శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జీవన సౌధాన్ని నిర్మించుకో

>> Sunday, January 5, 2014

ఒకసారి మదన మోహన మాలవ్యా హైదరాబాద్ నవాబు వద్దకు వచ్చి బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు విరాళం ఇవ్వవలసిందని చేయి చాచి అర్థించారు.  కోపోద్రిక్తుడైన నవాబు, “ఒక హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు నన్నే విరాళం అడుగుతావా? ఎంత ధైర్యం నీకు?” అని అంటూ కాలి చెప్పును తీసి ఆయనపై విసిరారు.  మాలవ్యా మారు మాట్లాడకుండా ఆ చెప్పునే కానుకగా రెండు చేతులతో అందుకుని, నేరుగా బజారు వీధికి చేరుకున్నారు.  అక్కడ ప్రజలను పిలచి నవాబు తనకు ఎంతో ప్రేమతో ఇచ్చిన పాదరక్షను వేలం వేస్తున్నాననీ, నవాబు మీద గౌరవం కలిగిన వారెవరైనా తగిన మూల్యం చెల్లించి, దానిని దక్కించు కోవచ్చుననీ ప్రకటించారు.  ఈ కబురు క్షణాలలో నవాబు చెవిన పడింది.  వేలంలో తన పాదరక్ష తక్కువ ధరకు అమ్ముడు పొతే తనకు అవమానమని భావించిన నవాబు, వెంటనే ఒక సహాయకునికి పెద్ద మొత్తం ఇచ్చి, దానితో ఆ చెప్పును కొని తీసుకురావలసిందిగా ఆదేశించాడు.  ఆ విధంగా లభించిన డబ్బును మాలవ్యా తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి వినియోగించారు.

మరొక సారి మాలవ్యా ప్రయాణిస్తున్న దారిలో ఒక బ్యాంకు నష్టాలలో పడి, కల్లోలంలో ఉంది.  మడుపరులందరు తమ డబ్బు తమకు ఇచ్చేయవలసిందని బ్యాంకు మీద విరుచుకు పడడంతో నిర్వాహకులు తలబాడుకుంటున్నారు.  ఆ సమయంలో మాలవ్యా బ్యాంకు లోపలకు వెళ్లి, తన విశ్వవిద్యాలయ నిర్మాణానికి విరాళం ఇవ్వవలసిందిగా బ్యాంకు పెద్దలను కోరారు.  “పండిట్ జీ, మా బ్యాంకు దివాలా తీసే స్థితిలో ఉందని తెలిసి కూడా మీరు ఇలా అడగడం న్యాయమేనా?” అని వారు ఆయనను ప్రశ్నించారు.  మాలవ్యా వారితో, “ఓ అయిదు లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వండి చాలు, నగదు అవసరం లేదు” అని అన్నారు.  ఆ కాలంలో అయిదు లక్షల రూపాయలంటే ఈ కాలంలో కోటాను కోట్ల కింద లెక్క.  వారు దిమ్మెర పోయారు.  “భయం లేదు.  నా మీద నమ్మకముంచండి! మీకంతా మంచే జరుగుతుంది.  నేను చెప్పినట్లు చెయ్యండి” అన్నారు మాలవ్యా. వారు భయపడుతూనే, ఆయన అడిగినట్లుగా చెక్కు రాసి ఇచ్చారు.

మర్నాడు ఈ వార్తా హిందూస్తాన్ టైమ్స్ దినపత్రికలో ప్రముఖంగా అచ్చయింది.  దానితో డిపాజిటర్లకు బ్యాంకు మీద విశ్వాసం అనూహ్యంగా పెరిగింది.  ఎంత పటిష్ఠంగా ఉండకపోతే, బ్యాంకు అంత విరాళం ఇవ్వగాలుగుతుమ్డనే ఆలోచన వారిని పునరాలోచనలో పడవేసింది.  వారంతా తిరిగి బ్యాంకుకు రావడం మొదలు పెట్టారు.  ఏడాది లెక్కలు ముగించే నాటికి బ్యాంకు లాభాలతో పరవళ్ళు తొక్కుతోంది.  చెక్కు మాలవ్యా వద్దనే భద్రంగా ఉంది.   బ్యాంక్ యాజమాన్యం స్వయంగా వారి వద్దకు వచ్చి, ధన్యవాదాలను తెలియజేసి, పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది. 

స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రను పోషిస్తూనే, వార్తా పత్రికా రంగంలో, విద్యా రంగంలో విశేష కృషి చేసిన మాలవ్యా, హిందువులకు ప్రత్యెక విశ్వవిద్యాలయం ఆవశ్యకతను 1900 సంవత్సరంలో గుర్తించారు. వజ్ర సంకల్పబలంతో 1916 ఏప్రిల్ 1వ తేది నాటికి పూర్తీ స్థాయిలో ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించ గలిగారు.  నేడు 1,370 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, 14 రంగాలలో, 127 శాఖలతో, 16,000 మంది విద్యార్థులతో, 1,300 మంది అధ్యాపకులతో దేశానికి మకుటాయ మానంగా నిలుస్తున్న బెనారస్ హిందూ యూనివర్సిటి, హిందూ జాతికి మాలవ్యా ఇచ్చిన అపురూపమైన కానుక.  దీనికిప్పుడు 13 లక్షల పుస్తకాలతో కేంద్ర గ్రంధాలయం ఉంది.  38 చిన్న గ్రంధాలయాలున్నాయి.  మరో మూడేళ్ళలో నూరు వసంతాలు పూర్తీ చేసుకోబోతున్న ఈ సరస్వతీ నిలయం మాలవ్యా పండితుని దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా వారణాసి నగరంలో దర్శనమిస్తోంది. 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP