి బాగా తెలిసిన నయనార్ భక్తకన్నప్ప నయనార్. వీరు భక్తిలో గాని,జ్ఞానములో గానీ, శంకరాచార్యులకు తక్కువేమీ కాదు. వారిని సనాతన ధర్మము అందలము ఎక్కించింది. గురువులుగా స్వీకరించి దాసోహము అన్నది. శ్రీమాన్ ఐలయ్యగారికి నయనార్ల గురించి తెలియకపోవడము అనేది నటన మాత్రమే. నయనార్ల విగ్రహాలు సనాతన ధర్మము ఆలయాలలో ఉంచి పూజించడము ఆయనకు తెలియదని ఎవరూ భావించనక్కర్లేదు. తరతరాలుగా సనాతన ధర్మమును దెబ్బతీయాలనుకునే వారి పంధానే శ్రీమాన్ ఐలయ్యగారు అవలింబించి, తనకి అవకాశం వచ్చినప్పుడల్లా అవాకులు చెవాకులు పేలుతూంటారు. దళితులు సనాతన ధర్మము పరిఢవిల్లటానికి చేసిన సేవలు తెలుసుకోవాలంటే ద్రవిడ భక్తి సాహిత్యం చదవాలి. తెలిసికూడా తెలియనట్లు నటించి సనాతన ధర్మానికి ఒక ఆలంబన ఇచ్చే బ్రాహ్మణ్యాన్ని దెబ్బతీసి అన్యమతాన్ని ఈ దేశములో ఇంకా శాఖోపశాఖలుగా విస్తరింప చేయాలనుకునే ఈ కుయుక్తుని ఆటలు సాగవని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

2 వ్యాఖ్యలు:

lakshman August 30, 2015 at 5:12 AM  

Well Said

sastry September 1, 2015 at 9:34 AM  

May be he is acting as an agent to some one who is against hinduism

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP