శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీకమాస ముగింపు సందర్భంగా అమావాస్య [శనివారం]నాడుసాగిన విశేషార్చనలు .

>> Sunday, November 23, 2014

 పరమపవిత్రమైన కార్తీక మాసం మొత్తం పీఠంలో సాధనా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. శనివారం [అమావాస్య] రోజున విశేష అర్చనలు చేశారు భక్తులు. ప్రభాతకాలం లో మొదలైన ఏకాధశ రుద్రాభిషేకం,ఆతదుపరి సహస్ర లింగార్చన కన్నులపండుగగా సాగాయి. పరమశివుని గుణగానం చేస్తూ  భక్తులు సాగించిన అర్చనలతో  ప్రకృతి పులకించిపోయింది.  ఆపైన రుద్రహోమం పూర్ణాహుతి నిర్వహించబడింది .  పూజ ,జపం,తర్పణం,హోమం,అన్నదానం చేయాలనే విధిక్రమానుసారం   ఈ ముప్పైరోజులు పార్ధివలింగార్చన సాగిస్తున్న సాధకులంతా  అన్నదానం కూడా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దీక్షాధారులందరినీ ఆహ్వానించి అన్నపూర్ణ భిక్షాశాలలో అమ్మవారి అన్నప్రసాదాన్ని  వడ్డించారు.












0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP