శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేను నాలుగు సూచనలు ఇస్తానన్న యమధర్మరాజు గారు

>> Sunday, July 14, 2019

🌷చనిపోయే ముందు భగవంతుని తలుచుకుంటే మోక్షం వస్తుంది అని విని ఒకతను యముడితో నన్ను తీసుకెళ్లే ముందు ఒక కాల్ చెయ్యి, నేను భగవంతుని తలుచుకుంటా అన్నాడు.
 దానికి యముడు ఓకే అన్నాడు . ఇంకేముంది అతను హ్యాపీగా వున్నాడు. ఒక రోజు హఠాత్తుగా అతడు చనిపోయాడు. యముడు నరకానికి తీసుకువెళ్తుంటే,  నువ్వు చెప్తానని మాట ఇచ్చి మోసం చేసావు అన్నాడు.  యముడు అన్నాడు నేను నా పద్ధతి  లో 4times కాల్స్ చేశాను, నువ్వు పట్టించుకోలేదు అన్నాడు  అతను, నువ్వు అబద్ధం చెప్తున్నావ్, నాకు కాల్స్ రాలేదు అన్నాడు.
    1st కాల్ గా జుట్టు తెల్లబడేలా చేశాను, నువ్వు రంగేసుకొని పట్టించుకోలేదు.
    2nd కాల్ గా కళ్ల కి చత్వారం వచ్చేలా చేశాను. నువ్వు స్పెక్ట్స్ తెచ్చుకున్నావు కానీ పట్టించుకోలేదు.
    3rd call గా B.P, షుగర్ వచ్చేలా చేశాను, తిండి మార్చుకున్నావు కానీ మళ్ళీ పట్టించుకోలేదు.
    4th call గా పళ్లు ఊడేలా చేశాను. నువ్వు పళ్లు కట్టించుకున్నావు కానీ భగవంతుని ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నాలుగు సార్లు చెప్పినా పట్టించుకోలేదు,  నీ టైం అయిపొయింది అందుకే నరకానికి తీసుకెళ్తున్నా అన్నాడు.
🌷జీవితంలో ప్రతిదీ హ్యాపీగా accept చేస్తూ, భగవంతుని స్మరిస్తూ ఉండాలి.
   🌷సారాంశం ఏమిటంటే ఒకేసారి స్మరణ రాదు, స్మరించడం అలవాటు చేసుకోవాలి, అపుడు చివరిదశ లో సహజం గా భగవంతుని స్మరణ వస్తుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP