శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అందరితరపున అమ్మకు ఈరోజు జరిగిన అర్చనాకైంకర్యములు .

>> Friday, July 27, 2012

సకల కళ్యాణకారిణి అగు అమ్మ వరలక్ష్మీ మాతకు ఈరోజు శ్రావనశుక్రవారసందర్భంగా భక్తులందరి తరపున విశేషపూజలు జరుపబడ్డాయి .   ప్రభాతకాలంలో అమ్మవారికి పంచామృతాభిషేకములు , విశేషఅర్చనాకైంకర్యములు నిర్వహింపబడ్డాయి . ఈసందర్భంగా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున కుంకుమ పూజలు జరుపుటజరిగినది.   
తదనంతరం   పీఠానికి చేరుకున్న సువాసినులంతా వరలక్ష్మీ వ్రతములు నిర్వహించుకున్నారు . కలశస్థాపనలు చేసి అమ్మను ఆహ్వానించి ,షోడశోపచారములతో పూజించి హారతులెత్తారు. వివిధఫల,ప్రసాదములు సమర్పించి వాయినములిచ్చుకున్నారు. 
అమ్మ అనుగ్రహాన మీ అందరిగృహములలో సర్వసౌభాగ్యాలుకొలువుండాలని ప్రార్ధిస్తున్నాము . జైశ్రీరాం




[ఈరోజు ఫోటోలు తీసేసమయంలేక కుదరనందున పాతఫోటో ఉంచుతున్నాను ఏమనుకోవద్దు.]

3 వ్యాఖ్యలు:

Yogi July 27, 2012 at 8:36 AM  

Dhanyavadalu master garu

Yogi July 27, 2012 at 8:36 AM  

Dhanyavadalu master garu.

anrd July 28, 2012 at 3:30 AM  

ధన్యవాదాలండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP