శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జైసద్గురు వీరబ్రహ్మేంద్ర

>> Tuesday, May 1, 2012



ఈ రోజు వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనా ఉత్సవం . కాలజ్ఞానమును బోధించి భవిష్యత్ ను ముందుగా తెలిపి మానవజాతి ని మేల్కొమ్మని చెప్పిన మహానుభావుడు . కలి ప్రభావం వలన భూమిపై ఎన్ని అనర్ధాలు సంభవిస్తాయో ఆయన చెప్పిన ప్రతిమాటా సత్యమవుతూ ఉంది . సమాజంలో నెలకొన్న అసమానతలను ఖండించి మతమౌఢ్యాన్ని తెగనాడి సద్గురువై సాధకులకు దారిచూపిన దివ్యజ్యోతి తాతగారు.


వ్యాపారమను పేర తెల్లదొరలూ వచ్చి .....భారతదేశాన్ని ఎలాదోచుకోబోతున్నారో హెచ్చరించారు . ఉద్యోగములుచూపి ఉచ్చులెన్నో వేసి మ్న మతానికె ఎసరు పెడతారు ..అని ఆయన చేసిన హెచ్చరికలను గమనించి ధర్మాచార్య్లులు ప్రతిక్రియలపై దృష్టి పెట్టినట్లైతే ఇప్పటి అనర్ధాలకు కొంత అడ్డుకట్ట వేసినట్లయ్యేది . ఇంకా ఆ మహాయోగి సూచించిన భవిష్యత్
ప్రమాదాలనుండి తప్పుకొనటానికై అవసరమైన ధార్మికాచారములను పాటించవలసిన సమయం వచ్చింది.
రామ ...అననివారెల్ల రాలిపోయేరు అని వారుచేసిన హెచ్చరిక మరువరాదు ..మనం .
జైసద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామికీ

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP