శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్ని మతాలు సమానమే అనే ఈ జబ్బు హిందువుల్లో ఎక్కువ.

>> Friday, September 8, 2017

మనలో చాలా మంది దేవుళ్ళు అందరూ ఒకటే, అన్ని మత గ్రంధాలూ సారం తెలిపేది ఒకటే, అన్ని మతాలు ఒకటే అని అనే ఒక మానసిక స్థితి లో ఉంటారు..

నిజానికి ఇది మానసిక స్థితి కాదు ఒక మానసిక రోగం..
ఈ వైరస్ ముఖ్యంగా హిందువుల లోకి కొంతమంది మతస్తుల ఎక్కించారు, అన్ని మతాలు సమానమే అనే వైరస్ హిందువులు ఎంతగా నాశనం చేస్తున్న ఈ రోజు మీకు వివరిస్తాను..!!

అన్ని మతాలు సమానమే అనే ఈ జబ్బు హిందువుల్లో ఎక్కువ. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి షాపుల్లో, ఇంట్లో, నెలవంక, ఓం, సిలువ మిక్సీ లో వేసి రీమిక్స్ చేసి వచ్చిన సింబల్ ని గోడకి తగిలిస్తారు..!

అన్ని మతాలు సమానం అనేది నిజమా?? కాదా?? మనం ఎవరో చెప్పిన దాన్ని విని నమ్మేద్దామా!! లేదా మనం ఆ గ్రంథాలు చూసి తెలుసుకుందామా?? నాతో రండి, నిజాన్ని తెలుసుకుందాం... ఈ వ్యాసం చదవండి!!

ఏ మతం ఎప్పుడు పుట్టింది..??
***************************

చరిత్ర ప్రకారంగా క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, ఈ మతం ఏసుక్రీస్తు తర్వాత ప్రారంభమైంది, యేసు కూడా క్రైస్తవుడు కాడు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం అనేది లేదు.

1400 సంవత్సరాల క్రితం ఇస్లాం అనే మతం పుట్టింది, మహ్మద్ ప్రవక్త  వల్ల ఈ మతం ప్రారంభమైంది 1400 సంవత్సరాల క్రితం ఈ మతం లేదు.

హిందూ ధర్మం (హిందూమతం) అనేది ఫలానా సమయంలో పుట్టింది కాదు, ఎవరో ఫలానా వ్యక్తి వచ్చి స్థాపించింది కాదు. హిందూమతం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. హిందూ మతం లో దేవుళ్లుగా పూజించబడుతున్న రాముడు, కృష్ణుడు కూడా హిందువులే.

ఒక మతమేమో 2000 సం. క్రితం పుడితే, ఇంకో మతం 1400 సం. క్రితం పుట్టింది.. హిందూ మతం ఫలానా సమయంలో, ఫలానా సమయం లో, ఫలానా వ్యక్తి స్థాపించింది కాదు..

మరి అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాల సారం ఒకటే ఎలా అవ్వుద్ది..??

అన్ని మత గ్రంధాలూ సారం ఒకటేనా..?
*********************************

బైబిల్ :- బైబిల్ లో ఉన్న దేవుణ్ణి (యహోవా) కాకుండా  వేరే దేవున్ని పూజిద్దాం రా అన్న వాడిని రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ ఉపదేశ కాండం 13: 6,7,8,9) ఇది బైబిల్ దేవుని ఆజ్ఞ

ఖురాన్ :- ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపండి (బహుదేవతారాధాన చేసేవాళ్ళని నరకండి) (ఖురాన్ 9:5)

భగవత్ గీత :- దేవుణ్ణి ఏ రూపం లో పూజించిన పర్లేదు, నువ్వు పూజించిన రూపం లోనే నిన్ను కరుణిస్తాడు..
 (4 అధ్యాయం, 13 శ్లోకం)

ఇది మీకు చదవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం.  ఇది చదివాక అన్ని మతాల సారం ఒకటే అన్న వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.!!
మరి మీకు..??

బైబిల్, ఖురాన్ అల్లాని, యహోవా ని మాత్రమే పూజించాలి లేకపోతె చంపేయండి, అని చెప్తుంది,
భగవత్ గీత నువ్వు పూజించే దేవుడు ఎవరైనా సరే భక్తీ ప్రధానం అంటున్నది... మరి అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే ఎలా అవ్వుద్ది..?? ఆలోచించండి హిందువులారా..!!

ఎవరికీ స్వర్గం?? ఎవరికీ నరకం ??
*************************

బైబిల్ :-

యెహోవానీ, యేసుని నమ్మినవారికి మాత్రమే స్వర్గము, లేనివారికి నరకం. ఈ లెక్కన ప్రపంచంలోని 750 కోట్ల మందిలో కేవలం క్రైస్తవులకి మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం కలిగి ఉన్నారు, మిగతా అందరి నరకానికి వేళతారు ఎందుకంటే వాళ్ల ఏసుని, యహోవా ని నమ్మ లేదు కాబట్టి..

ఖురాన్ :-   అల్లాన్ని, మహ్మద్ ని చివరి ప్రవక్త గా నమ్మిన వారికి స్వర్గం, లేనివారికి నరకం... కాబట్టి కేవలం ముస్లిం లు మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం, అయితే మిగతా ప్రపంచ జనాభా అందరూ నరకానికి వెళ్తారు..!!

హిందు గ్రంథాల ప్రకారం మనం ఏ దేవుడిన నమ్మాము? ఏ దేవుని పూజించాము అనేది కాకుండా నువ్వు చేసిన మంచి, చెడులు పాప, పుణ్యాలు బట్టి నీకు స్వర్గం, నరకం అనేది నిర్ణయింపబడుతుంది.. దీని ద్వారా ప్రపంచంలో అందరూ స్వర్గానికి వెళ్ళే అవకాశం కలిగింది..!!

ఈ ప్రశ్నను బట్టి చూసినా సరే అన్ని మతాలను సమానం కాదు అని తెలుస్తోంది..!!  నన్ను పూజించినవారికి  మాత్రం స్వర్గం, నన్ను పూజించని వారికి నరకం అన్న దేవుడెక్కడ ??

భగవంతుని ఏ రూపంలో పూజించిన మీకు ఫలితం తప్పకుండా ఉంటుంది అన్న దేవుడెక్కడ..!!

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

ఏ దేవుణ్ణి పూజించాలి??
*********************

బైబిల్ :-

బైబిల్ దేవుడు యహోవా ని మాత్రమే పూజించాలి, ఆయన్ని కాకుండా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని పూజిస్తే వాళ్ళని ఊరి బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ 17: 2,3,4)

బైబిల్ దేవుడు యహోవా ఇలా చెబుతున్నాడు నెను తప్ప నీకు వేరే దేవుడు ఉండ కూడదు, నీవు విగ్రహాలకి పూజించకూడదు. నా మాట కాదని వేరే దేవుళ్లను పూజిస్తే నీతో పాటు, నీ కుటుంబాన్ని 7 తరాలపాటు శిక్షిస్తాను (నిర్గమ కాండం 20: 3,4,5,6)

ఖురాన్ :- అల్లా ని కాకుండా వేరే దేవున్నీ పూజించటం, పాపం, ఆయనకి సమానంగా వేరొక దేవుణ్ణి పెట్టడమ్ షిర్క్ లోకి వస్తాయ్.. షిర్క్ అంటే ఎప్పటికి అల్లా కూడా క్షమించని పాపం..!!

భగవత్ గీత :- (శ్రీ కృష్ణుడు) ఎవరైనా ఒక దేవత ని పూజించాలి అని అనుకున్నప్పుడు వారి మనసు ని ఆ దేవత పై ఉండేలా, వాళ్ళ భక్తి ఆ దేవత మీద నిలిచేలా నేను చేస్తాను.. ( ఆ. 7, శ్లో. 21)

భైబిల్ యహోవా, ఖురాన్ అల్లా ఏమో వారిని కాకుండా వేరే దేవుల్లని పూజిస్తే తాట తీస్తాం, అని అంటున్నారు
భగవత్ గీత లో శ్రీకృష్ణుడు దీనికి భిన్నంగా నువ్వు ఏ దేవున్ని పూజిస్తే ఆ దేవుడు మీద నీ దృస్థి ఉండేలా చేస్తా అంటున్నాడు..

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

కర్మ సిద్ధాంతం:-
************

మనిషి యొక్క కష్టసుఖాలు,సుఖ దుఃఖాలు అతడు గత జన్మల్లో అతడు చేసుకున్న పాపపుణ్యాల బట్టి అతనికి ఈ జన్మలో కష్టాలు సుఖాలు రావడం జరుగుతాయి..!!

ఉదాహరణకి ఒక మనిషి పుట్టుక తోనే అంగవైకల్యంతో పుట్టారు అనుకుందాం,

దానికి సమాధానం

ఖురాన్ :
అతను ఎందుకలా పుట్టాడు దానికి సమాధానం లేదు

బైబిల్ : ఒక మనిషిని వికాలంగుడిగా ఏందుకు పుడుతున్నాడంటే అది దేవుడి ఇష్టం, ఆయనకి నచ్చినట్టు పుట్టిస్తాడు..

మళ్లీ వికలాంగుల మాత్రం అపవిత్రులు, వాళ్ళు దేవునికి ఏ ప్రసాదం పెట్టకూడదు, వాళ్లు దేవుడు దగ్గరకి వెళ్ళి దేవుడి స్థలాన్ని అపవిత్రం చేయకూడదు (లేవియా కాండం 21: 17-23)

హిందూ గ్రంధాల ప్రకారం ఒక మనిషి పుట్టుకతో వికలాంగుడు అయితే అతనికి గత జన్మలో చేసిన పాప కర్మలు కారణంగా ఆ సమస్య వచ్చిందని చెబుతారు వికలాంగులు అపవిత్రం ఏమి కాదు,  వాళ్లు దేవుడి దగ్గరకి వెళ్లిరావచ్చు ప్రసాదం పెట్టవచ్చు..!!

ఎవడ్రా అందరు దేవుళ్ళు చెప్పేది ఒకటే, అన్నీ మతాలు ఒకటే అన్నది..!!!

దేవుడి దృష్టిలో మిగతా జీవుల సంగతేంటి..?
***********************************

బైబిల్, ఖురాన్ ప్రకారం మనిషి కాకుండా మిగతా జీవులలో ఆత్మ ఉండదు వాటికి స్వర్గమా, నరకమా అన్న ప్రస్తావన ఉండదు.

మనుషుల కోసమే మిగతా జంతువులు సృష్టించబడ్డాయి మనుషులు వాటిని వాడుకోవచ్చు, చంపితినొచ్చు, వాటి మీద అధికారం చలాయిస్తారు అంతే.. జంతువులు దేవున్ని గురించి ఆలోచించడమ్, దేవున్నీ చేరుకోవడం లాంటివి ఏమి ఉండవు..!

హిందూ గ్రంధాల ప్రకారం అన్ని జీవులు దేవుని బిడ్డలే మనిషి తో పాటు, మిగతా జీవులులో కూడా పరమాత్మ తత్వం ఉంటుంది కాకపోతే అవి చేసుకున్న పాపపుణ్యాల బట్టే గత జన్మల్లో చేసుకున్న కర్మల బట్టే ప్రస్తుతం ఆ జంతు జన్మలు ఉన్నాయి.

కొన్నిసార్లు జంతువులుకి కూడా దేవుడు దర్శనమిచ్చినట్లు వాటికి కూడా స్వర్గము, మోక్షము ఇచ్చినట్టు హిందూ గ్రంధాలు చెబుతున్నాయి

ఉదాహరణకు గజేంద్ర మోక్షం లో సరస్సులో మొసలి చేత పట్టబడిన ఏనుగు, ఏనుగు పిలిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చే ఏనుగుని కాపాడతాడు.

అలాగే శివుడు తనను పూజించిన ఏనుగు,పాము, సాలిపురుగు, లకు కూడా మోక్షం ప్రసాదిస్తాడు అని హిందూ గ్రంధాలు చెప్తున్నాయి.

ఇప్పడు చెప్పండి అన్ని మతాలు సమనమా???

మనిషి పుట్టుకతో పాపి అనే సిద్ధాంతం.!!
**********************************

క్రైస్తవులు ఎక్కువగా విశ్వసించి సిద్ధాంత మిదే మనిషి పుట్టుక తోనే పాపి అని, మనిషి రక్తం  పాపమ్ తో నిండింది అని విశ్వాసం, మనుషుల కోసం యేసు తన రక్తాన్ని చిందించాడు అని, యేసు ని నమ్ముకోవాలి
అని చెప్తరు..

మనిషికి ఈ పాపం ఎలా వచ్చింది అంటే సమాధానం అవ్వ ఆదాం ఇద్దరూ కూడా దేవుడు తినవద్దన్న పండును తిన్నారు కాబట్టి వాళ్లు పాపులు, వాళ్ల వల్ల వచ్చిన మనం, మానవజాతి అంతా పాపులం, ఆ పాపం వారసత్వంగా వచ్చేస్తుంది అని చెప్తారు..

ఈ సిద్ధాంతం తప్పు ఎలా అంటే..?!

బైబిలు దేవుడు యహోవా ఆదాం పక్కటేముక ఒకటి తీసి అవ్వని తయారుచేశాడు కాబట్టి మగవాళ్ళకి ఒక పక్క టెముక తక్కువుంటుంది స్త్రీల కంటే (అని క్రైస్తవులు నమ్మే వారు, ఇది సైన్స్ తప్పు అని నిరూపించింది పురుషులకే స్త్రీలకే పక్కటెముకల సంఖ్య లో ఎలాంటి తేడా ఉండదని చెప్పింది)

ఆదాం కి ఒక పక్కటెముకు దేవుడు తీసేస్తే మానవజాతి అందరికి మగవాళ్లకు ఒక పక్కటెముకు తక్కువ ఉండాలి కదా..! మీ పాపి సిద్ధాంతం ప్రకారం.. కానీ అలా ఎందుకు లేదు??

అప్పుడెప్పుడో అవ్వ ఆదాం  పాపం చేస్తే  మానవ జాతంతా పాపాత్ములు  అని చెప్పిన మీ సిద్ధాంతం పక్కటెముక సంఘటన కి అన్వయించి చూడండి..!! మీకే అర్థమవుతుంది మీ మూర్ఖత్వం..!!

హిందూ ధర్మం ప్రకారం మనిషి జన్మ అన్ని జన్మలలోకి చాలా గొప్పది, ఈ జన్మలో మనం మంచి గొప్ప కార్యక్రమాలు, పుణ్యాలు చేస్తే దేవతల స్వర్గాన్నీ పొందవచ్చు, ఇక్కడ పుట్టుకతోనే  నేను పాపి అనే దౌర్భగ్యం లేదు. అమృతస్య పుత్రః అనే భావన ఉంది.. ఎన్నో పుణ్యాలు చేస్తేనే మానవజన్మ, అందునా ఈ భారతదేశంలో పుట్టడం ఎంతో అదృష్టం అనే చెప్పాలి..!!

ఎవడ్రా అన్ని మతాలు ఒకటే అన్నది..!! ఇంత తేడాలు ఉంటె..!!

మనిషి పుట్టుక మూలం ఏంటి కారణం ఏంటి ?
మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ?
**************************************

బైబిల్, ఖురాన్ :-

మనిషి పుట్టుక పరమార్థం ఏమిటి అనేది ఈ  ఈ గ్రంథాలలో కనబడ లేదు, అసలు మనిషి ఎందుకు పుడతాడు అనేది బైబిల్ ఖురాన్ అని స్పష్టంగా తెలియలేదు. క్రైస్తవుల ఇంకో అడుగు ముందుకేసి అసలు సెక్స్ అనేది పాపంగా చేప్తరు. మనుష్యులు కలయిక అనేది సెక్స్ అనేది పాపంగా భావిస్తారు.

హిందూ గ్రంధాలూ:

మనిషి పుట్టుకకు పరమార్థమని అతని లక్ష్యం నాలుగింటి గా చెప్పింది ధర్మము, అర్థము, కామము, మోక్షము

ధర్మము అంటే మనం ఆ క్షణంలో చేయవలసిన మన కర్తవ్యం,
అర్ధం అంటే మన సంపాదించుకోవాల్సినవి (పుణ్యం, డబ్బు...)
కామము అంటే మనం అనుభవించవలసినవి (సుఖాలు, భోగాలు)  మోక్షమంటే వీటన్నింటి నుంచి విడివడి పరమాత్మ చేరుకోవడం, ఇది మన జన్మ యొక్క లక్ష్యం

విగ్రహారాధన (విగ్రహాలను పూజించటం)..!!
************************************

బైబిల్ ఖురాన్ ప్రకారం విగ్రహాలను ఎవరైనా పూజిస్తే వారికి నరకం, అది ఘోరమైన పాపం.

బైబిల్ దేవుడు యహోవా ఏకంగా విగ్రహాలను, గుడి, దేవాలయాలను నాశనం చేసేయాలి, దేవాలయాల నామరూపాలు లేకుండ ధ్వంసం చేయలి అని బైబిల్ లో ఆజ్ఞ కూడా ఇచ్చాడు..! (ద్వితీయ ఉపదేశ 12: 1,2,3)

హిందూ గ్రంధాల ప్రకారం విగ్రహాన్ని పూజించటం వల్ల మనలో నిగ్రహం పెరిగి, దేవుని మీద ఏకాగ్రత పెరుగుతుంది.. మన కంటికి కనిపించని దేవుణ్ణి విగ్రహాన్ని మన ఎదుట పెట్టి భక్తికి మొదట అడుగు వేయటమే విగ్రహారాధన లక్ష్యం..

ఆ మతాలేమో విగ్రహాన్ని పూజిస్తే నరకం అంటున్నాయి విగ్రహాల్ని దేవాలయాలను నాశనం చేయమంటున్నాయ్

హిందూ మతమ్ విగ్రహారాధన దేవుని చేరుకోడానికి మార్గముంటుంది
                   
                        ******************

ఎవడ్రా అన్ని మతాలు సమానమ్ అన్నది..!!

చూసారా..
మిత్రులారా ఇన్ని తేడాలు మతాల మధ్య ఉంటే వచ్చిన ప్రతివాడు అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాలు సారం ఒకటే, అని చెప్తారు

అలా హిందువులకు చెప్పడం వల్ల లాభమేమిటి??  ఎందుకంటే ఒకసారి హిందువుల మనస్సులలో అన్ని మతాలు సమానమే,అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే అనే భావన తీసుకురాగలిగితే....

పాపం ఆ పిచ్చి హిందువు అన్ని మతాలు సమానమే అనుకోవడమే గాకుండా తాను హిందువుని అనే విషయం కూడా మర్చిపోతాడు... ఎందుకంటే అన్ని మతాలు సమానమైనప్పుడు, అన్ని మత గ్రంధాలూ ఒకటే అయినప్పుడు, అందరిదీ ఒకటే అయినప్పుడు

ప్రత్యేకంగా ఆయనకు నేను హిందువుని అని చెప్పుకోవడం ప్రత్యేకంగా అతని గ్రంథాలు చదవడం వృధా అనుకుంటాడు..!!

బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు..!
గుడికి వెళ్లడానికి మొహమాట పడతాడు..!
తాను నమ్మిన దేవుడు ఉన్నాడా అని అనుమాన పడతాడు..!!

చివరగా  తాను హిందువుని అనే
విషయం మరిచిపోతాడు..!!

ఆ ప్రాంత నేత మతస్థులను హిందువులను అమయుకుల్ని చేసి హాయిగా మత మార్పిడి చేసుకుంటారు..!!

చూశారా.......ఇది "అన్ని మతాలు సమానం" అనే ఒక వైరస్ వెనక ఉన్న అసలైన నిజం ఈ విషయం తెలుసుకోవాలి... ప్రతి హిందువు తెలుసుకోవాలి..!!!

By.    Gopi krishna garu

1 వ్యాఖ్యలు:

Aravind September 9, 2017 at 2:17 AM  

హిందూ మతం లో దేవుళ్లుగా పూజించబడుతున్న రాముడు, కృష్ణుడు కూడా హిందువులా? ఎవడ్రా నీకు చెప్పింది? చిన్న జీయర్ స్వామిలోరు ఉద్దేశ్యంలో వాళ్ళు ఏమవుతారో తెలుసుకో ముందు. చెత్త పోస్టులు పెట్టడం కాదు. కామెంట్లు పబ్లిష్ చేయడం నేర్చుకో! రచ్చబండ గాళ్ల లింక్ ఇచ్చా చూసుకో!
భారతీయులు హిందువులు కాదా? హిందువంటే దౌర్భాగ్యుడని అర్ధమా? వివాదాస్పద చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP