శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధర్మబోధ ఎలా జరగాలి ?

>> Wednesday, January 19, 2011

ధర్మాన్ని కేవలం ఏ కళాశాలలోనో బోధించడం చాలదు. ఏ కుటుంబానికాకుటుంబం బిడ్డకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించవలసినదే . అలా బాల్యం నుండి అనుక్షణం జీవించడం ద్వారా నేర్చిన దానిని ఏ యోచనా తర్వాత అంత తేలికగా మనసులోంచి చెదరగొట్టలేదు . "స్త్రీపురుషబేధం భౌతికమేగదా ! అటువంటప్పుడు దాంపత్యానికి వావివరుసలు పాటించనక్కరలేదు " అని ఎందరు చెప్పినా చెప్పేవాడుకూడా అలాప్రవర్తించడానికి కష్టపడతాడు . అంత బలీయము అలాటి ధర్మబోధ . కులమతాలు వరకట్నం అధర్మమని ఎందరు [వి]నాయకులు ఉపన్యాసాలు దంచినా తమవారికి మాత్రం వాటిని కాడెద్దులలాగా పాటిస్తూనే ఉన్నారు కదా ! అలా ధర్మబోధ జరగాలి

[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ [సాయిబాబా పత్రిక నుండి] ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP