శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవాలయాల కి వెళ్ళి నప్పుడు

>> Monday, July 17, 2017

*ఇక పైన దేవాలయాల కి వెళ్ళి నప్పుడు:*

*1. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే  దేవాలయాలలోని హుండీలలో డబ్బులు వేయకండి.*

*ఆ వేసిన డబ్బుని దేవాదాయశాఖ VIP విజిటర్స్ మీద హాయిగా ఖర్చు పెడుతుంది. ఇది జగమెరిగిన సత్యం.*

*ఇష్టం ఉంటే పదో పరకో పూజారికి ఇవ్వండి.*

*ఖచ్చితంగా హుండీలో మాత్రం వేయకండి. ఇలా చేస్తే కొన్నేళ్ళకి దేవాదాయశాఖ ఆదాయం లేని దేవాలయాలను వదిలి పారిపోతుంది. మనకి పట్టిన దరిద్రం  వదులుతుంది.*

*2.చక్కగా దేవీ దేవతలను దర్శనం చేసుకోండి. భక్తిని ప్రదర్శించండి.*

*కానీ కొబ్బరికాయలు కొనకండి.*

 *ఎందుకంటే గుడిలో వాటిని  పూజారి కొట్టటం నైవేద్యం పెట్టటం ఉండవు. వాటిని ఎవరో కాంట్రాక్టర్ పెట్టిన మనిషి కొడతాడు + అమ్ముకుంటాడు.*

*3. పసుపు,కుంకుమ,అగరత్తులు, హారతి కర్పూరం మీరు తీసుకుని వెళ్తారు. వాళ్లు మళ్ళీ అవే మనకి అమ్ముతారు. ఇతర భక్తు రాళ్ళ పాదాలకు పసుపు రాయండి.అమ్మ వారికి పెడుతున్నాము అనుకుని వారికి భక్తితో గౌరవించి నమస్కారము చేయండి.*

*దేవాలయం ఆదాయంతో మీకు కనీసం ప్రసాదం కూడా  పెట్టరు.*

*4. చీరేలు ,రెవికల గుడ్డలు అమ్మవారికి మొక్కు తీర్చుకోండి, కానీ వాటిని మరల మీరు తీసుకోండి లేదా వాటి అవసరం ఉన్న వాళ్ళకి  దానంగా ఇవ్వండి.*

*అమ్మవారు సంతోషించి మిమ్ములను ఆశీర్వాది స్తుంది*

*వేలమువేసి అమ్ముకుని డబ్బు చేసుకునే పాపంలో పాలు పంచు కోకండి !!*

*5. అన్నదానం ఉన్న చోట  అన్నదానానికి డబ్బు  కట్టండి.ఏదో కొంతలో కొంత నయం పుణ్యం వస్తుంది.*

*లేదంటే మీ ఇంటిలో నైవేద్యం తయారు చేసుకుని వెళ్ళండి.దేవి దేవతలకి భక్తితో వాటిని వారికి చూపించండి.వాటిని చక్కగా మీరే భక్తులకి పంచిపెట్టండి.అలాగే ఆకలితో అలమటిన్చే అన్నార్తులు దేవాలయం బయట ఉంటారు వారి కడుపు ఆకలి తీర్చేప్రయత్నం చేయండి.*

*6.  ఇంకా దానం చేయాలి అని అనిపిస్తే గోశాలలలోని గోవులకి ఆహారం కొని తీసుకుని వెళ్ళి ఇవండీ.మీ వంశము తరిస్తున్ది.మీ పెద్దలు ఆశీర్వాదిస్తారు.*

*7. శ్రీ రామ నవమి,వినాయక చవితి పందిళ్లు వేసేమంచి వారికి చందాలు కొద్దిగా ఇవ్వండి.*
*నైవేద్యాలు ఇళ్ళలో చేసి ఇవ్వండి లేదా పళ్ళు ఫలహారాలు పంచి పెట్టండి లేదా అన్నదానాలు చేయండి. ఏవైనా మీరు ప్రత్యక్షంగా చూసి,పాల్గొనండి.*

*చివరి పలుకు:*

*ఆదాయం వచ్చే చిన్న చిన్న  ఆలయాలు, పెద్ద పెద్ద దేవాలయ కమిటీలు అన్నీ ఆయా రాజకీయ  పార్టీల వాళ్ళతో, వాళ్ళకిష్టమైన వాళ్ళతో నింపుతున్నారు.*

*మసీదులకి,చర్చిలకి  కమిటీలు ప్రభుత్వం ఇలా నియమిస్తారా ? చస్తే చేయరు. అందుకని ఈ దొంగ  సెక్యులర్ ప్రభుత్వం  వారు నిర్వహించే దేవాలయాల లో డబ్బులు వేయవద్దు.*

*ముల్లాలకి ,మౌల్వీలకి ముత్తావలీలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. మక్కా హజ్ యాత్రలకి ,క్రైస్తవులకి జెరూసలెమ్ యాత్రలకి,మసీదులు ,చర్చిలు కట్టుకోవటానికి  ప్రభుత్వం మనం కట్టే పన్ను  డబ్బుతోకట్టిస్తారు, యాత్రలకు  పంపుతారు.మనకి మానస సరోవర్ యాత్రకి మనల్ని పంపుతారా ? పంపరు.*

*మన డబ్బు, మన దేవాలయం , మన దేవుడు,మన పెత్తనం,మన భక్తి ,మన ఆనందం.*

*మన దేవాలయ ఆస్తులు మనం కాపాడు కోవాలి. మన పీఠాధిపతులు, మన మఠాధి పతులు, ఆచార్యులు ,మన భక్తులు నడిపేదాకా మనం ప్రభుత్వా ధీన దేవాలయాలలో డబ్బులు వేయకుండా వాటికి స్వతంత్రం వచ్చేదాకా దీనిని పాటిద్దాం

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP