శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దౌర్భల్యం

>> Thursday, February 26, 2009


ప్రతి మతము వారూ ,తమ మతమే విశ్వ జనీనమని వాదిస్తారు. విశ్వజనీన మతమెన్నటికి కలగదని నా భావం .ఒకవేళ అలాంటి మతం వుంటే ,అది మన సనాతన మతం ఒక్కటే నని చెప్పటానికి కొంత వీలుంది. మరేమతానికి అటువంటి అవకాశమూ లేదు. .ఎందుకంటే ,తక్కిన మతాలన్నీ ఎవరో ఒక పురుషునిమీదగానీ,పురుషుల మీదగానీ ఆధారపడి పుట్టాయి . అవన్నీ ,చారిత్రక పురుషుడని ఆ మతస్తులు చెప్పే ఒకానొక పురుషుని జీవితం చుట్టూ అల్లబడ్డాయి. వారు ఏది తమమతానికి బలమని భావిస్తున్నారో అదే దాని దౌర్భల్యం . ఎందుకంటే ! ఆపురుషుని గూర్చిన చారిత్రకత సత్యమ కాదని మిరు రుజువు చేశారో, ఆమాట నిర్మాణమంతా నేలగూలిపోతుంది. ఈ గొప్ప గొప్ప మాట నిర్మాతల జివితాంశాలలో సగమైనా చారిత్రకంగా సత్యం కావని రుజువైనది. తక్కిన సగం సంశయగ్రస్తమై ఊగులాడుతోంది . అందువల్ల ఆమతకర్తల పలుకులే ఆధారంగా గల మాట ధర్మాలన్నీ రూపుమాసి,గాలిలో కలసిపోతున్నాయి.

_ స్వామి వివేకానంద

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP