శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జీవితం లో కష్టాలతో విసిగివేసారుతున్నారా?తొలగించుకునేమార్గమిదిగో

>> Monday, September 22, 2008


మానవజీవితం కష్టసుఖాల సమ్మేళనం . పూర్వజనం పుణ్యపు పాలు మిగులుగా నున్నప్పుడు సుఖాల రూపంలోనూ ,పాపఖర్మ రాసి మిక్కిలిగానున్నప్పుడు కష్టాల రూపం లో అవి అనుభవానికొస్తుమ్టాయి. భగవంతుని అనుగ్రహం వలన వీటిని నిర్వికారంగా అనుభవించే మహానుభావులు ఖర్మను నిశ్శేషం చేసుకుంటారు.కాని సాదారణమయిన మనలాంటి మానవులు ,వీటిని భరించే శక్తి లేక కష్టాలు వచ్చినప్పుడు తల్లడిల్లు తుంటాము. ఇవిధంగా సమానంగా వచ్చినా కొంతవరకు తట్టుకోవచ్చు, కానీ నిరంతరం కష్టాల కాష్ఠం లో కాలుతుండే అభాగ్యజీవుల ఆవేదన భరించరానిది . కరుణామయులైన మహర్షులు ఈ స్థితిని గమనించారు. మానవుల కర్మ పరిపక్వమయ్యే మార్గాలు కనిపెట్టారు. పరమశక్తిని ప్రసన్నం చేసుకుని ఈ కష్టాలనుండి విముక్తులయ్యే మార్గాలను అన్వేషించి ,ఆవిష్కరించారు. వాటిని దయతో మానవాళికి అందచేశారు .
కర్మ ఫలితం అనుభవించక తప్పేది కాదు. కాని తొలగించుకోలేనంత కష్టం కూడా కాదు. ఉదాహరణకు nadini దాటటం తప్పనిసరి అయినప్పుడు ఈదిదాటాలని ప్రయత్నించటం భాహుప్రయాస. ఒక దుంగ,లేక చేక్కముక్క తోదాటటం శ్రమతో కూడుకున్నది. ,కానీ పడవ మీదనో ఒడమిదనో దాటటం శుఖదాయకమే కదా? అలానే ఫలితాలను యధాతథంగా అనుభవించటం కంటే పరమాత్మ పాదాలు అనే ఓడను ఆశ్రయిమ్చి దాటటం సులభం కదా?.
కనుక మనం మహర్షులిచ్చిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుందాము. మన కష్టాలను మనమే తొలగించుకుందాము సిద్ధపడండి.
జగన్మాత అయిన ఆతల్లి దుర్గ దుర్గతులను నాశమ్మొనరించగలదని సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి. అట్టితల్లిని ఆశ్రయిమ్చి తమ బాదలనే సుడిగుండాలను తరిం చినవారెందరో మనకు చరిత్రనిండా కనపడతారు. ఆతల్లికి పరమ ప్రితికరమయిన శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఆసమయంలో అమ్మకు ఇష్టమయిన ఎన్నోరితులలో పూజించే ప్రక్రియలు పెద్దలు మనకిచ్చారు. వాటిలో మన సంస్కారానికి తగిన మార్గమేన్నుకుని అమ్మకృపకు పాత్రులమయితిమా, మన జన్మలు తరించినట్లే. శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠము భక్తులకు అటువంటి మార్గాలను సూచిస్తుంది. సాధకులు మీరే. మీ కువచ్చిన కష్టాలను తెలియబరచితే ,ఆయా కష్టాలను భక్తిమార్గంలో విశుద్ధ మార్గంలో ఎలా నవరాత్రులలో అమ్మను ఆశ్రయిమ్చి తొలగించుకోవాలో సూచిస్తుంది. ఇది దైవ సేవగా భావించి చేసే సేవఏగాని అనయము కాదని మనవి. నమ్మినవారికేన్నాడు నాశాములేడుగాడంమా! అని త్రికరణశుద్ధిగా నమ్మాము. ఆపాదాలనాశ్రయించి నిర్భయులమయి సేవలో నున్నామని చెప్పుకోగల అద్ర్రుస్టాన్నిచ్చిన ఆతల్లికి చేసే సేవగా భావిస్తున్నాము. రండి అమ్మ అనురాగాన్ని అందరితో పంచుకుందాము.

2 వ్యాఖ్యలు:

సురేష్ బాబు September 22, 2008 at 10:01 PM  

మీ ఇష్ట కామేశ్వరి యాత్ర చదివానండి.ఎంతో ఆనందం కల్గింది. నాకూ వెళ్లాలనిపిస్తోంది. అమ్మ దయ ఉంటే తప్పకుండా వెళ్తాను.

durgeswara September 23, 2008 at 4:01 AM  

subham

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP