శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కన్నులపండుగాయె స్వామీ ! నీకళ్యాణము.

>> Sunday, February 13, 2011






శ్రీదేవి,భూదేవి సిగ్గులమొగ్గలుకాగా చిరుతనవ్వులవాడు సింగారములతో కళ్యాణమండపంలో కొలువుదీరి ,పురోహితుల మత్రోచ్ఛరణ లమధ్య అమ్మవారల మెడలలో మంగళసూత్రం కట్టాడు. భక్తులజయజయధ్వానాలు తో మురిసిపోయి మనలను తానెప్పుడు వీడనని మందహాసస్మితుడై మోదాన్నితెలియపరచాడు.
మరొకపక్క జగన్మాతాపితరులగు పార్వతీ పరమేశ్వరులు తమ పిల్లలవేడుకకోసం నూతనవధూవరుల రూపుదాల్చి పరిణయోత్సవంలోపాల్గొన్నారు.

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణోత్సవం నిన్న [ఆదివారం] వైభవోపేతంగా జరిగింది .
మగపెళ్ళివారు, ఆడపెళ్ళివారు గా భక్తులు ఇరువైపులా తరలివచ్చి కళ్యాణంలోపాల్గొన్నారు.
ఈసందర్భంగా చెన్నైనుంచి వచ్చిన సునీల్ వైద్యభూషణ్ కూడా పురోహితులతోపాటు ఒకపురోహితుడై కళ్యాణక్రమాన్నినడపటమేగాక . స్వామి వారి భక్తులకు పెండ్లివిందు కూడా ఏర్పాటుచేశాడు అమెరికాలో ఉండే మన ఆడపడుచు రాధిక పురోహితులకు స్వామివారి తరపుఅ సంభావనలను అందించారు.
మన బ్లాగర్లు నాగప్రసాద్ ,కౌటిల్య లుకూడా కళ్యాణోత్సవంలో సందడిచేశారు.
వివాహమైన పందొమ్మిది సంవత్సరాలకు అమ్మవారి కృపతో శుక్ర్రవారం రోజు జన్మించిన పాపను తీసుకుని వచ్చిన ఆంధ్రభూమి విలేఖరి నమశ్శివాయ పాపను అమ్మవారి పాదసన్నిధిలో ఉంచి అమ్మా !ఇది నీప్రసాదం సంబరపడిపోయాడు . మూడునెలలు నిండని ఆ పిడుగు అమ్మవారి వంకచూసి కిలకిలలాడుతుంటే వెన్నెలవానకురిసినట్లనిపించింది .
నాడు యశోదకులభించని భాగ్యం నేడు మాకుదక్కింది ,మరలా నీకళ్యాణానికి మాకుచెప్పటం మరచిపోకు స్వామీ ! అని వచ్చినభక్తులు స్వామికి విన్నవించుకుని తరలి వెళ్ళారు.

ఈససందర్భంగా గోత్రనామాలు పంపిన భక్తుల తరపున కూడా అర్చనలు జరుపబడ్డాయి.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP