శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినవాడుకూడా ముండా అన్నాడట ! ఎంత చులకనైపోయాము మనం ?

>> Sunday, December 12, 2010

ఈ వార్త చూడండి :


"మూర్ఖ భారతదేశం": సింగపూర్ దౌత్యవేత్త అనుచిత వ్యాఖ్య

వికీలీక్స్ బయటపెడుతున్న రహస్య విషయాలు కొన్ని దేశాల మధ్య చిచ్చు
రగిల్చేవిగా ఉంటే.. మరికొన్ని దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం
చేసేవిగా ఉన్నాయి. ప్రపంచ దేశాలను తిట్టడం, దేశాధినేతలకు మారుపేర్లు
పెట్టడం వంటిది ఇప్పటి వరకూ అమెరికానే చేసిందనుకున్నాం. కానీ.. ఇప్పుడు ఆ
జాబితాలోకి సింగపూర్ కూడా చేరిపోయింది.

ఇటీవల వికీలీక్స్ విడుదల చేసిన దౌత్య పత్రాలలో సింగపూర్‌కు చెందిన
దౌత్యవేత్త భారత్‌ను ఓ మూర్ఖదేశంగా అభివర్ణించినట్లు అస్ట్రేలియాకు
చెందిన ఫాక్స్ మీడియా సంస్థకు విడుదల చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.
సింగపూర్ రాయబారి టామీ కో భారత్‌ను 'మూర్ఖదేశమ'ని, జపాన్ 'చిక్కిపోతోంది'
అని వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ పేర్కొంది.

ఈ పత్రాల ప్రకారం.. "మూర్ఖ భారతీయ మిత్రులు.. భారత్ సగం ఆసియాన్
కూటమిలోనూ, సగం దాని బయట ఉంది" అని కో అన్నారు. గత 2008, 2009 మధ్యకాలంలో
సీనియర్ అమెరికా అధికారులైన డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ ఫర్ ఈస్ట్ ఏషియా
డేవిడ్ సిడ్నీలతో సింగపూర్ విదేశీ వ్యవహారాల అధికారులు
వ్యాఖ్యానించినట్లు వెల్లడైంది.

అంతే కాకుండా.. మలేసియా, థాయ్‌ల్యాండ్, జపాన్ తదితర దేశాలపై వారు అనుచిత
వ్యాఖ్యలు చేశారు. జపాన్ నాయకత్వానికి సరైన ధృక్పధం లేదని, మలేసియాకు
సరైన నాయకత్వం లేకపోడం ప్రధాన సమస్య అని వారు వ్యాఖ్యానించారు.

http://telugu.webdunia.com/newsworld/news/international/1012/13/1101213006_1.htm


--

ఈడ్చితంతే మన రెండుజిల్లాలంతలేదు .సింగపూర్కుకూడా చులకనై పోయామా మనం ?

ఎక్కడైనా బలవంతుడే గౌరవింపబడతాడు . అతిమెతకసరుకు , ఇంట్లోనే విలువలేని ఈదేశానికి బయటనుంచి గొప్పగౌరవం ఎలాతేగలుగుతుంది మన నాయకత్వం .
పార్లమెంట్ పైనేకాదు, పౌరులపైనా దాడిచేసి పిట్టల్ని కాల్చినట్లు కాల్చినా వాల్లనేమీ చేయలేము . రాయబారిని ఆడపడుచు అనిచూడకుండా వల్లంతా తడిమి పరీక్షించినప్పుడు , మనమంత్రులకు అవమానం జరిగినప్పుడు కూడా గట్టిగా మాట్లాడలేని , ఆడా మగా కాని నాయకత్వాలతో ఈ భారతమాతకు ఇంతకంటే విలువదక్కదేమో .క్షమించమ్మా భారతీ చేతగాని వాజమ్మలమై నిన్ను అవమానాల పాల్జేస్తున్నందుకు . దు:ఖించమ్మా గుండెలవిసేలా ఇలాంటి సంతానాన్ని పొందినందుకు ..


11 వ్యాఖ్యలు:

Anonymous December 13, 2010 at 1:06 AM  

క్షమించమ్మా భారతీ చేతగాని వాజమ్మలమై నిన్ను అవమానాల పాల్జేస్తున్నందుకు . దు:ఖించమ్మా గుండెలవిసేలా ఇలాంటి సంతానాన్ని పొందినందుకు..

Malakpet Rowdy December 13, 2010 at 4:54 AM  

I think the issue has been blown out of proportions. That guy didnt call the whole nation stupid. He was taking our foreign policy, of being half in and half out of ASEAN, to task.

Anonymous December 13, 2010 at 5:46 AM  

ఆడవాళ్ళని అవమానించకూడదనే కదా ఆ సామెత చెబుతున్నది.. ఎందుకు మార్చడం ? ఇలా మారుస్తూ పోతే ఎన్ని సామెతల్ని మార్చాలో !

durgeswara December 13, 2010 at 6:35 AM  

ఇవే రంధ్రాన్వేషనలంటే . సమస్యను గమనించకుండా సామెతలుమార్చండి,జాతీయాలు తీసేయండి అంటే ఎలా?
విషయం గమనించండి స్వామీ !

durgeswara December 13, 2010 at 6:35 AM  
This comment has been removed by the author.
Jagadeesh Reddy December 13, 2010 at 7:20 AM  

మన దగ్గర ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సంపద వున్నా, చేతగాని వాళ్ళం కావడం వల్లే ఈ అనర్ధాలన్నీ.... ఒక సమస్య వస్తే కప్పదాటు ధోరణి అవలంబించే నాయకులు వున్నంత కాలం, అఫ్జల్ గురు లాంటి వాళ్ళని, కసబ్ లాంటి వాళ్ళని వురి తీయకుండా ఇంకా విందు భోజనంతో మేపే రాజకీయ నాయకులున్నంత కాలం మన పరిస్తితి ఇంతే...

శరత్ కాలమ్ December 13, 2010 at 8:06 AM  

వ్యావహారిక భాషలో విధవరాలిని ముండ అని పిలవక ఏమని పిలుస్తారు? ఇలాంటి అభ్యంతరాలన్నీ పట్టించుకుంటే అందరం గ్రాంధికమే మాట్లాడాల్సి వుంటుంది కానీ ఈ పదం పైన అభ్యంతరాలని పట్టించుకోకండి. ఓ కొద్దిమంది జనం సెన్సిటివ్ అయిపోతున్నారనీ మనమూ తల ఊపకూడదు.

durgeswara December 13, 2010 at 8:13 AM  

అనవసర వివాదం అని పైన రెండువ్యాఖ్యలు తొలగించాను ఏమనుకోవద్దు ఆ మితృలు

Anonymous December 14, 2010 at 1:25 AM  

సింగపూర్ వాళ్ళకి కాస్త బలుస్తోందన్నమాట నిజమే. వాళ్ళకున్న ఓ రోగమేమంటే ప్రపంచంలో అంతా తమనే అనుసరిస్తున్నారని ఓ అపోహ వుంది. కాని వాళ్ళు బ్రిటన్, అమెరికాలను అడ్డంగా కాపీ కొడుతుంటారు. అన్నిదేశాలపై వాళ్ళు ఇలా చేయాలి, అలాచేయాలి అని అయాచిత సలహాలిచ్చేస్తుంటారు. ఇలాంటి సలహాలిచ్చినప్పుడు తైవాన్ లీడర్ ఓ సారి " ముక్కులో పొక్కు అంతలేని సింగపూర్ కూడా సలహాలిచ్చేదే అన్నాడు.:) అస్ట్రేలియా కూడా ఓ సారి అలానే విసుక్కున్నారు. ఇదంతా గాసిప్ అని, అవన్నీ పట్టిచుకోనక్కరలేదని ఆదేశ విదేశాంగమంత్రి నిన్న సెలవిచ్చారు. అంటే ఆ దేశ వున్నతాధికారులు గాసిప్ లతో గడిపేస్తుంటారనే కదా! కాబట్టి పట్టించుకోనవసరం లేదు.

మలక్పేటూ, ఫారిన్ మినిస్ట్రీని తిడితే ఇండియాని తిట్టినట్టు కాదా!?!

Anonymous December 15, 2010 at 8:08 AM  

శరత్ గారు ,ఆ సామెతలో విధవరాలి గురించి ఎక్కడుంది ?విధవరాలిని మొగుడు ఎలా తిడతాడు ?got my point?

kadambari December 19, 2010 at 8:20 AM  

మన నాయకత్వం .
పార్లమెంట్ పైనేకాదు, పౌరులపైనా........
అని కాదు,

"పౌరులపైనేకాదు , పార్లమెంట్ పైనా ....."
అని చెప్పాలి.

స్వార్ధ చింతననే భుజ స్కంధాల మీద మోస్తూన్న మన నాయకులు గురించి ఏమని చెప్ప గలము? ప్చ్!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP