శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు పీఠంలో వార్షికోత్సవపూజలు

>> Sunday, February 9, 2014







 శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం   డెబ్బైసంవత్సరాలక్రితం వెంకయ్య ,గోవిందమ్మల పుణ్యదంపతులకు అమ్మవారి సాక్షాత్కారంతో ప్రారంభమై      భక్తుల సేవలందుకుంటూ అమ్మ ఆటలాడుకుంటున్న కేళీవనం. ఆతల్లి ఆదేశం మేరకు పీఠాన్ని రవ్వవరం గ్రామం నుండి సమీపంలో ఉన్న మా పొలం లోకి తరలించి నిత్యసేవా కార్యక్రమాలు జరుపుకుంటుండగా  ,తల్లితన అనుగ్రహంతో దివ్యమందిరాన్ని నిర్మింపజేసి ,అందులో శ్రీవేంకటేశ్వర ,రామలింగేశ్వరసమేతంగా  ఆవరణలో గణపతి,కుమార,అయ్యప్ప,దత్తాత్రేయ,హనుమంత, నవగ్రహాది పరివారదేవతా సమేతంగా  మాఘశుధ్ధ దశమినాడు కొలువైకూర్చున్న దివ్యముహూర్తం నేటికి ఏడుసంవత్సరాలైంది.  ఒక్కో సమయంలో ఒక్కో లీల చూపుతూ కలియుగంలో తనను నమ్మిన భక్తులకెన్నడు నాశములేదని అభయమొసంగుతూ ,దీనులమైన మమ్ము కరుణతో పాలిస్తూ పోషిస్తూ,కన్నతల్లిప్రేమఎలాఉంటుందో సాక్షాత్కారంగా కనిపిస్తూఉంది........................................ జై జగన్మాతృకే. జైభవానీ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP