శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?

>> Wednesday, December 30, 2009


శిష్యుడు : ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?
స్వామీజీ : హనుమన్మహావీరుడే మనకిప్పుడాదర్శపురుషుడు .రామాజ్ఞతో అతడు సాగరాన్ని ఎలా లంఘించాడో చూడు. అతనికి ప్రాణభీతిలేదు.మృత్యుభయం లేదు .అతడు జితేంద్రియ చక్రవర్తి . అత్యద్భుత వివేక మహిమాన్వితుడు. మనం ప్రస్తుతమున్న దాస్య భావ నిర్మూలనకోసం హనుమంతుని జీవితాదర్శంగా ఎన్నుకోవాలి . దానివల్ల మిగతా ఆదర్శాలన్నీ జీవితం లో క్రమంగా అభివ్యక్తమవుతాయి . ఎదురు చెప్పకుండా గుర్వాజ్ఞను పాటించటం.కఠోర బ్రహ్మచర్య పాలన - ఇవే జయం పొందటానికి కీలకాలు .


----------------------------- స్వామి వివేకానంద

4 వ్యాఖ్యలు:

సురేష్ బాబు December 30, 2009 6:16 PM  

ఎప్పుడైతే మన పురాణేతిహాసాలను మన వారే ఎగతాళి చేయడం ఫ్యాషన్ అయిందో అప్పటి నుండే మన పతనం ప్రారంభమైంది. హనుమంతుని జీవితాన్ని ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా పెడితే చిన్నప్పటి నుండే అతని జీవితం, కృషి, పట్టుదల ,ధైర్యసాహసాలు ,మరియు కార్యదీక్ష అర్థమవుతాయి.

అప్పారావు శాస్త్రి December 30, 2009 7:56 PM  

@ సురేష్ : చాలా బాగా చెప్పారు హనుమంతుని జీవితాన్ని ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా పెట్టాలి
@ రచయిత : మంచి మాట చెప్పారు

వైద్యభూషణ్ December 30, 2009 9:05 PM  

జై హనుమాన్.

మంచి విషయం చెప్పారు.

durgeswara December 30, 2009 9:50 PM  

ముఖ్యంగా యువతకు హనుమంతుని వలె ధీశక్తిని నింపుకోగల శిక్షన అవసరమంటున్నారు స్వామీజీ .
స్పందించిన యువతకు శుభాశీస్సులు. దిగ్విజయోస్తు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP