శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లలితానామసహస్ర నామ ప్రయోగాలు

>> Friday, September 26, 2008

[ లలితా నామ సహస్రనామలను ఎలా ఉపయోగించి .....2][35వశ్లోకం ను0డి అనువాదం ]

యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్ర పాఠకం
తా సంధాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండభైరవ:
సహస్ర నామ పఠనం చేసేవారిని ఎవరైనా దుష్టంగా చూస్తే అట్టివారిని మార్తాండ భైరవుడు స్వయంగా వారిని అతితక్కువ కాలమ్లో అంధులను చేస్తాడు. ... సహస్రనామ పఠనం చేసేవారి సొమ్మును దొంగలించిన చోరులను ఎక్కడవున్నా సరే క్షేత్రపాలుడు వారిని సంహరిస్తాడు. ఎవరైనా సహస్ర నామోచ్చారకునితో వాగ్వాదకునితో తలపడితే అటువంటి వారికి నకులేశ్వరి నోటిమాటలేకుండా చేస్తుంది.
ఏ ప్రభువైనా నామ పారాయణం చేయువారితో కయ్యం పెట్టుకుంటే ,అలాంటి ప్రభునికి గల చతురంగబలాలను దండినీదేవి నశింపజేస్తుంది. భక్తు లెవరైనా ఆరునెలల పాటు పారాయణం చేస్తే అటువంటివారి యింట లక్ష్మీదేవి వదలక స్థిరంగా వుంటుంది.

దినమునకు మూడుసార్లు చొప్పున ఒక మాసం రోజులు దీక్షగా పఠనం చేస్తే అటువంటి వారి నాలుక మీద వా గ్దేవి సర్వదా నాట్యం చేస్తూవుంటుంది.
యస్త్వేకవారం పఠతి పక్షమాత్ర మతంద్రితి: మహ్యంతి కామవశగా మృగాక్షస్తస్య వీక్షణాత్ "
య: పఠేన్నామ సాహస్ర0 జన్మ మధ్యే సకృన్నర: తదృష్టిగోచరా త్సర్వే ముచ్యంతి సర్వ కిల్భిషై :
జీవిత గమనం లో ఒక్క సారైనా నామపారాయణం చేస్తే అట్టివారిని చూచినంతనే సర్వ పాపములు నశించిపోతాయి. సహస్రనామ పారాయణం చేయు భక్తులకు అన్నమూ వస్త్రం ,ధనం ,ధాన్యందానంగా యివ్వడం మంచిది. పండితులైనవారు శ్రీ విద్యను జపించేవారిని శ్రీచక్రారాధన చేయువారిని సహస్రనామాలను పఠించేవారిని సత్పురుషులుగా తెలుసుకుంటున్నారు. లలితా దేవి భక్తులకు ఆమె సంప్రీతికై ఎవ్వరు ఏదానం చేసినా అట్టివారిని మెచ్చుకుని శ్రీదేవి సంతోషిస్తుంది. సహస్ర నామ పారాయణం శ్రీవిద్యారహితులకు చేయు దానములు నిరర్ధక మవుతాయై . బుద్ధి మంతులు దానాదులను చేసేటప్పుడు శ్రీవిధ్యానిధులను పరీక్షించి చేయవలెను. శ్రీ మంత్ర రాజంతో సమానమయిన మంత్రం లేదు
కుంభసంభవమునీ దేవతలలో లలితతో సమానమైన వారు లేనట్లే లలితా సహస్రనామముతో సమానమయిన స్తుతి మరొకటి లేదు. మంచిదయిన ఈ స్తోత్రరాజాన్ని గ్రంథముగా వ్రాసి వుంచుకుని భక్తిభావంతో పూజించేవారిని తెలుసుకుని అమ్మ ఆనంద పడుతుంది. చాలా మాటలు చెప్పి ఏమిలాభం ? అన్ని తంత్రాలలోనూ ఈ సహస్రనామములతో సాటి చెపదగినది,ఇంకొకటి లేదని తెలుసుకో.... ఈకారణం చేత శ్రీ విద్యారాధకులు ఈ స్తోత్రరాజాన్ని గౌరవ భావంతో సర్వదా పఠించాలి.
పద్మాలు,తులసీదళాలు, కలువలు, కడిమి పూలు,సంపంగి పూలు,జాజి పూలు,మల్లెపూలు ,ఎర్ర గ న్నేరు పూలు ,ఎర్ర కలువలు,బిళ్వపత్రాలు,మొల్ల పూలు,పొన్నపూలు, ఇంకా కమ్మని సువాసన గల పూలు మొగలి పూవులు,పూలగురివింద పుష్పాలు మొదలైన పలురకాల పువ్వులతో సహస్రనామార్చన జరపాలి. ఈ విధంగా చేసిన శ్రీచక్రార్చన ఫలము ఇంతయని చెప్పటం మహేశ్వరునకు కూడా శక్యం కాదు. తన స్వరూపము ఆతల్లికి మాత్రమే తెలుసు. నిజంగా శ్రీ చక్రార్చన వలన కలుగు ఫలితాన్ని వర్ణించటానికి బ్రహ్మాదులకే సాధ్యమవదనగా ఇతరులు ఎంతని తెలుసుకోగలరు ?
ప్రతి నెలలోనూ పూర్ణిమ రాత్రి చంద్రుడు ఉదయించేసమయాన శ్రీ చక్రార్చన చేసేవారు లలితా స్వరూపులు ,లలిత వారి రూపం లోనే వుంటుంది. శ్రీచక్రార్చనచేసే శ్రీ విద్యో పాసకులను ,శ్రీ దేవిని బేధభావం తో చూసేవారిని మహాపాపాత్ములుగా పరిగణించాలి. ఆశ్వయుజ శుక్ల పక్షం మందు వచ్చు శరన్నవమి నాటి రాత్రి అనగా మహర్నవమి నాడు శ్రీ చక్రమందుండు లలితాంబికను తలచి స హస్రనామాలతో అర్చించేవారికి ముక్తి కరతలామలక మవుతుంది. మహా భక్తితో ఎవరైనా శుక్రవారాలలో శ్రీ చక్రమున శ్రీ దేవిని సహస్రనామాలతో ఆరాధిస్తాడో ,అటువంటి పుణ్యాత్ముడు పొందే ఫలితాన్ని చెబుతాను విను. ...శ్రీ లలితాదేవి భక్తుడు ఈ పుట్టుకయందుసమస్త సంపదలను పొందుతున్నాడు. తన కోరికలన్నింటిని పొంది మనమలతో ,అభివృద్ధి చెందుతూ అన్ని భోగభాగ్యాలను అనుభవించి ఆఖరికి ఈశ్వరాదులచే కోరదగిన అసాధ్యమయిన లలితా0బ సాయుజ్యాన్ని చేరుతున్నాడు.
ఈ సహస్రనామాలతో వేయిమంది బ్రాహ్మణులను పూజించి వారిని తృప్తిగా భుజింపజేసి తాంబూల,దక్షిణ లతో సత్కరించిన వారికి ఆ తల్లి తన సామ్రాజ్యాన్నిస్తుంది. ఇటువంటి ఉపాసకులకు ముల్లోకాలలోను అసాధ్యమయినదేది లేదు. ఏవిధమయిన కోరికలు లేకుండా నిష్కామంగా ఈ సహస్రనామాన్ని పఠిస్తారో అటువంటివారు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. సంసార బంధనాలు లేకుండును. ధనార్ధం చేస్తే దానిని పొందుతారు. కీర్తికోసం చేస్తే కీర్తి ని పొందుతారు.
విద్యను కాంక్షించేవారికి విద్య,నివ్వడములోనూ భోగాన్ని ,మోక్షాన్ని ఇవ్వడానికి దీనిని మించినది మరొకటి లేదు. కనుక సుఖ బోగాదులను వాంచించేవారు సహస్రనామాలు పారాయణం చేయాలి . బ్రహ్మ చారులు గృహస్తులు ,వానప్రస్థులు, మరియు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాలవారు తమ ధర్మాలను చేయటములో జరిగిన లోపాలను పూర్తి చేయటానికి ఈ నామ పఠనం చెయ్యాలి. స్వధర్మాలను విడచి పాపాత్ములతో నిండిన ఈ కలికాలమందు. లైతా సహస్రనామ పఠనం ఒక్కటె మనుష్యులకు తరునోపాయం దీనికి సాటి మరొకటి లేదు.
లోకాలలో వాక్యాలన్నింటికంటే విష్ణు నామాన్ని కీర్తించటం మంచిది, విష్ణు సహస్ర నామాలకంటే ఒక్క ఈశ్వర నామోచ్చరణం మంచిది. వెయ్యి శివ నామాలకంటే ఒక్క లలితా దేవినామం ఉత్తమం , అగస్త్య మునీ వేలకొలది దేవీ నామాలు కోటిరకాలుగా చెప్పబడ్డాయి. వాటిలో పదివిధాలైన సహస్ర నామాలు ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. అవి ఇలా వున్నాయి. గంగ,భవాని,గాయత్రి, కాళీ,లక్ష్మీ,సరస్వతి, రాజరాజేశ్వరి ,బాల ,శ్యామల లలితా అని పదిరకాలు. ఇవి అత్యుత్తమాలు. వీటన్నిటిలో లలిత ప్రధానము. దీని సంకీర్తనం వలన కలిదోషం తొలగిపోతుంది. విష్ను ,శివ సహస్రనామాలతో పాటు మిగిలిన కూడా శ్రేష్టమయినవయినా సర్వశ్రేష్టమయిన వీనిపై అందరుదృష్టి సారించుటలేదు. .వేరు వేరు నామాలను పఠించినవారికి ఆయా పుణ్య ఫలం వలన ఆఖరి పుట్టుకలో శ్రీవిద్యాశక్తుడవుచున్నాడు. ఈ లోకములో లలితోపాసకులు ఎలా తక్కువగా వుంటున్నారో అలానే శ్రీవిద్యయందు శ్రద్ద చూపువారుకూడా చాలా తక్కువగా వున్నారు. సహస్రనామ పఠనం చేసే ఆసక్తి కలగటము గొప్పతప: ఫలితం కన్నులు లేనివాడు రూపాన్ని దర్శించలేనట్లే సహస్రనామాన్ని పఠించకుండా లలితా దేవిని సంతుస్ఠురాలిని చేయలేరు. అన్నం భుజించకుండా ఆకలి తీరనట్లు. లలితా దేవి భక్తులయినవారు నిత్యమూ సహస్రనామాలు చెయ్యాలి. ఆ తల్లి అనుగ్రహ సిద్ధికి ఇతి ఆవశ్యకం .
ఓ అగస్త్యమునీ ! నేను నీకోసం ఈ రహస్య నామాన్ని చెప్పాను. లలితోపాసన లో విముఖులకు,అభక్తులకు దీనిని ఉపదేశించరాదు. శ్రీవిద్య ఎంత రహస్యంగా ఉంచదగినదో, అలాగే ఈ రహస్యనామాలను గోప్యంగా ఉంచాలి. పశుతుల్యుడు, భక్తిలేనివారికి తెలియక అయినా చెప్పరాదు. అలా చెబితే యోగినీ సంఘం కోపపడును. ఆకారణం చేతనే నేను నీకు అడిగితేగానీ చెప్పలేదు. ఇప్పుడు దేవీ ఆజ్ఞ చేత నీకు రహస్యంగా ఉపదేశించాను.. సదా దీనిని శ్రద్ధా సక్తులతోనూ పఠిస్తూండు. ఆ తల్లి నీ పై కరుణ చూపిస్తుంది.
సూత ఉవాచ:ఈవిధంగా చెప్పిన హయగ్రీవుడు లలితా దేవిని స్మరిస్తూ ఆనంద పూరిత హృదయుడయ్యాడు.
ఇది లలితా సహస్రనామ స్తోత్రరత్న మహాత్మ్యం అనబడు ఉత్తర భాగము.
సమస్త సన్మంగళాని భవంతు. ...ఓమ్ శాంతి: శాంతి: శాంతి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP