శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధన త్రయోదశి

>> Sunday, October 19, 2014

ధన త్రయోదశి
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరకుని చెరనుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

ధనలక్ష్మీ ఆరాధన:
సకల సిరులకు, అష్తె్టశ్వర్యాలకు, నవనిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

అమావాస్య వెలుగుల పండుగ:
కార్తీకమాసంలో వచ్చే పండుగలలో చాలా ముఖ్యమైనదే కాక, పండుగలన్నింటికి కూడా చాలా ముఖ్యమైనదిగా చాలా ప్రాంతాల వారిచేత పరిగణించబడేది దీపావళి. ఇది అమావాస్య నాడు వచ్చే వెలుగుల పండగ. దీపాలు వెలిగించి, టపాకాయలు పేల్చి అవనిశిని దీప్తమంతం చేస్తుంది కనుక దీనికి దీపావళి అని పేరు వచ్చిందని అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట. అయినా,ఈ పండుగని ఎందుకు చేసుకుంటున్నామో, దీపాలు వెలిగించటానికి గల కారణం ఏమిటో చెప్పే కారణాలు మాత్రం చాలా వున్నాయి.

నరకాసుర వధ :
వాటన్నింటిలోనూ ముఖ్యమైనవీ, అందరూ అంగీకరించేది నరకాసురువధ. నరకుని శ్రీకృష్ణుడు సత్యభామ తోడ్పాటుతో సంహరించింది చతుర్దశి నాడు కానీ, ఆ సంతోషాన్ని అందరూ వ్యక్తపరిచి వేడుక చేసుకుంది మాత్రం మరునాడట. అదే దీపావళి. అజ్ఞానానికి ప్రతీక అయిన నరకుని అంతమొందించి విజ్ఞానజ్యోతిని వెలిగించిన దానికి ప్రతీకగా దీపాలు వెలిగించటం దీపావళి అంతరార్థం అనీ, ఇంట దీపం వెలిగించటంతో పాటు గుండెల్లోనూ, సమాజంలోనూ కూడా వెలిగించాలనీ, అప్పుడే దీపావళి పండుగ నిజమైన సంబరం అవుతుందనీ పెద్దలు మనకు సూచనప్రాయంగా అందించిన సంప్రదాయం. మనకు ఆశ్వయుజ కృష్ణ అమావాస్య, ఉత్తర దేశీయులకు కార్తీక అమావాస్య అయిన దీపావళి రోజున అనేక శుభ సంఘటనలు అన్ని యుగాలలోనూ జరిగినవట వాటి జ్ఞాపకార్థం దీపావళి జరుపుకోవటం ఆనవాయితీ అయిందట.

సీతారాముల ఆగమనం :
త్రేతాయుగంలో సుమారు 22 లక్షల సంవత్సరాలకి పూర్వం శ్రీరామచంద్రుడు రావణుని వధించి సీతా సమేతుడై అయోధ్యకు వచ్చిన సందర్భంలో సీతారాములను ఆహ్వానించటానికి పౌరులు నగరాన్ని ఆవునేతి దీపాలతో అలంకరించారట. ఆ దీపాలు వారి మనస్సులలో ఉన్న ఆనందానికి చిహ్నం. శ్రీరాముడు లేని రోజులన్నీ తమకు చీకటి అనీ, రాముని ఆగమనం తమ జీవితాలకి వెలుగునిచ్చిందనీ తెలియపరచటానికే దీపాలు. ఆ రోజు కార్తీక అమావాస్య అనీ, ఆ సంతోషకర సంఘటనకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆ రోజు దీపాలు వెలిగించి ఉత్సవం జరుపుకుంటారని దీపావళి పండుగ మూలం త్రేతాయుగం నుండి ఉందని ఒక విశ్వాసం.

మహావీరుని జన్మదినం :
జైనమత ప్రవర్తకుడు అయిన మహావీరుడు జన్మించింది కూడా దీపావళి రోజునే. అందువలననే జైనులు కూడా దీపావళిని పరమ పవిత్రదినంగా భావిస్తారు. విక్రమాదిత్య చక్రవర్తి 30 లక్షలమంది శకులను హూణులను భారత భూమి నుండి పారదోలినది కూడా దీపావళి శుభదినానే. ఆనాటి నుండే విక్రమశకం ప్రారంభమైంది

సిక్కులకు పవిత్ర దినమే :
దీపావళితో సిక్కులకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సిక్కుల గురువు గురుగోవిందసింగ్‌ను మొగలు చక్రవర్తి జహంగీర్‌ గ్వాలియర్‌ కోటలో బంధించాడు. కొన్నాళ్ళకు చక్రవర్తి గురుగోవిందసింగ్‌ ను మాత్రం విడుదల చేయటానికి నిశ్చయించుకున్నాడు కాని, గురుగోవిందసింగ్‌ తానొక్కడే విడుదల అవటానికి ఇష్టపడక, కోటలోని వారందరినీ కూడా తనతో పాటు విడుదల చేయాలని పట్టుపట్టాడు. జహంగీర్‌ ఆయన మాట మన్నించి అందరినీ విడుదల చేశాడు. ఆ శుభదినం కూడా దీపావళే. భారతదేశంలో ఉన్న అన్ని సంప్రదాయాలకీ దీపావళితో ఏదో ఒక విధమైన సంబంధం ఉంది. అందరూ పవిత్రదినంగా భావించి, వేడుకలు జరుపుకుంటారు.

లక్ష్మీ ఆవిర్భవించిన రోజు :
పురాణాలలో కూడా దీపావళికి సంబంధించి అనేక ఇతివృత్తాలు కనిపిస్తాయి ... నరకాసురవధ కాక విష్ణుపురాణం మార్కండేయ పురాణాలలో లక్ష్మీపూజ చేయాలని, అలా చేస్తే అది విశిష్ట ఫలదాయకమని చెప్పబడింది. రాముడు అయోధ్యకి రావటమో, కృష్ణుడు నరకుని సంహరించటమో జరిగిన రోజున వారిద్దరినీ కాక లక్ష్మిని పూజించటం విశేష ఫలదాయకం అవటానికి కారణం ఏమిటి?
క్షీర సముద్రాన్ని మదించినప్పుడు విశిష్ట వస్తు సముదాయాలన్నీ అందులోనుండి ఉద్భవించాయి కదా! త్రయోదశి నాడు ధన్వంతరి జన్మించాడని చెప్పుకున్నాం. అమావాస్య నాడు లక్ష్మి జన్మించిందట. లక్షి అనగా విస్పష్టమైన గుర్తు అవి కలిగి, వాటిపై ఆధిపత్యం కలిగిన దేవీమూర్తీ (వెలిగేరూపం) లక్ష్మీదేవి. ఆమె విష్ణువుని చూచి ఇష్టపడిందట. విష్ణువు ఆమెను తన వక్షస్థలంలో చేర్చాడట. ఆమె అష్టవిధమైన రూపాలతో అలరారిందట. వారే అష్టలక్ష్ములు. ఆమె జన్మదినం కనుక ఆనాడు తనను పూజించినవారికి అషై్టశ్వరాలను ప్రసాదించుతుందట. లక్షీదేవి అమావాస్యనాడు పుట్టినందువల్లనే కాబోలు, అమావాస్యనాడు ఆడపిల్ల పుట్టటం శుభం అనీ, ఆపిల్ల అపురూప సుందరి, ఐశ్వర్యవంతురాలు, అదృష్ట్టవంతురాలు అవుతుందనే నమ్మకం ఉంది. దేవలోకం వారికి కూడా దీపావళి శుభప్రదమే ఒకప్పుడు దుర్వాసమహర్షి ఇచ్చిన పారిజాత పూల దండని ఇంద్రుడు అగౌరపరిచాడట.

అది విష్ణువు ఇచ్చినదే అయినా, ముని తన మెడలొ వేసుకున్నదాన్ని దేవలోక రాజైన తాను ధరించటం అవమానం అని భావించి, పారవెయ్యటానికి భయపడి తానెక్కిన ఏనుగు కుంభస్థలం మీద అలంకరించాడు. కానీ అది ఏనుగు తలమీంచి కిందపడింది. దానిని ఏనుగు కాలితో తొక్కింది. దుర్వాసుడు అది చూసి స్వర్గలక్ష్మి ఇంద్రుని తొలగిపోతుందని శపించాడు. ముని శాపం ప్రకారం ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోయి దీనుడై వున్నాడు.దేవతలందరికీ పెద్ద దిక్కు అయిన బ్రహ్మను ప్రార్థిస్తే, అతడు ఇంద్రుని విష్ణువు వద్దకు తీసుకొని వెడతాడు. అప్పుడు విష్ణువు అభయం ఇస్తాడు. ఆ అభయ ప్రదానం కారణంగా, విష్ణువు లక్షిని స్వీకరించగానే ఇంద్రుని శాపం అంతం అయి, పూర్వవైభవాన్ని తిరిగి పొందుతాడు. ఆ కారణంగా దేవతలంతా ఆనందోత్సాహాలతో లక్ష్మీదేవి జన్మదిన వేడుకలను జరుపుతారు. తాము చీకట్లలోనుండి వెలుగులోకి వచ్చిన దానికి చిహ్నంగా దీపాలు వెలిగించి, జ్యోతి స్వరూపంగా లక్ష్మిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ విధంగా దీపావళి దేవతలు కూడా జరుపుకునే పండుగ అయింది.

దీపం ఉన్న ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది :
అన్ని పండుగలకి, మనం తలంటు పోసుకోటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండివంటలు చేసుకోవటం, బంధు మిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది కాని, ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది `దీపాలు వెలిగించటం, టపాకాయలు కాల్చటం దీనికి సంబంధించి విష్ణుపురాణంలో ఒక కథ కనపడుతుంది` దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకేం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యాస్తమయ సమయం, అనగా సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది. ``దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము''

``సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలెన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం,
ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన ్తయ్రోదశి. ఆశ్వయుజ బహుళ ్తయ్రోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ ్తయ్రోదశి, యమ ్తయ్రోదశి, కుబేర ్తయ్రోదశి, ఐశ్వర్య ్తయ్రోదశి వంటి పేర్లూ ఉన్నాయి. `అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యుభయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి'+ అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధన్తయ్రోదశి పర్వదినం. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యంకోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన ్తయ్రోదశినాడు పూజిస్తారు.

శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదయిన వానినన్నింటినీ పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన `వెలుగు' (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగు ను పంచుతాడు, చీకట్లు పోగొట్టి కాని, ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడెన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. `దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన:'' ఆ అగ్నిదేవుని మన ఇంటి యందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే, ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం!!!

తులసమ్మ వద్ద దీపం:
దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికీ ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్రదర్శనం చేయాలంటారు.

1 వ్యాఖ్యలు:

sri October 19, 2014 at 10:49 AM  

baavundi,chaala vishayalu chepparu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP