శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆదమరచి ప్రమాదంలో పడబోయినా పట్టుకుని కాపాడిన ..హనుమత్ మహిమ ఇది

>> Friday, April 18, 2025

మొన్న గిద్దలూరు నుండి మిత్రులు ....రావు గారు ఫోన్ చేశారు .స్వామీ ! మా బావగారు మీతో ఒకసారి మాట్లాడాలని కోరుతున్నారు. వీలయితే మీ దగ్గరకు వెల్లివద్దాం అని అడుగుతున్నారు. అన్నాడు . ఎందుకు స్వామీ ! అని అడిగాను . ఆయన పెద్ద ఇబ్బంది లో ఉన్నారు . దానికోసం మీ తో మాట్లాడాలని . ఏమైనది అని వివరమడిగాను . మీకు గుర్తున్నదా స్వామీ . పది సంవత్సరాల క్రితం నేను బెంగళూరు దగ్గర లో ఒకస్థలం కొనాలని వెళ్లి అక్కడకు వెళ్ళగానే చాలా ఇబ్బంది కలిగి మీకు ఫోన్ చేస్తే ,మీరు వెంటనే ఆ స్థలం నుండి బయటకు వచ్చెయ్యమని చెప్పారు. నేను తిరిగి వచ్చాను .అక్కడకు నన్ను తీసుకెళ్ళిన మా బావగారు మాత్రం తీవ్రమయిన ఇబ్బందులలో పడ్డాడు అని అన్నాడు. నాకు గుర్తు లేదు విషయం పూర్తిగా చెప్పండి అన్నాను. పది సంవత్సరాల క్రితం మా బావగారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యి వచ్చిన డబ్బులతో బెంగళూరు సమీపంలో స్థలం కొనాలనుకున్నాడు .నన్నుకూడా కొంతస్థలం తీసుకొమ్మని ప్రోత్సహించాడు . అప్పుడు మీరు దీక్షలో ఉన్నారు. నేనుకూడా మీ సూచనలతో దీక్ష సాగిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో భారీగా పెరుగుతుంది ది అనే ఆశతో వెళ్ళాము. ఈయన అంతకుముందే బ్రోకర్లతో మాట్ళాడిఉన్నాడు. సరే నని ఆస్థలం దగ్గరకు వెళ్లి అడుగు పెట్టగానే నాకు కరెంట్ షాక్ కొట్టినట్లు ఒళ్ళు జలదరించి పోయింది. నేను వెంటనే మీకు ఫోన్ చేశాను ,మీరు ఆస్తలంలో ఒక్క నిమిషం కూడా ఉండ వద్దు ,వెంటనే వచ్చేయండి అని చెప్పారు. నాకు శకునం బాగాలేదు. మా మాస్టర్ గారు వద్దంటున్నారు ,నేను తీసుకోలేను అని చెప్పి వచ్చేశాను. కానీ మా బావగారు మాత్రం తనకు రిటైర్ అవగా వచ్చినవి,పెన్షన్ అమ్మిన డబ్బు తోపాటు కూతురికి అల్లుడికి చెప్పి వాళ్ళవి కూడా కొంత డబ్బు తీసుకెళ్ళి స్థలం కొన్నాడు. ఇక్కడ బ్రోకర్లు తిమ్మిని బమ్మిని చేసి వేరే సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్ చేపించారు . ఆవిషయం తరువాత మెల్లగా ఈయనకు తెలిసింది . అక్కడి బ్రోకర్ ఈయనతో మాట్లాడటం మానేశాడు.అప్పటినుండి ఈయన తిరుగుతూ ఉన్నాడు.అక్కడ ఎవరిని ఏమి చేయలేముకదా ఇప్పుడు ఈయన పరిస్థితి దారుణంగా ఉంది .ఇంట్లో కొడుకూ కోడలూ ఈయనను తిట్టనిరోజు లేదు. భార్యతోకూడా గొడవ .ఇప్పుడు అమెరికాలో ఉన్న అల్లుడు మా స్థలమన్నా మాకు చూపెట్టండి లేదా వడ్డీతో సహా నాడబ్బు చెల్లించండి అని వత్తిడి తెస్తున్నాడు. చేతిలో డబ్బుపోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు .ఏదైనా మార్గం చూపెడతారేమోనన్న ఆశతో ఆయన మిమ్మలను సంప్రదించాలని అడుగుతున్నాడు అని వివరించాడు. ఆయన స్థితికి బాధ పడ్డాను .కానీ మనచేతులలో ఏముంది. ...రావు గారూ! కర్మ ఫలితాలను ఎవరూ తప్పించలేరు. ఒక్క భగవంతుడు తప్ప. కానీ అన్నీ మాకే తెలుసు అనే అమాయకంతో మనం భగవంతునికంటే మన శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఆరోజు మీకు స్వామి పట్ల ఉన్న అపారమైన భక్తి వలన ఆయన మీకు కొన్ని హెచ్చరికలు పంపాడు. ఎవడో నాలాంటి అనామకుని నోటిద్వారా ఇంకొంచెం జాగ్రత్తలు చెప్పించి ఆ సమయంలో మిమ్మల్ని పక్కకు తప్పించాడు. కేవలం తన శక్తి సామర్థ్యాలపై మాత్రమె నమ్మకమున్న వారుమాత్రం కర్మదేవతల లీలలో చిక్కుకు పోయారు. డబ్బులేనిరోజు తనవారికి తనపై ఎంత ప్రేమ ఉంటుందో అనుభవపూర్వకంగా తెలియటానికి కూడా కర్మదేవతలు ఇలా ఫలితాలనిస్తూ ,జీవిత చరమాంకంలోనైనా ఈ బందాలను వదిలి పరమాత్మ వైపు మళ్ళించాలని చూస్తారు . కానీ మనం మాత్రం విపరీతమయిన మమకారం తో ఈ బంధాల లో ఇంకా కూరుకు పోతూ దు:ఖిస్తూ ఉంటాము. ఇది మనలాంటి సామన్యులందరిలోనూ ఉన్నదే . సరే ! ఇప్పుడు బాధపడ్డా చేసేదేమీ లేదు. భగవంతుని పాదాలనుఆశ్రయించటం తప్ప . వీలయితే తిరుమల వెళ్లి వరాహస్వామి సన్నిధిలో ఆయన సమస్యను చెప్పుకుని ఈ సమస్య నుండి బయటపడితే ఎవరివి వాళ్లకు ఇచ్చి మిగతా డబ్బు స్వామి వారి హుండీలో సమర్పిస్తానని ,ఆపై తన జీవితాన్ని భగవంతుని చేరుకునే మార్గంలో కొనసాగిస్తాను అని మొక్కుకోమని చెప్పండి. వెల్లివచ్చాక స్వామి స్తుతి ఒకటి చెబుతాను, అది పారాయణం చేస్తూ ఉండమని చెప్పండి అన్నాను. కానీ ...రావుగారూ ! ఇటువంటి వారిలో ఎక్కువమంది ,,ఎవరో ఒకరు , మీ సమస్యను పరిష్కరించాలంటే పదిలక్షలు తీసుకురండి ,మిరపకాయలతోనో..మిరియాలతోనో మంటరేగేలా యజ్ఞం చేయాలి అని చెబితే ఇంకా అప్పుచేసైనా వెళతారు కానీ ఇలా ం భగవంతుని చరణాలపై భారం వేసి ఆయనను ఆశ్రయించి ఉండండి అంటే వినుకోరు ..అని ముగించాను ఫోన్ కాల్ .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP