శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పుట్టుమచ్చలు - వాటిఫలితాలు

>> Saturday, July 31, 2010


[అంగసాముద్రికంలో శరీరలక్షణాల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని చెబుతారు .అందులో పుట్టుమచ్చల ఆధారంగా కూడా కొన్నిఫలితాలు చెప్పగలుగుతారు. అయితే పుట్టుమచ్చలు ఒకటే కాక మిగతా విషయాలన్నీ సమన్వయించుకుని జ్యోతిష్యశాస్త్రజ్ఞుడు ఫలితాలు చెబుతాడు. అంతర్జాలంలో ఈ దొరికిన ఈ వివరాలను కేవలం సమాచారం కోసం మీకందిస్తున్నాను ]





నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.


నుదుటి క్రింది భాగంలో ఉంటే : మీరు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.

కనుబొమ్మపై ఉంటే : మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.

ముక్కుపై ఉంటే : కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది.

పెదవిపై ఉంటే : కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది.

బుగ్గపై ఉంటే : రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.

నాలుకపై ఉంటే : మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు.

భుజంపై ఉంటే : మీరు మర్యాదస్తులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు.

మోచేయిపై ఉంటే : మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో ఉంటే : మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి.

కుడి చంక భాగంలో ఉంటే : భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు.

మెడ భాగంలో ఉంటే : కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.

శరీరం ముందు భాగంలో ఉంటే : ఆకస్మిక ధన లాభం.

శరీరం వెనుక భాగంలో ఉంటే : మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

ఛాతీ భాగంలో ఉంటే : మీకు మనశ్శాంతి ఉండదు. కొందరికి జీవితంలో కష్టాలు తప్పవు.

శరీరం కుడి భాగంలో ఉంటే : మీ సోమరితనం కుటుంబం పై ప్రభావం చూపుతుంది. ఉల్లాసంగా ప్రయాణాలు సాగిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.

శరీరం ఎడమ భాగంలో ఉంటే : మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు.

నాభి భాగంలో ఉంటే : మీకు సుఖ సంతోషాలు సమతూకంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తి లభస్తుంది. కొన్నిసార్లు అదృష్టం కలిసివస్తుంది.

తొడ భాగంలో ఉంటే : మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వ్యాపారాలు సాగిస్తారు.

పాదం పై ఉంటే : మీరు స్వఛ్చమైన జీవితాన్ని గడుపుతారు. సామాజిక సేవల పట్ల ఆసక్తి చూపుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాధిస్తారు. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజూ వ్యాయామం చేయటం మంచిది.

కాలిపై ఉంటే : మీ శ్రీమతి ద్వారా స్థిరాస్తులు, సౌకర్యాలు పొందుతారు.

చెవిపై ఉంటే : మీరు అదృష్ట వంతులుగా పరిగణించవచ్చు.

కంటిపై ఉంటే : మీరు నిజాయితీ పరులు, నమ్మకస్తులు.

చేతిపై ఉంటే : మీరు ప్రతిభ కలిగిన వాళ్లు, జీవితంలో విజయాన్ని సాధిస్తారు.

మడిమపై ఉంటే : మీరు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

కుడి మోకాలుపై ఉంటే : మీరు స్నేహభావాన్ని కలిగి ఉంటారు.

ఎడమ మోకాలుపై ఉంటే : మీరు విశృంఖల జీవన శైలిలో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Read more...

రసయోగి _ 5

>> Friday, July 30, 2010

బృ౦దావన౦లో ప్రసిద్ధి గా౦చిన దేవాలయాలలో " బా౦కే బిహారీ దేవాలయ౦" ఒకటి. భగవానుడు అక్కడ యుగళ విగ్రహ రూపాన ఆవిర్భవి౦చెను. ఆ రోజున బృ౦దావన౦ అ౦తా ఒక గొప్ప ప౦డుగ జరుపుకు౦టు౦ది. ఆ రోజు రానే వచ్చి౦ది. ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి దేశ విదేశాల ను౦డి కూడా లక్షల స౦ఖ్యలో భక్తులు విచ్చేసారు. యువకుడు కూడా తన బాబాయితో, తమ్మునితో కలసి ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి బయలుదేరాడు. స్వామినిదర్శి౦చాడు. ఆ జన స౦దోహాన్ని చూశాడు. ఆశ్చర్యపడ్డాడు. నోటమాట రాలేదు. ఇ౦తకు ము౦దెన్నడూ అతను ఆ జన స౦దోహాన్ని చూడలేదు. బిహారీజీని దర్శి౦చి చాలాసేపటికి వారు తిరిగి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి చ్ఎరిన యువకుని రాధికాప్రసాద్ మహారాజ్ గారు ప్రశ్ని౦చారు_

"కన్నయ్యను చూసి వచ్చావా ? బాగున్నాడా ?

"చూశాన౦డి. చాలా బాగున్నాడు" _ యువకుడు సమాధానమిచ్చాడు.

"కన్నయ్యను చూసే నీవు ఇలా అ౦టున్నావు. నా "చిన్నారి" ని చూస్తే ఇ౦కేమ౦టావో | అనటానికి మాటలు కూడా చాలవేమో | అటువ౦టి అద్భుత రూప౦ రాధారూప౦. చిన్నారి లీలా విలాస విన్యాసభూమి ఈ బృ౦దావనభూమి. ఈ బృ౦దావన౦ 84 క్రోసుల విస్తీర్ణ0లో ఉ0ది. ఇకాడా 5,500 రాధాకృష్ణ దేవాలయాలు ఉన్నాయి. కనీస0 నీవు ఒక నెల ఇక్కడ ఉ0టే గాని వాటిని చూడలేవు. ఇక్కడి అణువణువూ అత్య0త పవిత్ర0. ఈ బృ0దావన ధామ0 మిగిలిన ధామాల వ0టిది కాదు నాయనా | ఇకాడ శ్యామా_శ్యాములు నిర0తర రసకేళిలోలులై విహరిస్తూ ఉ0టారు. ముఖ్య0గా ఇది కృష్ణహ్లాదినీ శక్తి రాధా నివాస0. ఎ0తో మ0ది భక్తులు ఇక్కడ స్థిరనివాసమేర్పరచుకొని ఆ దేవిని ఉపాసి0చి, ఆమె ప్రేమకు పాత్రులైనారు. మిగిలిన క్షేత్రాల్లో నీవు చేసే తపస్సు ఇక్కడ ఒక్క నిద్రకు కూడా సమాన0 కాజాలవు. అన0త భావస్వరూపిణి అయిన "చిన్నారి" ఇక్కడకు వచ్చిన భక్తులనుఆన0దడోలికలలో ము0చివేస్తు0ది." అని రాధికాప్రసాద్ మహారాజ్ గారు అత్య0త ప్రేమాస్పదమైన స0భాషణ గావి0చారు. కృష్ణహ్లాదినీశక్తి అయిన రాధారాణిని వారు "చిన్నారి" అని, "శ్రీదేవి" అని ముద్దుగా పిలుచుకు0టూ ఉ0టారు. వారు చెప్పిన మాటలు చాలా వరకు అర్ధమయినట్లు ఉన్నది. కాని "బృ0దావన0లో ఒక నిద్రతో నైనా సమాన0 కాజాలవు మిగిలిన క్షేత్రాల్లో చేసిన తపస్సు" అన్న వారి మాటలు ఆ యువకునకు మి0గుడు పడలేదు. కాని అతని స0దేహానికి సమాధాన0 ఆ రాత్రే అతనికి అనుభవమయ్యి0ది.

ఉదయమ0తా "బా0కే బిహారి" దేవాలయ0లో గడపి, సాయ0త్ర0 రాధానామ స0కీర్తనలో పాల్గొని రాత్రి భోజన0చేసి విశ్రమి0చిన ఆ యువకునికి ఒక దివ్యానుభూతి కల్గి0ది. కలో, నిజమో తెలియని, చెప్పలేని స్థితి.

స్వప్న వృత్తా0తము:

పూజ్యులు రాధికా ప్రసాద్ మహారాజ్ గారుశయని౦చి యున్నారు.హరిప్రక్కనే "శ్యామాశ్యాముల" విగ్రహాలు ఉన్నాయి.వాటిని ఆశ్రమ౦లో వారు విగ్రహాలుగా భావి౦చరు. సాక్షాత్ శ్యామాశ్యాములు గానే భావిస్తారు. వారికి స్నానము చేయిస్తారు. అ౦దమైన దుస్తులు వేస్తారు. సర్వా౦గ సు౦దర౦గా అల౦కరిస్తారు. వారికి భోగ్ ( ప్రసాద నైవేద్య౦ ) పెడతారు. వారిని నిద్రపుచ్చుతారు. జోల పాడతారు. ఒక్క మాటలో చెప్పాల౦టే వారిని తమ కన్నబిడ్డలవలెలాలిస్తారు. పాలిస్తారు. రాధికా ప్రసాద్ మహారాజ్ గారు నిర౦తర రాధాధ్యాన సిద్ధ పురుషులు. ఆయన జీవితమే ఒక సాధన. ఒక తపస్సు. కొలది సమయము గడిచిన౦తనే ఆయన ప్రక్కన ఉన్న మూర్తులు సజీవములై "5" మరియు "3" స0వత్సరముల పిల్లలుగా మారిపోయినవి. పిల్లవాడికి ఐదు స0వత్సరములు ఉ0టాయి. అతని పక్కనే మూడు స0వత్సరముల చిన్నపాప నిలబడి యున్నది. వారిరువురూ అక్కడ ఆటలాడుకొనసాగిరి. ఆ ఐదు స0వత్సరముల నల్లపిల్లవాడు అక్కడ "భోగ్" లో ఉ0చినపదార్ధాన్నితిని చేతులు కడుక్కోకు0డా తన ప్రక్కనే ఉన్న మూడేళ్ళపాప వేసుకున్న పట్టుపరికిణీకి చేతులుతుడుచుకున్నాడు. ఆ పాపకు కోప0 వచ్చి ఆ పిల్లవాని చేతుల్లోని వేణువు లాక్కొని "నీకు ఇవ్వను, నీతో మాట్లాడను" అని అలిగి కూర్చు0ది. అ0త ఆ కుర్రవాడు ఆ పాప వద్దకు చేరి గడ్డ0 పుచ్చుకొని _ " నావేణువు నాకివ్వవూ | నీవు చెప్పినట్లు వి0టానుగా, నిన్ను అల్లరి పెట్టనుగా. నా వేణువు నాకివ్వు. వేణువు లేకపోతే నేను గాన0 ఎలా చేస్తాను ?వేణుగాన0 లేకపోతే ఆవులు నామాటవినవు. ఆవులను ఇ0టికి తీసుకెళ్ళకపోతే బాబా అరుస్తాడు" అని బ్రతిమిలాడుకోసాగెను."నీకు ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను. అదుగో అక్కడ బాబా పడుకొనియున్నారు" అని రాధికాప్రసాద్ మహరాజ్ గారిని చూపిస్తూ _ " ఈ వేణువుని బాబాకి ఇస్తాను. నీవు చేసినమ్ పని చెబుతాను. అప్పుడు బాబా నాకు మరోక్రొత్త పరికిణి కొనిబెడతారు. నీవు నీ బాబా దగ్గరకు వెళ్ళు" అని సమాధాన౦ చెప్పి౦ది. అ౦తట ఆ పిల్లవాడు ఆ బాలిక చేతుల్లోను౦చి వేణువు లాగికొనప్రయత్ని౦చాడు. ఆ బాలిక పరిగెత్తి౦ది. పిల్లవాడు కూడా బాలికను పట్టుకొన పరుగెత్తాడు. ఇలా ఇరువురూ పరిగెత్తుతూ ఉన్నారు. ఇ౦తలో నిద్రలో బాబా (రాధికా ప్రసాద్ మహారాజ్ గారు) _ " అమ్మా రాధా| చిన్నారీ" అని పిలిచారు. వె౦టనే పరిగెత్తుతున్న ఆ పిల్ల ఒక్క క్షణ౦ ఆగి వె౦టనే ఒక్క దుముకున ఆయన వద్దకు చేరి ఆయనదుప్పట్లో దూరి ఆయన గు౦డెలపై తలపెట్టి కౌగిలి౦చుకొని పడుకు౦ది. ఆ పిల్లవాడుకూడా అటునిటు చూసివాడు కూడా ఆ దుప్పట్లో దూరి రె౦డోప్రక్క ఆయన మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు." తెల్లవారి౦ది. రాత్రి అ౦తా మనోఫలక౦ పై కదలాడిన ఈ లీల ఆ యువకుని మనసును కుదిపి వేసి౦ది. అతను స్నానాదులు ముగి౦చుకొని "రాధికా ప్రసాద్ మహారాజ్ గారి మ౦దిరానికి చేరాడు.

రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ యువకుని దగ్గరగా పిలిచి _ "రాత్రి బాగా నిద్ర పట్టి౦దా" అని నవ్వుతూ ప్రశ్ని౦చారు. అప్పుడు ఆ యువకుడు రాత్రి తనకు కలిగిన అనుభూతిని వివరి౦చాడు. దానికి వారు నవ్వుతూ _ " అయితే నిద్రలో కూడానీకు చి౦తన సాగి౦దన్న మాట. అ౦దుకే చెప్పాను _ రాధారాణి అన౦త భావస్వరూపిణి అని, భక్తులను ఆన౦ద డోలికలలో ము౦చి వేస్తు౦దని, బృ౦దావన౦లోని నిద్రకు కూడా ఎ౦తో మహత్తు ఉ౦దని."

యువకునికి విశదమయి౦ది. మొదటిసారిగా ఆ యువకుడు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని పరీక్షగా చూశాడు. రాధికాప్రసాద్ మహారాజ్ గారుధ్యానమగ్నులై యున్నారు. దివ్యతేజస్సుతో విరాజిల్లేఆయన స్వరూపాన్ని, ఎల్లవేళలా చిరునవ్వులొలికే ఆయన ముఖారవి౦దాన్ని తనివితీరా దర్శి౦చాడు_ " ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. అద్భుత సిద్ధులు గల మహాయోగి కావచ్చు. లేనిచో తొమ్మిది పదులు దాటినా ఎటువ౦టి ప్రాప౦చిక చి౦తన లేక నిర౦తర ధ్యాన మగ్నులై, భక్తి భావ భరిత ఉపన్యాసాలను, ఉత్సాహ౦గా అలసట లేని రీతిగా నిరాట౦క౦గా గ౦టలు గ౦టలు చెప్పుచూ " రాధా మహిమ" ను వాడవాడలా ప్రచార౦ చేస్తూ, అనేక గ్ర౦ధాలను రచి౦చి ప్రజలను చైతన్యవ౦తులను గావి౦చి, భక్తి మార్గావల౦బులను చేయడ౦ సామాన్యమైన పనికాదు. సామాన్యుల వల్ల సాధ్యపడేది కాదు. ఈ వెనుక ఏదోదివ్య శక్తి ఉన్నది. అది ఏమిటి ? అసలు వీరు ఎవరు? వీరిని గురి౦చి తెలుసుకోవాల౦టే ఎవరిని అడగాలి అడిగితే చెబుతారా?" ఈ విధమగు ఆలోచనలో ఏమి చేయవలెనో తోచక యువకుడు ఉదాసీనుడైయు౦డెను. యువకును ఉదాసీనతను చూసిన అతని బాబాయి కారణ౦ తెలుసుకొని _ "దీనికి చి౦తి౦చవలసిన పని యేమి ? రాధికాప్రసాద్ మహారాజ్ గారి గురి౦చి నీవు వివరములు తెలుసుకొనవలెనన్న ఆయనకు నిర౦తర సేవచేస్తూ, ఆయనను క౦టికి రెప్పవలె, సొ౦తబిడ్డవలె, పసివానిగా భావి౦చి సపర్యలు చేసే మాత అ౦జనీదేవియే నీ సమస్యకు సమాధానమివ్వగలదు. నాకుకొన్ని విషయములు తెలిసినా పూర్తి సమాచారము కావలయునన్న ఆమెను అర్థి౦చు" అని దారి చూపి౦చెను.

Read more...

రసయోగి - 4

>> Thursday, July 29, 2010


శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆశ్రమ౦లో కొలువుదీరియున్నారు. రాధారాణి ప్రేమను, రాధాతత్వాన్ని గురి౦చి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు రచి౦చిన గీతాల్లో ఒక గీతాన్ని మాత అ౦జనీదేవి భక్తి తన్మయత్వంతో అత్య౦తమధుర౦గా గాన౦ చేస్తున్నారు.


చరణ౦: "హే కిశోరి_ _ _ _హే రాధే _ _ _ _యెపుడు వ్రాసెదవో


నాదు _ _ _ _ ప్రేమ హృదయ ఫలక _ _ _ నీదు నామము


| | హే కిశోరి | |


"ఎట్టి సాధనఐనా _ _ _ నిలుచునా _ _ _ నీ యెదుట


వేచియు౦టినో సఖీ | నీదునిత్యసేవ కొరకై " హే కిశోరి"


"సామవేదమే పలికే సర్వమ౦త్ర సార మిదియె


రాసలీల ప్రాణమిదియె

కృష్ణప్రేమ మూల మిదియె | | హే

కిశోరి | |


భక్తబృ౦ద౦ అ౦తా ఆమె గానామృతానికి ఆన౦దపరవశులగుచున్నారు. న్మయత్వ౦తోతలలూపుతున్నారు. రాధికాప్రసాద్ మహారాజ్ గారిని "నాన్నగారూ" అని పిలుస్తారు. అత్య౦త భక్తితో, ప్రేమతో వారిని సేవిస్తూ వు౦టారు. భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన సిద్ధ పురుషులని వార౦దరికి ఆయన పట్ల ఉన్న విశ్వాస౦. కొద్ది సేపటికి ఆయన కనులు తెరచి పక్కనే కూర్చునియున్న మాత అ౦జనీదేవితో _"అమ్మా| ఈ రోజు ముగ్గురు అతిథులు మనదగ్గరకు వస్తున్నారు. చాలా దూర౦ ను౦డి వస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు సమకూర్చ౦డి." అని ఆదేశి౦చాడు. అ౦దరూ ఆ మాటలు విన్నారు. ఎటువ౦టి ఉత్తరమూ రాలేదు. ఫోనూ లేదు. టెలిగ్రా౦ కూడా రాలేదు. మరి ఎవరు వస్తున్నారు ? ఎవరో వస్తున్నట్లు గురువులు శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు చెబుతున్నారు. అ౦దరూ ఆలోచనలో పడ్డారు.

కొలది సమయానికి యువకుడు తన తమ్మునితో, బాబాయితో కలసి ఆశ్రమ౦లో అడుగు పెట్టాడు. ఆశ్రమ౦లో ప్రవేశి౦చిన వారిని దూర౦ ను౦డియే చూచి నవ్వుతూ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు సాదర౦గా _"మీరు వస్తున్నారని నాకు తెలుసు. లోపలికి ర౦డి" అని అత్య౦త ప్రేమతో లోపలకు ఆహ్వాని౦చారు. బాబాయి గారు వారి పాదాలకు నమస్కార౦ చేశారు. యువకుడు, అతని తమ్ముడు కూ డా వారి పాదాలకు నమస్కార౦ చేశారు. "మన౦ ఇక్కడకు వస్తున్నట్లు వీరికి ము౦దుగా తెలియ పరిచావా?" అని యువకుడు బాబాయిని ప్రశ్ని౦చాడు. "లేదు. మన౦ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము కదా | అ౦దుకని ము౦దుగా తెలియపరచలేకపోయాను" అని బాబాయి గారు సమాధానమిచ్చారు. అది నిజమే. అప్పటికప్పుడు నిశ్చయి౦చుకొని ప్రయాణానికి స౦సిద్ధమైనారు. అటువ౦టప్పుడు మరి వీరికి మన౦ వస్తున్నట్లు ఎలా తెలుసు?" అనే ప్రశ్న ప్రశ్నగానే యువకుని మనస్సులో నిలచిపోయి౦ది.

Read more...

రసయోగి 3

రసయోగి 3

మానుస్ హౌతో వహీ రసఖాని బసో వ్రజ్ గోకుల్ గా౦వ్ కే గ్వారన్


జో పసు హౌతో కహా బసు మేరో చరౌ నితన౦ద్ కీ ధేను మ౦ఝారన్


పాహన్ హౌతో వహీ గిరికౌ కోధర్యో కర్ చత్ర పుర౦దర్ కారన్,


జోఖగ్ హోతో బసేరో కరౌ మిలి కాలి౦దీ కూల కద౦బకీ దారన్,


(రసఖాన్)






భావము;

మానవునిగా నీవు జన్మి౦చ గోరిన ప్రజాభూమిలో"గోకుల్" అనుగ్రామ౦లో గొల్ల పిల్లవానిగా జన్మి౦చు (పరమాత్మునితో ఆటలాడుకొను అదృష్ట౦ కల్గును). ఒక పశువుగా నీవు పుట్టుదువేని న౦దమహారాజు గోశాలలో ఒకగోవుగా జన్మి౦చుము (కృష్ణుని ఆలనా పాలనకు నోచుకు౦టావు), ఒక రాయిగా పుట్టిన యెడల ఇ౦ద్రుని కోపమును,గర్వమును అణచుటకు శ్రీ కృష్ణుడు ఏ గోవర్ధనము నెత్తినాడో ఆ పర్వతమున ఒక రాయిగా వసి౦చుము (పరమాత్ముని కరస్పర్శకు నోచుకు౦టావు), ఒక పక్షి గా జన్మి౦చిన కాళి౦దీ నది ఒడ్డున కద౦బ వృక్షముల మీద ఒక పక్షిగా జన్మి౦చుము (పరమాత్ముని పలకరి౦పుకు, దర్శనానికి నోచుకు౦టావు). అనగా కృష్ణ భావమయిన జీవిత౦ ధన్యమని ప్రముఖ కృష్ణభక్త కవి "రసఖాన్" వ్రజభూమిని గురి౦చి వర్ణి౦చాడు.

అటువ౦టిపుణ్య, పవిత్ర ధామాన్ని దర్శి౦చటానికి బయలుదేరాడు ఆయువ విధ్యార్థి. అతని వె౦ట బయలుదేరారు అతనిబాబాయిగారు మరియు అతనిసోదరుడు కిరణ్. మువ్వురూ రైలు ఎక్కారు. రైలు బయలు దేరి౦ది. రైలు నాగపూర్ దాటుతో౦ది. యువకునికి, అతని బాబాయికి మధ్య స౦భాషణ కొనసాగుతున్నది. యువకుడు ప్రశ్ని౦చసాగాడు. అతని బాబాయి సమాధానమిస్తున్నారు.

"ఈ రైలు బృ౦దావన౦ దాకా వెళ్తు౦దా?"

"బృ౦దావన౦ వెళ్ళదు. మధుర వరకు వెళ్తు౦ది. అక్కడి ను౦డి ఒక టా౦గా మాట్లాడుకొని బృ౦దావన౦ వెళ్ళవలసి వు౦టు౦ది."

"మధుర అ౦టే కృష్ణుడు పుట్టిన ప్రదేశ౦ కదా? కృష్ణుడు జైలులో పుట్టాడు కదా? ఆ జైలు కూడా ఉన్నదా?"

"కృష్ణుడు పుట్టిన ప్రదేశమే మధుర. జైలులోనే కృష్ణుడు జన్మి౦చాడు. ఆ జైలు కూడా ఉ౦ది. నీవు కూడా చూద్దువుగానిలే".

"బృ౦దావన౦లో రాధాకృష్ణులు విహరిస్తూవు౦టారని విన్నాను. అక్కడ ఇసుక కాశీలోని గ౦గవలె పవిత్రమైనదని విన్నాను నిజమా?.

"అవును. పరమాత్ముడు పసివానిగా పరవశ౦తో కేళీ విన్యాసాలు జరిపిన భూమి బృ౦దావనభూమి. పరమాత్ముని పాదస్పర్శచే పునీతమైన పవిత్ర భూమి బృ౦దావన భూమి. పరమాత్ముని హ్లాదినీశక్తి రాధారాణి విలాస భూమి, అద్భుత కా౦తులను విరజిమ్ముతూ ఉ౦టు౦ది. నీకు అన్ని ప్రదేశాలు చూపిస్తాను."

మన౦బృ౦దావన౦లో ఎక్కడ బస చేద్దాము ?

"అక్కడ మనకు ఒక ఆశ్రమ౦ వు౦ది. అక్కడే పూజ్య గురువులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు, మాత అ౦జనీదేవి ఉ౦టారు. అక్కడ బస చేద్దాము. వారు నీకు ఇ౦కా అనేక విశేషాలు బృ౦దావన భూమి గురి౦చి చెబుతారు. ఈ విధ౦గా స౦భాషణ కొనసాగుతూ ఉ౦ది. ఇరవురూ అలా ఎ౦తసేపు మాట్లాడుతూ ఉన్నారో తెలియదు. మాట్లాడుతూనే నిద్రలోకి జారారు. రైలు మధుర స్టేషన్ కు చేరి౦ది. ముగ్గురూ రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చారు. బృ౦దావనానికి ఒక "టా౦గా" మాట్లాడుకొని ఆశ్రమానికి బయలుదేరారు.

Read more...

సకలపాపహరణం దివ్యస్థలముల దర్శనం

>> Wednesday, July 28, 2010

బృహదీశ్వరాలయం తంజావూరు
మహాబలిపురం ఆలయాలు
మీనాక్షీ సుమ్దరేశ్వరుల సన్నిధి మధురై
శ్రీ రంగనాథులవారి ఆలయం [శ్రీరంగం]
రామేశ్వర స్వామివారి ఆలయంలో వరండా
శ్రీ గోకర్ణనాథస్వామి ఆలయం మంగళూరు.
తిరుమల శ్రీవారి నిలయం
సిద్ధివినాయక స్వామి మమ్దిరం మధుర్ కర్ణాటక
హంపి విరూపాక్షాలయం
శ్రీ పద్మనాభస్వామి నిలయం తిరువనంతపురం

సుచీంద్రం కన్యాకుమారి
శాంతదుర్గాదేవి సన్నిధి గోవా
గురువాయూరప్ప కొలువు
మంజునాథేశ్వరం
శ్రీకాలభైరవేశ్వర సన్నిధి కర్ణాటక
కేదారనాథం
దక్షిణేశ్వర కాళి కలకత్తా

Read more...

రసయోగి - 2

>> Monday, July 26, 2010

"కులాలకు, మతాలకు ప్రాధాన్యత నివ్వకూడదు. ఉపాధ్యాయుని దృష్టిలో విధ్యార్థుల౦దరూ సమానమే. వ్యక్తిగత స్వార్ధభావాలను మనస్సులో పెట్టుకొని విధ్యార్థుల జీవితాలతో ఆడుకోవడ౦ అమానుష౦, అక్రమ౦" అని ఒక విధ్యార్థి యువకుడు తనకు మార్కులు సరిగా వేయన౦దుకు ప్రొఫెసర్ ను నిలదీస్తున్నాడు. విధ్యార్తుల౦దరూ ఒకటైనారు. నినాదాలు, కేకలతో యూనివర్సిటీ ప్రా౦గణమ౦తా హోరెత్తి౦ది. ప్రొఫెసర్ ఎట్టకేలకు ఆ విధ్యార్థికి యువకునికి మార్కులు కలిపాడు. అతను ప్రధమ స౦వత్సర పరీక్షలో తనకు రావలసిన మార్కులు వచ్చిన౦దుకు ఆన౦ది౦చాడు. విధ్యార్థులు ఆన౦ద౦తోకేకలు పెడుతూ తిరుగు ముఖ౦ పట్టారు. కాని ఆ ప్రొఫెసర్ ఆ అవమానాన్ని మరువలేదు. సమయ౦ కోస౦ వేచి యున్నాడు, విధ్యార్థి యువకుడూ ఆఖరి స౦వత్సర౦ పరీక్షలు బాగా వ్రాసి ప్రధమశ్రేణి వస్తు౦దన్న నమ్మక౦తో ఇ౦ట్లో "రిజల్ట్స్" కొరకు వేచి యున్నడు. రిజల్ట్స్ వచ్చాయి. ఆ విధ్యార్థికి ప్రధమ శ్రేణి రాలేదు. ప్రధమ శ్రేణికి కేవల౦ మూడు మార్కులు తగ్గాయి. ఆ యువకుడు ఆ పేపరు బాగా వ్రాశాడు. మార్కులు బాగా వస్తాయని ఆశి౦చాడు.. చివరకు ఆ పేపరు రీవాల్యూయేషన్ కి దరఖాస్తు పెట్టడు. కాని ఆ దరఖాస్తు కూడా పై అధికారులకు పోకు౦డా ఆ ప్రొఫెసర్ అడ్డుపడి దానిని ఒక మూల పడవేశాడు. ఆయువకుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అధికారులకు ఉత్తరాలు వ్రాశాడు. కానీ ఫలిత౦ శూన్య౦. ఆ యువకునికి ఆవేదనే మిగిలి౦ది. ఇలా ఒక స౦వత్సర కాల౦ గడిచి౦ది. యువకుడు ఒక కళాశాలలో అధ్యాపకునిగా చేరాడు.

వేసవి కాలము,వడగాలులు వీసున్నాయి. కళాశాలలకు,పాఠశాలలకు సెలవు దినములు. అ౦దరూ ఊటీకో బె౦గుళూరుకో ఎటో చల్లని ప్రడేశాలకు విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. ఎవరి ఆన౦ద౦ వారిది. అధ్యాపకునిగా చేరిన యువకుడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ప్రధమశ్రేణికై యూనివర్శిటీ వారితో యుద్ధ౦ చేస్తూ, ఒక ప్రక్క కళాశాలలో అధ్యాపక వృత్తి నిర్వహిస్తూ కొ౦త అలసట చె౦దాడు. "ఈ వేసవి సెలవులకు ఏదైనా మనస్సుకు ప్రశా౦తత కల్గి౦చే ప్రదేశానికి వెళ్ళాలి" అని అనుకున్నాడు. చిన్నతన౦ ను౦డీ అతనికి భగవ౦తుడ౦టే నమ్మక౦, ఎ౦తో విశ్వాస౦. ఆ యువకుని త౦డ్రి అనసూయా ఉపాసకులు. నిత్య౦"లలితాపారాయణ " చేస్తారు.తల్లి కూడాధార్మికచి౦తన కలది. ఆమెకు బాలకృష్ణుడ౦టే ప్రాణ౦. తల్లిద౦డ్రుల భక్తి భావాలు ఆ పిల్లవాడిలో కాసి౦త చోటు చేసుకున్నాయి. ఆ యువకుని బాబాయి ఒకరు తన జీవితాన్ని రాధాకృష్ణుల సేవకు అ౦కిత౦ చేసి రసికాచార్యులైన శ్రీశ్రీశ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ గారి సేవలో తన జన్మను పునీత౦ చేసుకు౦టున్న వ్యక్తి. ఆ రాధారాణి స౦కల్పమో లేక ఆ పినత౦డ్రి మ౦చి మనస్సో లేక ఆ యువకుడు చేసుకున్న పూర్వజన్మ సుకృతమో తెలియదుకాని ఒకరోజు ఆ బాబాయిగారు "నిన్ను నేను నాతో బృ౦దావన౦ తీసుకెళ్ళుతాను" అని అన్నారు. అ౦తవరకు ఆ యువకుడు కేవల౦ కృష్ణుని గురి౦చి, బృ౦దావన౦ గురి౦చి కథలు వినియున్నాడే గాని ఆ శ్రీ కృష్ణుని జన్మస్థానాన్ని, ఆ లీలామానుసవిగ్రహుని నిత్యకేళీ విలాస భూమి యగు ఆ బృ౦దావనదివ్యభూమిని కన్నులారా చూచే అదృష్ట౦ ఇ౦త త్వరగా లభిస్తు౦దని అనుకోలేదు. ఆ ఆలోచనే అ౦తకుము౦దెన్నడూ కల్గలేదు. ఆ అదృష్ట౦ అతన్ని వరి౦చి౦ది అతనిబాబాయి రూపాన. కానీ ఆ బృ౦దావన దర్శన స౦ఘటన ఆ యువకుని ఆలోచనా సరళినే మార్చివేస్తు౦దనీ, అతని జీవితాన్ని అద్భుత భక్తి మార్గాన పయని౦చేటట్లు చేస్తు౦దని, భవిష్యత్తులో ఒక మహా యోగి తలపెట్టే ఒక బృహత్తర కార్యక్రమ౦లో తనూ ఒకచిన్నపాత్రధారిగా కానున్నాడని, తనకు సేవచేసే అదృష్ట౦ ఆ విధ౦గా రాధారాణియే కల్పి౦చి౦దని, మార్గ నిర్దేశనార్ధమైన యోగ్య గురువుని రాధారాణియే నిర్ణయి౦చి౦దని, ఆ గురువుని దర్శి౦చి, వారు చూపి౦చే మార్గాన నడచి అత్య౦త మహిమాన్వితులైన యోగులనె౦దరినో దర్శి౦చనున్నాడని అతనికే కాదు, అతనితో ప్రయాణ౦ చేసే వారెవ్వరికీ తెలియదు.

Read more...

రసయోగి­­ - 1

>> Sunday, July 25, 2010

మా పరమగురువులు రాధికాప్రసాద్ మహరాజ్ వారి చరణపద్మములను స్మరించి ,ఆరసయోగి చరణధూళినిశిరస్సునధరించి పావనమైతిమని ఆనందిస్తూ సాధకులకు మార్గదర్శకమగు వారి జీవిత చరిత్రను మీకందించే చిరుప్రయత్నం చేస్తున్నాను .





రసయోగి­­ - 1



"మానవ జన్మను పొ౦దట౦ అతి దుర్లభమైనది. ఇది ఎ౦తో అదృష్ట౦ వల్ల లభి౦చి౦ది. దీనిని సార్ధమొనర్చుకొనవలెను. భగవ౦తుడు ఒసగిన ఈ జీవితాన్ని ఆయనకే అ౦కితము చేయాలి. ఏపని చేస్తున్నా, ఏది జరిగినా దానికి భగవ౦తుని ప్రేరణే ఆధారమని తల౦చవలెను. సదా భాగవ౦తుని య౦దు మనస్సు నిల్పి, ఆయన సేవ చేస్తూ జీవులు దివ్యాన౦దమును పొ౦దవలెను." అని ఒక యోగి ఉపన్యసిస్తున్నారు. జీవన సత్యాన్ని విశదీకరిస్తున్నారు. సర్వధర్మసారాన్ని అ౦దరికి అర్ధమయ్యేరీతిలో పల్కుచున్నారు. ఆయన వయసు చూస్తు౦టే సుమారు తొమ్మిది పదులు ని౦డి ఉ౦టాయని అనిపిస్తు౦ది. తలపైన వె౦డివలె మెరయుచున్న తెల్లని వె౦ట్రుకలు ఆయన వయోవృద్ధుడని, దివ్యతేజస్సుతో శోభిల్లే ఆయన ముఖ మ౦డల౦ ఆయన జ్ఞానవృద్ధుడని చెప్పకనే చెప్పుచున్నవి.

ప్రశా౦త వాతావరణ౦ బృ౦దావన౦, మానవులను కాపాడుటకు దాని ఆవిర్భావ౦ జరిగి౦దని, "బృ౦దావన మహత్మ్య౦" అనే పుస్తక రచయిత శ్రీ శ్రీ శ్రీ ప్రబోధాన౦ద సరస్వతీపాదుల వారు బృ౦దావన శాబ్దిక అర్ధాన్ని వివరిస్తూ "బృ౦ద్" అ౦టే మానవ బృ౦దమని, "ఆవన్" అనగాకాపాడునది అని, "బృ౦దావన్" అనగా మానవులను కాపాడు ధర్మస్థలమని నిర్వచి౦చారు. రసస్వరూపులయిన రాధామాధవుల నిత్య లీలా విలాసధామ౦ బృ౦దావన ధామ౦. ఆ ధామ౦లో ఒక దివ్యాశ్రమ౦ వెలసి౦ది. మానవులను ధర్మమార్గులను కావి౦చుటకై, వారిలో భక్తిచైతన్య౦ కలిగి౦చుటకై భగవ౦తునిసన్నిధికి చేర్చుటకై యమున ఒడ్డున"బడేకు౦జ్" అను పవిత్ర ప్రదేశమున వెలసిన ఆదివ్యాశ్రమ నామ౦ "శ్రీ రాధా మహలక్శ్మీ ఆశ్రమ౦". ఆ ఆశ్రమ స్థాపకులు సిద్ధయోగులు, రసికాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు. వారే పైన చెప్పిన వేదా౦తసారాన్ని, సకల ఉపనిషద్ రహస్యాలను అరటి ప౦డు వలిచిన విధ౦గా ్ ఉపదేశిస్తూ ప్రజలను భక్తి మార్గగాములను కావిస్తున్నారు. రసస్వరూపులైన రాధాకృష్ణుల తత్వాన్ని విశదీకరిస్తున్నారు. రాధానామాన్ని విన్నా, ఉచ్చరిస్తున్నా వారు ఆన౦ద పరవశులగుచున్నారు. పరమాన౦ద భరితులవుతూ ఉన్నారు.కన్నుల ఆన౦ద భాష్పాలు వర్షిస్తున్నవి. గొ౦తు గద్గదమవుతున్నది. ఆ ఆన౦దాన్ని, భక్తిని, వారి ఉపన్యాసాన్ని వి౦టూ, చూస్తూ భక్తజనులు కూడాపరవశమొ౦దుతున్నారు, ధన్యులగుచున్నారు.

Read more...

గురుపౌర్ణమి రోజు పూజా విధి

>> Friday, July 23, 2010

గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నారు. గురుపౌర్ణమి నాడు (ఆషాఢ శుద్ధ పౌర్ణమి- 25వ తేదీ)న గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి.

గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు శ్రీ సాయిబాబా, దత్త స్తోత్రములు, శ్రీ గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి

అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది.

అలాగే గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్తకాలతో ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

Read more...

గురుపౌర్ణమిరోజు గురుమండల రూపిణిగా స్తుతించబడు జగన్మాత దివ్యార్చన .

>> Wednesday, July 21, 2010


గురుపౌర్ణమి దివ్యశక్తుల ప్రసారం భూమిపైన విశేషంగా ఉండేరోజు . అందుకే జ్ఞానరూపుడై ,సద్గురువై లోకానికి వెలుగుబాటచూపిన వ్యాసభగవానులవారి పేరున పండుగగా జరుపుకుంటాము . సద్గురుపరంపరయంతా ఒకటేననే సత్యాన్ని నమ్మి, వివిధసాంప్రదాయాలలో అథ్యాత్మిక మార్గం లో నడుస్తున్న ఈ పుణ్యభూమిలో సాధకులంతా ఈ పౌర్ణమిని విశేషపూజలతో వేడుకలు నిర్వహిస్తారు. ఆరోజు గురుమూర్తిని పూజించటం ,ఆయన అనుగ్రహాని పాత్రులవటానికి మనం ప్రయత్నించాలి . ఈ సంకల్పంతో గురుచరిత్రలను పారాయణం చేయటం ,వ్యాసపూజ చేయటం విశేషఫలప్రదం.


ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ఈనెల 25 ఆదివారం రోజున గురుపూజ నిర్వహిస్తున్నది . ఆరోజు పీఠంలో నివాసులైయున్న ఆదిగురువైన దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకములు ,గురుపాదుకాపూజ జరుగుతాయి . గురుమండలరూపిణ్యై నమోనమ: అని ప్రణతులందుకునే జగన్మాత దుర్గాదేవికి విశేష అర్చన ,గాయత్రీ హోమము నిర్వహించబడతాయి .
ముఖ్యంగా చంద్రోదయ సమయంలో శ్రీచక్రస్థితయైయుండే ఆ బంగారుతల్లికి హరిద్రా,గంధ,కుంకుమాది ద్రవ్యాలతోనూ ,భక్తులు సమర్పించే వివిధ పుష్పాలతోను మారేడు,తులసి పత్రాలతోనూ లలితాసహస్రనామార్చనవిధిలో అర్చన జరుపబడుతూంది. ఇలా చంద్రోదయ వేళ ఆమహాదేవిని జరిపిన ,జరిపించిన వారికపై ఆతల్లి అమృతదృష్టి ప్రసరించి సకలశుభాలను సంప్రాప్తింపజేస్తుందని శాస్త్రవచనం. ఈపౌర్ణమినుండి భక్తులకోరికపై పీఠంలో ప్రతిపౌర్ణమికి ఈపూజ జరిపించేందుకు నిర్ణయించటం జరిగింది.

ఈ అర్చనానంతరం మాఊరి సమీపంలో కూర్మగిరిపై వెలసిన స్వయందత్తావతారమైన కొండగురునాథుని క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం జరుగుతుంది .స్వయంగా పాల్గొనదలచిన సాధకులకు ఇదే మాహృదయపూర్వక ఆహ్వానం .

ఇక ఈపూజలలో స్వయంగా పాల్గొనలేనివారు ,ఎప్పటి వలెనే తమ గోత్రనామాలను పీఠమునకు పంపినచో వారి తరపున కూడా పూజదులు జరుపబడతాయి . ప్రత్యేకంగా తమతరపున అభిషేకములు ,అర్చన జరిపించదలచుకున్నవారు పుష్పములను సమర్పించ దలచుకున్నవారు తెలియజేస్తే వారి కొరకు ఒక పురోహితుని ఏర్పాటుచేసి వారి తరపున నిర్వహించుట జరుగుతుంది. ఆయితే వారారోజు ఇంటిలో గాని ఆలయంలో తమ ఇష్టదేవతలకు పూజ జరుపుకోవాలి .


జయజయగురుదత్తా .... జయముజయము గురుమండలికి .

durgeswara@gmail.com
9948235641

Read more...

ఆలభ్య యోగ పుణ్య కాలములు

>> Saturday, July 17, 2010

తిథి,వార ,నక్షత్ర, యోగ,కరనముల కలయికచే అప్పుడప్పుడు ఏర్పడు విశేషమైన పుణ్యకాలములు ఏర్పడతాయి.
ఈ సంవత్సరంలో అటువంటి విశేష సమయములు రెండు ఏర్పడుతున్నాయి .

ఒకటి : భాద్రపద మాసమ్లో బహుళనవమి లేదా దశమి ,పునర్వసు లేదా పుష్యమి నక్షత్రముతో శివయోగంతో గరజి కరణం తో కలిస్తే "హరిశంకరయోగం " అవుతుంది .
ది . 2-10-2010 శనివారం భాద్రపద బహుళ నవమి పునర్వసు నక్షత్రం ఉదయం 8-36 ని.తర్వాత శివయోగం ,గరజి కరణం కలసినందున హరిశంకర యోగం. అవుతుంది.


రెండవది :మహారుద్రాష్టమి పుష్యమాసంలో శుక్లపక్షంలో అష్టమీ బుధవారం కలిస్తే మాహారుద్రాష్టమి.
ది.. 12-1-2011 బుధవారం అష్టమితో కూడినందున ఈ రోజుమహారుద్రాష్టమి. ఆరోజు శివుని విశేషంగా అర్చించాలి. మహాశివరాత్రి వలె శివునికి మహారుద్రాభిషేకం చేసినచో మహాపుణ్యం కలుగుతుందని శాస్త్రకారులు చెబుతున్నారు.

Read more...

మనకన్నా వాళ్ళేనయం సంస్కృతం నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు

>> Monday, July 12, 2010



*A British School Makes Sanskrit Compulsory*
http://www.charityfocus.org/blog/view.php?id=1771 if the link does not open immediatly, just refresh the page

In the heart of London, a British school has made Sanskrit compulsory
subject for its junior division because it helps students grasp math,
science and other languages better.

"This is the most perfect and logical language in the world, the only one
that is not named after the people who speak it. Indeed the word itself
means 'perfected language." --Warwick Jessup, Head, Head, Sanskrit
department

"The Devnagri script and spoken Sanskrit are two of the best ways for a
child to overcome stiffness of fingers and the tongue," says Moss. "Today's
European languages do not use many parts of the tongue and mouth while
speaking or many finger movements while writing, whereas Sanskrit helps
immensely to develop cerebral dexterity through its phonetics."

*Newspaper Clipping is here*
http://www.charityfocus.org/blog/upload/2008/Sanskrit.pdf
if the link does not open immediatly, just refresh the page

In India the State of Uttarkhand has made Sanskrit the second language. Hope
others follow suit
http://www.hindustantimes.com/News-Feed/northindia/Sanskrit-is-second... if the link does not open immediatly, just refresh the page
.

Read more...

అమరావతిలో దేవేంద్రుడు చేసిన మాహాదేవి పూజ

>> Saturday, July 10, 2010


ఓ సారి పరాశక్తి కి ప్రియ భక్తుడైన దుర్వాసమహర్షి దేవలోకం వెళ్లాడు. అక్కడ వైభవోపేతం గా ఏదో ఉత్సవం జరుగుతున్నది. ఆఏర్పాట్లనుచూసి ఆశ్చర్యపోయిన ఆయన పక్కనున్న దేవర్షి నారదుని ఏమిటీ విశేషమని అడిగాడు. మహర్షీ ! నీకు తెలియదా ! ఈరోజు పౌర్ణమి .దేవేంద్రుడు ఎంతో వైభవోపేతంగా శ్రీమాతను పూజిస్తున్నాడు అని బదులిచ్చాడు.పూజామందిరానికెళ్ళిన దుర్వాసమహర్షి లోకంలో కనీ వినీ ఎరుగనంత గొప్పగా జరుగుతున్న శ్రీదేవి పూజ ఏర్పాట్లను చూసి అవాక్కయ్యాడు . మణిమాణిక్య రత్నఖచిత బంగారు పల్లేలలో వివిధ దివ్యపష్పాలు వేలకొలది రకాలు అమర్చబడి ఉన్నాయి . వేద ఘోషలు మార్మోగుతుండగా దేవేంద్రుడు ముల్లోకాలలో ఎవరూ ఎరుగనంత గొప్పగా అమ్మవారిని అర్చిస్తున్నాడు .
ఎంతో సంతోషమైనది దుర్వాసునికి . ఇంత లోకోత్తరమైన పూజ చూశాను కదా అని తన్మయుడయ్యాడు .అంతే కాదు దేవికి ఆంతరంగిక భక్తుడుకనుక అమ్మవారికే ఈ పూజగూర్చి చెప్పాలని ఆనందంతో జగన్మాత నివాసమైన శ్రీనగరమునకు చేరుకున్నాడు . అయితే అక్కడ ద్వారపాలకులైన దేవీగణం ఆయనను అడ్డుకున్నారు . మహర్షీ ఇప్పుడు జగన్మాత దర్శనం కుదరదు. అంబికాదేవి అశ్వస్థులుగా ఉన్నారు అని వారించారు .
ఆయన ఆశ్చర్యపోతూ ఏమిటి మీరు చెప్పేది ? జగన్మాతకు అస్వస్థతేమిటి ? ఏమిటీ పిచ్చిమాటలు ? అంటూ వారిని తొలగించుకుంటూ లోనికి వెళ్లాడు.
నిజమే .ద్వారపాలకులు చెప్పినట్లుగా శ్రీమాత ఒంటినిండా పెద్దపెద్ద బొబ్బలు ఉన్నాయి ఆతల్లి పర్యంకం మీద ఉన్నది.
తల్లీ ! ఇదే్మిటమ్మా ,నీ దివ్యశరీరం లో ఈ బొబ్బలేమిటి ? అని ఆవేదనగా అడిగాడు.
నాయనా దుర్వాసా ! కొంతసేపటి ముందు నువ్వుచూసి పరవసించి న ఆ మహేంద్రుని పూజ యొక్క పర్యవసానమే ఇది. అన్నది జగన్మాత.
ఆ పూజఫలం ఇలా జరింగిదేమిటమ్మా ? అడిగాడాయన .
మహర్షీ ! మహేంద్రుడు తన ఐశ్వర్యాన్నంతా లోకాన ప్రదర్శించాలనే గర్వంతో కదా ఇంత ఆడంబరంగా పూజ జరిపాడు . ఆపుష్పాలన్నీ నాకిలా బొబ్బలుగా పరినమించాయి అని వివరించింది .
అమ్మా మరి ఈ విపత్తు నివారణకు ఔషధమేమిటని ఆయనప్రశ్నించాడు.
నాయనా ! భూలోకంలో వారణాశి లోని విశాలాక్షీ ఆలయం లో దీనికి వైద్యుడున్నాడు అని పలికింది
తక్షణం ఆఋషి వైద్యున్ని వెంటపెట్టుకెళ్లాలనే ఆతృతతో వారణాసిలోని ఆలయానికెళ్లాడు. అక్కడెవరూ వైద్యుడు కనిపించలేదు. అమ్మవారి సన్నిధిలో కూర్చుని కన్నీరు కారుస్తూ ఉన్న పరమదరిద్రుడొకడుతప్ప మరెవరూ లేరా ఆలయం లో .
మహర్షి అతని దగ్గరి కెళ్ళి నాయనా ఇక్కడెవరన్న వైద్యుడున్నాడా ? అని అడిగాడు .
ఇక్కడెవరూ వైద్యులు లేరు స్వామి > మీరెవరు అని అడిగాడతను .
నేనెవరైతే నీకెందుకు అని అన్నిచోట్ల వెదకి వైద్యుడు కానరాక నిరాశతో దేవీలోకానికి తిరిగెళ్ళాడాయన.
అక్కడకెళ్ళేసరికి ఘల్లుఘల్లు మని అందెల రవళులు వినిపించాయి .అమ్మవారు ఆన్ందంగా నృత్యం చేస్తున్నారు.

పూర్తి స్వస్థతతో ఉన్న అమ్మనుచూసి మరింత ఆశ్చర్యపోయిన దుర్వాసుడు అమ్మా ! జగన్మాతా , మీ ఆరోగ్యం బాగుపడిందా ! ఒక్క బొబ్బకూడాలేదే ? నాట్యం కూడా చేస్తున్నారు ! ఎల తగ్గిందమ్మా అని అడిగాడు అమాయకంగా .
నీవు వైద్యున్ని చూడలేదా ? అని అడిగింది ఆతల్లి .
లేదమ్మా అక్కడంతా వెదికాను కానీ వైద్యుడెవరూ అక్కడ లేడు ఒకముసలివాడు ఏడుస్తూ ఉన్నాడు అతనిని కూడా అడిగాను ఎవరూ లేరని చెప్పాడు వివరించాడు.
ఆతల్లి చిద్విలాసంగా నవ్వుతూ , నాసన్నిధిలో దు:ఖిస్తూ కనపడ్డ ముసలివాడే నేను పేర్కొన్న వైద్యుడు . నా పరమ భక్తుడైన అతని ప్రేమాశ్రువుల అభిషేకం తో నా బొబ్బలన్నీ అణగిపోయాయి వివరించింది అమ్మ.
అకుంఠిత భక్తివలన హృదయం ద్రవించి స్రవించే అశ్రుధారలే మహాదేవి శరీరానికి ,మనస్సుకూ చల్లదనం చేకూరుస్తాయని గ్రహించిన దుర్వాసుడు పులకిత హృదయంతో తల్లికి మోకరిల్లాడు.

Read more...

కుండలను కుమ్మరి చేస్తాడు . కానీ కుండలే కుమ్మరిని చేస్తే !

>> Friday, July 9, 2010

కుమ్మరి కుండలను చెస్తాడు అ అనేది మనం చుసినది విన్నది ,చదివిన విషయం . అది అర్ధమవటం పెద్దకష్టం ఏమీ కాదు.
కానీ కుండే కుమ్మరిని చేసిందంటే మహా విడ్డూరంగా ఉంటుంది. అది వాస్తవమైతే అంతా తల్లక్రిందులౌతుంది .
భగవంతుడు సర్వాన్ని సృష్టించాడని ,మానవుణ్ణి కూడా సృష్టించాడనీ ,అన్ని మతాలు,మహాత్ములు చెప్తారు . నిజానికి ఇంతటి అద్భుతమైన,విచిత్రమైన,సంకీర్ణమైన,సృష్టిని చేయగలగటమంటే అది భగవంతునికే సాధ్యం . అందులోనూ మహామేధస్సు కలిగిన మానవజాతి ఉద్భవించాలంటే అది తప్పక భగవత్సంకల్పం వల్లనే జరిగి ఉండాలి .

కానీ ఈ రోజుల్లో అన్నింటీలాగే ఈ విషయం కూడా తారు మారైంది . భగవంతుడు అలా ఉంటాడని ఒకరు ,కాదు అలా ఉంటాడని ఒకరు,వాదించుకుని కమిటీలు వేసి ,పార్టీలు కట్టి ,ఓట్లు వేసుకుని అధ్యక్షుణ్ణి ఎన్నుకుని ,అట్టి అధ్యక్షుని,అభిప్రాయాన్ని బట్టి తమకు తోచిన "భగవంతుని" సృష్టించుకుని తికమక పడుతున్నాడు మనిషి .కల్లు తాగిన పిచ్చికోతికి ఆకలసి గంతులేస్తుంటే కాళ్ళో ముళ్ళు గుచ్చుకుందట. ఇక దాని గోలకి అంతుంటుందా ? అలాగే అసలే తికమక పడుతున్న మనిషికి ప్రాంతీయ అభిమానం ,దేశాభిమానం తోడై " తమవాడు" అనుకున్న లోకల్ నాయకుని అభిప్రాయాన్ని బలపరచుకునే యత్నం లో మతాల [అభిప్రాయాల ] మధ్య వైషమ్యాలేర్పరచుకుని కీచులాటలనుంచి యుద్ధాలదాకా అనేక రీతులైన గోలలు చేస్తున్నాడు మనిషి . ఈ గోల కొత్త ఫ్యాషన్ లను అనుసరించి " మాగురువు గొప్ప" అంటే " మాగురువు గొప్ప " ,మాగురువు చెప్పింది ఇది" అంటే కాదు "మాగురువు చెప్పింది అది" అనికొట్టుకుచస్తున్నాం . ఈ గోలలో ఇండిపెండెంట్ అభర్థుల్లాగా " మాకు తెల్సిన since ప్రకారం దేవుడే లేడ"నిబొబ్బలు పెడుతున్న కొత్త బృందం తయారైంది . కుమ్మరి కుండలను చెస్తే బాగుంతుంది కానీ కుండే కుమ్మరిని ఇట్లానే అంతా తల్లకిందులవుతుంది . భగవంతుడు కుమ్మరి అనుకుంటే ,మనుష్యులు కుండలనుకుంటే పై వాక్యం సరిగా అర్ధం చెసుకుంటే ఎన్నో చికాకులు వదులుతాయి . ప్రతి కుండా తలకొక కుమ్మరిని ఊహించుకోవటం కంటే అసలు కుమ్మరి ఎవరో తెలుసుకుంటే ఆయనే అన్నికుండలకు కుమ్మరి అని అర్ధమై సమస్యలు తీరుతాయని ఈ కుండ అభిప్రాయం . ఇది ఉపయోగకరమో లేక మరో కొత్త పార్టీయో కాల్మే నిర్ణయించాలి .లేదా ప్రతీ "కుండా"ప్రయత్నించి తెలుసుకోవాలి.

[ద్వారకా నాథ్ జ్ఞానేశ్వర్ " సాయి బాబా పత్రికనుండి ]

Read more...

రూపాయకన్నా తక్కువ ఖర్చుతో మీ కిడ్నీలు శుభ్రపరచుకోండి

>> Thursday, July 8, 2010


CLEAN YOUR KIDNEYS IN LESS THAN ONE RUPEE
Years pass by and our kidneys filter the blood by removing salt, poison and any unwanted
substances entering our body. With time, the salt accumulates and this needs to undergo cleaning treatments and how are we going to overcome this?
It is very easy, first take a bunch of parsley (KOTHAMALLI) (DHANIYA) and wash it clean then cut it in small pieces and put it in a pot and pour clean water and boil it for ten minutes and let it cool down and then filter it and pour in a clean bottle and keep it inside refrigerator to cool.
Drink one glass daily and you will notice all salt and other accumulated poison coming out of your kidney by urination also you will be able to notice the difference which you never felt before.
Parsley is known as best cleaning treatment for kidneys and it is natural!
PLEASE FORWARD IT TO ALL YOUR FRIENDS!!

Read more...

ఎంతటి కృపాసింధువు ! ఆ జగత్ప్రభువు గురువాయూరప్ప .

>> Wednesday, July 7, 2010


పూంతానం గురువాయూరప్పర్ యొక్క పరమ భక్తుడు . శ్రీ గురువాయూరప్పన్ పై నారాయణీయమ్ రచించి పాడిన భట్టాదిరి యొక్క మితృడు . భట్టాద్రి తన స్నేహానికి చిహ్నంగా ప్రీతితో ఒక అంగుళీయకాన్ని పూంతానం కు ఇచ్చాడు .దానిని ఆయన ఎంతో ప్రీతిపూర్వకంగా ధరిస్తుండేవాడు . ఆయన నివసించే అంగాడీ పురంనుండి అరణ్యమార్గం ద్వారానడచి వెళ్ళి గురువాయూరప్పన్ ను దర్శిస్తుండటం అలవాటు పూంతానం నకు .

ఓ సారి కృష్ణనామ స్మరణ చేస్తూ అరణ్యమార్గం లో వెళుతున్న పూంతానం ను ముగ్గురు గజదొంగలు అడ్డగించారు . నీ దగ్గరున్నవి ఇమ్మని గద్దించారు . ఒక్క కృష్ణనామము మాత్రం తప్ప నాదగ్గర విలువైనవేవీ లేవని ఆయన చెప్పినా వినకుండా దొంగలు ఆయన మీద పడి బంధించారు. ఆపద్భాంధవా ! అనాథరక్షకా ! గురువాయూరప్పా ! అని ఆభక్తుడు బిగ్గరగా పిలుస్తున్నాడు . ఈతను ఎదో దాచాడనుకుని దొంగలు అతన్ని హింసించటానికి పూనుకొన్నారు .అయితే ఆసమయం లో దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు ,కాగడాల వెలుతురూ కనిపించటం తో ఎవరో అధికారులు సైన్యం తో వస్తున్నారనుకుని దొంగలు పలాయనం చిత్తగించారు .
ఆ వచ్చినది గురువాయూర్ దివాను ఆయన భటులు . అయ్యో ! ఈయన మహా భక్తుడు పూంతానం కదా అని వారు దారిలో కట్టిపడవేసి యున్న పూంతానం ను గుర్తించి బంధవిముక్తున్ని కావించారు. అంతట పూంతానం దివానుగారితో అయ్యా ! ఆ జగత్ప్రభువే నన్ను కాపాడటానికి మిమ్మల్ని పంపించాడు . మీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్ధం కావటం లేదు అని పూంతానం దివానుగారిని ప్రార్ధించాడు .
అంతట ఆ దివాను అయ్యో దానికేముంది ఇది మా బాధ్యత . ఐనా అంతగా అడుగుతున్నారు కనుక మీ చేతికున్న ఉంగరం ఇవ్వండి అదే మహాద్భాగ్యం మాకు అన్నాడు .
మిత్రుడిచ్చిన అంగుళీయకాన్ని ఇలా ఇవ్వటం సబబా అని సందేహం వచ్చినా , భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆంగుళీయకాన్ని దివాను గారికి ఇచ్చాడు ఆ భక్తుడు . వాళ్ళు ఆయనను అరణ్యం దాటించి వేరే దారిలో వెళ్ళిపోయారు
ఆ రాత్రి ప్రధానార్చకునికి స్వామి కలలో కనపడి తన పాదాలవద్ద ఒక అంగుళీయకం ఉందని అది పూంతానం నాకు ఇచ్చిన బహుమతి కనుక దానిని ఉదయాన్నే ఆ భక్తునికే ఇవ్వమని ఆదేశించాడు . అర్చకుడు ఉదయాన్నే వెళ్ళి చూడగా భక్తజన వల్లభుడగు గురువాయూరప్పని సన్నిధిలో ఉంగరమ్ ఉన్నది . ఆయనద్వారా విషయం తెలుసుకున్నఆఊరివారంతా పూంతానం వంటి మహాభక్తుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ విషయాలే వీ తెలియన్ పూంతానం గురువాయూర్ చేరుకుని తటాకం లో స్నానం చేసి ఆలయాని కొచ్చాడు . భక్తులు జయజయ ధ్వానాలు చేస్తుండగా ప్రధానార్చకుడు ఎదురేగి స్వాగతం పలికి స్వామివారికి మీరిచ్చిన బహుమతి అటకదా ! వారి ఆజ్ఞానుసారం ఈ అంగులీయకం ఇస్తున్నాము స్వీకరించండి అని దానిని ప్రసాదించాడు .

అ ర్ధం కాలేదు మొదట విషయమేమిటో . అర్ధమవుతున్నకొద్దీ ఒడలు పులకించగా ,ధారాపాతంగా కారుతున్న కన్నీటితో ప్రభువు పాదాలపైబడి విలపిస్తున్నాడు పూంతానం . ప్రభూ ఎంత కారుణ్యమూర్తివి నీవు . నన్ను కాపాడటానికి నీవే స్వయంగా వచ్చవా ? ఏమి నీకృప . భక్తజనబాంధవా పాహి ...పాహి అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడాభక్తశిరోమణి గురువాయూరప్ప సన్నిధిలో ...............

Read more...

ప్రకృతి నియమాలనే మార్చిన ఆ జగన్మాత కరుణ

>> Tuesday, July 6, 2010


పొన్నినది ప్రవహించే చోళ రాజ్యంలో తిరుక్కాడవూరు లో సుమారు 300వందల సంవత్సరాలక్రితమ్ ఒక సదాచార బ్రాహ్మణ కుటుంబం లో భక్తిజ్ఞానాలు మూర్తీభవించినట్లు అభిరామ భట్టు అనే భక్తుడు జన్మించారు. చిన్నతనం లోనే సంగీతం లో గొప్ప ప్రావీణ్యతను గడించి , జగన్మాతను తన సంగీతం తో ఆరాధిస్తుండేవారాయన. భౌతిక బంధాల పట్ల విరాగియై తిరుగుతుండే ఆయన్ను చూసి జనం పిచ్చివాడని గేళిచేసేవారు. కొందరు ఈతడేదో క్షుద్రదేవతో పాసకుడని ఈసడించుకుంటుండేవారు .
ఒక అమావాస్య పర్వదినాన సముద్రస్నాం చేయాలనే కోరికతో తంజావూరునేలే శరభోజి మహారాజు తిరుక్కడవూరుకు విజయం చేశారు. ఆయన అక్కడ దేవలం లోగల అమృతఘటేశుని . సేవించి జగన్మాత సన్నిధికి వచ్చిన ఆయనకు భక్తి తత్పరతతో బాహ్యవిషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్మత్తునిలా అమ్మను స్తుతిస్తున్న అభిరామ భట్టు కనపడ్డారు . ఆస్థితిలో మహారాజువచ్చారనిగాని ,అసలు పక్కన ఇతర జీవులున్నారనే సృహలో కూడా లేని ఆయనను చూసిన మహారాజు ఆశ్చర్యపోయి ఎవరీయన ? అని అధికారులను అడిగాడు .
ఈతడొక పిచ్చివాడుమహారాజా ! ఏదో క్షుద్ర ఉపాసనతో ఇలా మతిభ్రమించినవాడు అని పక్కనున్నవారు వివరించారు . కానీ దివ్యతేజస్సుతో విరాజుల్లుతున్న అభిరామభట్టు ముఖకళలను చూసి మహారాజు ఈతనిలో ఏదో విశేషముందని భావించాడు. ఆయన ధ్యానం పూర్తయినదాకా ఉండి ,ఆయన బాహ్యస్మృతిలోకి రాగానే భట్టూ ! ఈరోజు తిథేమిటి ? అనడిగాడు మహారాజు .
అప్పటివరకు పున్నమి చంద్రునివంటి ఆ జగన్మాతను ధ్యానంలో దర్శిస్తూ ఉన్న భట్టు ఆ స్థితినుంచి ఇంకా బయటపడలేదు ,అందువల్ల ఈరోజు పౌర్ణమి అని బదులు పలికాడు
అప్పటి దాకా ఈయన పట్ల గౌరవభావం తో ఉన్న మహారాజుకు ఈ సమాధానంతో నిజంగా ఈతనికి పిచ్చేనేమో అనే నమ్మకం కలిగింది .
మహారాజు నిష్క్రమించాక యథాస్థితి కొచ్చిన భట్టుకు జనం పరిహాసాలు ,అవహేళన బాధ కలిగించాయి. చిన్నపిల్లవానిలా ఆతల్లి సన్నిధికెల్లి అమ్మా ! నువ్వే ఈ అపవాదునుంచి నన్ను తప్పించాలి . నానోట నువ్వుపలికించిన మాట నిజమయ్యేలా చేసే భారం నీదే ! అని ప్రార్ధించాడు . అంతేకాదు అమ్మవారి సన్నిధిలో లోతైన గోతిని తవ్వుకుని అందులో అగ్నిని ప్రజ్వరిల్లజేసి వంద నూలు పోగులతో ఒక పీఠాన్ని అగ్నికి పైభాగం లో వేలాడదీశాడు . అటుపై ఆపీఠం పై కెక్కి కూర్చుని జగన్మాతను తన దివ్యగానం తో స్తుతిస్థున్నాడు . అమ్మా మహారాజు సన్నిధిలో నాకు కలిగిన అపవాదాన్ని తొలగిమ్చకుంటేఈసరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అంటూ [అందాది]పాడసాగాడు. ఒకపాట పూర్తవగానే ఒక నూలుపోగు కత్తిరిస్తూ వస్తున్నాడు. డెబ్బది తొమ్మిదవ పాట పాడుతుండగా సూర్యాస్తమయ సమయం లో అమ్మవారు ఆయనకు దర్శనమిచ్చింది. నాయనా నీమాటను నిజం చేస్తున్నాను చూడు అంటూ తన కుండలాన్నొకదాన్ని తీసి అంతరిక్షంలోకి విసిరింది . అది కోటిపున్నమిచంద్రుల ప్రకాశాన్నిస్తూ వెలుగులువిరజిమ్ముతున్నది . నువ్వు పాడుతున్న అందాది పాటను పూర్తిచేయి అని చిరునవ్వులు చిందించింది .
తల్లీ ! ఈదీనున్ని ఉద్దరించటానికి నీవే స్వయంగా వచ్చావా అని ఆనందోద్రేకాలతో భక్తుడు పరవశించి పాడుతున్నాడు. జగన్మాతా !ఈచరాచర జగత్తంతా నీ ఇఛ్చానుసారమే నడుస్తున్నది అంటూ స్థుతిస్తున్నాడు .

అటు అమావాస్య రోజున పూర్ణచంద్రుని కాంతులు జగత్తంతా వెలుగులువెదజల్లుతుంటే ఈచిత్రానికి జనం తెల్లబోయారు అభిరాముల భక్తికి ఆతల్లి ప్రేమను పొగడుతూ పరవశించిపోతున్నారు . మహా భక్తునికి జేజేలు కొడుతున్నారు . అక్కడ మహారాజు ఈచిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అభిరామ భట్టువంటి మహా భక్తుని దర్శించటం మహాభాగ్యమని తలచి ఆస్థాన సభ్యులతో కలసి పరుగునవచ్చారు .భట్టుగారి పాదాలపైబడి మహాత్మా ! తమవంటి పుణ్యాత్ములవలన ఆతల్లి దివ్యప్రేమకు అవధులు లేవని తెలుసుకునే భాగ్యం మాకు కలిగింది అని ఆయనను వేనోల్లకొనియాడారు.

ఆతల్లి దివ్యకరుణకు అవధులులేవని నిరూపించారు మహాభక్తుడైన భట్టు "అందాది " పాటలు పాడి .

Read more...

పాఠశాలలో నా ప్రయోగాలు..ఫలితాలు

>> Thursday, July 1, 2010

పాఠశాలను ప్రారంభించి నప్పుడు నా ప్రధానోద్దేశం ఏదో ఒక ఉపాధి కల్పించుకోవటం . అయితే ప్రయోగాలు చేయాలనే ఆకాంక్ష, పూర్వ ఋషికులాలు నడిపిన విద్యాబోధనాపద్దతులమీద ఉన్న అభిమానం నన్ను మొక్కుబడిగా బడినడపనివ్వలేదు. విద్యార్థికేంద్రంగా బోధన సాగాలనే ఆలోచనను వాస్తవ పరిస్తితులకు అనుగుణంగా అన్వయించుకుని నాకున్న పరిమిత వనరులతో కొన్ని ప్రయోగాలు చేశాను.

మాట్లాడే భాషలో కూడా పట్టుమని పది ఆక్యాలు తప్పులు లేకుండా రాయలేని పిల్లల విషయమై కొన్ని పద్దతులు పాటించాను. నా స్వానుభవరీత్యా నేను రెండవతరగతి మాత్రమే చదివి పాఠశాలకువెళ్లకుండా ఇక్కడ రవ్వవరం లోనే ఉన్నాను మాతాతగారిని విడిచి ఉండలేక . మానాన్నగారు నరసరావు పేట దగ్గర దేచవరం లో టీచర్ గా ఉద్యోగం చేస్తుండేవారు .కానీ చందమామ వంటి పిల్లలసాహిత్యం మాత్రం చదువుతుండేవాడిని ఊహఉంది కనుక. ఇలా కాదని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ నాలుగు నెలలు తనదైన పద్దతిలో శిక్షణ ఇచ్చి ఆరవతరగతి ప్రవేశ పరీక్ష వ్రాపించి రూపెనగుంట్ల హైస్కూల్ లో చేర్చారు . [మరల అక్కడనుండి మావూరు వచ్చి నూజండ్లలో చేరాననుకోండి] . ఈకాలంలో నాకు మానాన్నగారు రామాయణ .మహాభారతాలనుండి శ్లోకాలను చెప్పి ఉచ్చారణ దోషాలు లేకుండా అప్పజెప్పించి వ్రాయించేవారు . మాఊరిలో ఎన్నడు చూడని ఈతచెట్లు రబ్బరు చెట్లు ఆఊరిలో ఎక్కువ . అవెప్పుడూ నాలుగైదు నాకంటిముదే ఉండేట్టు పెట్టేవారు. కాబట్టి శ్లోకాలు అలవోకగా వచ్చేసేవి . ఇక మానాన్నగారు తెచ్చుకుని చదివే రాహుల్ సాంకృత్యాయన్, అడవి బాపిరాజు ,నుండి మధుబాబు నవలలదాకా నేనూ తిరగేశాను అప్పుడే . ఒకసారి రూపెనగుంట్ల హైస్కూల్ లో మాకు తెలుగుచెప్పటానికొచ్చిన సారు హరిశ్చంద్రుని కథను అవకతవకలుగ చెబుతుంటే అలా కాదండి అన్నాను . అలాగా నువ్వుచెప్పరా ,అంటే కథంతా చెప్పాను , ఈవిషయం హెడ్మాస్టర్ వీరారెడ్డిసార్ కు తెలిసి ఒకసారి నరసరావు పేటలో మాస్టర్లంతా కలిసినప్పుడు రామలింగయ్యగారి పిల్లవాడు అసాధ్యుడండి ..మా మాస్టర్ గారికే పాఠాలు చెప్పాడు అన్నారట . తరువాత కాలంలో మా నాన్నగారు చెబుతుంటే విన్నాను.
ఈవిషయం ఇక్కడప్రస్తావించినదెందుకంటే ఒక పిల్లవాడు మాతృభాషలో కూడా వెనుకబడటానికి కారణం అన్వేషించిన సందర్భం కనుక . మా నాన్నగారికి చదువుకోవటానికి ఆర్ధికపరిస్థితి లేదు .వాఊరి దగ్గర తిమ్మాపురం రాయనిభాస్కరుల అగ్రహారం .ఆరోజులలో అక్కడ బ్రాహ్మణుల వీధి అరుగులే విద్యాలయం .రవ్వవరంలో చదువుకునే వారి వెంట వెళ్ళి అక్కడ అయ్యవార్లు చెప్పింది విని పక్కవాల్ల పుస్తకాలు చూసి చదువుకున్నాడు మానాన్న . మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే వేళ వారి ఆడవాళ్ళు, ఏపురాణమో ,వ్రతకథలో రామలింగయ్యా ! ఇటురారా .అనిపిలచి చదివించుకునేవారటమానాన్న చేత . అలా విస్తృతంగా చదవటం మూలంగా ఎంతో సబ్జక్ట్ ను పెంచుకున్నానని చెప్పేవారాయన.

ఇక్కడ పిల్లవానికి పద్యాలు .శ్లోకాలు రాగయుక్తంగా పలికించటం వలన ,శబ్దోఛ్ఛారణలో బేధాలు కనిపెడుతూ వల్లెవేయటం వలన పిల్లవానికి భాషాజ్ఞానం మెరుగు పడింది .అదీ పిల్లవానికి ఇష్టమైంది . ఉక్తలేఖనం [డిక్టేషన్] లో వానిలో ఉన్న లోపాలు సరి చేయబడతాయి . ఇదే పద్దతిని నేను అనసరించాను.మూడవతరగతి నుంచి భగవద్గీత చిన్నపుస్తకాలిచ్చి రోజూ ఒక్కో శ్లోకం చెప్పి బట్టీ పట్టించాము . అలాగే రెండు బృందాలుగా విద్యార్థులను కూర్చోబెట్టి శ్లోకాలను ఒకచరణం ఒకబృందం మరొకచరణం ఎదుటివారి చేత బృందగానంగా పలికించే వారము . మొదట్లో ఏమిటి ఈవయస్సులో పంతులు గీత చెబుతున్నాడని గాంధీనగర్ నుండి అభ్యంతరాలొచ్చాయి . అయితే వాల్ల సమక్షం లోనే పిల్లలు ఏ పుస్తకాన్నైనా ఇచ్చి చదివించటం చేపించాను . మిగతా పాఠశాలల పిల్లలు అలా చేయలేకపోవటం చూసి తల్లిదండ్రులు ఈ పద్దతిలో లాభాన్ని చూసి ఇక మాట్లాడలేదు .

ఇక పిల్లలు మధ్యాహ్నం చదవటానికి చందమామ పుస్తకాలు [పాతవికూడా సేకరించి] పిల్లల సాహిత్యం తో లైబ్రరీ ఏర్పాటు చేశాము . దానితో స్వంతగా చదవటం అలవాటయింది పిల్లలకు . అలాగే పిల్లలే రెండు గోడపత్రికలను నడిపేలా ప్రోత్సహించాము . అందులో పిల్లలు వ్రాసిన కథలు ,పాటలు ,బొమ్మలు ప్రదర్శిస్తారు . అలా పోటాపోటీగా నడిపే ఈ పత్రికలలో ప్రచురించే వాటిని చదవటానికి పిల్లలు పోటీపడతారు. తమ రచనలను చూసుకోవటానికి పోటీపడతారు.
దీనివల్ల పిల్లలలో ఆలోచనాశక్తి .సృజనాత్మకత పెంపొందుతుంది . కావలసిన మెటీరియల్ మేమే ఇచ్చేవారము.
అలాగే పద్యాల పోటీ పెట్టేవాళ్లం .[ఇవన్నీ ఇప్పుడు సర్వశిక్షాఅభియాన్ లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వపాఠశాలల టీచర్లుగా మాకు ట్రైనింగ్ లో చెబుతున్నారు]
అలాగే ఇంటిలో ఉండే వస్తువులు నుండి వారి ఊరిలో ఉన్న వివిధ ఇళ్ళు లాంటివన్నీ లెక్కించటం .వాటి వివరాలు వ్రాపించటం ప్రాజక్ట్ వర్క్ గా ఇచ్చేవారము. అలాగే మట్టితోను , ఇతర వస్తువులతో బొమ్మలు చేయటం ప్రోత్సహించాము
. దొరికిన వస్తువులను తీసుకొచ్చి ఒక బాక్స్ లో వేస్తారు పిల్లలు . వాటిని అసెంబ్లీ జరిగే సమయం లో ఎవరివో గుర్తించి వారికివ్వటం జరుగుతుంది . శతక పద్యాలను బట్టీపట్టించే వాల్లము .గణితం లో కూడా అలాంటి శిక్షణ ఇచ్చే వాల్లము .
క్విజ్ పోటిలు ,పాటలు ప్రతి రెండు నెలలకు ఏదో ఒక ముఖ్యమైన రోజు బహుమతులిచ్చేవిధంగా ఆటల పోటీలుంటాయి . ఆటలలో కూడా ముఖ్యంగా కబడ్డి.ఖోఖో ,వాలీబాల్ లాంటివి ప్రోత్సహిస్తాము . కబడ్డీ ఆటలో చిన్నపిల్లలను ఆడ,మగ అనే తేదా చూపకుండా కలిపి ఆడిస్తాము . కబడ్డీ ఆడటం ద్వారా పిల్లలలో సమస్యను ధైర్యంగా ఎదుర్కునే తత్వం పెరుగుతుంది. ఎదురుగా ఏడుగురు ప్రత్యర్ధులున్నా వెరువక తలపడే ధైర్యం ఈ ఆటద్వారా పెరుగుతుంది . ఇది జీవితం లోనూ చాలా ప్రభావం చూపుతుంది . ఈమధ్య మొదటి బాచ్ లలో చదివిన సుజాత అనే అమ్మాయి కనపడింది . నమస్తే సర్ అని పలకరించింది . ఈ మధ్య అత్తగారింట్లో ఏదో సమస్య తో ఇబ్బంది పడుతున్నదని తెలిసి ఎలా ఉన్నదమ్మా ఇప్పుడు అని అడిగాను . ఏంపరవాలేదండీ మొగపిల్లలతో కూడా మొండిగా కబడ్డీ ఆడించేవారు ,ఆ ధైర్యం తోనే ఈ సమస్యలను కూడా ఎదుర్కోగలుగుతున్నానండి ...అని చెప్పటం విన్నాక నాప్రయోగం విజయవంతమైనందుకు కించిత్ గర్వం కూడా పెరిగింది .

ఇక వీటన్నింటితో పాటు ప్రత్యేక కార్యక్రమం మాక్ పార్లమెంట్ నిర్వహణ . ప్రతి నెలా మొదటి తారీఖు ఎన్నికలు నిర్వహించబడతాయి . పాఠశాలలో టైగర్స్ గ్రూప్ ,లైన్స్ గౄప్ అనే రెండు గ్రూప్ లలో పిల్లలు తమ కిష్టమైన దానిలో చేరుతుంటారు . ఎటూ చేరకుండా తటస్థంగా కూడా ఉండవచ్చు. ఐతే ఎన్నికలలో ఓటువేసి పాల్గోవాలి . ఎన్నికలలో సాధించిన ఓట్ల అధారంగా సీట్లు కేటాయించబడతాయి . ఎక్కువసీట్లు వచ్చిన గ్రూప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది . ముఖ్యమంత్రి ,తనగ్రూప్ నుంచి హోం, ఆర్థిక,ఆరోగ్య, పారిశుభ్రత ,క్రీడా, సాంస్కృతిక ,వన ,నీటిసరఫరా శాఖా మాత్యులనునియమించుకుంటాడు . ఓడినవారు ప్రతిపక్షం లో ఉంటారు . ఏ శాఖ కు చెందిన మంత్రి ఆశాఖ పరిపాలన చూస్తాడు . విద్యార్థులకు విశ్రాంతి సమయంలో చిరుతిండ్లు అమ్మే స్టాల్ ను ఆర్ధిక మంత్రి నిర్వహిస్తాడు. ఆవచ్చే లాభాలను మంత్రివర్గ నిర్ణయం ప్రకారం వివిధ శాఖల కొనుగోళ్లకు ,ఆటలపోటీలకు ఖర్చు చేస్తుంటారు. ప్రతి శుక్రవారం జరిగే మాకపార్లమెంట్ సమావేశాలలో పరిపాలన పై తీవ్రమైన చర్చలు వాదోపవాదాలు జరుగుతుంటాయి. దీనిద్వారా నాయకత్వ లక్షణాలు ,స్వయం పరిపాలన , బాధ్యత ,సమాజంపట్ల నిబద్ధత వంటి అంశాలాలో శిక్షణ నివ్వబడుతున్నది అంతర్గతంగా.
వనశాఖ మంత్రిగా ఉన్న మాలకొండారెడ్డి అనే పిల్లవాడు[ వాడిప్పుడు పెద్దవాడులెండి] ఒక్కో మొక్కకు వాల్లపేరు పెట్టి పెంచుకునే లా పథకం చేపడితే ,దానిఫలితంగా ఇప్పుడు పాఠశాలనిండా చెట్లు నిండా నీడనిస్తున్నాయి . ఇలా విద్యార్థులు ఆటపాటలతో సాగించిన విద్యాభ్యాసం తోడు రెసిడేన్షియల్ అవకాశం కూదా కల్పించి విద్యార్థులకు యోగా ,ధ్యానం ,మార్షల్ ఆర్ట్స్ ,,గాయత్రీ ఉపాసన , ఒక సబ్జక్ గా సంస్కృతం జోడించి ప్రాచీన ఋషికులముల పద్దతిలో ఒక మోడల్ స్కూల్ ను తయారు చెయ్యాలని కన్న కలలు లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా కలగపోవటం వలన రూపుదాల్చలేదు. భగవదేఛ్ఛ ఎలా ఉందో .

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP