శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూజ కాగానే మంగళహారతి పాడతారెందుకు..?

>> Friday, July 29, 2011





పూజకుకూడా మొదలుపెట్టటం నుంచి ముగింపు వరకు కొన్నిపద్దతులున్నాయి . . ప్రారంభంలో తలమీద నీళ్లు చల్లుకుంటూ. "అపవిత్రపి పవిత్రోవా.."అనే మంత్రం స్మరిస్తాము. . దీనితో పూజ ప్రారంభమవుతుంది. ఇళ్లలోనూ దేవాలయాల లోనూ పూజ పూర్తిఅయ్యాక మంగళహారతి ఇవ్వడం పూజావిధిలో భాగం. దీనితో పూజ పరిసమాప్తమవుతున్నట్లుగా భావిస్తాం.

ఇంటిలో పూజ మన ఒక్కరికే (కుటుంబానికి) సంబంధించిన పూజ. కనుక పూజ కాగానే మంగళహారతి ఇచ్చి పూర్తి చేస్తాం.అదీ ఉదయం సాయంత్రాలలో . దేవాలయాల్లో దేవుడికి ఒకే ఒక్క పూజకానీ, ఒకే ఒక్కరి పూజ కానీ కాదు. కాబట్టి, మంగళహారతి అనేది అనే పర్యాయాలు ఇస్తారు. దేవాలయాల్లో జరిగేదంతా మంత్రపూర్వకంగా జరుగుతుంది. కనుక మంగళహారతి "సర్వః ప్రజామ్నే గోపాయ.." అంటూ మంత్రపూర్వకంగా వినిపిస్తుంది.

ఇళ్ళలో మంత్రపూర్వకంగా పూజ జరిగినా భగవంతుని గానంతో సేవించాలి ఆయన గాన ప్రియుడు కాబట్టి ఆయనకు మంగళహారతి సమయంలో రాగయుక్తంగా, మంచిగొంతుతో అందరూ కలిసి పాటపాడి వినిపిస్తారు.

పూజ అయిన తర్వాత మంగళహారతి పాటను పాటడం అంటే నాకు వచ్చిన సంగీతం పాండిత్యం ఈ కంఠ మాధుర్యం, ఈ భక్తీ, శ్రద్ధా, నా కుటుంబ శ్రేయస్సు, అన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వల్ల వచ్చినవే.

కనుక, వీటినన్నింటినీ నీకే అంకిత మొనర్చుకుంటున్నాను దేవా! అని తన్మయంత్వంతో తెలుపడమే అవుతుంది. ఈ విషయాన్ని జ్యోతిసాక్షిగా సర్వాంతర్యామి అయిన దేవుడికి తెలుపడం పూజ అయినదని ప్రకటించడం మంగళ హారతి ఇవ్వటంలో అంతరార్ధం .

3 వ్యాఖ్యలు:

astrojoyd July 29, 2011 4:13 AM  

బావుంది ఇందులోని మరో ప్రయోజనం ఏమంటే కర్పూర,పంచ తైలాలతో ఇచ్చే హారతిలో వెలువడే ఆవిరి వాసనలు గుడిలోని బొగ్గుపులుసువాయువుని,ఇతర క్రిములను నిర్వీర్యము చేస్త్త్హాయి.ఈ రకంగా పుణ్యమూ/పురుషార్ధము పొందానికి ఆలయాల్లో తరచుగా హారతి ఇస్త్త్హారు.

వనజ వనమాలి July 29, 2011 10:33 AM  

Manchi vishayam thelusukunnam..Thanks..andee!

సాయి August 3, 2011 3:45 AM  

ILANTI MANCHI VISHAYALU INKA TELUPANDI

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP