శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విపత్తునుండికాపాడిన లలితా సహస్రనామమంత్రం

>> Monday, July 14, 2008

లలితా సహస్రనామ మహిమను అనుభవపూర్వకంగా తెలుపుతున్న ఒక సాధకుని అనుభవం .వారు విజయవాడ srr& cvr ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ . కె.జి.సి.హరివిఠల్ గారు. ఆయన మాటలలో నే ఆవిషయాన్ని తెలుసుకుందాం.

1983 డిసెంబర్లో నన్నురైలెక్కించడానికి విధ్యార్ధులు , బంధువులు శ్రీకాళహస్తి రైల్వే స్టేషనుకు వచ్చారు వారికి వీడ్కోలు చెబుతూ కదులుతున్న రైలు ఎక్కబోతూ జారి పట్టాల పక్కన పడిపోయాను. అందరూ చనిపోయాననే అనుకున్నారు. కానీ కాళ్ళువిరిగి,తలకు గాయమై, వీపుకు గాయాలయి రక్తం ఓడుతూ సృహతప్పిపోయి వున్నాను. వెంటనే నన్ను తిరుపతి రుయా హాస్పటల్ కుతరలించగా 48 గంటల తరువాతగానీ చెప్పలేమని ,రాయవెల్లూరుతీసుకు పోవటం మంచిదని సూచించటంతో అక్కడికి చేర్చారు. 24 గంటలకు నేను కళ్ళుతెరచేసరికి బ్రతుకుతానో లేదో, బ్రతికినా లేచితిరగ గలుగునో లేదో అనే పరిస్తితిలో వున్నాను. అక్కడి డాక్టర్లు మిషనరీ జీల్తో పనిచేసె అత్యంత నిపుణులైన వారు. మీకు నయంకావడానికి 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా వుంటే నడిపించి ఇంటికి పంపుతామని అన్నారు.
ముందుగా వారు నావీపుమీద ప్లాస్టిక్ సర్జరీ చేసి చర్మం అతికించారు. అది మిగతా చర్మంతో కలవాలంటే 7 రోజులు పడుతుంది. ఆ 7 రోజులు పక్కమీద బోర్లాపడుకోవాలని పక్కకు తిరగకూడదని చెప్పి పను కో బెట్టారు.ఒక్కగంట అలా పనుకోవాలంటేనే కష్టం. 7 రోజులు ఎలా పనుకోగలను?.
అప్పుడు దేవుని స్మరిస్తూ అలాగే పండుకున్నాను. నాకు లలితా సహస్ర నామము నోటికి వచ్చు. స్తోత్రాన్ని చదువు కుంటున్నాను. అసలు మన శరీరము జగన్మాత అంశముతో ఏర్పడినది . మన అవయవములన్నింటిలో ఆమె సుప్రతిష్ఠితమై వుంది.అందుచేత నాచర్మం కలసిపోయి గట్టిపడాలికనుక చర్మమునందుండు అమ్మవారి స్వరూపమును వర్ణించే శ్లోకముని మనసులోనే వెదకటం మొదలుపెట్టాను.
పాయసాన్న ప్రియా త్వక్ స్తా పశులోక భయంకరీ
అమృతాదిమహాశక్తి సంవృతా ఢాకినీశ్వరీ
అనే శ్లోకం లో "త్వక్ స్థా " అంటే త్వగింద్రియ దేవతయై చర్మము నందుండునది అని అర్ధం .అందు చేత బీజములను అనుసంధించి " ఓ0 , ఐం ,హ్రీం ,శ్రీం ,త్వక్ స్థాయై నమోనమ: " అనే మంత్రాన్ని రాత్రింబవళ్ళు నా భార్య చేత జపింప చేసి ఆ తీర్ధాన్ని పుచ్చుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే 7 రోజులు లలో కలసిపోవలసిన చర్మం 24 గం టలలో గట్టి పడింది. డాక్టర్లు వచ్చి చూసి ఆశ్ఛర్యపోయారు. ఇది ఎలా జరిగింది అని అడిగారు. నేను చేసిన పని చెప్పాను. ఇది మన మహర్షులు అందించిన మంత్ర ప్రభావమని చెబితే వాళ్ళూ నిర్ఘాంత పోయారు.
ఆతరువాత వాళ్ళు నాకాలు విరిగిన చోట ఎముకలు సరిచేసి కట్టుకట్టారు. ఆఎముకలు అటుక్కోవ డముకోసం మరలా సహస్ర నామాలను పరిశీలించాను . అందులో 106వ శ్లోకములో ఇలావుంది.
" మూలాధారాంభుజా రూఢా, పంచవక్త్రాస్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా "
ఇందులో అస్థి సంస్థితా అంటే ఎముకలయందు నివసించియుండుతల్లీ అని అర్ధము . అందుచేత మరలా "ఓ0, ఐం, హ్రీం, శ్రీం, అస్థి సంస్థితా యై నమోనమ: అనేమంత్రాన్ని జపింపజేసి ఆఫలాన్ని పొందాను. ఎముకలుగూడా త్వరలో కలుసుకున్నాయి. దీనంతటి ఫలితంగా 6 నెలల లో జరగవలసిన చికిత్సను 2 నెలలో ముగించుకుని వచ్చాను. డాక్టర్ లు మిక్కిలి ఆశ్చ్ర్యపోయారు. ఈచికిత్సా కాలములో జరిగిన మరొక విశేషంవుంది. డాక్టర్లు తామిచ్చే ఆహారమే తినాలన్నారు. అందులో నాన వేసి వండిన పెసలు ఆహారంగా ఇచ్చారు. అవి తింటే ఎముకలకు బలం వస్తుందని చెప్పారు, సరేనని తింటున్నాను. మరలా నేను లలితా సహస్ర నామాన్ని పరి శీలించాను. అందులో ఎముకలలో నివశించివున్నామ్మవారికి "సాకిని " అని పేరు చెప్పబడింది. ఆమె ముద్గౌదనా సక్తచిత్తా అని వర్ణించబడినది. అనగా ఈమె మనస్సు పెసలు కలిపి వండిన అన్నమునందు ఆసక్తి కలదియై యుండునని అర్ధము. ఈవిధముగా నిపుణులైన డాక్టర్లు నిర్ణయించిన ఆహారము., ఎముకలయందు నివసించు అమ్మవారు ఇష్టపడే ఆహారము ఒకటే అయినది.
ఈవిధముగా నా అనుభవమేకాక అనేకమందికి ఈ విషయాలు చెప్పగా వారికి ఆశ్చకరమైన ఫలితాలు వచ్చాయి.
[ వీరు పలుసార్లు పత్రికలలో ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా }

3 వ్యాఖ్యలు:

Jagadeesh Reddy July 14, 2008 at 11:25 PM  

బాగుందండి. మన పురాణాలని, మంత్రాలని అపహాస్యం చేసే వారు ఎక్కువయిపోయిన ఈ రోజుల్లో, వాటి నిజమయిన అర్ధం, శక్తి లోకానికి చాటి చెప్పవలసిన అవసరం ఎంతయినా ఉంది.

Kathi Mahesh Kumar July 15, 2008 at 12:33 AM  

faith healing అనే విధానాన్ని చాలామంది నమ్ముతారు. అది వ్యక్తిగతమైన విషయం. దాన్నే కొందరు మూఢనమ్మకం అని కూడా అంటారు. ఏదిఏమైనా మంచి జరిగితే అన్నీ మంచే!

durgeswara July 15, 2008 at 5:15 PM  

dhanyavaadamulu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP