స్వైన్ ఫ్లూ ముప్పుకు మందు మనదగ్గరేవుంది
>> Tuesday, August 11, 2009
స్వైన్ ఫ్లూ మహమ్మారి ముంచుకొస్తుంది .అదేకాదు మరికొన్ని కొత్తవ్యాధులు కాచుకు కూర్చుని వున్నాయి.ఈసమయం లో జనాన్ని కాపాడేశక్తి ప్రభుత్వాలకుందని నమ్మలేము .ఎందుకంటే గుంటూరు జిల్లా లాంతి ఒకపెద్దజిల్లాలో స్వైన్ఫ్లూ నిర్దారించే పరికరాలు ప్రయోగశాలలూ కానీ లెవని ఇరవై నాలుగుగంటలలో పూనే కో ఢిల్లీకో సాంపిల్స్ ను పంపించటం సాధ్యమయ్యేపనికాదని ఇక్కడ జిల్లాస్థాయి వైద్యాధికారులు స్పష్టం చేసారు ఈరోజు . అంటే ఒకదానివెంట ఒకటిగా దాడులు చేస్తున్న ఈ మహమ్మారులను నిలువరించగలగటం కేవలం ఆధునిక పద్దతులవలనమాత్రమేసాధ్యం కాదు .సాంప్రదాయ పద్దతులను పక్కనబెట్టటం ఎంతనష్ట మో ఇప్పుడైనా అలోచించాల్సిన విషయం . ప్రకృతిని హింసించి ,ప్రకృతి విరుద్దమైన పనులు చేసి తెచ్చుకున్న ముప్పును మనం మరలా ప్రకృతిని ఆశ్రయించటం ద్వారామాత్రమే నివారించుకోగలుగుతాము.
ప్రస్తుతం మనలను వణికిస్తున్న ఈ స్వైన్ఫ్లూ వ్యాధికి తులసి దివ్యౌషధమని వైద్యలోకం అంగీకరిస్తుంది .అలాగే ఆవుపాలతో ఈవ్యాధికి ఔషధాన్ని తయారు చేస్తున్నామని మహారాష్ట్ర లోని ఆయుర్వేదవైద్యులు వెల్లడించారు .అంటే సమస్య తోపాటు పరిష్కారం కూడా ప్రకృతి కరుణతో ప్రసాదిస్తూనేవున్నది. దానిని గ్రహించి జాగ్రత్తపడవలసినది మనం.
ఇక ప్రతి ఇంట్లో సాంప్రదాయంగా వుంచుకునే తులసి కోటను ఏర్పాటుచేసుకోవటం ,అలాగే తులసి తీర్ధం ,తులసి సేవనం వలన ఈ వ్యాధికారక క్రిములను ఎదుర్కోవచ్చు.
ఆలాగే ప్రతి గృహం లో యజ్ఞం జరపటం వలన అది భౌతికంగనూ, అలాగే ఆథ్యాత్మికంగా ను సత్ఫలితాలనిస్తుంది .
యాగం చేయటం లో స్వల్ప వ్యయం తో గాయత్రీ పరివార్ వారు ఆచరిస్తున్న విధానం అనుకూలంగావుంటుంది .
ఒక పావుగంట సమయాన్ని వెచ్చించి ఇటిలో ఈ అగ్నికార్యం చేయటం వలన మనుషులకు ఇలాంటి వ్యాధికారక క్రిములను ఎదుర్కునే సామర్ధ్యం పెరగటమేగాక ,ఈ క్రిముల నిర్మూలన జరుగుతుంది . ఇక ఆ మంత్రోచ్చారణా తరంగాల ప్రభావం గూర్చి మీకు చెప్పనవసరం లేదనుకుంటాను . దేశం లో పెద్ద ప్రమాదమైన కార్బైడ్ ఫాక్టరీ గ్యాస్ లీక్ సమయం లో ఈవిషయం నిరూపించబడినది.
ఇక ఈవిద్యలనిచ్చిన మహర్షులు మానవాళిశ్రేయస్సును కోరి చెప్పారు .జాగ్రత్తగా దీనిని వుపయోగించుకుంటామా లేక అనవసర వివాదాలతో ముప్పు కు బలవుతామా అనేది మనిష్టం .ఎవరన్నా కోరితే ఈ అగ్నికార్యం సులభంగా చేయటమెలాగో వివరించటానికి శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం సిద్దంగావున్నది.
ఇక భూకంపాది ప్రమాదాలు విస్తరిస్తున్నాయి . "విక్రమవత్సరం నుండి విపరీతములు పుట్టి జననష్టమే సమ్భవించేను" అనే తాతగారి [వీర్బ్రహ్మేంద్రుస్వామివారి] కాలజ్ఞాన హెచ్చరికలు గుర్తు తెచ్చుకుని గడచిన విక్రమ వత్సరం నుండి భూమ్మీద జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుని అవి ఎంత సత్య మో తెలుసుకొవాలి.
"రామా" అనని వారెల్లా రాలిపోయేరు అనే "కాలజ్ఞాన" వాక్యాల హెచ్చరికలను గమనించి మానవాళి భగవంతుని ప్రసన్నం చేసుకోవాల్సిన ఆపత్సమయమిది. ఇది భయపెట్టటానికి చెప్పటం లేదు .బయటపడే మార్గాన్ని తెలియజేస్తూ చెబుతున్న మాట.
[ సనాతనమైన భారతీయ సాంప్రదాయ రీతులను ఆచరించే వారి కోసం వ్రాయబడినది . నమ్మకమన్నది మీఇష్టం ]
అనవసర వివాదాత్మక వాఖ్యలు అంగీకరిపబడవు
2 వ్యాఖ్యలు:
తులసి పంది-ఫ్లూ ను తగ్గిస్తుందని ఈ మెయిల్స్ వస్తున్నాయి.
మన ఇళ్ళల్లో అమ్మమ్మలు, తాతయ్యలు నలతగా ఉంటేనో, జ్వరమంటేనో తులసో, కషాయమో, వేపాకో ఇలా ఏదో వాడి, మరీ తగ్గకపోతే డాక్టర్లంటారు. ఇప్పుడు దగ్గినా, తుమ్మినా డాక్టర్ అంటున్నారు. ఇది మన పురోగతి.
కరెక్ట్ గా చెప్పారు.
Post a Comment