సాగుతున్నయాగానికి సానుకూల పరిణామాలు
>> Monday, August 10, 2009
లోక కళ్యాణం కోసం చేస్తున్న రామనామ జపయజ్ఞానికి ఆటంకాలు తొలగిపోతున్నాయి .ఆపవనసుతుని రక్షణలో సాగుతున్న ఈ యాగానికి సానుకూలవాతావరణం ఏర్పడుతున్నది. మా పిల్లలు యాగం మొదలెట్టిన శనివారం నుండి వాతావరణం చల్లబడినది . మబ్బులు పట్టి వున్నవి. స్వామి అనుగ్రహమా అన్నట్లు ఆరోజు రెండు చినుకులు చిలకరించాయి . మనమంటే నోరున్నది కనుక ఏదోఒకటి అడిగితెచ్చుకుని తినగలుగుతాము ,పాపం ఆమూగజీవులు చూడండిరా గడ్డిలేక నేలనే నాక్కుంటున్నాయని ,చుట్టూ పరిసరాల్లోవున్న పశువులను చూపాను. మాపిల్లలు మరింత పట్టుదలతో జపం చేస్తున్నారు , వర్షాలు కురిసి వాటికి మంచి పచ్చిక దొరకాలని కోరుతూ .
ప్రస్తుతము ఈయాగం వివరాలు చెప్పగానే లక్ష్మీపురం ,గాంధీనగర్ ,సాయినగర్ ,తిమ్మాపురం ,రాముడుపాలెం ,తండా ,బుర్రిపాలెం గ్రామస్తులు తమ గ్రామం లో జపయాగం జరపటానికి సిద్దమయ్యారు. వచ్చే ఆదివారం అన్నిగ్రామాలలో ఒకేసమయం లో యజ్ఞము పూర్ణాహుతి జరపాలని సంకల్పంతో సాగుతున్నాము
జై శ్రీరామ్
2 వ్యాఖ్యలు:
మంచి ప్రయత్నం.
ఆ పవన సుతుడు మీ నమ్మకాన్ని నిజం చెయ్యాలని ఆశిస్తూ.....
jai sriram
Post a Comment