శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నందమూరి తారక రత్న లాంటి యువకులకు ఏమిటీ పరిస్థితి

>> Tuesday, January 31, 2023

నందమూరి తారక రత్న మహా ఉంటే వయసు ఉంటుంది 40+ ఒకటో రెండో మూడో,
ఒక్క రోజు కొద్ది సేపు బయట నడిస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్లీ పరిస్థితి సీరియస్ విషమం అంటూ వార్తలు, ప్రాణాలకు ఆపాయం లేదు అంటూ బ్రేకింగ్ న్యూస్
ఏంటి ఈ తరం ??
ఏం జరుగుతుంది అసలు???
అంత డబ్బు, మంచి తిండి, పోషణ ఉంటున్నా కూడా ప్రముఖులు లేదా సామాన్యులు ఎవరన్నా 40 యేళ్లు దాటితే చాలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు, చిన్న వయసులోనే కొందరి  ప్రాణాలు క్షణాల్లోనే పోతున్నాయి !!
కారణం ఏమై ఉంటుంది ????
కన్నడ రాజ్ కుమార్ మరణం కూడా చాలా షాకింగ్ !!!

నాకు తెలిసి 1980 తర్వాత తరం చాలా ప్రమాదపు అంచుల్లో ఉంది
తినే ఆహారం కలుషితం,
తాగే నీరు కలుషితం,
పీల్చే గాలి పూర్తి విష తుల్యం.

అంతటా కల్తీ ఆహార పదార్థాలు రాజ్యం ఏలుతున్నాయి.
క్యాన్సర్ కారక సింథటిక్ ఫుడ్ రంగులు, ఆహార పదార్థాల్లో వేసే వెనిగర్, టేస్టింగ్ సాల్ట్, సాస్ లు, ఒకటికి పదిసార్లు కాచి ఫిల్టర్ చేసి అమ్మే కల్తీ నూనెలు, పాడైపోతున్న కుళ్ళిన వారాల పాటు డీప్ ఫ్రీజర్స్ లో నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం, 
యూరియా సర్ఫ్ వేసి చేస్తున్న పాలు పాల ఉత్పత్తులు
భయంకరంగా చచ్చిన మూగ జీవాల శవాలు పేగులు వేసి చెరువుల్లో పెంచుతున్న రొయ్యలు చేపలు
ఇంజెక్షన్లు స్టెరాయిడ్స్ ఇచ్చి గుడ్లు పెట్టిస్తు
కిలోలు కిలోలు నెలరోజుల్లో బరువుపెరిగే కోళ్లు 
అన్నీ మానవ శరీరానికి నూటికి నూరుశాతం హని కలిగించేవే 
అవన్నీ ఇప్పుడు యదేచ్ఛగా
మార్కెట్లో పునుగుల బండి నుండి 5స్టార్ హోటల్ వరకు వాడుతున్నారు.
ఆరోగ్య శాఖ పర్యవేక్షణ సక్రమంగా లేదు. 

అసలు పండే పంటలోనే దమ్ము లేదు.
అంతా హైబ్రిడ్ వంగడాలు
అన్నీ క్రాస్ బ్రీడ్ పంటలు
ఎరువులు, పురుగుమందులు
ఒకప్పుడు పచ్చిమిర్చి బజ్జీ ఇరవై తినేవాడిని తొక్క కూడా అరిగిపోయేది.
ఇప్పుడు మిర్చి తొక్క ప్లాస్టిక్ పేపర్ లా ఉంటుంది తొక్కైనా అరిగే అవకాశం లేదు
ఒకప్పుడు దోసకాయ తొక్క తీయకుండా వండేవారు
చక్కగా కరిగిపోయేది కూరలో తింటే....అలాగే వంకాయ, టొమోటో, ఆపిల్ తొక్కలు కూడా ప్లాస్టిక్ పొరల్లా అయ్యాయి ఇప్పుడు తింటే అరిగే పరిస్థితి లేదు కారణం ???

ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద భవిష్యత్ తరాల కోసం అన్నా దృష్టి పెట్టాలి.
బయట దొరికే ఆహారం
మరియు మన దేశంలో పంటలు విషయంలో దృష్టి పెట్టాలి.
రైతుల్ని ప్రోత్సహించి
సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేపించాలి
దేశీయ పంటల్ని, విత్తనాల్ని అభివృద్ధి చేసి వాడుకలో తీసుకురావాలి.
నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు అమ్మే సంస్థలు, తయారీదారుల పట్ల ఉక్కు పాదం మోపాలి.

మాకోసం కాకున్నా 
అయ్యా రాజకీయ నాయకులారా!
 మీ పిల్లలు, మీ వంశం నిలబడాలి అన్నా మీరు ఈ విషయం గురించి చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి......

👉Whatsap Forword......

2 వ్యాఖ్యలు:

raamudu February 2, 2023 at 6:35 AM  

ఇలా చేస్తే చేసే వాళ్ళ తరాలైన మిగులుతాయా?

durgeswara February 5, 2023 at 7:00 AM  

ఆలోచించకుంటే రాబోయే తరాలకు ఇంకా ప్రమాదం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP