శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కీరో బ్రాహ్మణ గురువులు - ఇండియాలో ఆధ్యాత్మిక జీవనం

>> Tuesday, July 29, 2008

పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి(3)

బొంబాయి ప్రాంతంలో నివసించే బ్రాహ్మణుడు ఒక జోషీ కులస్తుడు . తనకు సాముద్రిక జ్యోతిషం నేర్పించాడనీ ఆయన తనకు బొంబాయిలోనే ఓడల రేవువద్ద కలిసాడనీ స్పష్టంగా ఇంగ్లీషు మాట్లాడే బ్రాహ్మణుడు పురోహితుడివలే వున్నాడనీ తన ఆత్మ కథలో కీరో ఈవిధంగా వర్ణించాడు.

“ Yet, out of that motley crowd, there was one person who was actually coming to greet me ! An old man, garbed as I thought , like a Brahmin priest, was even then, making his way towards me ! I could hardly believe it at first, but our eyes met, and that seemed to decide his action.”

“ Again the Study I loved so much, had opened another door for me . I shall never forget the expression that passed over the old mans face! He held out his hands for me to read. I told him all I could, of the dates of changes in his life, illness in the past, and other things.”

“Wonderful ! “ was all he muttered. After sometime he told me of himself that he was a descendant of the old joshi caste . who had kept the study of hand, together with that of Astrology, alive since some far- distant ages.

“ He described where he lived and pointed to the western Ghats, or range of low mountains to the North of the city. He told me of his associates , how simply they lived, the occult studies they believed in and practiced.

“ Of course , I was fascinated! It remembered me so much of a book my mother had let me read, dealing with the Yogis of India.

“ I expressed a wish to go and live there with him. He held out his hand. Very simply he said “ Come ! you will be welcome among us ! Whatever our knowledge is , shall be yours, provided you pass through certain tests of willpower and faith”

“ Thus there was, that I had the inestimable privilege living for upwards of two years, in the society of men who were not only devotees of Indian occultism but who were Masters of whatever branch of it they had especially made their own.”

బాంబే పరిసర ప్రాంతాలలో వుండే పశ్చిమ కనుమల పర్వతాలలో జోషీ కులస్తులు క్రీస్తుకు పూర్వం 3000 సంపత్సరాలనుండీ అనాదిగా జ్యోతిష విద్యను రహస్యంగా పరిరక్షించుకుంటూ జాగ్రత్తగా బోధిస్తూ వచ్చారు. వారివద్దనుంచీ కీరోకు అధ్భుతమైన హస్తరేఖల శాస్త్రంలో శిక్షణ లభించినదని కీరో తన ఆత్మకధలో స్వయంగా వ్రాసుకున్నాడు పై వాక్యాలలో.

ఆ బ్రాహ్మణుడు కీరోకి తానీ విద్యను నేర్పేముందు ఒక ప్రమాణం చేయించాడు. తానీ విద్యనేర్చుకుని తెల్లదొరల దేశాలకు తిరిగి వెళ్ళి కనీసం 21 సంవత్సరముల పాటు ఈ శాస్త్రంయొక్క గొప్పదనం విదేశీయులకు అర్ధమయ్యేలాగు ప్రచారమయ్యేలాగ ఈ శాస్త్రాన్ని గౌరనం చెడకుండా కాపాడుకుంటూ ప్రజలకు భవిష్యత్తు చెబుతూ, ఈ విద్యను మానవులకు కష్టంలో సహాయం చేయడానికి ఉపయోగిస్తాననీ ఎవ్వరికీ అపకారం చేయడానికి, లేక స్వార్దానికి వినియోగించడానికి ఈ జ్యోతిష పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చెయ్యనని ప్రమాణం చేశాడు.

కీరో లండన్ కు తిరిగి వచ్చిన తరువాత దాదాపు 21 సంవత్సరాల పాటు రాజులు, మహారాణులు , కళాకారులు, విద్యావేత్తలు, రచయితలు ఒక్కరేమిటి , చివరకు స్వామి వివేకానందుని వంటి మహానుభావుని చేతిముద్రలు కూడా సేకరిస్తూ అధ్భుతమైన జ్యోతిష ఫలితాలను ఎందరికో చెప్పాడు.

అంతేకాదు తన గురువుకు మాటఇచ్చినట్లుగానే జ్యోతిషమంటే విదేశాలలో భక్తి, గౌరవాలు పెరిగేలాగ, ఈవిద్యను సద్వనియోగం చేశాడు. అంతాకాడు ఇప్పటివాళ్లలాగ బ్రాహ్మణులను, తనకు విద్య చెప్పిన వారిని చులకన చేస్తూ ఎన్నడూ మాట్లాడలేదు. మీదుమిక్కిలి ఎంతో భక్తితో ఈ భ్రాహ్మణుల నిస్వార్ధ జీవితాన్ని వారు తరతరాలుగా ఈ పవిత్ర విద్యను కాపాడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూకూడా డబ్బు కోసం ఆశపడకుండా ఇప్పటికీ ఈ జోషీ కులస్తులు తనకీ విద్యలో ఎలా శిక్షణ ఇచ్చారో స్పష్టంగా వర్ణించాడు కీరో.

అంతేకాదు ఈ బ్రాహ్మణ గురువు కేవలం జాతకం నేర్చుకుంటే చాలదు మనిషికి వాక్ శుధ్ది, జపధ్యానములు దైవ చింతన లో కూడా శిక్షణ వుంటేగాని ఈ విద్య నాస్తికులకు స్వార్ధపరులకు చెప్పరాదని నియమం పెట్టి కీరోకు మంచి శిక్షణ నిచ్చాడు.

ఈవిధంగా కీరో మూడు సంత్సరములపాటు ఉప్పు కారంలేని ఆహారం తింటూ పాలూ అన్నంమీద తన గురువు చెప్పిన సాధన చేస్తూ జ్యోతిషం నేర్చుకున్నాడు.

చివరకు పశ్చిమ కనుమలలోని కొండ గుహలలో ఒక రహస్య దేవాలయ శివాలయనికి కిరోను తీసుకువెళ్ళి అర్ధరాత్రి అతనికి యోగ దీక్షనిచ్చి ధ్యానంలోకి పంపాడు. అక్కడ గాఢ సమాధిస్థితుడైన కీరో మూడు రోజులవరకూ ఆన్నాహారములు లేకుండా అసలు వంటిమీద బాహ్యస్పృహలోని యోగ సమాధి స్ధితుడైనాడు. తరువాత క్రమంగా మెలుకువ వచ్చింది. కాని నీరసానికి కళ్ళు చీకట్లుక్రమ్మి కళ్లు కనిపింటలేదు.ఆ తరువాత హిమాలయ పర్యతాలలో మానస సరస్సు వద్ద ధ్యానిస్తూ కీరో తన జ్యోతిష శిక్షణకు తన జప ధ్యానాదులకు ఇంకా మెరుగులు దిద్దుకున్నాడు.

ఆయన తాను వ్రాసిన హస్తసాముద్రికం భాష అన్న పుస్తకంలో హిమ శిఖరాలలో బాలచంద్రుని చూస్తూ ధ్యానించిన తనకు ప్రాచీన వేద మంత్రాల ఘోషలు ఇప్పటికీ గాలి హోరులో నాదంలాగ వినిపిస్తాయని తాను తన్మయంతో పులకించాననీ, ఆ ఆనందంలో దైవంకు దగ్గరై దైవసన్నిధి పొందినట్లు పులకించాననీ వర్ణించాడు., తన బ్రాహ్మణ గురువులకు కృతజ్ఞత తెలుపుతూ

భారత దేశంలో ఉండగా ఎన్నో రహస్య ఆధ్యాత్మక అనుభవాలను వారినుండి అనుగ్రహంగా పొందటమేకాక గొప్ప ఆధ్యాత్మిక సద్గురువులను ( పేరు చెప్పలేదు) కలిసాడు కీరో

వారి వద్ద పొడవాటి తోలు మీద వ్రాసిన జ్యోతిష గ్రంధాలు ( నాడీ గ్రంధాలు) చూపించారనీ అందులో మూడు పేజీలు మాత్రమే తనకు వివరించి ఇది చాలుననీ ఆమూడు పేజీల వలన మనిషి గతంలోను జరగబోయే భవిష్యత్తునూ నడుస్తున్న వర్తమానమూ అన్నీ తెలుస్తాయని చెప్పి ఆశీర్వదించి పంపుతూ-

“ నీవు విదేశాలకు , నీ స్వదేశానికి తిరగి వెళ్ళే సమయము కూడా ఆసన్నమైంది. నీవీ విద్యను దూర దేశాలలో ప్రచారం చేయ్యి. రాజులు , మహారాణులు ప్రముఖులు నీవద్దకు వస్తారు. భవిష్యత్తును తెలుసుకోవడానికి. అందరికీ ఉపకారం చెయ్యి ఎవ్వరినీ స్వార్ధానికి వినియోగించుకోరాదు. దైవచింతన నిత్యమూ చేస్తూవుండు. పవిత్ర జీవనం గడుపు. నీజీవితం చివరలో నీ సద్గురువు అనుగ్రహం మళ్ళీ నీకు లభిస్తుంది. “ అంటూ ఆశీర్వదించి తిరిగి కీరోను విదేశాలకు పంపారు.

ఈ విధంగా “భగవంతుడు నిర్దేశించిన చదువు “ తనకిలా పూర్తిఅయ్యిందని కీరో తన సొంత వాక్యాలలో ఇలా ఆన్నాడు.” After in this way completing may Education if I may use that term , I was enabled to return to London by the death of a relation who had left me a considerable amount of money”

- “ Confessions and Memories of Modern Seer “ ( - page 33.)

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP