శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం [2012] కార్యనిర్వాహకవర్గ సూచనలు

>> Wednesday, March 28, 2012


హనుమత్ రక్షాయాగం [2012] కార్యనిర్వాహకవర్గ నిర్ణయములు


స్వామి అనుగ్రహం వలన ఈ యాగ నిర్వహణలో మొదటిదశగా కోటిచాలీసా పారాయణ విజయవంతంగా సాగుతున్నది. దేశవిదేశాలనుండి భక్తులు యాగం లో చాలీసా పారాయణద్వారా భాగస్వాములయ్యారు. ఇక పూర్ణాహుతి కార్యక్రమానికి
సంబంధించిన ఏర్పాట్లు గూర్చి 'కార్యనిర్వాహకవర్గం" సమావేశమై తీసుకున్న నిర్ణయాలివి.


౧. యాగంలో పాల్గొననున్న భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బందీ లేకుండా చూడటం.
౨. మే 15 న హనుమజ్జయంతి సందర్భంగా హనుమత్ స్వామికి 108 కలశములతో వివిధ పవిత్రద్రవ్యములతో అభిషేకం. ప్రత్యేక అర్చనలు .
సాయంత్రం . పీఠంలో కొలువై వున్న శ్రీవేంకటేశ్వర స్వామివారికిదేవేరులకు మరియు శ్రీ రామలింగేశ్వరులకు,దుర్గాపరమేశ్వరి అమ్మవారలకు కళ్యాణోత్సవం నిర్వహించటం .

౩ . మే 16 న 108 యజ్ఞకుండిలతో పూర్ణాహుతి యాగాన్ని నిర్వహించటం జరుగుతుంది.
ఒక్కో యజ్ఞ కుండి దగ్గర దంపతుల కుమాత్రమే అనుమతి



౪. వారిచే సశాస్త్రీయంగా నిర్వహింపజేయుట జరుగుతుంది

౫. యజ్ఞ ద్రవ్యములు అన్నీ అక్కడే అందజేయబడతాయి .
౬. యాగానంతరం ప్రసాదాలు రక్షలు అందజేయబడతాయి .

౭. అందుకోసం యజ్ఞం లో పాల్గొను దంపతులు యాగద్రవ్యములకోసం 1008 రూపాయలు సమర్పించి ఏప్రిల్ ఇరవయ్యవతేదీలోగా క్రింద ఇచ్చిన అడ్రస్ లలో తమపేర్లు నమోదు చేపించుకొన వలెను .

౮. మామూలుగా యాగానికొచ్చేవారు ముందుగా సమాచారమివ్వవలసిన అవసరం లేదు.
౯. యాగమునకు ,అన్నదానమునకు సహకరించవలసిన వారు తెలిపితే వారికి ఆన్లైన్ ఎక్కౌంట్ నంబర్ ఇవ్వబడుతుంది దానికి పంపవచ్చు.

౧౦ . యాగమునకు సహకరించినవారందరికీ యాగానంతరం హనుమద్రక్షలు ప్రసాదం పంపబడుతుంది.


౧౨ యాగములో పాల్గొను దంపతులు సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి [పంచెకండువ, స్త్రీలు చీరకట్టు]

౧౩ వేసవి గనుక నేత వస్త్రాలైతే మేలు



౧౪ . యాగానికి వచ్చువారు may 15 రాత్రికి గాని మే 16 ఉదయాన్నే ఏడుగంటలకల్లా యాగశాలకు చేరుకోవాలి.

౧౪ . ఇక్కడ మాతోపాటు అందరితో కలసి సాధారణ వసతులతో బస చేయవలసి ఉంటుంది . ప్రత్యేకం గా వసతులుండవు .అందరితో పాటు కలసి యాగంలో సేవకులమనే భావనతో సేవలో పాల్గొనాలి.
స్త్రీలతో కలసి యాగానికి వచ్చు వారికి ఇబ్బందులేమీ ఉండవు.

రూటు ః గుంటూరు -కర్నూల్ ప్రధాన రహదారిపై గల వినుకొండ పట్టణానికి 18 km రహదారిపై నేరవ్వవరం గ్రామంలో పీఠం ఉంటుంది. వినుకొండ నుండి బస్సులు జీపులు ఆటో సౌకర్యములున్నవి.
హైదరాబాద్ వైపునుంఛి వచ్చేవారు నేరుగా నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల వినుకొండ చేరుకోవచ్చు.

రాయలసీమ వైపునుంచి వచ్చేవారు గుంతకల్లు... గుంటూరు రూట్లో ఉన్న వినుకొండ రైల్వేస్టేషన్ లో దిగాలి
అలాగే కర్నూల్-గుంటూరు నేషనల్ హైవే లో వినుకొండ లో దిగాలి

మద్రాసు వైపునుంచి వచ్చేవారు ఒంగోలు వచ్చి అక్కడనుండి అద్దంకి వచ్చి పీఠానికి చేరుకోవచ్చు
విశాఖ పట్నం --విజయవాడ వైపునుంచి వచ్చేవారు గుంటూరు మీదుగా వినుకొండ రైల్లో బస్సులో చేరుకోవచ్చు
విశాఖ ..బెంగలూర్ ..పుట్తపర్తి వెళ్ళె ప్రశాంతి ఎక్స్ ప్రెస్ వినుకొండలో ఆగుతుంది

వినుకొండ నుండి పీఠం తరపున జీపు ఒకటి ఏర్పాటు చేసి ఉంచుతాము కనుక దానిపై పీఠానికి చేరుకోవచ్చు.
ప్రయాణంఅయ్యాక ఫోన్ లో సంప్రదిస్తుంటే కార్యకర్తలు మీకు సరైన మార్గాన్ని తెలియపరస్తుంటారు


౧౬ సంప్రదించవలసిన చిరునామాలు

దుర్గేశ్వర 9948235641 durgeswara@gmail.com


యాగనిర్వాహక సభ్యులు
---------------------
జి శ్రీనివాసరెడ్డి ఒంగోలు
అన్నా సుందరరావు ముక్కెళ్లపాడు
సూరె కృష్ణా రావు గిద్దలూరు
బి. శ్రీనివాసరావు [నెల్లూరు]
ఎస్ .హనుమంతరావు [ఈనాడు]నూజండ్ల
ఆచారి [సాక్షి]నూజండ్ల
నమశ్శివాయ [ఆంధ్రభూమి]నూజండ్ల
వెంకటరెడ్డి [ఆంధ్ర జ్యోతి] నూజండ్ల
కోటేశ్వర రావు [దరిశి]
బి కృష్ణ శ్రీ పీఠం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP