శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నిన్నగాక మొన్న పరిచయమైన అమ్మాయికోసం చావాలనుకున్నావు ! మరి అమ్మ ఏమవుతుందని ఆలోచించలేకపోయావా అమాయకుడా !

>> Friday, September 7, 2012

మాజిల్లాలో  మొన్న సాయంత్రం  ఒక దుర్ఘటన జరిగింది . ప్రేమిమ్చిన అమ్మాయి మోసం చేస్తున్నదని భావించి ఒక  యువకుడు [సాఫ్ట్వేర్ ఇంజనీర్] తనప్రియురాలిని బండిపై ఎక్కించుకుని వేగంగా వెళ్ళీ ఆర్టీసీ బస్సును ఢీకొని మరణించాడు. వాని  జేబులో ఉత్తరం తీసిచదివిన పోలీసులు, దీన్ని ప్రచురించిన పత్రికలవాల్లు, చదివినవాల్లము కన్నీరు ఆపుకోలేనివిధంగా వ్రాసాడు ఆపిల్లవాడు.. చక్కటి జీవితాన్ని  పిల్లలు తెలియని అమాయకత్వం, తాత్కాలిక ఆవేశాలు, లోపించిన విచక్షణాగ్నానం  వలన  చేజేతులారా ఎలా నాశనం చేసుకుంటూన్నారో అని బాధకలుగుతున్నది.
అందరినీ అంతగా ప్రేమించిన ఆపిల్లవాడు ,తనజీవితాన్ని ప్రేమిమ్చటం నేర్చుకోలేదు. తనను కడుపున మోసి పెంచిన ఆతల్లి ఏమవుతుందో ఆలోచించుకోలేకపోయాడు . 
కుర్రపిల్లలూ ! ప్రేమ జీవితంలో ఒక భాగం అంతే , అదే జీవితంకాదు .ప్రేమంటే అమ్మా నాన్నా, అన్నలూ తమ్ముల్లూ,బంధువులూ అందరిపట్లా ఉందేది.. కంటికి నదురుగా కనపడ్డ పిల్లతోటిదే ప్రేమకాదు.  అది మోహం.
అసలైన ప్రేమను తెలుసుకోండి. జీవితాలను ఆనందమయం చేసుకోండి, చేయండి.ఇలా అర్ధాంతరంగా చచ్చి తల్లీదండ్రిని జీవచ్చవాలుగా చేయకండి.-------


---------------------------------------------------------------------------------------------------------

ఆంధ్రజ్యోతి పత్రికలో నిన్న వచ్చిన వార్త 
-----------

ప్రియురాలితో కలిసి ప్రియుడి ఆత్మహత్య

మేడికొండూరు, సెప్టెంబర్ 5 : అది.. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు సమీపంలోని లిక్కర్ డిపో ప్రాంతం! బుధవారం రాత్రి.. బైక్‌పై ఒక అబ్బాయి, వెనకాలే అతణ్ని ఆనుకుని కూర్చున్న అమ్మాయి!! వేగంగా వస్తున్న ఆ బైకు.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును విసురుగా ఢీకొట్టింది! రెప్పపాటులో జరిగిపోయిన ఆ దృశ్యాన్ని చూసినవారంతా షాక్ అయ్యారు! ఇంతలో ఆ ప్రమాదం గురించి తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడి చొక్కా జేబుల్లో వెతికితే బయటపడింది.. సూసైడ్ నోట్!! ఆ బైక్‌పై ఉన్న యువతీయువకులు ప్రేమికులు.

ప్రియురాలిపై అనుమానంతో తన ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఆమె ఉసురు కూడా తీశాడా ప్రేమికుడు!! ఆమెను బైకు మీద ఎక్కించుకుని వేగంగా వెళ్లి, బస్సును ఢీకొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంపరాల గ్రామానికి చెందిన మాదల సైదుబాబు గుంటూరుజిల్లా ఫిరంగిపురం సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. అప్పట్లో సహ విద్యార్థిని శివకృష్ణజా రెడ్డిని ప్రేమించాడు.

చదువు పూర్తయ్యాక సైదుబాబు చెన్నైలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. తనపై ప్రేమ నటనని.. ఆమె మరికొందరిని ప్రేమిస్తోందని అతడికి అనుమానం వచ్చింది. అంతే, ఉద్యోగం మానేసి గుంటూరుకు చేరుకున్నాడు. స్నేహితుడి మోటార్ సైకిల్‌పై శివకృష్ణజను తీసుకుని కాలేజీకి వెళ్లి.. వస్తూ.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతకుముందే సూసైడ్ నోట్‌రాసి జేబులో పెట్టుకున్నాడు. అందులో.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఉద్దేశించే కాదు.. పోలీసులను, బస్సు డ్రైవర్‌ను ఉద్దేశించి కూడా రాశాడు.

"అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లెలు, మా మయ్య, తాతయ్య, బాబాయిలు, చిన్నమ్మలు.. మీ అందరినీ వదిలి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి'' అని రాశాడు. పోలీసులను ఉద్దేశించి.. "పోలీస్ సర్స్‌కి నాది చిన్ని రిక్వెస్ట్. ప్లీజ్ నన్ను డైరెక్ట్‌గా మా హోమ్‌కి డెలివరీ చేయండి'' అని పేర్కొన్నాడు. తనకు టీడీపీ అంటే ఇష్టమని, తన సమాధి పక్కన పార్టీ జెండా పెట్టాలని కోరుకున్నాడు. బస్సు డ్రైవర్‌ను ఉద్దేశించి "డ్రైవర్‌గారూ నన్ను క్షమించండి. నేను చనిపోవాలని మీ వాహనాన్ని ఢీకొట్టాను. నాకు బతకడం ఇష్టం లేదు'' అని రాశాడు. తన ను క్షమించమని ప్రియురాలి తండ్రిని ఆ లేఖలో వేడుకున్నాడు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP