శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠంలో ఈరోజు వరలక్ష్మీ విభవం

>> Friday, July 31, 2009






అనంతరూపాల భాసిస్తూ ,ఆశ్రితులను కాపాడు ఆదిపరాశక్తి ఆతల్లి వరలక్ష్మిగా అవతరించి భక్తుల సేవలందుకునే సుదినం ఈరోజు . శ్రావణమాసాన ఆతల్లిని ఆరాధించే అతివలు ఆమెకృపకు పాతృలై అనంత సంపదలను పొందుతారు.


శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో ఈరోజు ప్రాత: కాలమునుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి .
ఉదయాన్నుండి మూలమూర్తులకు పురుషసూక్త ,రుద్రసూక్తములతో వేంకటేశ్వర,రామలింగేశ్వరులకు ,శ్రీసూక్తప్రకారంగా అమ్మవారికి పంచామృతాలు ,కుంకుమ ,గంధ,హరిద్రాచూర్ణయుక్త జలములతో అభిషేకములు నిర్వహింపబడ్డాయి. తదనంతరం శ్రీచక్రార్చన ,పూజలు జరిగాయి . ఆతరువాత గోత్రనామాలు పంపిన భక్తులతరపున కుంకుమార్చన జరుపబడినది.

ఆతరువాత మాయింటి కోడల్లు ,ఆలయానికి వచ్చిన భక్తురాళ్లచేత సామూహికంగా వరలక్ష్మీ వ్రతం భక్తి శ్రద్దలతో సాగినది. ఆతరువాత ప్రత్యేకించి చేసిన ఐదురకాలైన ప్రసాదాలను అమ్మకు నివేదించి వాయినదానాలు ఇచ్చిపుచ్చుకున్నారు పరస్పరం .


సాయంత్రం మరలా సంధ్యహారతి అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామాలతో పుష్పాలతో పూజ జరుపబడినది. అలాగే జ్యోతిస్వరూపమైన ఆతల్లికి దివ్యజ్యోతుల నీరజనం సమర్పించబడినది.

1 వ్యాఖ్యలు:

నీహారిక August 1, 2009 at 12:13 AM  

గుడి ఎంతో పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది,అమ్మవారి ఫోటోస్ బాగా వచ్చాయి.చాలా బాగుంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP