కార్తీక సోమవారం సహస్రలింగార్చనలో మీతరపున శివలింగ ప్రతిష్ఠ,అర్చనకై గోత్రనామాలు పంపండి
>> Thursday, November 28, 2013
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో ఈకార్తీకంలో చివరి సోమవారం రోజున సహస్రలింగార్చన జరుపబడుతున్నది. ఈ సహస్రలింగార్చనలో అందరికీ ఫలితం లభించేందుకై ఒక్కో కుటుంబం తరపున ఒక్కో పార్థివలింగాన్ని ప్రతిష్టించి అర్చించాలని సంకల్పము . కనుక భక్తులు తమ గోత్రనామాలను పంపితే వారితరపున ఆరోజు శివార్చన జరుపబడుతుంది.
అయితే ఇందుకొరకు ఒక రుసుము చెల్లించవలసి ఉంది
అదేమిటంటే
సోమవారం[2-12-2013]రోజు మీ గృహంలో శివారాధన చేయాలి. వీలుకాకుంటే కనీసం వెయ్యిన్నెనిమిది సార్లు పంచాక్షరీ జపాన్ని చేయనైనా చేయాలి. వీలైతే సాయంత్రం శివలింగాకృతిలో దీపాలను ఏర్పాటుచేసుకుని అర్చించుకొనవచ్చు .మీపై ఈశ్వరానుగ్రహం అపారంగా వర్షించాలని వేడుకుంటూ
గోత్రనామాలు పంపవలసిన చిరునామా durgeswara@gmail.com [ఇప్పటికే కార్తీకమాసపూజలకు గోత్రనామాలు పంపినవారు మరలా పంపనవసరం లేదు]
3 వ్యాఖ్యలు:
chala bagundi andii...
swami vaari seva chesukovadam meeku labhinchina varam. namassulu
AUM NAMAHSIVAAYA.
Eswara lingam photos chal baavoondi.
Post a Comment