‘ఆదిత్య హృదయం’ పరమపవిత్రం
>> Friday, January 3, 2014
పాపాలను,
శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుశ్యును పెంచే అమోగమైన అక్షర సాధనం
అదిత్య హృదయం. ఈ అమోగమైన స్తోత్రరాజాన్ని శ్రీ రామ చంద్రునికి
ఆగస్త్యమహర్షి మంత్రాల వంటి మాటల తో వివరించాడు.ఆరోగ్య భాగ్యమును సకల
సంపదలను ప్రసాదించే వానిగా, ప్రత్యక్షదెైవముగా సూర్య భగవానుడు పేరు
ప్రఖ్యాతి కాంచినాడు.అదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంధము. శ్రీమద్ రామాయణ
మహాకావ్యమంద లి యుద్దకాం డలో 105వ సర్గలో సూర్య భగవానుని స్తుతి కి
‘‘ఆదిత్య హృదయం’’ అని నామకరణం చేశారు. వీటిలో ఆదిత్య నామం శ్రీరామాయణ
కర్తఅయిన వాల్మీకి మహార్షి కి చాలాఇష్టం.అదిత్యులు12మంది. అందులోవిష్ణువు
ము ఖ్యుడు ఆదిత్యులలో ‘‘నేను విష్ణువు’’ను అని గీతాచార్యెడెైన శ్రీకృష్ణ
భగవానుడు తెలిపెను.‘‘ఆదిత్యానా మహం విష్ణుం’’ అందువలన ఆదిత్య హృదయంను
విష్ణువు స్తోత్రముగా భావిస్తారు.
ఆదిత్యహృదయం విశేషపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే యిహలోకమున అన్ని రకాల సంపదులు, పరమున పుణ్యలోకములను పొందును. సంతానం లేనివారు ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుచుట్టూతిరు గుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికివిజయంలుగుతుంది. కఠిక దారిద్ర్యంచే బాధ పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల సంపదలు కలుగుతాయి.ఆనారోగ్య రుగ్మతలతో బాధపడుచున్నవారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణ ము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో బాధపడేవారు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. . శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.
దీని తో శ్రీరాముడు చింతాక్రాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి చూస్తున్న ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే. ఓరామ!నీకు మహాపవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. దీని వల్ల నీ వు యుద్ధమును రావణున్ని సులభంగా జయించగలవు. మహా పుణ్యప్రదము,జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుశ్శు ను కలుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశిం చెదను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, తొమ్మిండుగురు ప్రజాపతులు ను, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యువును, యముడును, చంద్రుడును, సముద్రుడును అను వీరందరును ఇతడే. పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు,అశ్వినీ దేవతలు, మరుత్తులు,మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యడే అంతర్యామియై ఉన్నాడు. బంగారు రూపముగల అండమును గర్భమునందు గలవాడు. బంగారంతో సమానమైన అంతఃకరణ గలవాడవును, చల్లవాడవును, శత్రుసంతానములను పోగొట్టువాడవును, లోకమునకు వెలుతురు కలుగజేయువాడువును, అదితియొక్క కుమారుడవు ను, మంచును పోగొట్టువాడవును అను నీకు భక్తితో నమస్కనించి స్తోత్రమును చేయుచున్నాను. ఋగ్వేదము, యజుర్వేదము,సామవేదము, ఆధర్వణవేదము అను నాలుగు వేదములయొక్క సారము అయిన వాడవునుచ సమస్త వేదములును నీవే అయినవాడువును సముద్రజలముపెై శయనించు వాడవును,దక్షిణాయనమున వింధ్య పర్వతతమున సంచరించువాడవును అయిన భక్తి సేవించుచున్నాను అని శ్రీరాముడు అనెను.
సమస్త నక్షత్రములకును, గ్రహములకును అధిపతివయిన వాడవును లోకమునుకు ఆధారభూతుడవును, స్వర్గము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశము, దిక్కులు, భూమి, సముద్రము అన్నియు నీ వీర్యముచే నిలిచి ఉన్నవి. ఇంద్రుడు, ధాత, భృగుడు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, ఆర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత,విష్ణువు అను పేరుగల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కరిరస్తున్నాను. ప్రళయ కాలమున యిశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరల సృష్టించి కిరణములచే లోకానికి తాపమును కలుగజేసి వర్షములను కురిపించి సర్వజయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను.ఈ విధంగా ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.
- రావుల రాజేశం
ఆదిత్యహృదయం విశేషపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే యిహలోకమున అన్ని రకాల సంపదులు, పరమున పుణ్యలోకములను పొందును. సంతానం లేనివారు ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుచుట్టూతిరు గుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికివిజయంలుగుతుంది. కఠిక దారిద్ర్యంచే బాధ పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల సంపదలు కలుగుతాయి.ఆనారోగ్య రుగ్మతలతో బాధపడుచున్నవారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణ ము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో బాధపడేవారు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. . శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.
దీని తో శ్రీరాముడు చింతాక్రాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి చూస్తున్న ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే. ఓరామ!నీకు మహాపవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. దీని వల్ల నీ వు యుద్ధమును రావణున్ని సులభంగా జయించగలవు. మహా పుణ్యప్రదము,జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుశ్శు ను కలుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశిం చెదను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, తొమ్మిండుగురు ప్రజాపతులు ను, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యువును, యముడును, చంద్రుడును, సముద్రుడును అను వీరందరును ఇతడే. పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు,అశ్వినీ దేవతలు, మరుత్తులు,మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యడే అంతర్యామియై ఉన్నాడు. బంగారు రూపముగల అండమును గర్భమునందు గలవాడు. బంగారంతో సమానమైన అంతఃకరణ గలవాడవును, చల్లవాడవును, శత్రుసంతానములను పోగొట్టువాడవును, లోకమునకు వెలుతురు కలుగజేయువాడువును, అదితియొక్క కుమారుడవు ను, మంచును పోగొట్టువాడవును అను నీకు భక్తితో నమస్కనించి స్తోత్రమును చేయుచున్నాను. ఋగ్వేదము, యజుర్వేదము,సామవేదము, ఆధర్వణవేదము అను నాలుగు వేదములయొక్క సారము అయిన వాడవునుచ సమస్త వేదములును నీవే అయినవాడువును సముద్రజలముపెై శయనించు వాడవును,దక్షిణాయనమున వింధ్య పర్వతతమున సంచరించువాడవును అయిన భక్తి సేవించుచున్నాను అని శ్రీరాముడు అనెను.
సమస్త నక్షత్రములకును, గ్రహములకును అధిపతివయిన వాడవును లోకమునుకు ఆధారభూతుడవును, స్వర్గము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశము, దిక్కులు, భూమి, సముద్రము అన్నియు నీ వీర్యముచే నిలిచి ఉన్నవి. ఇంద్రుడు, ధాత, భృగుడు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, ఆర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత,విష్ణువు అను పేరుగల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కరిరస్తున్నాను. ప్రళయ కాలమున యిశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరల సృష్టించి కిరణములచే లోకానికి తాపమును కలుగజేసి వర్షములను కురిపించి సర్వజయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను.ఈ విధంగా ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.
- రావుల రాజేశం
0 వ్యాఖ్యలు:
Post a Comment