శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగ స్వామి చరిత్ర -- 72 to 77

>> Tuesday, July 24, 2012

ఈ జగత్తు నీటి బుడగలాంటిది; ఎండమావి వంటిది. అలాంటి జగత్తును ఎవరు తుచ్ఛంగా భావిస్తారో, వారిని మృత్యువు తేరిపారచూడలేదు.
27.తరుముకు వచ్చే కష్టాలలాగా ప్రకోపించే కోపాన్ని అదుపు చేయగలవాడే నిజమైన సారధి. ఇతరులు కేవలము కాంతి కిరణాలను పట్టుకోవాలని వ్రేలాడేవారే!
28.ప్రేమద్వారా క్రోధమును జయించు. శుభముద్వారా అశుభమును జయించు. నిస్వార్థత ద్వారా స్వార్థతను జయించు. సత్యము ద్వారా అసత్యమును జయించు.
29.గురువు ఇచ్చే ఉపదేశాన్ని మనస్సుతో విని, దానిని పాటించాలి.
30.అనవసరమైన మాటలు మాట్లాడకు. ఎక్కువగా మాట్లాడేవారు అబద్ధాలు ఎక్కువ చెబుతారు. శాంతి కొరకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొద్దిగా మాట్లాడాలి.
యోగశిక్షణకు అరణ్యవాసము, నిరాహారములు అక్కరలేదు. చిత్తవృత్తి నిరోధమే యోగము. చిత్తమునకు వశీభూతమైన ఇంద్రియములను ఇష్టసాధనకు నియోగించగల క్షమత గలవారికి ఈ జగత్తు అయినా అరణ్యమైనా ఒకటే. ఏకాగ్రతయే యోగమునకు ప్రాణము. ఏకాగ్రతలో జీవాత్మ- పరమాత్మలు ఒకటైప్పుడు, జీవాత్మ పరమాత్మలలో తేడా ఉండదు. అప్పుడే సాధకుడు అసలైన యోగి అవుతాడు. ఈశ్వరుని పొందటానికి యోగాంగ సాధన అవసరం లేదు. భక్తి ద్వారానే భగవంతుని పొందవచ్చును. భక్తుడు భక్తిద్వారా ఆయనను ప్రసన్నుని చేసికొని, ఆయనలో లీనమైపోవచ్చును. దాన్ని కూడా సమాధి అంటారు.
సమాధి అంటే బ్రహ్మలో మనస్సును స్థిరీకరించటం. జీవాత్మ పరమాత్మల ఏకీకరణం మొదలైనవి సమాధి యోగము యొక్క ఫలస్వరూపములు. చిత్తము వశీభూతమై ఇతర కార్యముల నుండి నిస్పృహమై, ఆత్మలో నిలిచినప్పుడు, దానిని సమాధి అంటారు. ఏ స్థితిలో విశుద్ధమైన అంతఃకరణ ద్వారా ఆత్మావలోకనం చేసి ఆత్మలోనే తృప్తి, బుద్ధిలాభము, అతీంద్రియత్వము వంటి ఆంతరంగిక సౌఖ్యములను పొందుతారో, ఏ స్థితిలో ఉండటంవలన ఆత్మతత్త్వ విచ్యుతి కలుగదో, ఏ స్థితిని పొందిన తరువాత సాధకుడు ఇతర లాభములను లాభములుగా భావించడో, ఏ స్థితిలో ఉండగా గురుతరములైన దుఃఖములు కూడా చలింపజేయలేవో, ఆ స్థితి పేరే యోగము. మనసును ఆత్మలో నిలిపి స్థిరమైన బుద్ధితో మెల్లిమెల్లిగా విరతిని అభ్యసించాలి. చంచలమైన మనస్సు ఏయే విషయాల కోసం చరిస్తూ ఉంటుందో, వాటిని గురించి ఆలోచించకుండా, దానిని పట్టి లాగి ఆత్మకు వశపరచాలి. రజోగుణ- తమోగుణ విహీనులైన యోగిగణము ఈ ప్రకారంగానే మనస్సును సర్వదా వశీభూతం చేసి, అనాయాసంగా బ్రహ్మ సాక్షాత్కారం పొంది, సర్వోతృష్ణ సుఖాన్ని పొందుతారు. అంతటా బ్రహ్మదర్శనం చేయగలవాడు, తన మనస్సును సమాహితం చేసి సకలభూతములలో ఆత్మను, ఆత్మలో సకల భూతములను దర్శిస్తాడు. నిష్కామంగా యోగాభ్యాసం చేసేవాడు మాత్రమే సమాధి స్థితికి లేదా మోక్షానికి అర్హుడవుతాడు. ఈశ్వరునిలో లీనమైన జీవాత్మ పరమాత్మతో లీనమవటమే ముక్తి.
సమాధి అంటే తన్మయభావము. ఎక్కడ జీవాత్మ- పరమాత్మ వేరనే భావం ఉండదో, ఎపుడు జీవుడు బాహ్య జ్ఞానశూన్యుడవుతాడో, ఎప్పుడు బాహ్యేంద్రియములు చలనము లేనివవుతాయో దానిని సమాధి అంటారు. మనస్సును ఇంద్రియాలకు వశం చెయ్యక, ఇంద్రియములను మనస్సుకు వశీభూతం చెయ్యటమే యోగాభ్యాసంలో ప్రధానోపాయము. మొదట ఇంద్రియాల నుంచి పుట్టిన చిత్తవృత్తులను నియంత్రించి, చిత్తమును వశీభూతం చేసుకోవాలి. ఆ తరువాత చిత్తమును చిత్తమునకు వశపరచి అంటే సంసారికమైన ఇంద్రియ వృత్తులకు వశీభూతమైన చిత్తమును నిష్కామమైన చిత్తంగా చెయ్యాలి. చిత్తమును వివిధలక్ష్యముల నుంచి మరల్చి, అభీష్ట లక్ష్యమునకు మార్గదర్శంగా చెయ్యాలి.
 వివిధ చింతనలనుంచి క్రమక్రమంగా నియంత్రించి ఎల్లప్పుడు ఆత్మ చింతనలోనే నియోగించాలి. యోగము రెండు రకాలు 1.సకామ యోగము. 2.నిష్కామ యోగము. సకామ యోగాభ్యాసము చేసేవాడు మోక్షమును పొందలేడు. నిష్కామ యోగాభ్యాసియే మోక్షాన్ని పొందుతాడు. నిష్కామ ధర్మపాలనమే యోగమునకు మూలము.
ఆత్మతత్త్వము యోగమునకు ఒక అంగము. అంతేకాక అది యోగము యొక్క ఫలస్వరూపము కూడా! తన్మయత్వభావము కలిగిన తరువాతే మరే అనుష్ఠానము అవసరం లేదు. తన్మయత్వభావమే యోగసిద్ధి. అలాంటి భావము లభించిన తరువాత దృష్టి అంతా కామ్యవస్తువుపైననే ఉంటుంది. మరే వస్తువుపైనా ఉండదు. అన్య చింతన ఉండదు. మనస్సులో కామ్య వస్తువు, కామ్య వస్తువుపై మనస్సు మాత్రమే ఉంటాయి. కామ్య వస్తువు మినహా జగత్తులోని మరే వస్తువు అతనికి కనబడదు. ఆ కామ్య వస్తువే మనస్సంతా నిండి ఉంటుంది. అప్పుడతను జగత్తులో ఉండి కూడా, జగత్తులోని మనిషి కాడు. అతని అస్తిత్వము కామ్య వస్తువే అవుతుంది. ఆ కామ్య వస్తువు లేనప్పుడు అతని అస్తిత్వమే ఉండదు. అట్లా కామ్య వస్తువులో కలిసిపోతాడు. దాని పేరే తన్మయత్వము. ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పనిలో తన్మయులు కావటం తప్పనిసరి. అట్లా చేస్తే ఆ పని విఫలము కాదు. ఆ పని తప్పక సిద్ధిస్తుంది. భావన ఎట్లా ఉంటుందో, సిద్ధి కూడా అట్లాగే ఉంటుంది. కోరిన దానిపట్ల ఎంతగా మనస్సు లగ్నమై ఉంటుందో, దాని ఫలితం కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పనియైనా సంపూర్ణంగా సిద్ధించాలంటే, దానిపట్ల సంపూర్ణ తన్మయత్వం పొందాలి. ఏకాగ్రత లేకుండా తన్మయత్వంరాదు. ఏ పనినైనా చేయటానికి, అది అవసరం కనుక, ముందుగా ఏకాగ్రతలో శిక్షణ పొందాలి. ఏకాగ్రత లేకపోతే ఆ పనిలో తన్మయత్వం కలుగదు. పనిలో విశ్వాసం లేకపోతే సిద్ధి కలుగదు. కార్యసిద్ధికి మూలం విశ్వాసమే! కనుక పనిపట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. తన్మయత్వము, ఏకాగ్రత, ఫలసిద్ధి, వీటన్నింటికీ మూలం విశ్వాసమే.
సృష్టి చేసే సమయంలో భగవంతుడు అన్నిటికన్నా మొదట మాయను సృజించాడు. ఆ మాయ జ్ఞాత-జ్ఞాయము- జ్ఞానములలో కార్యకారణ రూపములలోను, సత్వ- రజ-స్తమో గుణములలోను, విశిష్టమై యున్నది. దానికి రెండు శక్తులు ఉన్నాయి. మొదటిది ఆవరణ శక్తి- అంటే మాయ చేత జీవుడు ఆచ్ఛాదింపబడి ఉండటం వలన నిత్య సత్య స్వరూపుడైన పరమాత్మను పొందలేక, అహంకారంతో తనను తాను స్వతంత్రుడనని భావిస్తాడు. రెండవది విక్షేపశక్తి- దీనివలన జీవుడు అసత్యమైన వస్తువును సత్యముగా భావించి జగత్తును నిత్యంగాను సత్యంగాను భావిస్తాడు. అంతేకాక భగవంతుని మరచిపోయి, అనిత్య విషయ వస్తువులోనే ఉండిపోతాడు.
తాంత్రిక విధానంలో షట్చక్ర భేదనము
సత్వరజస్తమో గుణ విశిష్టమైనది. చంద్ర సూర్యాగ్ని రూపమైనది, స్వచ్ఛమైనది అయిన సుషుమ్న నాడి ఇడ-పింగళ నాడులకు మధ్యలో ఉన్నది. చతుర్దళాకారంలో ఉన్న ఆ నాడి, మూలాధార పద్మం నుంచి శిరస్సులోని బ్రహ్మరంధ్ర పర్యంతము విస్తరించియున్నది. ఈనాటికి చుట్టబడి ఆసనము, లింగము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము,శిరస్సులో వరుసగా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా, సహస్రారము అనే ఏడు పద్మాలు ఉన్నాయి. ఈ సుషుమ్ననాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్రా అనే నాడి ఉన్నది. మరల దానిలో చంద్ర సూర్య అగ్ని రూపమైన, బ్రహ్మవిష్ణు శివులతో కూడిన చిత్రా (చిత్రిణి) అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయము లేకపోవటంవలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరల ఆ చిత్రానాడిలోపల అతి సూక్ష్మమైన విద్యున్మాలలాగా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ బ్రహ్మనాడి అనే మరొక నాడి ఉన్నది.
 ఈ బ్రహ్మనాడిలోని రంధ్రంద్వారా బ్రహ్మరంధ్రంలోని సహస్రార పద్మం నుండి సుధ ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మంవద్దనున్న కుండలినీ శక్తి ద్వారా పానం చేసి, సిద్దానందమును అనుభవిస్తారు.
1.మూలాధార చక్రము ఆసనములో ఉన్నది. ఇది చతుర్దళములు, స్వర్ణకాంతి, అధోముఖముతో ఉండే పద్మము. సాధనకాలంలో సాధకుల ఊర్థ్వముఖులై చింతనచెయ్యాలి. ఈ చక్రపు నాలుగు దళములలో ‘‘వం, శం, షం, సం’’ అనే నాలుగువర్ణాలు ఉన్నాయి. మధ్యలో చతురస్రాకారంలో పృథ్వీచక్రం ఉన్నది. ఆ చక్రము ఉజ్జ్వలము, పీత, వర్ణము, అష్టశూల సంయుతము అయినది. దాని మధ్యలో ‘్భం’ అంటే ఫృథ్వీబీజం ఉన్నది. దానితో కలిసి లక్ష్మీబీజం ఉన్నది. ఆ చక్రానికి అధిదేవత ఇంద్రుడు. ఆయన ప్రక్కన చతుర్ముఖుడైన బ్రహ్మ చతుర్వేద పారాయణ చేస్తూ, భౌతిక పదార్థాలను సృష్టిస్తూ ఉంటాడు. ఆ చక్రంలో రక్తవర్ణము- చతుర్‌బాహువులు కలిగి, ద్వాదశాదిత్యులతో సమానమైన డాకినీ శక్తి ఉన్నది. వజ్రానాడి ప్రారంభంలో కామరూపమనే పీఠం ఉన్నది. ఆ పీఠం మీద త్రికోణ యంత్రం ఉన్నది. ఈ యంత్రం నుంచి బయటికి వచ్చిన కందర్పవాయువు జీవాత్మను పట్టుకొని ఉన్నది. ఈ త్రికోణ యంత్రంలో శరత్కాల చంద్రునిలాగా లింగరూపియైన స్వయంభువుడున్నాడు. ఆ లింగము వద్ద మూడున్నరసార్లు చుట్ట చుట్టుకొని ఉన్న బ్రహ్మనాడి ఉన్నది. ఆ బ్రహ్మనాడీ ముఖమును ఆనుకొని కుండలినీ శక్తి నిద్రాణమై ఉన్నది. అక్కడే విద్యుత్ రూపిణియైన మహామాయ తుమ్మెదలాగా మధురమైన గున గున శబ్దం చేస్తున్నది. అదే శబ్దజనని. శ్వాస- ప్రశ్వాసల ద్వారా ప్రాణులను రక్షించేది అదే! ఈ కుండలినీ శక్తి శరీరంలోని పరమ కళ. త్రిగుణాత్మకమైన అంశ రూపాత్మకమైన సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపజేస్తున్నది.
2.స్వాధిష్టాన చక్రము లింగమూలమున ఉన్నది. ఇది షడ్దళ- అరుణవర్ణ పద్మము. దీని ఆరు దళములలో ‘‘బం, భం, మం, యం, రం, లం’’ అనే వర్ణాలు ఉన్నాయి. దానిలో పద్మాకారంలో ఉన్న వరుణ దేవతాచక్రం ఉన్నది. ఆ చక్రంలో శరత్కాల చంద్రకాంతి, తలలో అర్ధచంద్రధారి- మకరవాహిని- వం బీజరూపి అయిన వరుణ దేవత ఉన్నది. ఆ దేవత ప్రక్కన 24 లక్షణాలు కలిగి, పీతాంబరధారి అయిన నారాయణుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తి లక్ష్మీరూపిణియైన రాకిణి.
3.మణిపూర చక్రము నాభిమాలములో ఉన్నది. అది దశదళ- నీలవర్ణ పద్మము. దాని పది దళాలలో ‘టం, డం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫ’’ అనే పది వర్ణాలు ఉన్నాయి. దానికి సరిగ్గా మధ్యభాగంలో టం అకారాత్మక త్రికోణాకార అగ్ని బీజం ఉన్నది. దానిని ఆవరించి స్వస్తికాకార మండలం వున్నది. అక్కడ ఉన్న అగ్నిదేవత చతుర్బాహువై, మేగవాహనుడై, ఎఱ్ఱని సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రక్కన ఆయనకు ఇష్టదేవత- సంహారకారి అయిన మహాకాళుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తి లాకిని. ఆమె నల్లని వర్ణము కలది.
4.అనాహత చక్రం హృదయంలో ఉన్నది. అది ద్వాదశ దళసింధూర వర్ణ పద్మము దాని పనె్నండు దళాలలో ‘‘కం, ఖం, గం, ఘం, ఙం, చం, ఛం, జం, ఝం, ఞం, టం, ఠం, అనే 12 వర్ణాలున్నాయి. దాని మధ్యలో షట్కోణాకారంలో ధూమ్రవర్ణంలో ఉన్న వాయుమండలం ఉన్నది. దానిలోపల యం అకారాత్మక వాయు బీజ దేవత ఉన్నది. అది కృష్ణవర్ణంలో, మృగవాహినియై ఉన్నది. ఆ బీజంలో హంసలాగా స్వచ్ఛమైన వర్ణములో అభయ వరదుడైన ఈశానుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తికాకిని. ఆ శక్తిలో స్వర్ణవర్ణాత్మకమైన బాణలింగరూపంలో మహాదేవుడు ఉన్నాడు. ఆ పద్మంలో మరొక అష్టదళ పద్మం ఉన్నది. దానిమీద ఒక కల్పవృక్షం ఉన్నది. దాని క్రింది మణిపీఠంలో హంసరూపియైన జీవాత్మ ఉన్నది. సాధకుడు ఇక్కడ నిలిచి గురూపదిష్టమైన దేవతను ధ్యానించాలి. అట్లా చేస్తే ఆత్మదర్శనమవుతుంది.
 విశుద్ధచక్రం కంఠంలో ఉన్నది. ఇది ధూమ్ర వర్ణంలో ఉన్న షోడశ దళ పద్మము. దాని 16 దళములలో ‘‘అ, ఆ, ఇ,ఈ, ఉ, , ఋ, ఋ౎, ఎ, ఐ, ఓ, ఔ, అం, అః’’ అన్న 16స్వరములు ఉన్నాయి. ఆ పద్మకర్ణికలో తెల్లని ప్రకాశవంతమైన శరీరముగలవాడు, తెల్లని వస్తమ్రులు ధరించినవాడు, గోళాకార ఆకాశ చక్రధారి అయి ఏనుగు నధిష్ఠించి ఉన్నాడు. ఆ చక్రములో హంసాకారి, పాశాంకుశధారి, ద్విబాహువు, అభయవరదాత అయిన ఆకారబీజమున్నది. దాని ప్రక్కన పంచమఖములు, త్రినేత్రములు, దశభుజములు కలిగిన ఈశ్వరగౌరి ఉన్నది. దానిలోని చంద్రమండలం నుంచి సుధాపానంచేస్తూ, పీతవర్ణ చతుర్భుజ అయిన సాకినీ శక్తి ఉన్నది.
6.ఆజ్ఞాచక్రము భ్రూయుగ్మ మధ్యనున్నది. ఇది ధ్యానం చెయ్యవలసిన ప్రదేశము. అది తెల్లని ద్విదళపద్మము. దాని దళములలో ‘‘హ, క్ష’’ వర్ణములు ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే ఇడ- పింగళనాడులు, వరుణ- అసినదుల రూపంలో కలిసి వారణాసీ తీర్థమును చేసినాయి.
ఆ పద్మంలో శుక్లవర్ణ షణ్ముఖి అయిన హాకీనీశక్తి ఉన్నది. ఆమె నాలుగు చేతులలో పుస్తకము, కపాలము, డమరుకము, జయమాల ఉన్నాయి. ఈ పద్మమును ధ్యానించటంవలన బ్రహ్మజ్ఞాని అవుతారు. ఈ పద్మంలో మనస్సు, కర్ణికలో త్రికోణ యంత్రము ఉన్నాయి. ఇక్కడ పరమలయస్థానం ఉన్నది. అక్కడ శుక్ల అనే పేరుగల మహాకాళుడు త్రినేత్రుడు అయిన సిద్ధలింగము ప్రకాశిస్తున్నది. ఈ శివుడు అర్థనారీశ్వరుడని ప్రఖ్యాతిగాంచినాడు. ఆజ్ఞాన చక్ర పరిజ్ఞానం కలిగిన తరువాత జీవునకు అద్వైత భావన కలుగుతుంది.
7.ఆజ్ఞాచక్రానికి కొద్దిగా పైభాగంలో శుద్ధము -జ్ఞానము-జ్ఞేయము - దీపశిఖవలె జ్యోతిర్మయము, ఓంకారాత్మకము అయిన అంతరాత్మ నిరంతరముగా ఉంటాడు.
దానిమీద అర్ధచంద్రాకారము, దానిపైన బిందువు రూపంలో ఓం అన్న నాదము, శక్తిరూపక సాకారాత్మక పూర్ణచంద్రునిలాగా ప్రకాశిస్తున్న ఉజ్జ్వల శివలింగము ఉన్నవి. ఆ ‘ఓం’ కారంపైన రెండుభుజములు కల మహానాదము అన్న పేరుగల శిఖాకార వాయువు యొక్క లయస్థానం ఉన్నది. ఆ ఆజ్ఞా చక్రంపైన శంఖిణి అన్న పేరుగల నాడికి ముందు ఆకాశంలో విసర్గ (:)లాంటి రెండు బిందువులున్నాయి. దాని క్రింద పూర్ణచంద్రునిలాగా శుభ్రవర్ణము, బాలసూర్య ప్రభాభాసమైన కేసరములతోనున్న సహస్రదళ పద్మము అధోముఖియై ఉన్నది.
దానిలో పంచాశత్ (50) మాతృకావర్ణములు యథాస్థానంలో ఉన్నాయి. ఆ స్థానంలో నిర్మలమైన కుందేలు చంద్రుడు ఉన్నాయి. ఆ చంద్రునిలో విద్యుదాకారంలో త్రికోణయంత్రం ఉన్నది. ఆ యంత్రంలో అతి రహస్యమైన చిద్రూపాకార స్థానం ఉన్నది. అక్కడ పరమాత్మ స్వరూపుడైన పరమశివుడు విరాజిల్లుతున్నాడు. అతడు యోగానందము- జ్ఞానము - శుభముల నొసగేవాడు. అతనినే పరమహంస అని కూడా అంటారు. ఇక్కడే శైవుల కైలాసము, వైష్ణవుల గోలోకము, శాక్తేయుల మహాశక్తి నివాసము ఉన్నాయి.
ఆ సహస్ర దళ పద్మంలోపల లేత సూర్యునివంటి ఎఱ్ఱని కాంతి, అతి సూక్ష్మము, విద్యున్మాలవంటి జ్యోతిర్విశేషము, శుద్ధము, నిర్వికారము, నిత్య ప్రకాశమానము, ఉదయాస్తమయ రహితము, అథోముఖి అయిన పూర్ణానంద పరంపర నుండి అమృతధార కురుస్తూ ఉంటుంది. దానిని ధరించేది ‘అమా’ అనే చంద్రకళ. దాని లోపల వెంట్రుక కొనలో వెయ్యోవంతు ఉండే అర్థచంద్రాకార ద్వాదశాదిత్య ప్రభావిశిష్టమైన, ప్రాణులకు ఇష్టమైన నిర్వాణకళ ఉన్నది. అది మహాకుండలిని అనే పేరుతో ప్రఖ్యాతమై ఉన్నది.
తిరిగి ఆ నిర్వాణకళలోపల కోటి సూర్య ప్రభాభాసమైన శివలింగమున కర్మ ఫలదాయినియైన నిర్వాణ శక్తి ఉన్నది. ఆ నిర్వాణ శక్తి మధ్యభాగంలో యోగి, మహాత్ములచే చింతన చేయబడేవాడు, పరమ సుఖమయమైన నిత్యానంద స్వరూపుడు అయిన తురీయ బ్రహ్మ ఉన్నాడు.
 యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధారం, ధ్యాన, సమాధి, తపస్సులతో యోగి దీర్ఘజీవనము, ఆకాశగమనము, అంతర్థాన శక్తి, పరకాయ ప్రవేశము, దూరదర్శనము, భూత భవిష్యత్ వర్తమాన త్రికాల దర్శనము, అణిమ, మహిమాచైవ గరిమా లఘుమాప్రాప్తి ప్రాకామ్యము- ఈశత్వము- వశిత్వము- కామావసాయిత్వము ఇత్యాది అష్టసిద్ధులను పొందుతాడు. అణిమ అంటే అణువులాగా చిన్న దేహమును ధరించే శక్తి. మహిమ అంటే బాగా బరువెక్కడం. లఘిమ అంటే తేలికగా అయిపోయి ఆకాశ గమనం చేయగలశక్తి. ప్రాప్తి అంటే ఈ విశ్వంలోని అన్ని వస్తువులనూ హస్తగతం చేసుకొనే శక్తి. ప్రాకామ్యమంటే యథేచ్చగా చేయగలశక్తి. ఈశత్వమంటే ప్రభుత శక్తి.
వశిత్వమంటే అన్నింటినీ తన వశంలో పెట్టుకోగల శక్తి. కామవసాయిత్వమంటే అన్ని కోరికలను తీర్చుకొని నిష్కాములు కావటం. భక్తి లేకుండా సాధకుడు తన పురుషకార సాధన ద్వారా ఎంత ఉన్నతిని పొందినా, అతనికి పతనావకాశం సిద్ధంగా ఉంటుంది.
తపస్సులో చివరి మెట్టుమీదికి వెళ్లినప్పటికి, దానిలో ఒక్కొక్కసారి అవిశ్వాసము నైరాశ్యము చోటుచేసుకొని ఉంటాయి. కానివాటితోపాటు భక్తికూడా ఉంటే, అవిశ్వాసం ఎప్పుడూ కలుగదు. అప్పుడు యోగి అనాయాసంగా ముక్తిని పొందగలుగుతాడు. ఆత్మలో పరమాత్మ సంయోగం చెందటమే తన్మయత్వము. ఏదైనా ఒక విషయం మీద మనస్సును లగ్నం చేసి ఇతర విషయాలపట్ల మనస్సు లాగకుండా ఉండటమే తన్మయత్వము. తన్మయత్వంవల్లనే బంధమోచనమై ముక్తి లభిస్తుంది.
కొన్ని సారోక్తులు
శిష్యుడు: భూమిని సృష్టించటానికి పూర్వం ఎవరున్నారు
గురువు:పంచభూతములు - ఈశ్వరుడు
శిష్యుడు: భూమిని జీవరాశిని ఎవరు సృష్టించారు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: సృష్టిని ఎవరు వృద్ధిపరుస్తారు?
గురువు: బ్రహ్మ
శిష్యుడు: బ్రహ్మ ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి.
శిష్యుడు: సృష్టిని పాలించేది ఎవరు?
గురువు: విష్ణువులేదా నారాయణుడు
శిష్యుడు: విష్ణువు ఎవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: సృష్టిని లయము లేదా ధ్వంసము చేసేది ఎవరు?
గురువు: మహేశ్వరుడు- అంటే మహాదేవుడు
శిష్యుడు: మహాదేవుడెవరు?
గురువు: ఈశ్వరుని శక్తి
శిష్యుడు: బ్రహ్మణి ఎవరు?
గురువు:బ్రహ్మ యొక్క శక్తి
శిష్యుడు: లక్ష్మీ ఎవరు?
గురువు: విష్ణువు యొక్క శక్తి
శిష్యుడు: దుర్గ ఎవరు?
గురువు: మహాదేవునిశక్తి
శిష్యుడు సంసార సాగరాన్ని తరింపజేసేది ఎవరు?
గురువు: ఈశ్వరుడు
శిష్యుడు: బంధనమంటే ఏమిటి?
గురువు: విషయానురక్తి
శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి?
గురువు: విషయముపట్ల విరక్తి చెంది ఈశ్వరునిలో లీనం కావటం
శిష్యుడు : ఘోరమైన నరకం ఏది?
గురువు: మనశరీరము
శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమియే స్వర్గము
శిష్యుడు: సంసార బంధనం ఎట్లా తొలగిపోతుంది?
గురువు: ఆత్మజ్ఞానమువలన
శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది
గురువు: తత్త్వజ్ఞానమువలన
శిష్యుడు: నరకమునకు కారణమేది?

శిష్యుడు:స్వర్గప్రాప్తికి కారణమేమిటి?
గురువు:అహింస
శిష్యుడు:మనిషికి శత్రువు ఎవరు?
గురువు:అతని ఇంద్రియములే.
శిష్యుడు:మనిషికి మిత్రుడు ఎవరు?
గురువు:వశీకృతములైన ఇంద్రియాలు
శిష్యుడు:దరిద్రుడు ఎవరు
గురువు:చాలా లోభి అయినవాడు
శిష్యుడు:ఐశ్వర్యవంతుడు ఎవరు?
గురువు:ఎప్పుడూ సంతుష్టుడుగా ఉండేవాడు.
శిష్యుడు:జీవన్మృతుడు ఎవరు?
గురువు:ప్రయత్నమే చెయ్యని పురుషుడు
శిష్యుడు: మాయ అంటే ఏమిటి?
గురువు:అతి ప్రేమ
శిష్యుడు:మహా అంధుడెవరు?
గురువు:కామాతురుడు
శిష్యుడు:మృత్యువంటే ఏది?
గురువు:అపకీర్తియే మృత్యువు. మనుష్యుడు అమరుడు.
శిష్యుడు: చిరకాలముండే రోగమేది?
గురువు:సంసారము
శిష్యుడు:ఆ రోగమునకు మందేమిటి?
గురువు:నిర్లిప్తుడై ఉండటమే
శిష్యుడు:ప్రధాన తీర్థమేది?
గురువు: పవిత్రమైన మనస్సు
శిష్యుడు:త్యాజ్యమేది?
గురువు:అర్థము - దురాశ
శిష్యుడు: వినదగినదేది?
గురువు:గురుసన్నిధిలో వేదాంతబోధ
శిష్యుడు:బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఉపాయమేమిటి?
గురువు:సత్‌సాంగత్యము
శిష్యుడు:సాధువు ఎవరు?
గురువు:మోహము, అనురాగములు లేనివాడు
శిష్యుడు:జీవునికి జ్వరమేది?
గురువు:చింత
శిష్యుడు:మూర్ఖుడెవరు?
గురువు:అవివేకియైనావడు
శిష్యుడు:నాస్తికుడెవరు?
గురువు:ఈశ్వరుని అస్తిత్వమును ఒప్పుకోనివాడు.
శిష్యుడు:పండితుడెవరు?
గురువు:జ్ఞాని
శిష్యుడు:్ధర్మికుడెవరు?
గురువు:యథార్థ పండితుడు
శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు:్భగవంతుని పట్ల భక్తి
శిష్యుడు:విద్య అంటే ఏమిటి?
గురువు:బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది
శిష్యుడు:లాభమంటే ఏమిటి?
గురువు:బ్రహ్మజ్ఞాన ప్రాప్తి
శిష్యుడు:జగద్విజేత ఎవరు?
గురువు:మనస్సును జయించినవాడు
శిష్యుడు:విషయమంటే ఏది?
గురువు:విషయము
శిష్యుడు:దుఃఖితుడు ఎవరు?
గురువు:వియానురక్తి కలవాడు
శిష్యుడు:సుఖవంతుడు ఎవరు?
గురువు:ఏరకమైన చింతలేనివాడు
శిష్యుడు:్ధన్యుడెవరు?
గురువు:పరోపకారి
శిష్యుడు:పూజనీయుడెవరు?
గురువు:తత్త్వజ్ఞానియైన వ్యక్తి
శిష్యుడు:కర్తవ్యం ఏమిటి?
గురువు:మోహము - పాపము
శిష్యుడు:బుద్ధిమంతుడెవరు?
గురువు:స్ర్తికి వశుడు కానివాడు
శిష్యుడు: ఉత్తమ వ్రతమేది?
గురువు:సత్పాత్రదానము
శిష్యుడు:సంకెల ఏది?
గురువు:స్ర్తిలోలత్వము
శిష్యుడు:లోకులకు తెలియనిది ఏది?
గురువు:స్ర్తి వయస్సు, స్ర్తి చరిత్ర
శిష్యుడు:ఎవరు పశువు?
గురువు:మూర్ఖుడు
శిష్యుడు:ఎవరితో సాంగత్యం చెయ్యకూడదు?
గురువు:మూర్ఖునితో, పాపితో, దుర్మార్గునితో నీచునితో
- ఇంకాఉంది


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP