శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ శనివారం "దరిశి" పట్టణంలో విద్యార్థుల కోసం" విజయీభవ" కార్యక్రమం నిర్వహించనున్న రామదండు.

>> Thursday, March 6, 2014



                                                           [ఫైల్ ఫోటోలు]
పదవతరగతి, ఇంటర్మీడియెట్  విద్యార్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా  దరిశి పట్టణంలో  ఎనిమిదవ తేదీ శనివారం రోజున స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో  "విజయీభవ" కార్యక్రమం  నిర్వహించబడుతున్నది.
ఈకార్యక్రమంలో విద్యార్థులకు జయాన్ని ప్రసాదించమని వేడుకుంటూ స్వామివారికి అభిషేకం ,ప్రత్యేక అర్చనలు జరిపి అనంతరం స్వామివారి పాదాలపై పెన్నులను ఉంచి పూజ జరుపబడుతుంది. ఉదయం ఏడుగంటలనుండి  వచ్చే విద్యార్థులందరికీ స్వామి వారి "రక్ష"ఆంజనేయస్వామి వారి దండకం కార్డ్, పెన్  ప్రసాదం గాఇవ్వబడుతుంది . ఆసమయంలో అర్చకులు వారిపై అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తారు.  హనుమంతుని ఆశ్రయించటం ద్వారా విజయాన్ని పొందిన వారిగూర్చి స్వామి అనుగ్రహ శక్తిగూర్చి  విద్యార్థులకు వివరించటం జరుగుతుంది. ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు,విద్యాసంస్థలు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈకార్యక్రమంలో పీఠ కార్యకర్తలచే ఏర్పడ్డ "రామదండు" స్థానిక ఆథ్యాత్మిక సంస్థలు ఏర్పాట్లు  చూస్తున్నారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP